-
‘ధరణి’ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించండి
మెదక్ కలెక్టరేట్: ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్లో తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. . జిల్లాలో ఇప్పటివరకు ధాన్యం ఎగుమతి, దిగుమతితో పాటు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం వివరాలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని సూచించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి ఆన్లైన్ లాగిన్ పాస్వర్డ్ ఇచ్చినట్లు తెలిపారు. ప్రజలు అందించిన పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేసి ఆన్లైన్లో పొందుపర్చాలని ఆదేశించారు. జటిలమైన సమస్యలపై అవసరం అయితే క్షేత్రస్థాయిలో పర్యటన చేసి నివృత్తి చేయాలని ఆదేశించారు. జూన్ 7వ తేదీ వరకు ప్రజావాణి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. దళారులను ఆశ్రయించొద్దు పెద్దశంకరంపేట(మెదక్): జొన్నల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్ సీఈఓ రవీందర్ రైతులకు సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పేటలోని కొనుగోలు కేంద్రంలో జొన్న లు క్వింటాల్కు రూ.3,180 చెల్లిస్తున్నామని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని చెప్పారు. జీలుగ కోసం రైతుల బారులు చిన్నశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలో జీలుగ కోసం రైతులు ఎగబడ్డారు. సోమవారం లారీ లోడ్ వచ్చిందనే సమాచారంతో రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గంటలోనే బస్తాలు అమ్ముడు పోవడంతో ఆలస్యంగా వచ్చిన వారు నిరాశతో వెనుదిరిగారు. రైతుల డిమాండ్కు అనుకూలంగా జీలుగ అందుబాటులో ఉంచాలని రైతులు కోరారు. వర్షాలు పడడంతో దుక్కి దున్ని జీలుగ విత్తేందుకు అనుకూలంగా ఉంటుందన్నారు. వ్యవసాయశాఖ అధికారులు స్పందించి రైతుల డిమండ్కు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచాలని కోరారు. గోడు ఎవరికి చెప్పుకోవాలి? మెదక్ కలెక్టరేట్: ఏళ్ల తరబడి ప్రజావాణిలో దరఖాస్తులు ఇస్తున్నా.. భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసు కోవడం లేదని రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామస్తురాలు రాణమ్మ వాపోయింది. సోమవారం కలెక్టరేట్కు వచ్చిన ఆమెకు ప్రజావాణి రద్దు విషయం తెలిసింది. దీంతో కలెక్టర్ను కలిసి సమస్యను వివరిస్తానని అక్కడే కూర్చుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్న సోదరుడికి భూమి సాగు చేసు కోమని ఇస్తే ఆక్రమించుకున్నాడని వాపోయింది. పోలీస్స్టేషన్లు, కోర్టు, కలెక్టరేట్ చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. కొంతమేర భూమి ఇచ్చినప్పటికీ దానిని సర్వే చేయాలని గత కలెక్టర్లు, ఆర్డీఓలు ఆదేశాలు జారీ చేసిన అధికారులు ఇప్పటివరకు తనకు న్యాయం చేయలేదని వాపోయింది. దరఖాస్తుల ఆహ్వానం మెదక్ కలెక్టరేట్: బెస్ట్ అవైలబుల్ పథకం కోసం జిల్లాలోని అర్హులైన గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారిణి విజయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 25 సీట్లు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. 3వ తరగతిలో 13 సీట్లు, 5వ తరగతిలో 6, 8వ తరగతిలో 6 ఖాళీగా ఉన్నాయన్నారు. బాలికలకు మొదటి అవకాశం ఉంటుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు జూన్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్లకు అర్హులైన గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. -
రైతులు ఇబ్బంది పడొద్దు
జిల్లా ప్రత్యేకాధికారిణి భారతి హొలికేరి మెదక్జోన్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని జిల్లా ప్రత్యేకాధికారిణి భారతి హొలికేరి సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, వివిధ మండలాల తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లోని సమస్యలను కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షించి పరిష్కరించాలని ఆదేశించారు. మిల్లర్ల వద్ద ధాన్యం పేరుకుపోతే సిద్దిపేట, మహబూబ్నగర్ జిల్లాలకు తరలించాలన్నారు. రైతులు అధైర్యపడొద్దని, చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. సీఎంఆర్ను త్వరతగతిన సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి జాగ్రత్తలు పాటించాలని రైతులకు సూచించారు. తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ మిల్స్కు తరలించేందుకు చర్య లు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఎగు మతి చేసిన ధాన్యాన్ని పెండింగ్ లేకుండా సీఎంఆర్కు దిగుమతి చేసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చి కాంటా పెట్టిన ధాన్యంతో పాటు నిల్వ ఉన్న ధాన్యం వివరాలు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓలు రమాదేవి, శ్రీనివాస్, జయచంద్రారెడ్డి, డీఏఓ గోవింద్, డీసీఓ కరుణ, అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కళాశాలలే మిన్న
● నిష్ణాతులైన అధ్యాపకులతో బోధన ● జిల్లాలో మొత్తం 60 ఇంటర్ కళాశాలలు ● ఈనెలాఖరు వరకు ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్లు ● ‘సాక్షి’తో డీఐఈఓ సత్యనారాయణ మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ కళాశాలల్లో నిష్ణాతులైన అధ్యాపకుతో మెరుగైన బోధన లభిస్తుందని ఇంటర్ విద్యాశాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆయన శ్రీసాక్షిశ్రీతో మాట్లాడారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమైనట్లు చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో అన్నిరకాల కోర్సులు, సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యార్థులు నచ్చిన కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలల్లోనే చేర్పించాలని కోరారు. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో చేర్పించి ఆర్థికంగా అవస్థల పాలు కావొద్దన్నారు. జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో ఈనెల 9వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. 2023– 24 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో 9,553 మంది ఉత్తీర్ణులయ్యారని, వీరంతా ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందనున్నారని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 13 ప్రైవేట్ కళాశాలలు, 7 మోడల్, 6 కేజీబీవీ, 2 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్, 6 ట్రైబల్, 2 మైనార్టీ, 6 మహాత్మ జ్యోతిబాపూలే, 4 సోషల్ వెల్ఫేర్ కలిపి మొత్తం 60 కళాశాలలు ఉన్నాయని తెలిపారు. వీటితో ఈనెల 31వ తేదీ వరకు మొదటి విడత దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అడ్మిషన్ ప్రక్రియ ఇలా.. జూన్ 1 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన టీసీ, స్టడీ సర్టిఫికెట్, తాత్కాలిక ఎస్ఎస్సీ మెమో ఆధారంగా ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు అవకాశం ఉంటుందన్నారు. ఒరిజినల్ ఎస్ఎస్సీ మెమో అందజేసిన తర్వాతనే అడ్మిషన్ నిర్ధారిస్తామన్నారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీకు 10 శాతం, బీసీలకు 29 శాతం, దివ్యాంగులకు 5 శాతం, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎక్స్ట్రా అర్హతలున్న వారికి 5 శాతం, ఎక్స్ సర్వీస్మెన్, డిఫెన్స్ పర్సనల్ వారికి 3, ఆర్థికంగా వెనుకబడిన వారికి 10, బాలికలకు 33.3 శాతం సీట్ల కేటాయింపు చేస్తామన్నారు. అయితే పదో తరగతిలో పొందిన గ్రేడింగ్ ఆధారంగా అడ్మిషన్లలో ప్రాధాన్యం ఉంటుందన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా ఇంటర్ బోర్డు గుర్తింపు పొందిన కళాశాలల్లోనే ప్రవేశాలు పొందాలని సూచించారు. -
బడులకు నిధులు
● మరమ్మతులకు రూ.5.15 కోట్ల విడుదల ● ముమ్మరంగా సాగుతున్న పనులుమెదక్జోన్: ప్రభుత్వ బడుల్లో వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 562 పాఠశాలల్లో మైనర్ రిపేర్ల కోసం రూ.20.62 కోట్లు అవసరం కాగా ముందస్తుగా 25 శాతం నిధులు విడుదల చేసింది. దీంతో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభం కాకముందే పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 899 ప్రభుత్వ పాఠశాలలు జిల్లావ్యాప్తంగా 899 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా గత ప్రభుత్వ హయాంలో 313 పాఠశాలలను మన ఊరు– మన బడికింద ఎంపిక చేసి వాటికి కొన్ని నిధులు విడుదల చేశారు. పనులు కొంత మేర జరిగినప్పటికీ పూర్తిస్థాయిలో నిధులు విడుదల కాక పోవడంతో అర్ధాంతరంగా ఆగిపోయాయి. అలాగే జిల్లాలో 24 పాఠశాలల్లో విద్యా ర్థులు లేకపోవడంతో వాటిని మూసి వేశారు. ఇక మిగిలిన 562 పాఠశాలల్లో మైనర్ మరమ్మతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసి పనులు ప్రారంభించింది. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కన్వీనర్గా, వీఓతో పాటు ప్రతి పాఠశాలకు ముగ్గురు చొప్పున విద్యార్థుల తల్లులు కమిటీ సభ్యులుగా ఎన్నుకొని అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల ఆధ్వర్యంలో 562 పాఠశాలల్లో తాగునీరు, సంపుల నిర్మాణాలు, నల్లాల ఏర్పాట్లు, మరుగుదొడ్ల నిర్మాణాలు, కరెంట్ తో పాటు చిన్నపాటి మరమ్మతులను చేయిస్తున్నారు. ఇందుకోసం రూ. 20.62 కోట్లు అవసరం కాగా ముందస్తుగా రూ.5.15 కోట్లు విడుదల చేశారు. జూన్ మెదటి వారంలో పూర్తి వచ్చేనెల 12వ తేదీన పాఠశాలలు పున:ప్రారంభం కానునందున అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మొదలు పెట్టిన మరమ్మతులు జూన్ 5వ తేదీ వరకు పూర్తి కావాలని చెప్పాం. ఇందుకోసం ముందస్తుగా 25 శాతం నిధులు విడుదల చేశాం. అన్ని పాఠశాలల్లో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నారు. – రాధాకిషన్ డీఈఓ మెదక్ -
‘రైతుల గోస పట్టని సర్కార్’
కొండపాక(గజ్వేల్): కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రైతుల పాలిట శాపంగా మారుతోందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిమ్మారెడ్డిపల్లిలోని కొనుగోలు కేంద్రంలో పేరుకు పోయిన ధాన్యం కుప్పలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ ఆరుగాలం పాటు కష్టించి పండించిన ధా న్యం అమ్ముకోవడంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పల వద్ద కాపలా ఉండాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంలో, మిల్లుల్లో అన్లోడింగ్ చేయడంలో నత్తనడకన సాగుతోందన్నారు. -
పేద విద్యార్థులకు సీట్లు కేటాయించాలి
మెదక్ కలెక్టరేట్: విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు ఉచిత అడ్మిషన్లు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్రాజ్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రమేశ్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో 15 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని.. ప్రతి పాఠశాల 25 మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత అడ్మిషన్లు ఇవ్వాలని కోరారు. ఈ నిబంధన విద్యాహక్కు చట్టంలో ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు. -
పేదరికాన్ని జయించి.. ప్రభుత్వ కొలువులు సాధించి..
పేదరికం.. చదువుకు అడ్డుకాదని నిరూపించారు. విద్యే ఆయుధంగా చేసుకొని జీవితంపై పోరాడారు. చదువులు పూర్తయిన వెంటనే పోటీ పరీక్షలకు సిద్ధమై ముగ్గురు కూడా.. ఒకరి తర్వాత మరొకరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వారే హుస్నాబాద్ పట్టణానికి చెందిన రాజ్కుమార్, శ్వేత, శ్రీకాంత్. తండ్రి హమాలీ కారి్మకుడిగా పడిన కష్టానికి న్యాయం చేకూర్చారు. పట్టణ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. హుస్నాబాద్: పట్టణానికి చెందిన చేర్యాల మైసయ్య, స్వరూప దంపతులు. వీరికి రాజ్కుమార్, శ్వేత, శ్రీకాంత్ సంతానం. పెద్ద కుమారుడు రాజ్కుమార్ అక్కన్నపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. కూతురు శ్వేత గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుంది. చిన్న కుమారుడు శ్రీకాంత్ నెల రోజుల క్రితం ఫైర్స్టేషన్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. కాల్ లెటర్ రాగానే జూలైలో ఫైర్ కానిస్టేబుల్గా శిక్షణ పొందనున్నాడు. తండ్రి మైసయ్య రోజు వారి హమాలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంటిని చక్కదిద్దుకుంటూనే సంతానాన్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని సంకలి్పంచారు. భవిష్యత్లో తన పిల్లలు ఉన్నతమైన స్ధానంలో ఉండాలని ఆకాంక్షించారు. కష్టాన్ని పంటి కింద భరిస్తూనే కూలీ పనులు చేస్తూ పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించారు. అనంతరం ఉద్యోగులు సాధించాలని భావించాడు. తండ్రి కష్టాన్ని చూసిన వారు కూడా ఆయన నమ్మకాన్ని ఒమ్ముచేయకుండా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. -
ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
పాపన్నపేట (మెదక్): ధాన్యం రవాణా చేయాలని కోరుతూ వారం రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నా అధికారుల నుంచి స్పందన కరువైంది. వారి ఆందోళనను పట్టించుకోక పోగా ఓ తహసీల్దార్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. మెదక్ జిల్లా పాపన్న పేట సమీపంలో మిన్పూర్లో శుక్రవారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో వారం రోజులుగా రవాణా జరగక వందలాది క్వింటాళ్ల ధాన్యం కల్లాల్లో పేరుకు పోయింది. అయితే గురువారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి మొలకలెత్తాయి. దీంతో ధాన్యం రవాణా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు.సమాచారం అందుకున్న పోలీసులు పాపన్నపేట తహసీల్దార్ లక్ష్మణ్బాబుకు రైతుల ఆందోళన గురించి వివరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ‘ఎప్పు డంటే అప్పుడు వచ్చేయడానికి మాకు మాత్రం భార్యా పిల్లలు లేరా’అంటూ నిర్లక్ష్యంగా సమాధాన మివ్వడంతో ఆగ్రహించిన రైతులు బొడ్మట్పల్లి రోడ్డుపై రాస్తారోకో చేశారు. దీంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్సై సురేశ్ అక్కడకు చేరుకుని రైతులకు నచ్చ జెప్పినప్పటికీ ఆందోళన విరమించలేదు. పోలీ సులు ఫోన్ చేసి తహసీ ల్దార్ను ఘటనా స్థలానికి పిలిపించారు. రైతులతో తహసీ ల్దార్ కొద్దిసేపు మాట్లాడి వారికి క్షమాపణ చెప్పారు. అదేవిధంగా గంటలో ధాన్యం రవాణా ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
No Headline
మెదక్జోన్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ఉదయం 5 గంటలకే ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించిన సిబ్బంది 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభించారు. ఓటర్లు ఉత్సాహంతో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గంట గంటకు ఓటింగ్ శాతం పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్నవారందరు ఓటుహక్కు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. దీంతో రాత్రి 7 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ సాగింది. జిల్లా ఎన్నికల అధికారి రాహుల్రాజ్ సతీసమేతంగా హవేళిఘనాపూర్ మండలం ఔరంగాబాద్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎస్పీ బాలస్వామి మెదక్ బాయ్స్ కళాశాలతో పాటు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కాగా 2019లో మెదక్ పార్లమెంట్ పరిధిలో 71.77 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి 73.63 శాతం నమోదు అయింది. అయితే మొత్తంగా ఎంతశాతం అన్నది అధికారులు ధృవీకరించాల్సి ఉంది. చెదురు మదురు ఘటనలు ఎన్నికల నేపథ్యంలో అక్కడక్కడ చెదురు మదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. నర్సాపూర్ మండలం బ్రహ్మణపల్లిలోని 164 పోలింగ్స్టేషన్లో అదే గ్రామానికి చెందిన మంగళి గణేష్ ఓటు వేసి అధికారుల కళ్లు గప్పి తన సెల్ఫోన్లో చిత్రీకరించి పలు వాట్సాప్ గ్రూపుల్లో వీడియో షేర్ చేశాడు. దీంతో పోలీసులు ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు. అలాగే శివ్వంపేట మండలం మల్లుపల్లి గిరిజన తండాలో ప్రత్యేకంగా పోలింగ్స్టేషన్ ఏర్పాటు చేయాలని, అప్పటివరకు ఓటు వేయమని తండా వాసులు తేల్చిచెప్పారు. రెండు కిలోమీటర్ల దూరంలో గల మల్లుపల్లికి వచ్చి ఓటు వేయాల్సి వస్తుందని వాపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు ఈసారి ప్రత్యేక బూత్ ఏర్పాటు చేయడం కుదరదని, వచ్చే ఎన్నికల్లో ఏర్పాటుచేస్తామని నచ్చచెప్పడంతో శాంతించి ఓటు వేశారు. మెదక్ పట్టణంలోని పిట్లంబేస్ పరిధిలో గల 581, 161 పోలింగ్ కేంద్రాల సమీపంలో బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని, పలువురిని పట్టణ పోలీసులు స్టేషన్కు తరలించారు. కొంత సేపటి తర్వాత సొంత పూచికత్తుపై వదిలిపెట్టారు. పట్టణానికి చెందిన మరో బీఆర్ఎస్ కార్యకర్త ఓ పోలింగ్ బూత్ దగ్గర కండువా కప్పుకుని ప్రచారం చేస్తున్నాడనే ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఓటేసిన ప్రముఖులు ప్రముఖులు వారి వారి స్వగ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు తన స్వగ్రామమైన చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లిలో సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి కౌడిపల్లి మండల కేంద్రంలో, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి శివ్వంపేట మండలం గోమారంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. మాజీ ఎమ్మెల్యే పద్మ రామాయంపేట మండలం కోనాపూర్లో ఓటు వేశారు. మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ దంపతులు పట్టణంలోని పెద్దబజార్లో గల ప్రాథమికోన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొరాయించిన ఈవీఎంలు జిల్లాలోని పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. శివ్వంపేట మండలం 260 పోలింగ్స్టేషన్లో ఉదయం అరగంట పాటు ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ నిలిచిపోయింది. టెక్నిషియన్స్ మరమ్మతులు చేసిన తర్వాత పోలింగ్ కొనసాగింది. అలాగే నర్సాపూర్లోని రెండు పోలింగ్ కేంద్రాల్లో అరగంట పాటు, చేగుంట మండలం కర్నాన్పల్లిలోని పోలింగ్ కేంద్రం, నార్సింగి మండల కేంద్రంతో పాటు నార్సింగి మండలం వల్లూరులో అరగంట పాటు ఈవీఎంలు మొరాయించాయి. -
12 స్థానాల్లో కాంగ్రెస్దే గెలుపు
మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట(అందోల్): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 12 లోక్సభ స్థానాల్లో గెలుస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ ధీమా వ్యక్తం చేశారు. జోగిపేట వ్యవసాయ మార్కెట్లోని 196 పోలింగ్ కేంద్రంలో తన కూతురు త్రిషతో కలిసి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని, ప్రజలు దేశంలో కూడా ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తర్వాతి స్థానం కోసం బీజేపీ, బీఆర్ఎస్లు పోటీ పడుతున్నాయన్నారు. రాష్ట్రం ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆరుగ్యారంటీలకు ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. మున్సిపల్ చైర్మన్ మల్లయ్య తదితరులు ఉన్నారు. అంతా ఓకేనా.. టేక్మాల్(మెదక్): ఎన్నికల సందర్భంగా సోమ వారం టేక్మాల్కు వచ్చిన మంత్రి దామోదర రాజనర్సింహ కార్యకర్తలతో మాట్లాడి పోలింగ్ సరళిపై ఆరా తీశారు. మండలంలోని పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నిమ్మ రమేష్, నాయకులు మాన్కిషన్, సుధాకర్, కిషోర్, మజహర్, సాగర్, పాపయ్య, భిక్షపతి, కిష్టయ్య, రాజు, శివాగౌడ్, దు ర్గయ్య, అంజయ్య, అనిల్ తదితరులు ఉన్నారు. -
వెల్లివెరిసిన ఓటరు చైతన్యం
రాష్ట్రంలోనే అత్యధికంగా జహీరాబాద్ సెగ్మెంట్లో పోలింగ్ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఓటర్ల చైతన్యం వెల్లువిరిసింది. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా, ఓటర్లు అప్పటికే కేంద్రాలకు తరలివచ్చారు. క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు. మహిళలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించినప్పటికీ.. ఈ సౌకర్యం కోసం నమోదు చేసుకోని వారు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేశారు. తొలిసారిగా ఓటు హక్కు వచ్చిన యువతీ, యువకులు ఉత్సాహంగా ఓటేశారు. వాతావరణం కూడా అనుకూలించడం, ఎండల తీవ్రత కాస్త తగ్గడం కూడా ఓటింగ్శాతం పెరగడానికి కారణమైంది. జిల్లా అధికార యంత్రాంగం పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించింది. పలు కేంద్రాల వద్ద వెబ్క్యాస్టింగ్ నిర్వహించారు. కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వల్లూరు క్రాంతి పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఎన్నికల బందోబస్తును ఎస్పీ చెన్నూరి రూపేష్ పర్యవేక్షించారు. మొత్తం మీద జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 80 శాతానికి చేరువలో.. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 50 శాతం దాటింది. సాయంత్రం 5 గంటల వరకు 71.91 శాతం నమోదైంది. పోలింగ్ ముగిసే వరకు సుమారు 80 శాతానికి చేరువలో పోలింగ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. పూర్తి పోలింగ్ శాతం మంగళవారం ప్రకటిస్తామని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. -
ఓటింగ్ సరళిపై అభ్యర్థుల ఆరా
నర్సాపూర్: పట్టణంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ తీరును అభ్యర్థులు తమ పార్టీ నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు. కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అధికారులతో మాట్లాడి పోలింగ్ శాతం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే బయట ఓటు వేసేందుకు నిరీక్షిస్తున్న ఓటర్లను కలిసి తనను పరిచయం చేసుకున్నారు. పట్టణంలోని రెండు బూత్లలో ఈవీఎంలు మొరాయించాయని నాయకులు చెప్పగా అధికారులతో మాట్లాడారు. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సైతం నాయకులతో కలిసి పోలింగ్ శాతం తెలుసుకున్నారు. ఎన్నికల అధికారులతో మాట్లాడి ఈవీఎంలు త్వరగా మరమ్మతులు చేయించాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు సత్యంగౌడ్, బాల్రెడ్డి, రాజేశ్, ఆంజనేయులుగౌడ్ తదితరులు ఉన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు నర్సాపూర్లోని పలు పోలింగ్ బూత్ల వద్ద తమ పార్టీ నాయకులతో పోలింగ్ సరళిపై చర్చించారు. పోలింగ్ సరళిని, పట్టణంలో పార్టీ పరిస్థితులను ఆ యనకు నాయకులు వివరించారు. అయితే పోలింగ్ కేంద్రాల్లోకి కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల వెంట ఎక్కువ సంఖ్యలో రాజకీయ నాయకులు వెళ్లిన విషయాన్ని స్థానిక ఎస్ఐ పుష్పరాజ్ వద్ద ప్రస్తావించగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పోలింగ్ బూత్ లోనికి పాస్ లేని వారిని అనుమతించలే దని తెలిపారు. -
అంతా సజావుగానే: ఎస్పీ
వెల్దుర్తి(తూప్రాన్): పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగిందని ఎస్పీ బాలస్వామి తెలిపారు. సోమవారం వెల్దుర్తిలో పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల వద్ద ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. పోలింగ్ సరళిపై ఎస్సై నవతగౌడ్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సుమారు 1600 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద కేంద్ర పారా మిలిటరీ బలగాలను మోహరించామన్నారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని వివరించారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు పెద్దశంకరంపేట(మెదక్): ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి హరికృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, డీఎస్ఓ బ్రహ్మంరావు, జిల్లా సహకార అధికారి కరుణ తెలిపారు. సోమ వారం మండలంలోని రామోజీపల్లి, వీరోజిపల్లి, కొత్తపేట, పెద్దశంకరంపేటలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు పరిశీలించారు. అనంతరం పిడుగుపాటుకు గురై మృత్యువాత పడిన రైతు కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. అకాల వర్షాలకు రైతు లు ఆందోళన చెందవద్దని, చివరి గింజ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. వారితో పాటు పీఏసీఎస్ సీఈఓ రవీందర్ తదితరులు ఉన్నారు. ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ మెదక్ కలెక్టరేట్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్రాజ్ తెలిపారు. సోమవారం జిల్లాలో జరిగిన పోలింగ్ పరిశీలనకు కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ ప్రక్రియ సక్రమంగా, సజావుగా నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన ఓటర్లకు, ప్రజలకు, భాగస్వాములైన అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేసిన మీడియా ప్రతినిధులను అభినందించారు. రైతన్నకు అకాల కష్టం కౌడిపల్లి(నర్సాపూర్): అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేస్తోంది. ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో మండలంలోని వివిధ గ్రామాల కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు, బస్తాలు తడిసి ముద్దయ్యాయి. పంటపొలాల్లో ఉన్న ధాన్యం కుప్పల చుట్టూ వర్షం నీరు చేరింది. దీంతో రైతులు పాదులు తీసి నీటిని తొలగించారు. తడిసిన ధాన్యం బస్తాలను రైతులు ఆరబెట్టారు. ధాన్యం కొనుగోలు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. -
సభ హైలెట్స్
● 7.30 గంటలకు కేసీఆర్ నర్సాపూర్ చౌరస్తాకు చేరుకున్నారు. ● కేసీఆర్ బస్సుపైకి చేరుకోగానే కార్యకర్తలు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. ● 7.35 గంటల నుంచి 7.55 గంటల వరకు మాట్లాడారు. ● M>Æý‡²ÆŠḥ Ò$sìæ…-VŠæÌZ MóSïÜBÆŠ‡ JMýSPÆó‡ {ç³çÜ…W…^éÆý‡$. ● పక్కన ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఉన్నారు. ● మాజీ మంత్రి హరీశ్రావు కళాకారుల వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. ● సాయత్రం 5:30 గంటల నుంచే జనాలు తరలివచ్చారు. ● చౌరస్తా వద్ద ఉన్న పలు బిల్డింగ్ల పైనుంచి కార్యకర్తలు, ప్రజలు కేసీఆర్ ప్రసంగాన్ని విన్నారు. – నర్సాపూర్ రూరల్/శివ్వంపేట -
మల్లన్న జలాలతో సిరులే..
నర్సాపూర్/నర్సాపూర్రూరల్: మల్లన్నసాగర్ కాలువల ద్వారా సాగు నీరు వస్తే నర్సాపూర్ బంగారు తునక అవుతుందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బస్సుయాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం నర్సాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నర్సాపూర్ను లింకు చేయడానికి శంకరంపేట నుంచి కాలువల తవ్వకాలు కొనసాగుతున్నాయని చెప్పా రు. మల్లన్నసాగర్ నుంచి ఒక్కసారి నీరు రావడం మొదలైతే నర్సాపూర్ సస్యశ్యామలం అవుతుందన్నారు. కాలువల నిర్మాణం పూర్తయి నీళ్లు రావాలంటే మెదక్ ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలవాలన్నారు. మనమంతా కలిసి యుద్ధం చేస్తేనే ఈ ప్రభుత్వం నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉందన్నారు. ఎమ్మెల్యేగా సునీతారెడ్డి గెలిచినప్పటి నుంచి కాలువల నిర్మాణంలో స్పీడ్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. నర్సాపూర్ పొలాలు గోదావరి జలాలతో పారాలన్నదే నా కల అన్నారు. నర్సాపూర్ను ఎంతో అభివృద్ధి చేశామని, మున్సిపాలిటీకి రూ. 25 కోట్ల నిధులు ఇచ్చామని, గ్రామ పంచాయతీల అభివృద్ధికి సైతం నిధులు ఇవ్వగా ఈ ప్రభుత్వం ఆ నిధులన్నింటినీ వెనక్కి తీసుకుపోయిందని ఆరోపించారు. కొల్చారంలో మల్లినాథసూరి యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని తాను నిర్ణయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. తమ హయాంలో హల్దీ వాగు, మంజీరాపై 10 చెక్ డ్యాంలు నిర్మించామని, రైతులు బ్రహ్మాండంగా పంటలు పండించారని చెప్పారు. సస్యశ్యామలం చేయడమే నా కల అందుకు ప్రభుత్వంపై యుద్ధం చేద్దాం నర్సాపూర్ కార్నర్ మీటింగ్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ -
ఓటు హక్కు వినియోగించుకోవాలి
జిల్లా ఎన్నికల అధికారి రాహుల్రాజ్ మెదక్ కలెక్టరేట్: అర్హులు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్రాజ్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. హవేళిఘనపూర్ మండలం ఔరంగాబాద్ పోలింగ్ కేంద్రం 211లో ఓటు హక్కు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఈనెల 13వ తేదీన తన ఓటు హక్కును వినియోగించుకుంటానని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా ప్రాముఖ్యత ఉందని, అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీ విజిల్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ప్రజలు ఫిర్యాదు చేయాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు చెప్పారు. ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. అధికారులు ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.అప్రమత్తంగా ఉండాలి: సమీర్ మాధవ్ కుర్కోటి ఎంసీఎంసీలోని అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి సీసీటీవీ, పెయిడ్ ప్రకటనలను పరిశీలించాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు సమీర్ మాధవ్ కుర్కోటి సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని మీడియా సెంటర్ను ఆయన సందర్శించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
ఏం చేద్దామని కాంగ్రెస్లోకి వెళ్లిండు
కాంగ్రెస్ ప్రభుత్వంలో తాగు నీరు రాదు, సాగు నీరు రాదు, కరెంట్ రాదు అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఏం పథకాల అందనప్పుడు మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి కాంగ్రెస్లోకి ఎందుకుపోయారని ప్రశ్నించారు. నా చరిత్ర, మదన్రెడ్డి చరిత్ర మీకు తెలుసు, ఆయన టీడీపీ హయాంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా తాను బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించానని గుర్తు చేశారు. 70 ఏళ్ల వయసులో ముసలితనానికి కుసుమ గుడాలు అన్నట్లు ఏం చేద్దామని కాంగ్రెస్లోకి పోయారని మండిపడ్డారు. మనందరిని వదిలిపెట్టిన మదన్రెడ్డికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
రాజీయే రాజమార్గం
మెదక్జోన్: వచ్చేనెల 8వ తేదీన నిర్వహించే లోక్ అదాలత్లో కక్షిదారులను ఒప్పించి వీలైనన్ని ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి లక్ష్మీశారద పేర్కొన్నారు. బుధవారం కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో న్యాయ మూర్తులు జితేందర్, రిటా లాల్చంద్ తదితరులు పాల్గొన్నారు. మద్యం అమ్మకాలపై ఆరా కొల్చారం(నర్సాపూర్): మండలంలోని చిన్నఘనాపూర్ శివారు ఐఎంఎల్ (ఇండియన్ మేడ్ లిక్కర్) డిపోను ఎన్నికల అబ్జర్వర్ సునీల్ కుమార్ బుధవారం తనిఖీ చేశారు. జనవరి నుంచి ఇప్పటివరకు జరిగిన లిక్కర్ అమ్మకాల వివరాలు, ఎన్నికల దృష్ట్యా తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. గతేడాది మేలో మద్యం అమ్మకాల ఆధారంగా లిక్కర్ పంపిణీ చేపడుతున్నామని డిపో మేనేజర్ నాగేశ్వరరావు తెలిపారు. నెలరోజుల అమ్మకాలు మొత్తం కలిపి దానికి అదనంగా 40 శాతం మాత్రమే డిపో నుంచి మద్యం దుకాణాలకు సరఫరా చేస్తున్నామని వివరించారు. ఆయన వెంట ఎకై ్సజ్ సీఐ నాగేశ్వరరావు, డిపో ఎకై ్సజ్ సీఐ రామిరెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ సీఐ నరేందర్ ఉన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వద్దు: ఎస్పీ మెదక్ మున్సిపాలిటీ: ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ కీలకమైందని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ బాలస్వామి సూచించారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల విధులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ప్రత్యేక మినహాయింపులు ఎవరికీ ఉండవని తేల్చిచెప్పారు. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు ఈసీఐ నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, మెదక్, తూప్రాన్ డీఎస్పీలు రాజేశ్వర్, వెంకట్రెడ్డి, ఏఆర్ డీఎస్పీ రంగనాయక్, డీసీఆర్బీసీఐ మధుసూదన్గౌడ్ పాల్గొన్నారు. 10 వరకు పోస్టల్ బ్యాలెట్కు అవకాశం నర్సాపూర్: పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే గడువును ఈనెల 10 వరకు ఎన్నికల కమిషన్ పెంచిందని అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జగదీశ్వర్రెడ్డి తెలిపారు. గడువు పెంచినందున ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
ఇందిరా హయాంలోనే ప్రగతి
నర్సాపూర్ రూరల్: ఇందిరాగాంధీ వల్లే మెదక్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 9న నర్సాపూర్కు రాహుల్గాంధీ వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మెదక్ ప్రజల అభ్యున్నతి కోసం ఇందిరాగాంధీ అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయించి ఉపాధి కల్పించిందని కొనియాడారు. అలాగే వైఎస్సార్ హయాంలో అభివృద్ధి జరిగిందన్నారు. సొంత జిల్లా ప్రగతికి కేసీఆర్, హరీశ్రావు ఏ మాత్రం కృషి చేయలేదని విమర్శించారు. రాహుల్గాంధీని ప్రధానమంత్రి చేసేందుకు నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వెంకట్రామిరెడ్డి కలెక్టర్గా ఉన్న కాలంలో కేసీఆర్కు దోచిపెట్టి రూ. కోట్లు సంపాదించారని ఆరోపించారు. రఘునందన్రావు జిల్లా అభివృద్ధికి నయా పైసా తీసుకురాలేదన్నారు. రాహుల్గాంధీ రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా నలుమూలల నుంచి 50 వేలకు పైగా ప్రజలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్, చెంగనూర్ ఎంపీ సురేష్, మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నాయకులు శ్రీనివాస్గుప్తా, మల్లేశ్, నగేశ్, మణిదీప్, నాయకులు పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ రాహుల్గాంధీ సభకు భారీ ఏర్పాట్లు -
సైనికుల్లా పనిచేయండి
రేగోడ్(మెదక్)/టేక్మాల్(మెదక్): కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి సురేశ్ షెట్కార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. రేగోడ్లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడపగడపకూ వెళ్లి కాంగ్రెస్ పథకాలను వివరించాలని సూచించారు. త్వరలో రైతు లకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రూ.7 కోట్లతో బోరంచ ఎత్తిపోతల పథకం ద్వారా రేగోడ్ తదితర చెరువులను నింపుతామన్నారు. ఇటీవల రేగోడ్కు చెందిన సీఆర్పీఎఫ్ మాజీ ఉద్యోగి రాజశేఖర్ కుమారుడు ఆస్పత్రిలో ఉన్న విషయం తెలుసుకుని సొంత డబ్బులతో వైద్యం చేయించినందుకు గాను వారి కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపా రు. అనంతరం బీఆర్ఎస్కు చెందిన పలువురు కాంగ్రెస్లో చేరగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు మున్నూరు కిషన్, మండల పార్టీ అధ్యక్షుడు దిగంబర్రావు, గ్రామ అధ్యక్షుడు శంకరప్ప, మాజీ జెడ్పీటీసీ రాజేందర్ పాటిల్, కో ఆప్షన్ సభ్యుడు చోటుమియా, మాజీ సర్పంచ్ విజయభాస్కర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ శ్యాంరావు కులకర్ణి, మాజీ ఎంపీటీసీ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం టేక్మాల్ మండలంలోని బొడ్మట్పల్లి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నిమ్మ రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరగా మంత్రి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యకర్తల సమావేశంలో మంత్రి దామోదర -
తండాలను పంచాయతీలు చేశాం..
దశాబ్దాల పాటు పరిపాలించిన ఏ ప్రభుత్వం తండాలను పట్టించుకోలేదని, తాము తండాలను పంచాయతీలుగా చేసి అభివృద్ధి చేశామని కేసీఆర్ అన్నారు. మన రిజర్వేషన్లు మనకు ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలని పిలుపునిచ్చారు. కార్నర్ మీటింగ్లో మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్హుస్సేన్, జెడ్పీ చైర్పర్సన్ హేమలత, కార్మిక బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్రెడ్డి, మన్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, జెడ్పీటీసీ బబియానాయక్, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, చంద్రాగౌడ్, గోపి, వెంకట్రెడ్డి, నయిమోద్దీన్, సత్యంగౌడ్, పంబాల భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. -
భద్రత కట్టుదిట్టం
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా కట్టుదిట్టమైన భత్రత ఏర్పాటు చేశామని ఎస్పీ డాక్టర్ బాలస్వామి తెలిపారు. ఈసీ నిబంధనలు ధిక్కరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో 1500 మంది సిబ్బందితో పాటు మూడు పారా మిలటరీ బలగాలను రప్పించామని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి సీసీ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు. ఎంపీ ఎన్నికల సందర్భంగా బుధవారం ‘సాక్షి’తో పలు అంశాలను వెల్లడించారు. –మెదక్జోన్1500 మంది సిబ్బందితో బందోబస్తు ● మూడు కంపెనీల కేంద్ర బలగాలు ● జిల్లాలో 45 సమస్యాత్మక పోలింగ్స్టేషన్ల గుర్తింపు ● ‘సాక్షి’తో ఎస్పీ డాక్టర్ బాలస్వామి ● పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్పీ: సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాం. ప్రతీ పోలింగ్స్టేషన్కు ఒక ఎస్ఐతో పాటు నలుగురు సిబ్బందిని నియమించాం. జిల్లావ్యాప్తంగా 15 వందల మంది సిబ్బందిని కేటాయించాం. అలాగే మూడు కంపెనీల కేంద్ర బలగాలను దించాం. ● జిల్లాలో మొత్తం ఎన్ని పోలింగ్స్టేషన్లు ఉన్నా యి? వాటిలో సమస్యాత్మకమైనవి ఎన్ని? జిల్లాలో మొత్తం 770 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వాటిలో 45 సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. వాటిని 78 రూట్లుగా గుర్తించి ఒక్కో రూట్కు ఒక్కో ఆర్మ్డ్ ఎస్కార్డ్లను కేటాయించాం. ఈవీఎం పంపిణీ సెంటర్ నుంచి పోలింగ్స్టేషన్ వరకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాం. రూట్ మొబైల్లో వైర్లెస్ సెట్ పోలీస్ కంట్రోల్ రూంకు కనెక్ట్ చేశాం. ఏదైనా సంఘటన జరిగితే వెంటనే అప్రమత్తమయ్యే విధంగా ఏర్పాట్లు చేశాం. ● జిల్లా సరిహద్దులో ఎన్ని చెక్పోస్టులు ఏర్పాటు చేశారు? జిల్లా చుట్టూ ఉన్న సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి సరిహద్దులో 9 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. పోలీస్ సిబ్బందితో పాటు జిల్లాకు చెందిన ఇతర శాఖలకు సంబంధించిన సిబ్బంది సైతం 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవే కాకుండా 9 ఎస్ఎస్టీ టీమ్స్, 9 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 24 గంటల పాటు నిఘా పెట్టారు. ● తనిఖీల్లో ఇప్పటివరకు ఎంత డబ్బు సీజ్ చేశారు? ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రూ.88 లక్షల 57 వేల 678 నగదు సీజ్ చేశాం. అలాగే నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న బెల్టుషాపుల నుంచి 3,300 లీటర్ల మద్యం సీజ్ చేశాం. ఇది రూ.15 లక్షల విలువ ఉంటుంది. రామాయంపేటలోని ఓ లాడ్జిలో అక్రమంగా నిల్వ ఉంచిన 202 చీరలను సైతం పట్టుకున్నాం. వీటి విలువ రూ. 2 లక్షల వరకు ఉంటుంది. అలాగే 2 వేల క్వింటాళ్ల బియ్యం సైతం పట్టుకున్నాం. దీని విలువ రూ. 40 లక్షలుగా గుర్తించాం. రూ.1 కోటి 45 లక్షల 91 వేల విలువ చేసే వివిధ రకాల వస్తువులను స్వాధీనం చేశాం. నగదుకు సంబంధించి తగు ఆధారాలు చూపిన వారికి తిరిగి ఇచ్చేశాం. ● సీజ్ చేసిన డబ్బులో రాజకీయ నాయకులది ఉందా? పట్టుకున్న నగదులో ప్రత్యేకంగా రాజకీయ నాయకులదని గుర్తించలేదు. కానీ ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తల నుంచి మాత్రం స్వాధీనం చేసుకున్నాం. ఆ డబ్బును డీజీసీకి నివేదించాం. నిబంధనల ప్రకారం పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ● ఎన్నికల ఉల్లంఘన కేసులు ఎన్ని నమోదయ్యాయి? జిల్లావ్యాప్తంగా 6 ఎంసీసీ వాయిలెన్స్ కేసులు నమోదయ్యాయి. అందులో విచారణ పూర్తయింది. త్వరలోనే కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ● ఇప్పటివరకు ఎంత మందిని బైండోవర్ చేశారు? గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పాత నేరస్తులు 800 మందిని గుర్తించి బైండోవర్ చేశాం. ఒక్కసారి బైండోవర్ చేసిన వ్యక్తులు ఏడాది వరకు ఏదైనా వాయిలెన్స్లో పాల్గొంటే మరోసారి బైండోవర్ చేయాల్సి ఉంటుంది. పాత నేరస్తుల్లో అలాంటి వారు లేరు. కొత్తగా 173 కేసుల్లో 241 మందిని పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బైండోవర్ చేశాం. ● సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు వైరల్ చేశారా? సోషల్ మీడియాలో రెండు అభ్యంతరకర పోస్టులు వైరల్ చేసినట్లు మా దృష్టికి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ● ఈసీ నిబంధనలకు విరుద్దంగా రాజకీయ నేతలు వ్యవహరించినట్లు గుర్తించారా? ఈసీ నిబంధనల ప్రకారం అభ్యర్థులు అనుమతి తీసుకొనే సభలు, కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. వారిపై మా సిబ్బంది అనుక్షణం నిఘా పెట్టారు. ఈసీ నిబంధనలను పాటించకుంటే చర్యలుంటాయి. -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
ఆందోళనలో అన్నదాతలుమెదక్జోన్/చిలప్చెడ్(నర్సాపూర్)/టేక్మాల్(మెదక్): ఈదురుగాలులతో కురిసిన వర్షం ధాన్యం ఆరబోసుకున్న రైతులను అతలాకుతలం చేసింది. అకాల వర్షంతోపాటు జోరుగా వడగండ్లు పడడంతో రోడ్ల వెంట ఆరబెట్టిన ధాన్యంతోపాటు కొనుగోలు కేంద్రాల్లో నిలువ ఉంచిన ధాన్యం రాశులు తడిచి ముద్దయ్యాయి. మెదక్లో మంగళవారం సాయంత్రం 5గంటలకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి అరగంట పాటు ఏకదాటిగా వర్షం కురిసింది. అలాగే చిలప్చెడ్ మండలంలోని పలు గ్రామాలలో వర్షం ఎక్కువగా కురవడంతో కల్లాలలో వరదనీరు చేరింది. ధాన్యం కుప్పల కిందకు నీరు రాకుండా రైతులు నానా తంటాలు పడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్ఫాలిన్లు లేక ఇబ్బందులు పడ్డారు. -
ఎన్నికల ఖర్చు నమోదు చేయాలి
సంగారెడ్డి టౌన్ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సెంటర్ను మంగళవారం మెదక్ లోక్సభ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు సునీల్ కుమార్ రాజ్వాన్షి, జహీరాబాద్ వ్యయ పరిశీలకులు మోతీలాల్, కలెక్టర్ క్రాంతి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ఖర్చును ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. ప్రచార ప్రకటనలకు సంబంధించిన ఖర్చు అభ్యర్థి లెక్కలోకే వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎంసీఎంసీ కేంద్రంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. మీడియాలో వచ్చే ప్రతీ ప్రకటనను మానిటరింగ్ చేయాలన్నారు. అలాగే ఐసీసీలో నెలకొల్పిన కంట్రోల్ రూంను వారు సందర్శించారు. -
ఖేడ్ అభివృద్ధికి జోడెద్దుల్లా పనిచేస్తాం
పొలిటికల్ హీట్నారాయణఖేడ్: నారాయణఖేడ్ పట్టణంలో మంగళవారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ గెలుపుకోసం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అభ్యర్థి సురేష్ షెట్కార్ కామారెడ్డిలో ప్రచారం కోసం బయలుదేరారు. ప్రచారం నిర్వహిస్తున్న ప్రాంతం మీదుగా వెళు తూ ఆగి తనను ఎంపీగా గెలిపిస్తే ఎమ్మెల్యే, తాను ఐక్యంగా జోడెద్దుల్లా పనిచేస్తూ ఖేడ్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి చేస్తామన్నారు. ఇరువురం కలవడం అభివృద్ధికి సంకేతమన్నారు, దీంతో కార్యకర్తల్లో ఉత్సాహం నిండింది. కార్యకర్తలు సమష్టిగా పనిచేసి ఖేడ్ కోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన టికెట్ను త్యాగం చేసిన షెట్కార్ గెలుపుకోసం శక్తివంచనలేకుండా కృషిచేస్తామని ఎమ్మెల్యే మరింత ఉత్సాహపర్చారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
రేవ్ పార్టీ.. హేమతో పాటు ఈ బ్యూటీ కూడా.. ఇంతకీ ఎవరంటే? (ఫోటోలు)
ఈ బ్రాండ్ అంత ఈజీగా రాలేదు: దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: కేటీఆర్
బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (23-05-2024)
బీఆర్ఎస్కు10 ఏళ్ళు పట్టింది.. కాంగ్రెస్కు 5 ఏళ్ల పాలన గగనం: కిషన్ రెడ్డి
ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడు: కాసు మహేష్రెడ్డి
రూ.46.90 లక్షల కారు లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - పూర్తి వివరాలు
ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పుష్ప 2 మూవీలో ఛాన్స్ వదిలేసుకున్నా: రవి కృష్ణ
తప్పక చదవండి
- బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
- ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
- బాయ్ఫ్రెండ్తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
- 'ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి'.. గూగుల్ పే కొత్త ఫీచర్
- ‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
- 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
- బీసీసీఐ ఆఫర్ నిజమే.. నేనే రిజెక్ట్ చేశా: ఆసీస్ దిగ్గజం
- రూ.2.5 కోట్లకు రూ.10 కోట్లు.. విరుష్క జంటకు లాభాల పంట!
- SRH vs RR: ‘సన్రైజర్స్ కాదు!.. రాజస్తాన్కే గెలిచే ఛాన్స్’
- పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
Advertisement