-
రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ పోలీసులు గురువారం మహుళిపుట్ ప్రాంతంలో గల అడవిలో బస్తాలతో ఉన్న 2 క్వింటాళ్ల 27 కేజీల గంజాయిను పట్టుకున్నారు. ఈ సంఘటనలో ఎక్కరూ పట్టుబడలేదని బొయిపరిగుడ పోలీసు అధికారి దీపాంజళి ప్రధాన్ వెల్లడించారు. విశ్వాసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిన వెంటనే బొయిపరిగుడ పోలీసులు మహులిపుట్ వెళ్లి గ్రామ సమీప ప్రాంతాల్లో గాలింపు ప్రారంభించారు. అడవిలో పలు ప్రాంతాల్లో గాలించిన పోలీసులకు అడవిలో గంజాయి బస్తాలు గుర్తించారు. గంజాయిని దొంగతనంగా తరలించేందుకు ఉంచిన వ్యక్తులు కనిపించలేదని పోలీసు అధికారి వెల్లడించారు. పట్టుబడిన గంజాయి బస్తాలను పోలీసు స్టేషన్కు తీసుకు వచ్చి తూకం వేశామన్నారు. బొయిపరిగుడ సమితి ప్రాంతంలో గ్రామీణ ప్రజలు పెద్ద ఎత్తున గంజాయి సాగు చేస్తున్నారని, వారికి గంజాయి మాఫియా ప్రోత్సహిస్తుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అడవిలో గంజాయి దాచిన వారిని పట్టుకునేందుకు విస్తృతంగా గాలిస్తున్నామని పోలీసు అధికారి వెల్లడించారు. ఈ దాడిని ఎస్ఐ డి.బారిక్ నేతృత్వంలో ఒక టీమ్ జరిపిందన్నారు. -
త్రిముఖ పోటీ
నవరంగపూర్ ఎంపీ స్థానానికి..జయపురం: నవరంగపూర్ (ఎస్టీ) లోక్ సభ స్థానంలో నలుగురు బరిలో ఉండగా.. వారిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు మఝి సంప్రదాయ గిరిజనులే. కాంగ్రెస్ అభ్యర్థిగా భుజబల మఝి, బీజేడి అభ్యర్థిగా ఫ్రదీప్ మఝి, బీజేపీ అభ్యర్థిగా బలభధ్ర మఝి పోటీలో తలపడనున్నారు. ఈ నియోజకవర్గంలో బరిలో ఉన్న సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్టు) పార్టీ అభ్యర్థి త్రినాథ్ మండగుడియ పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 1952, 1962 ఎన్నికల్లో ఇద్దరు తెలుగువారు ఎన్నకయ్యారు. 1952లో పొన్నాడ సుబ్బారావు (గణతంత్ర పరిషత్) గెలుపొందారు. 1962 ఎన్నికల నాటికి నవరంగపూర్ లోక్ సభ నియోజకవర్గం తిరిగి జనరల్ స్థానంగా విభజించారు. ఆ ఎన్నికలో మరో తెలుగు నేత రాచకొండ జగన్నాథరావు(కాంగ్రెస్) విజయం సాధించారు. 1967లో ఈ స్థానాన్ని ఎస్టీలకు కేటాయించారు. ఈ ఎన్నికలలో ఖగుపతి ప్రధాన్ (కాంగ్రెస్) గెలిపొందారు. తరువాత జరిగిన 1971, 1977, 1980, 1984, 1989, 1991, 1996, 1998 ఎన్నికల్లో ఈయన వరుసగా విజయాలు సాధించారు. ఈయన తరువాత నవరంగపూర్ నియోజకవర్గంలో మఝి సంప్రదాయ నేతల ఆధిపత్యంలోనికి వచ్చింది. 1999 ఎన్నికల్లో ఈ స్థానం బీజేపీ కై వసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి పరశురాం మఝి విజయం సాధించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థి పరశురాం మఝి ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ కుమార్ మఝి మొదటి సారిగా ఎన్నికల బరిలో దిగి బీజేపీ అభ్యర్థి పరశురాం మఝిని, బీజేడీ అభ్యర్థి డొంబురు మఝిలను ఓడించారు. 2004లో ఈ స్థానంలో ఘన విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి పరశురా మఝి 2009లో కేవలం 1,56,784(19.8 శాతం) ఓట్లు మాత్రం పొంది మూడో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ మఝి 3,08,307 (38.93 శాతం) ఓట్లు పొందారు. బీజేడీ అభ్యర్థి డొంబురు మఝి 2,78,330 (35.15శాతం) ఓట్లు సాధించారు. 1999, 2004 ఎన్నికల్లో బీజేపీ విజయానికి బలమైన కారణం ఉమ్మరకోట్, ఝోరాగాం, మల్కనగిరి, చిత్రకొండ అసెంబ్లీ సెగ్మెంట్లలో శరణార్థ బెంగాలీల ఓట్లు వల్లేనని పరిశీలకుల విశ్లేషణ. తరువాత పరిస్థితులు మారాయి. 2009లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2014 లో బీజేడీ అభ్యర్థి బలభద్ర మఝి గెలిపొదారు. సిట్టింగ్ ఎంపీ అయిన కాంగ్రెస్ అభ్యర్థి పరశురాం మఝిని కేవలం 2042 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ నియోజకవర్గంలో రెండు పర్యాయాలు విజయం సాధించిన బీజేపీ ఓట్ల శాతం పడిపోయి మూడో స్థానానికే పరిమితమైంది. 2019లో ఈ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ జరిగింది. కాంగ్రెస్ నుంచి ప్రదీప్ మఝి, బీజేడీ నుంచి రమేష్ చంద్ర మఝి, బీజేపీ నుంచి బలభద్ర మఝి, బీఎస్పీ నుంచి చంద్రద్వజ మఝి తలపడ్డారు. ఆ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య గట్టి పోటీ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థిపై 41,724 ఓట్ల తేడాతో బీజేడీ అభ్యర్థి రమేష్ మఝి విజయం సాధించారు. బీజేడీకి 3,92,504 ఓట్లు రాగా.. కాంగ్రెస్కు 3,50,870 ఓట్లు, బీజేపీకి 3,42,839 ఓట్లు, బీఎస్పీకి 28,905 ఓట్లు, నోటాకు 44,582 ఓట్లు పడ్డాయి. ఈ ఎన్నికల్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు చోట్ల బీజేపీ విజయం సాధించగా.. 5 చోట్ల బీజేడీ అభ్యర్థులు గెలుపొందారు. 41 వేల ఓట్లతో పరాజయం పొంది రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్కు ఒక్క అసెంబ్లీ స్థానం దక్కలేదు. ఈ నెల 13వ తేదీన జరుగనున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలొ చతుర్ముఖ పోటీ ఉండనుంది. 2019లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన మాజీ ఎంపీ ప్రదీప్ మఝి బీజేడీలో చేరారు. నేడు ఈయన బీజేడీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2014లో బీజేడీ టికెటుపై పోటీ చేసి విజయం సాధించిన బలభధ్ర మఝి ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. కాంగ్రెస్ అభ్యర్థిగా డాబుగాం ఎమ్మెల్యే భుజబల మఝి తలపడుతున్నారు. ప్రధానమైన పోటీ కాంగ్రెస్, బీజేడీ, బీజేపీల మధ్యేనే ఉంటుందని పరిశీలకుల విశ్లేషణ. నవరంగపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నవరంగపూర్ జిల్లా నుంచి నవరంగపూర్, డాబుగాం, ఉమ్మరకోట్, జోరిగాం, కొరాపుట్ జిల్లాలోని కొట్పాడ్, మల్కనగిరి జిల్లాలో మల్కనగిరి, చిత్రకొండ అసెంబ్లీ సెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. -
మహిళా ఓటర్లే నిర్ణేతలు
కొరాపుట్ జిల్లాలో..జయపురం: ఈ నెల 13వ తేదీన జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కొరాపుట్ జిల్లాలో మహిళా ఓటర్లే అధికం. ఈ జిల్లాలో 9,69,092 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 5,00,405 మంది మహిళలు, 4,68,604 మంది పురుషులు, 83 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. లక్ష్మీపూర్, కొరాపుట్, పోట్టంగి, జయపురం, కొట్పాడ్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ●లక్ష్మీపూర్(ఎస్టీ–141)లో 1,72,483 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 90,732 మంది మహిళలు, 81,732 మంది పురుషులు, 19 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ●కొట్పాడ్(ఎస్టీ 142) నియోజకవర్గంలో 2,08,283 మంది ఓట్లు ఉండగా.. వారిలో 1,07,191 మంది మహిళా ఓటర్లు, 1,01,081 మంది పురుషులు,11 మంది ట్రన్స్జెండర్స్ ఉన్నారు. ● జయపురం (జనరల్–143)నియోజకవర్గంలో 2,11,908 ఓటర్లు ఉండగా.. 1,09,104 మంది మహిళా ఓటర్లు, 1,02,770 మంది పురుషులు, 34 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ● కొరాపుట్ (ఎస్సీ–144) నియోజకవర్గంలో 1,90,341 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 97408 మంది మహిళలు, 92,921 మంది పురుషులు, 12 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ● పొట్టంగి (ఎస్సీ–145) నియోజకవర్గంలో 2,76,182 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 1,86,076 మంది మహిళా ఓటర్లు ఉండగా.. 90,100 మంది పురుష ఓటర్లు, ఆరుగురు ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ● జిల్లాలో మొత్తం ఓటర్లలో మొదటిసారి 22,500 మంది ఓటు హక్కును వినియోగించుకుంచుకోనున్నారు. ● జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 1158 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయనుండగా వాటిలో కొరాపుట్ నియోజకవర్గంలో 215 బూత్లు, పొట్టంగిలో 238 బూత్లు, లక్ష్మీపూర్లో 225, జయపురంలో 237, కొట్పాడ్లో 243 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేస్తున్నారు. ● ఐదు నియోజకవర్గాలలో 1158 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తుండగా పట్టణాల్లో గల బూత్లలో మరో 129 నుంచి 150 వరకు అదనపు బూత్లు ఏర్పాటు చేస్తారు. ఇవి కేవలం మహిళా పోలింగ్ టీమ్లు నిర్వహిస్తాయి. ముఖ్యంగా ఈ అదనపు బూత్లు జయపురం, కొరాపుట్, కొట్పాడ్, సునాబెడలలో ఏర్పాటు చేస్తారు. ఈ ఎన్నికలో మొదటిసారి 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి వద్దనే ఓటు వేసుకునే హక్కు కల్పించారు. మొత్తం ఓటర్లు 9,69,092 మంది మహిళలు 5,00,405 మంది పురుషులు 4,68,604 మంది ట్రాన్స్జెండర్స్ 83 మంది -
వాహనం బోల్తాపడి డ్రైవర్ మృతి
మల్కన్గిరి: వాహనం డివైడర్ను ఢీకొట్టి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి మాంత్రీపూట్ గ్రామం వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐజాక్సే వాహనం బలిమెల నుంచి చిత్రకొండకు వస్తుంది. మాంత్రీపూట్ గ్రామం దాటిన తరువాత ఘట్టీపైకి వెళ్లే క్రమంలో డివైడర్ను ఢీకొట్టి అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో డ్రైవర్ కిందకు దిగే క్రమంలో అదేవాహనం చక్రాల కిందపడిపోవడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చిత్రకొండ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థంలో లభ్యమైన ఆధార్ కార్డు ఆధారంగా డ్రైవర్ది మోహిర్భంజ్ జిల్లా దేవులి గ్రామానికి చెందిన సమీర్ధల్ (39)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
అనుమానాస్పద స్థితిలో తాపీమేస్త్రి మృతి
ఇచ్ఛాపురం రూరల్: గత తొమ్మిది రోజులుగా కనిపించకుండాపోయిన తాపీమేసీ్త్ర మామిడి చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించిన ఘటన శుక్రవారం ఇచ్ఛాపురం మండలంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ ఎన్.లక్ష్మణరావు తెలిపిన వివరాల ప్రకారం..గార మండలం పొగాకువానిపేటకు చెందిన నీలాపు సూర్యనారాయణ(68) కొంతకాలంగా ఇచ్ఛాపురం మండలం కేశుపురంలో తాపీమేసీ్త్రగా పనిచేస్తున్నాడు. గత నెల 25న ఉదయం ఇచ్ఛాపురం వెళ్లిన సూర్యనారాయణ తిరిగి రాకపోవడంతో స్నేహితులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుమారుడు ఆదినారాయణ ఇచ్ఛాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో లొద్దపుట్టి సమీపంలోని మామిడి చెట్టుకు గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకొని అనుమానాస్పదంగా మృతి చెందినట్లు రూరల్ పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ లక్ష్మణరావు ఘటనా స్థలానికి చేరుకొని విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియపరిచారు. మృతుడు సూర్యనారాయణగా కుటుంబ సభ్యులు గుర్తుపట్టారు. కుమారుడి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement