రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం | Sakshi
Sakshi News home page

రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం

Published Sat, May 4 2024 6:35 AM

రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం

జయపురం: జయపురం సబ్‌డివిజన్‌ బొయిపరిగుడ పోలీసులు గురువారం మహుళిపుట్‌ ప్రాంతంలో గల అడవిలో బస్తాలతో ఉన్న 2 క్వింటాళ్ల 27 కేజీల గంజాయిను పట్టుకున్నారు. ఈ సంఘటనలో ఎక్కరూ పట్టుబడలేదని బొయిపరిగుడ పోలీసు అధికారి దీపాంజళి ప్రధాన్‌ వెల్లడించారు. విశ్వాసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిన వెంటనే బొయిపరిగుడ పోలీసులు మహులిపుట్‌ వెళ్లి గ్రామ సమీప ప్రాంతాల్లో గాలింపు ప్రారంభించారు. అడవిలో పలు ప్రాంతాల్లో గాలించిన పోలీసులకు అడవిలో గంజాయి బస్తాలు గుర్తించారు. గంజాయిని దొంగతనంగా తరలించేందుకు ఉంచిన వ్యక్తులు కనిపించలేదని పోలీసు అధికారి వెల్లడించారు. పట్టుబడిన గంజాయి బస్తాలను పోలీసు స్టేషన్‌కు తీసుకు వచ్చి తూకం వేశామన్నారు. బొయిపరిగుడ సమితి ప్రాంతంలో గ్రామీణ ప్రజలు పెద్ద ఎత్తున గంజాయి సాగు చేస్తున్నారని, వారికి గంజాయి మాఫియా ప్రోత్సహిస్తుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అడవిలో గంజాయి దాచిన వారిని పట్టుకునేందుకు విస్తృతంగా గాలిస్తున్నామని పోలీసు అధికారి వెల్లడించారు. ఈ దాడిని ఎస్‌ఐ డి.బారిక్‌ నేతృత్వంలో ఒక టీమ్‌ జరిపిందన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement