వాహనం బోల్తాపడి డ్రైవర్‌ మృతి | Sakshi
Sakshi News home page

వాహనం బోల్తాపడి డ్రైవర్‌ మృతి

Published Sat, May 4 2024 6:30 AM

వాహనం బోల్తాపడి డ్రైవర్‌ మృతి

మల్కన్‌గిరి: వాహనం డివైడర్‌ను ఢీకొట్టి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి మాంత్రీపూట్‌ గ్రామం వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐజాక్సే వాహనం బలిమెల నుంచి చిత్రకొండకు వస్తుంది. మాంత్రీపూట్‌ గ్రామం దాటిన తరువాత ఘట్టీపైకి వెళ్లే క్రమంలో డివైడర్‌ను ఢీకొట్టి అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో డ్రైవర్‌ కిందకు దిగే క్రమంలో అదేవాహనం చక్రాల కిందపడిపోవడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చిత్రకొండ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్‌ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థంలో లభ్యమైన ఆధార్‌ కార్డు ఆధారంగా డ్రైవర్‌ది మోహిర్‌భంజ్‌ జిల్లా దేవులి గ్రామానికి చెందిన సమీర్‌ధల్‌ (39)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Advertisement
Advertisement