-
Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
భువనేశ్వర్: ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాజకీయ పర్యాటకులు తమ రాష్ట్రానికి తరలివస్తున్నారని, తమపై వ్యక్తిగత దూషణలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ మండిపడ్డారు. తమ ప్రజలపై ఈ రాజకీయ పర్యాటకుల ప్రభావం ఏమాత్రం ఉండదని తేలి్చచెప్పారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు పొలిటికల్ టూరిస్టులుగా మారిపోయారని, కేవలం ఎన్నికల సమయంలోనే వారు ఒడిశాలో కనిపిస్తారని, ఆ తర్వాత మటుమాయం అవుతారని ఎద్దేవా చేశారు. నవీన్ పటా్నయక్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాజకీయ పర్యాటకులు అనుచితమైన భాష ఉపయోగిస్తున్నారని, అది తమ రాష్ట్ర ప్రజలు సహించబోరని హెచ్చరించారు. -
వ్యాపార ప్రత్యర్థిపై దాడి
భువనేశ్వర్: గంజాం జిల్లాలో శుక్రవారం మరో ఎన్నికల వివాదం చెలరేగింది. వ్యాపార ప్రత్యర్థిపై దాడి చేసిన ఆరోపణ కింద కాంగ్రెసు టిక్కెట్టుపై పోటీ చేస్తున్న అభ్యర్థిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ఘటనలో గంజాం జిల్లా దిగొపొహండి శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి సాకా సుజిత్ కుమార్ అరైస్టెయ్యారు. ఘటనపై బరంపురం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సార్థక్ షడంగి మాట్లాడుతూ దాడిలో సిహాలాకు చెందిన సుధాంశు సంగ్రామ్ పాఢి అనే బిల్డర్తో సహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని తెలిపారు. కుకుడాఖండి ప్రాంతంలోని ఒక ప్లాట్లో పని చేస్తున్న సుధాంశు సంగ్రామ్ పాఢి సిబ్బందిపై కొందరు దుండగులు దాడి చేశారు. పాఢి మరియు అతని సిబ్బంది ఫిర్యాదు చేయడానికి పోలీస్స్టేషన్కు వెళ్లుండగా, కాంగ్రెస్ అభ్యర్థి, అతని వ్యక్తులు వారిపై దాడి చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సహచరుడు కె.అమిత్ కుమార్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. దిగపహండి కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్ -
బలి జాతరకు ఇసుక సంగ్రహణ
జయపురం: ఖరీప్ సీజన్ సమయంలో కొరాపుట్ ఆదివాసీ ప్రజలు జరుపుకునే వ్యవసాయ సంబంధిత బలిజాతర పండగ ఒకటి. ఈ జాతర జరపడం వలన పంటలు బాగా పండుతాయని, తమ కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉంటారని అక్కడి ప్రజ ల నమ్మకం. అటువంటి బలి జాతరకు బొరిగుమ్మ సమితి శొశాహండి పంచాయతీ ప్రజలు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గ్రామ మహిళలంతా బుట్టలతో నువాగుడ గ్రామ సమీపంలోని చిరుశ్రోత నదికి వెళ్లి ఇసుక నింపుకొని, వాటిలో వివిధ రకాల విత్తనాలు చల్లి తమ గ్రామంలో ఉన్న దేవత గుడిలో ఉంచారు. గ్రామ సాంప్రదాయం ప్రకారం ఈనెల 28వ తేదీన బలి జాతర మహోత్సవం జరుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. బుట్టల్లో వేసిన విత్తనాల్లో మొలకెత్తిన విత్తనాలను ఖరీఫ్ సీజన్లో పండిస్తే మంచి దిగుబడి వస్తుందని ప్రజల నమ్మకం. -
ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగ్
మల్కన్గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి ఎంవీ 26 గ్రామానికి చెందిన దేభశిష్ సర్కార్ (32) అనే వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్కు బలైపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. దేభశిష్ గత కొన్ని నెలలుగా ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్నాడు. దీంతో బెట్టింగ్స్లో ఓడిపోయి ఊరంతా అప్పులు పాలయ్యాడు. ఇటీవల అప్పులు ఇచ్చినవారు డబ్బులు అడగగా, అందరికీ శుక్రవారం ఇస్తానని చెప్పాడు. అనంతరం కుటుంబ సభ్యులతో గురువారం రాత్రి సంతోషంగా గడిపాడు. శుక్రవారం వేకువజామునే లేచి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు. తీరా చూస్తే ఉదయం 6 గంటల సమయంలో ఇంటికి కొంతదూరంలోని చెట్టుకు ఉరికి వేలాడుతూ కన్పించాడు. దీంతో గ్రామస్తులు వెంటనే మల్కన్గిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోరుకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. దేభశిష్కు భార్య, ఇద్దరు పిల్లులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అల్లర్లపై దర్యాప్తునకు సిట్
భువనేశ్వర్: గంజాం జిల్లా ఖల్లికోట్ ప్రాంతంలో ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొన్న ఎన్నికల హింసాత్మక ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఈ విచారకర ఘటనలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో నిందితులను అరెస్టు చేశారు. సరైన సాక్ష్యాలను (వైజ్ఞానిక, ఫోరెన్సిక్, డిజిటల్) సేకరించి 30 రోజుల్లో ఛార్జిషీట్ను దాఖలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు విచారణ వేగవంతం చేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిట్ ఎప్పటికప్పుడు స్థాయీ నివేదికను దక్షిణ ప్రాంతీయ ఇన్స్పెక్టరు జనరల్ ఆఫ్ పోలీస్కి దాఖలు చేస్తుందని అధికారిక ప్రకటన తెలిపింది. ఖల్లికోట్ ముందస్తు ఎన్నికల హింసాత్మక సంఘటనల దృష్ట్యా, ఎన్నికల సమయంలో గంజాం జిల్లాలో శాంతిభద్రతలను పర్యవేక్షించడానికి అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాధాకృష్ణ శర్మ శుక్రవారం నుండి ఈ నెల 21 వరకు ఛత్రపురంలో క్యాంప్ చేయనున్నారు. ● కార్యకర్తల ఘర్షణ రాష్ట్రంలో రెండో విడత ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఖల్లికోట్ పోలీసు ఠాణా పరిధిలోని శ్రీకృష్ణశరణ్పూర్ గ్రామంలో బుధవారం రెండు వర్గాల రాజకీయ కార్యకర్తల మధ్య ఘర్షణ ప్రాణాంతకంగా మారింది. బీజేపీ కార్యకర్త మృతి చెందగా, మరో 3 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘర్షణలో అదే గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ పహాన్ అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలై ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బీజేడీ కార్యకర్తల అసంతృప్తివాదంతో ఈ వివాదానికి ప్రేరణగా భావిస్తున్నారు. ఆశించిన మేరకు బీజేడీ టికెటు లభించకపోవడంతో రెండుగా చీలిన వర్గాల మధ్య ఘర్షణ తారా స్థాయికి చేరింది. అయితే ఖల్లికోట్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థి ఎంపికపై అసంతృప్తి చెందిన వర్గం ఇటీవల బీజేపీలో చేరారని అనుబంధ వర్గాలు తెలిపాయి. అనంతరం దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఖల్లికోట్ పోలీస్స్టేషన్ ఎదుట బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఖల్లికోట్, భువనేశ్వర్ మధ్య రోడ్లను దిగ్భందించి రాకపోకలకు అంతరాయం కలిగించారు. ఘటనకు సంబంధించి ఇప్పటివరకు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా హింసాకాండ నేపథ్యంలో మే 20న ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక లోక్ సభ స్థానానికి ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా నిర్వహించేందుకు గంజాం జిల్లాలో 20 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించాలని ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి నికుంజ బిహారీ ధొలొ ఆదేశించారు. 30 రోజుల్లో చార్జిషీట్కు ఆదేశాలు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
రాయగడ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన ఘటన జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి కృష్ణానగర్ గ్రామ సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. మృతుల్లో విశ్వజిత్ (29), జోగేష్ మినియాక (32)లు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న కల్యాణ సింగుపూర్ ఐఐసీ నీలకంఠ నాయక్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి నాయక్ తెలియజేసిన వివరాల ప్రకారం.. రైల్వే కార్మికుడిగా పనిచేస్తున్న విశ్వజిత్ పనులు ముగించుకుని సికరపాయి నుంచి రాయగడకు వస్తున్నాడు. ఈ క్రమంలో కృష్ణానగర్ గ్రామ సమీపంలో రోడ్డు పక్కన నీలగిరి కర్రల లోడుతో ట్రాక్టర్ ఆగి ఉంది. ట్రాక్టర్ డ్రైవర్ జోగేష్ మినియాక రోడ్డుకు పక్కగా నిలుచున్నాడు. అతివేగంతో బైకుపై వస్తున్న విశ్వజీత్ అదుపు తప్పి ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొన్నాడు. దీంతో ట్రాక్టర్ సమీపంలో నిల్చున్న జోగేష్తో పాటు విశ్వజీత్కు తీవ్రగాయాలవ్వడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్నికల ప్రచారానికి కొరాపుట్ నేతలు
కొరాపుట్: మొదటి దశ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దీంతో ప్రముఖ పార్టీలు మెదటి దశలో ప్రచారంలో పాల్గొన్న నేతలను మిగతా ప్రాంతాలకు తరలించాయి. అవిభక్త కొరాపుట్ జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు ఎన్నికలు జరగాల్సిన ప్రాంతాలకు వెళ్లారు. నబరంగ్పూర్ జిల్లా జొరిగాం అసెంబ్లీ స్థానం నుంచి బీజేడీ అభ్యర్థిగా పనిచేసిన ఎంపీ రమేష్ చంద్ర మజ్జి సంబల్పూర్ తరలి వెళ్లారు. ఆ స్థానంలో పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేస్తున్న బబి దాస్ కోసం ప్రచారం చేయనున్నారు. శుక్రవారం కుటిండ అసెంబ్లీ స్థానంలో ప్రచారం చేశారు. కార్యక్రమంలో బీజేడీ నబరంగ్పూర్ అదనపు పరిశీలకుడు దేవాశిస్ పాత్రో, జిల్లాకి చెందిన రాష్ట్ర మైనల్ లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ ప్రమెద్ పాఢీలు పాల్గొన్నారు. ఇదే నియోజకవర్గంలో రాయగడ జిల్లాకి చెందిన బీజేడీ జిల్లా అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావులు ప్రచారం చేస్తున్నారు. భద్రక్ జిల్లాలో కొరాపుట్ సెంట్రల్ కో–ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర్ చంద్ర పాణీగ్రాహి ప్రచారం చేస్తున్నారు. కొరాపుట్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన ఎంపీ సప్తగిరి ఉల్క ఎన్నికల ప్రచారానికి వెళ్తూ ఆంధ్రలోని రామభద్రపురం వద్ద స్థానిక మీడియాతో మాట్లాడారు. -
తాగునీటి కోసం ఆందోళన
పర్లాకిమిడి: కాశీనగర్ ఎన్ఏసీలో తాగునీటి సమస్య తీర్చాలని కోరుతూ మహిళలంతా కలిసి సమితి కార్యాలయం ఎదుట బిందెలు, బకెట్లతో శుక్రవారం ఆందోళన జరిపారు. దీనిలో భాగంగా కాశీనగర్ ఎన్ఏసీ బ్లాక్ ఆరోగ్య కేంద్రం రోడ్డులో వాహనాలను నిలిపివేశారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గత ఆరు నెలలుగా కాశీనగర్ ఎన్ఏసీ, గ్రామీణ తాగునీటి శానిటేషన్ ఇంజినీర్లు, కాశీనగర్ బీడీవోకు తాగునీటి కోసం మొరపెట్టుకున్నా అధికారులు స్పందించలేదని, అందువల్ల ఆందోళన చేస్తున్నామని మహిళలు పేర్కొన్నారు. వెంటనే పోలీసు అధికారులు చొరవ తీసుకుని ప్రైవేటు వాటర్ ట్యాంకర్ ద్వారా తాగునీటిని సరఫరా చేశారు. -
బీజేడీ నాయకురాలు మిస్సింగ్
జయపురం: కొరాపుట్ జిల్లా బందుగాం సమితి బీజేడీ ఉపాధ్యక్షురాలు పుష్పాంజలి కడ్రక గత మూడు రోజులుగా కనిపించడం లేదు. ఆమె తన భర్త సీతయ్య కడ్రక, ఇద్దరు బిడ్డలతో కలిసి బందుగాం సమితి సర్జెలి గ్రామంలో నివాసముంటున్నారు. ఆమె భర్త సీతయ్య కడ్రక తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 16వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో లక్ష్మీపూర్ వెళ్లి వస్తానని చెప్పి తన భార్య పుష్పాంజలి వెళ్లిందన్నారు. అలా వెళ్లిన ఆమె తిరిగి రాలేదని వెల్లడించాడు. తాము అన్ని ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికై నా ఆమె కనిపిస్తే తమకు తెలియజేయాల్సిందిగా కోరారు. నాటుసారా బట్టీలపై దాడులు జయపురం: సమితిలోని డిమ్లా గ్రామ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న బట్టీలపై ఎకై ్సజ్ సిబ్బంది గురువారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో వండిన నాటుసారా 60 లీటర్లు, 900 లీటర్ల ఇప్పమొగ్గతో పాటు ఊటను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేసినట్లు అధికారులు తెలియజేశారు. వాటి విలువ సుమారు రూ.54 వేలు ఉంటుందని నీలాద్రి బిహారి మిశ్ర వెల్లడించారు. అయితే నాటుసారా తయారు చేస్తున్న వ్యక్తులు పారిపోయారని పేర్కొన్నారు. సారా వంటకానికి వినియోగించే సామగ్రి సీజ్ చేశామన్నారు.ఏనుగుల బీభత్సంరాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి సునాఖండి పంచాయతీలో గురువారం రాత్రి ఏనుగులు బీభత్సాన్ని సృష్టించాయి. పంచాయతీ పరిధి బరియాపొడ, శిలొపొదొరొ, సరాటి, పార్టీబెడ గ్రామాల్లోకి చొరబడ్డాయి. బరియాపొడ గ్రామంలో ఉన్నటువంటి సోలార్ ప్లేట్లను ధ్వంసం చేయగా, సరటి గ్రామంలో జమాప్రప్కా అనే ఆదివాసీ రైతుకు సంబంధించిన పనస, అరటి, మామిడి తోటలను ధ్వంసం చేశాయి. గత కొద్ది నెలలుగా ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీ సిబ్బంది కొరత కారణంగా ఏనుగుల గుంపును తరిమికొట్టడంలో విఫలం చెందుతున్నారు. పొరుగు జిల్లా కలహండి అడవుల నుంచి ఇటువైపుగా వచ్చిన ఏనుగులు ఈ ప్రాంతంలో పనస, అరటి వంటి తోటలు విరివిగా ఉండటంతో ఇక్కడే తిష్టవేసినట్లు సమాచారం. ఇప్పటికై నా అధికారులు తగు చర్యలు తీసుకుని ఏనుగుల నుంచి కాపాడాలని బాధిత గ్రామస్తులు కోరుతున్నారు. మాజీ మంత్రి లాల్బిహారికి భార్య వియోగం రాయగడ: రాష్ట్ర మాజీ మంత్రి, బీజేడీ సీనియర్ నాయకుడు లాల్బిహారి హిమిరికకు భార్య వియోగం కలిగింది. అతని భార్య అప్పలమ్మ హిమిరిక (69) శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను పెంట గ్రామంలోని స్వగృహంలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో శుక్రవారం ప్రాణాలు విడిచారు. ఆమెకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆమె మృతిపై బీజేడీ నాయకులు, కార్యకర్తలు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. -
వైభవంగా ఆలయ నిర్మాణం
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని రాజువీధిలో గజేంద్రుడి ముఖాకృతిలో ఆలయాన్ని నిర్మించారు. దీనికోసం దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలను కమిటీ పరిశీలించింది. ఏనుగు తల రూపంలో నిర్మించడానికి సిద్ధమయ్యారు. దీనికోసం నయాగడ్ జిల్లా నుంచి మేసీ్త్రలను తీసుకొచ్చారు. సుమారు ఆరు నెలల కృషితో నిర్మాణం పూర్తయ్యింది. ఈ దేవాలయ నిర్మాణం కోసం డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి రూ.5 లక్షలు, 5టీ చైర్మన్ వి.కార్తికేయ పాండ్యన్ రూ.5 లక్షలు, నబరంగ్పూర్ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని రు.3 లక్షలు విరాళంగా అందజేశారు. మిగతా అవసరమైన నిధులు భక్తులు నుంచి సేకరించారు. దేవాలయాన్ని జూన్లో ప్రారంభిస్తామని కమిటీకి చెందిన సంతున్ కుమార్ పాత్రో ప్రకటించారు. -
విప్పపువ్వు బస్తాలు స్వాధీనం
రాయగడ: స్థానిక సిరికొన సమీపంలో ఎకై ్సజ్ అధికారులు గురువారం సాయంత్రం నిర్వహించిన దాడుల్లో 2,800 కిలోల విప్పపువ్వు బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి చంద్ర గరడియా అనే వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. గత కొద్ది రోజులుగా ఎకై ్సజ్ అధికారులు నిర్వహిస్తున్న విస్తృత దాడుల్లో భాగంగా గురువారం సిరికొన గ్రామ సమీపంలో అనుమానస్పదంగా కనిపించిన ఒక మినీ ట్రక్ను ఆపి తనిఖీ చేశారు. దీనిలో నాటుసారా తయారీకి వినియోగించే విప్పపూల బస్తాలు బయటపడ్డాయి. దీంతో కేసు నమోదు చేశారు. దాడుల్లో ఎకై ్సజ్ ఐఐసీ సంజయ్ కుమార్ ప్రధాన్, ఎస్ఐ రాసి నాయక్, సంగ్రామ్ ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. -
No Headline
జయపురం: లమతాపుట్ జలాశయంలో గురువారం ఒక నాటు పడవ బోల్తాపడడంతో వ్యక్తి గల్లంతైన ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన వ్యక్తి బిలాపుట్ పంచాయతీ జబాగుడ గ్రామానికి చెందిన సుకు ప్రధాన్(39)గా గుర్తించారు. అతడు గురువారం మధ్యాహ్నం తన జీడిమామిడి తోటకు బయల్దేరాడు. తోటకు వెళ్లేందుకు మధ్యలో లమతాపుట్ జలాశయం ఉండడంతో నాటు పడవలో వెళ్తుండగా బోల్తాపడింది. జలాశయ పరివాహక ప్రాంతంలో వేరుశనగ పంట పొలంలో పనిచేస్తున్న రైతులు పడవ మునిగిపోవడం చూశారు. వెంటనే అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం వారు స్థానిక సర్పంచ్ రాజు లెద్రకు తెలియజేయగా ఆయన జోళాపుట్ పోలీసులకు సమాచారం అందించారు. జోళాపుట్ ఏఎస్ఐ సంతోష్ కుమార్ పొరిడ, లమతాపుట్ ఎస్ఐ గోవింద హన్సద, నందపూర్ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని జలాశయంలో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి అయినా జాడ తెలియకపోవడంతో తిరిగి శుక్రవారం ఉదయం నుంచి గాలిస్తున్నారు. ఈ ఘటనతో సమీప ప్రాంతాల్లో విషాదం నెలకొంది. -
సామూహిక లలితా సహస్ర నామ పారాయణ
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళంలోని ఎచ్చెర్ల వీధిలో సామూహిక లలితా సహస్రనామ పారాయణాలు శుక్రవారం పెద్ద ఎత్తున జరిగాయి. ఆదిశంకరాచార్యుల జయంతి ఉత్సవాల్లో భాగంగా మొండేటి వీధిలోని లలితాదేవి అమ్మవారి ఆలయం నుంచి షిర్డీ సాయి సేవా సంఘం, దివ్యటె క్స్టైల్స్ ఆధ్వర్యంలో గుజరాతిపేట రాజరాజేశ్వరీ లలీతా మహా త్రిపుర సుందరి పీఠం పర్యవేక్షణలో శంకరాచార్యుల చిత్రపటంతో ఊరేగింపు జరిగింది. వెయ్యి మంది మహిళలతో సామూహిక పారాయణాలు జరిగాయి. కార్యక్రమంలో పీఠం నిర్వాహకులు పెంట రామచంద్రశెఖరశర్మ, పెంట వశిష్ట కార్తికేయ శర్మ, భక్తులు పాల్గొన్నారు. -
వరకట్న వేధింపు కేసులో ఇద్దరికి జైలుశిక్ష
హిరమండలం: వరకట్న వేధింపుల కేసులో భర్త, అత్తలకు ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తూ సోంపేట సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. ఇందుకు సంబంధించి ఎస్ఐ జి.నారాయణస్వామి అందించిన వివరాలిలా ఉన్నాయి. తంప గ్రామానికి చెందిన పెంటల హారతి అనే వివాహిత 2020 సంవత్సరంలో ఆత్మహత్య చేసుకుంది. భర్త బోయితి తిరుమలరావు, అత్త లిమ్మమ్మ వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో పుట్టింటి వారి ఫి ర్యాదులతో కేసు నమోదు చేసిన పాలకొండ డీఎస్పీ రారాజు ప్రసాద్ కేసు నమోదు చేశారు. నిందితులపై అభియోగాలు మోపుతూ కేసు వేశారు. పలుమార్లు విచారణ కొనసాగింది. శుక్రవారం కోర్టులో విచారణ జరిగింది. నిందితులపై నేరారోపణలు రుజువు కావడంతో న్యాయమూర్తి టి.భాస్కరరావు తీర్పు చెప్పారు. భర్త తిరుపతిరావుతో పాటు అత్త లిమ్మమ్మలకు ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించారు. బాధితుల తరఫున పీపీ కె.వెంకటరావు వాదించారు. హిరమండలం ఎస్ఐ నారాయణస్వామి నిందితులను హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను రిమాండ్కు తరలించారు. -
జిల్లాకు కొత్తగా 8 బస్సులు
శ్రీకాకుళం అర్బన్: జిల్లాకు కొత్తగా 8 అల్ట్రా డీలక్స్ బస్సులు వచ్చాయని జిల్లా ప్రజారవాణా అధికారి ఎ.విజయ్కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. శ్రీకాకుళం ఒకటో డిపోకు ఒక బస్సు, టెక్కలి డిపోకు 4 బస్సులు, పలాస డిపోకు 3 అల్ట్రా డీలక్స్ బస్సులు వచ్చాయని తెలిపారు. పాతబస్సుల స్థానంలో ఈ కొత్తబస్సులు వచ్చాయని తెలిపారు. అలాగే అద్దె బస్సులకు సంబంధించిన టెండర్లు కూడా పూర్తయ్యాయని, ఆగస్టు నాటికి ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బస్సులను కూడా పంపించడం జరిగిందని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అన్ని డిపోలకు బస్సు లు చేరిపోయాయన్నారు. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల అనంతరం దూరప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మళ్లీ వారి ప్రాంతాలకు వెళ్లేందుకు గత మూడు రోజులుగా కాంప్లెక్స్ ప్రయాణికులతో రద్దీమయంగా కనిపించిందని, ఈ రద్దీకి అనుగుణంగా బస్సులు వేసి ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చూశామని తెలిపారు. జిల్లా ప్రజారవాణా అధికారి ఎ.విజయ్కుమార్ -
ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు
గుమ్మలక్ష్మీపురం: పదో తరగతి ఫలితాలు వెలువడ్డాయి. పాలిసెట్, రెసిడెన్షియల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు కూడా వచ్చాయి. విద్యార్థులు వారి ఆసక్తిని బట్టి ఏ కోర్సులో చేరాలన్నదానిపై ఆలోచన చేస్తున్నారు. అధిక శాతం మంది విద్యార్థులు ఇంటర్మీడియట్లో చేరనుండగా, పలువురు విద్యార్థులు పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సుల్లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. పదోతరగతి పూర్తి చేయగానే త్వరితగతిన ఉపాధి పొందాలనుకునేవారికి ఐటీఐ కోర్సులు మంచివని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. 18 ఏళ్లు దాటగానే.. ఐటీఐ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు అప్రెంటీస్ పూర్తి చేసుకుంటే 18 ఏళ్లు దాటగానే పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఐటీఐ ఒక చక్క ని మార్గం. విద్యుత్, రైల్వే, రక్షణ, పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఐటీఐ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు త్వరితగతిన లభిస్తాయి. ఐటీఐ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు స్కిల్స్ తప్పనిసరి. ఆయా ట్రైడుల్లో నైపుణ్యం సంపాదించిన విద్యార్థులకు ఉపాధి తప్పనిసరిగా లభిస్తుందనడంలో సందేహం లేదు. ఉద్యోగం, ఉపాధితో పాటు స్వయం ఉపాధికి సైతం ఐటీఐ కోర్సు దోహదపడుతుంది. ఏడాది, రెండేళ్ల కాలపరిమితి కోర్సులు.. ఐటీఐల్లో ఏడాది, రెండేళ్ల కాలపరిమితికి రెగ్యులర్ కోర్సులు ఉంటాయి. రెండేళ్ల కాల పరిమితితో ఎల క్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిల్, డ్రాప్ట్మేన్ సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానికల్ వంటి కోర్సు లు ఉంటాయి. ఏడాది కాల పరిమితితో డీజిల్ మెకానిక్, వెల్డర్, కటింగ్ అండ్ సూయింగ్, కంప్యూటర్ ప్రొగ్రాం అసిస్టెంట్ తదితర కోర్సులు ఉంటాయి. ఆసక్తి ఉన్న కోర్సుల ఎంపికే ప్రధానం పార్వతీపురం మన్యం జిల్లాల్లోని భద్రగిరి, సీతంపేట, సాలూరు మండలాల్లో మూడు ప్రభుత్వ, ఐదు ప్రైవేటు ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. ఐటీఐలలో చేరే విద్యార్థులు వారికి ఆసక్తి ఉన్నకోర్సులు ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఐటీఐ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసేందుకు జూన్ 10వ తేదీ తుది గడువుగా ఉపాధి, శిక్షణ శాఖ ప్రకటించింది. ఉన్నత చదువులకు అవకాశం ఐటీఐ కోర్సుల్లో రెండేళ్ల వ్యవధి ఉన్న కోర్సులు పూర్తి చేసిన వారికి ఉన్నత చదువులకు అవకాశం ఉంది. ఐటీఐ పూర్తి చేసిన వారికి పాలిటెక్నిక్ రెండవ సంవత్సరంలో బ్రిడ్జి కోర్సు ద్వారా ప్రవేశం పొందేందుకు అవకాశం ఉంది. పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు అనంతరం బీటెక్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. తద్వారా ఉద్యోగావకాశాలు మెరుగుపర్చుకోవడానికి కూడా ఒక చక్కని అవకాశంగా దోహదపడుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఐటీఐలో చేరేందుకు ఆసక్తిచూపే విద్యార్థులు జూన్ 10వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పరిశీలన సమయంలో సమీప ప్రభుత్వ ఐటీఐలకు విధిగా హాజరుకావాలి. కౌన్సెలింగ్ షె డ్యూల్ వివరాలు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మొబైల్ నంబర్లకు పంపిస్తాం. పదో తరగతిలో విద్యార్థి పొందిన మార్కులు, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం అడ్మిషన్లు ఉంటాయి. పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో ప్రవేశాలకు తొలిదశ నోటిఫికేషన్ విడుదల వివిధ ట్రేడుల్లో అడ్మిషన్లకు జూన్ 10 తుది గడువు -
ప్రభుత్వ బడుల్లో సీబీఎస్ఈ
చదువుతోనే పిల్లలకు ఉజ్వల భవిత సొంతమవుతుందని.. వారి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతాయన్న ఉద్దేశంతో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. సర్కారు బడుల్లో సంస్కరణలు చేపట్టింది. నాడు–నేడు కింద సకల సదుపాయాలు కల్పించింది. డిజిటల్ విద్యను అందుబాటులోకి తెచ్చింది. బైలింగ్విన్ విధానంలో పుస్తకాలు ముద్రించింది. తాజాగా కార్పొరేట్ స్కూల్స్లో చదువుకున్న విద్యార్థులకు బోధించే సీబీఎస్ఈ సిలబస్ను సర్కారు బడుల్లో బోధనకు చర్యలు చేపట్టింది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తోంది. జిల్లాలో సీబీఎస్ఈకి ఎంపికై న పాఠశాలలు ఇవే... ఏపీఎంఎస్– పురోహితునివలస (సాలూరు), ఏపీఎంఎస్– మునక్కాయవలస(మక్కువ), ఏపీ మోడల్స్కూల్ (భామిని), ఏపీఎంఎస్ (కురుపాం), ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ (భామి ని), ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కళాశా ల, ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ (పీఎన్ బొండవలస), ఏపీఎస్ డబ్ల్యూఆర్ఎస్ బాలికలు (గరుగుబిల్లి), ఏపీఎస్ డబ్ల్యూఆర్ఎస్ (కొమరాడ), కేజీబీవీ (సీతంపేట), కేజీబీవీ (భామిని), కేజీబీవీ (వీరఘట్టం), కేజీబీవీ (మక్కువ), కేజీబీవీ (జోగింపేట), కేజీబీవీ(బలిజిపేట), కేజీబీవీ (చినమేరంగి), కేజీబీవీ(సాలూరు), కేజీబీవీ (కవిటిభద్ర), కేజీబీవీ(కురుపాం), కేజీబీవీ (గుమ్మలక్ష్మీపురం), కేజీబీవీ (కొమరాడ), కేజీబీవీ (గరుగుబిల్లి), కేజీబీవీ(పాచి పెంట), ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ బాలురు (మల్లి), ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ బాలికలు(సీతంపేట), ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ బాలురు (సీతంపేట), ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ బాలికలు(భద్రగి రి), ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ బాలురు(కొమరాడ), ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ బాలురు (కోనవలస), ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ బాలికలు (బెలగాం), ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ బాలికలు (భద్రగిరి), జీటీడబ్ల్యూఏహెచ్ (మల్లి), జీటీడబ్ల్యూఏహెచ్ఎస్ (హడ్డుబంగి), జీటీడబ్ల్యూఏఎస్ (కొత్తగూ డ), జెడ్పీహెచ్ఎస్ (బలిజిపేట), జెడ్పీహెచ్ఎస్ (మక్కువ), జెడ్పీహెచ్ఎస్ (పాచిపెంట), జెడ్పీహెచ్ఎస్(ఎమ్మార్నగరం), కేపీఎంహెచ్ఎస్– కొత్తవలస(పార్వతీపురం). సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో పిక చేసిన ప్రభుత్వ బడుల్లో సీబీఎస్ ఈ బోధనను ఉచితంగా అమలు చేయనున్నారు. పిల్లలు సర్వతోముఖాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాలోని 40 పాఠశాలలను తొలుత ఎంపిక చేశారు. బడుల్లో బ ట్టీ విధానానికి, మూస పద్ధతికి స్వస్తి పలికి సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిల బస్ను అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి న ప్రకియపై విద్యాశాఖ ఆధ్వర్యంలో కురుపాంలో 140మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. పేద విద్యార్థులకు ప్రోత్సాహం ఇప్పటివరకు కార్పొరేట్, ఇతర ప్రత్యేక పాఠశాల ల్లోనే సీబీఎస్ఈ విధానం అమలవుతోంది. ప్రస్తు తం నడుస్తున్న పోటీ ప్రపంచంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలంటే సీబీఎస్ఈ సిలబస్ కచ్చితంగా ఉండాలి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడు ల విద్యార్థులకూ ఇటువంటి బోధన అందించాల న్న సంకల్పంతో చర్యలు తీసుకుంది. అన్ని రకాల వనరులూ ఉండి, పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో దీన్ని ఈ విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఈ బోధన ద్వారా చదువుకునే అవకాశం ఉంటుంది. ఆయా విద్యాలయాల పర్యవేక్షణ కేంద్రం పరిధిలోకి వెళ్తుంది. విద్యార్థుల ఆసక్తి, అభిరుచిని గుర్తించి వివిధ రంగాల్లో వారిని ప్రోత్సహిస్తారు. సబ్జెక్టుల మేరకు అవసరమైన ఉపాధ్యాయులను నియమిస్తారు. తొలివిడతగా 40 పాఠశాలల ఎంపిక ఈ విద్యాసంవత్సరం నుంచి అమలు విద్యార్థులకు ఉపయోగకరం పోటీ ప్రపంచంలో విద్యార్థులు సామర్థ్యాన్ని పెంచుకుని జాతీయ పరీక్షలకు హాజరు కావడానికి సీబీఎస్ఈ సిలబస్ దోహదపడుతుంది. సీబీఎస్ఈ సిలబస్కు అనుగుణంగా పాఠశాల ల్లో సౌకర్యాలు కల్పిస్తున్నాం. – పగడాలమ్మ, జిల్లా విద్యాశాఖాధికారిణి -
Odisha Assembly Elections 2024: బీజేపీకి సవాల్
ఒడిశాలో రెండో విడత ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో 21 లోక్సభ స్థానాలుండగా నాలుగింటికి 13న పోలింగ్ ముగిసింది. ఈ నెల 20న రెండో విడతలో ఐదు లోక్సభ స్థానాలు, వాటి పరిధిలోని 35 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఐదు లోక్సభ స్థానాల్లో మూడు బీజేపీ సిట్టింగ్ సీట్లే కావడం విశేషం. ఆ పారీ్టకి గట్టి మద్దతున్న ఈ స్థానాల్లో అధికార బీజేడీ నుంచి సవాలు ఎదురవుతోంది... బోలంగీర్ రాష్ట్రమంతటా ఆసక్తి నెలకొన్న స్థానమిది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ, రాజ వంశీకురాలు సంగీతా సింగ్దేవ్ బరిలో ఉన్నారు. బీజేడీ గత అభ్యర్థి కల్కేశ్ నారాయణ్ సింగ్దేవ్ స్థానంలో సురేంద్ర సింగ్ భోయ్ని పోటీకి దింపింది. కాంగ్రెస్ నుంచి మనోజ్ మిశ్రా పోటీలో ఉన్నారు. ఇక్కడ సంగీత నాలుగుసార్లు గెలిచారు. ఆమె భర్త కనకవర్ధన్ సింగ్దేవ్ పాటా్నగఢ్–బోలంగీర్ మహరాజు రాజ్రాజ్ సింగ్దేవ్ కుమారుడు. ఒడిశా బీజేపీ చీఫ్గా, రాష్ట్ర మంత్రిగా కూడా చేశారు. కరువు బాధిత జిల్లా అయిన బోలంగీర్ నుంచి ఏటా 30 వేల మందికి పైగా ఉపాధి కోసం వలస పోతున్నారు. ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో నాలుగు బీజేడీ చేతిలో ఉన్నాయి. కాంగ్రెస్ రెండు చోట్ల, బీజేపీ ఒక్క స్థానంలో గెలిచాయి.సుందర్గఢ్ ఒడిశాలో కీలక లోక్సభ స్థానాల్లో ఇదీ ఒకటి. ఇక్కడ బీజేపీదే హవా. గత రెండు ఎన్నికల్లో గెలిచిన బీజేపీ సిట్టింగ్ ఎంపీ జుయల్ ఓరం మళ్లీ బరిలో ఉన్నారు. 1998 నుంచి ఇక్కడ ఆయన ఐదుసార్లు గెలవడం విశేషం. 2009 ఎన్నికల్లో మాత్రం ఓరంపై కాంగ్రెస్ నేత హేమానంద బిశ్వాస్ విజయం సాధించారు. అధికార బీజేడీ ఇక్కడ ఖాతాయే తెరవలేదు! రాష్ట్రంలో ఆ పార్టీ ఇప్పటిదాకా నెగ్గని ఏకైక స్థానమిది. గత మూడుసార్లుగా అభ్యర్థులను మారుస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఈసారి భారత హాకీ జట్టు మాజీ కెపె్టన్ దిలీప్ టిర్కీని బీజేడీ మరోసారి బరిలో దింపింది. 2014లో ఆయన 18 వేల ఓట్ల తేడాతో ఓడారు. ఈ గిరిజన ప్రాబల్య నియోజకవర్గంలో బీజేపీని ఓడించడం కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచ స్థాయి హాకీ స్టేడియం ఏర్పాటు, టిర్కీ ఆదరణ కలిసొచ్చి ఈసారి గట్టెక్కుతామని బీజేడీ భావిస్తోంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ దెహూరీ పోటీ చేస్తున్నారు. ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో మూడు బీజేపీ చేతిలో ఉన్నాయి. రెండింట బీజేడీ, కాంగ్రెస్, సీపీఎం చెరో చోట గెలిచాయి.కందమాల్ ఈ స్థానం బీజేడీ కంచుకోట. కందమాల్, బౌద్ జిల్లాలు మొత్తం దీని పరిధిలోకే వస్తాయి. బీజేడీ నుంచి సిట్టింగ్ ఎంపీ, ప్రముఖ విద్యావేత్త అచ్యుతానంద సామంత బరిలో ఉన్నారు. బీజేపీ ప్రతిసారీ కొత్త అభ్యరి్థని నిలుపుతున్నా నిరాశే ఎదురవుతోంది. ఈసారి సుకాంత కుమార్ పాణిగ్రాహికి టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి అమీర్చంద్ నాయక్ పోటీలో ఉన్నా పోటీ బీజేపీ, బీజేడీ మధ్యే ఉంది. సామంతకు విద్యా, దాతృత్వ కార్యక్రమాలు గట్టి దన్ను. కాగా తాగు, సాగునీటి సమస్య, రోడ్ల దుస్థితి తదితర అంశాలను పాణిగ్రాహి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆయనకు మద్దతుగా ప్రధాని మోదీ ఇప్పటికే ప్రచారం చేశారు.బార్గఢ్ 2008 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏర్పడిన ఈ స్థానంలో విజయం పారీ్టల చేతులు మారుతూ వస్తోంది. 2009లో కాంగ్రెస్ నేత సంయజ్ భోయ్ గెలవగా, 2014లో బీజేడీకి చెందిన డాక్టర్ ప్రవాస్ కుమార్ సింగ్ విజయం సాధించారు. 2019లో బీజేపీని విజయం వరించింది. బీజేడీ సీనియర్ నేత ప్రసన్న ఆచార్యను బీజేపీ నేత సురేశ్ పూజారి ఓడించారు. ఈసారి ఆయనకు బదులు ప్రదీప్ పురోహిత్కు బీజేపీ టికెటిచి్చంది. పూజారిని అసెంబ్లీ ఎన్నికల్లో మోహరించింది. బీజేడీ కూడా పరిణీత మిశ్రాకు అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి సంజయ్ భోయ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేడీ ప్రభుత్వ వైఫల్యాలపై బలంగా గళం వినిపించే ప్రదీప్కు స్థానికంగా మంచి పేరుంది. మోదీ సర్కారు సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ఓటర్లకు దగ్గరవుతున్నారు.అస్కా బీజేడీకి కంచుకోట. సీఎం నవీన్ పటా్నయక్కు ప్రతిష్టాత్మక లోక్సభ స్థానం. ఆయన పోటీ చేస్తున్న హింజిలి అసెంబ్లీ స్థానం దీని పరిధిలోనే ఉంది. తండ్రి బిజూ పటా్నయక్ మరణానంతరం 1997 లోక్సభ ఉప ఎన్నికల్లో అస్కా నుంచే నవీన్ లోక్సభకు ఎన్నికయ్యారు. 1998, 1999 ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించారు. వాజ్పేయి ప్రభుత్వంలో ఉక్కు, గనుల శాఖ మంత్రిగా చేశారు. ఇక్కడ ఏ అభ్యర్థినీ రెండోసారి నవీన్ కొనసాగించకపోవడం గమనార్హం. బీజేడీ నుంచి 2019లో ప్రమీలా బిసోయ్ గెలిచారు. ఈసారి ఆమెను కాదని 33 ఏళ్ల రంజితా సాహుకు బీజేడీ టికెట్ దక్కింది. ఆమె వలస కారి్మకుల కోసం ‘కొడాల యూత్ ఫోరం’ అనే స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు. సామాన్యుల్లో ఆమెకున్న గుర్తింపు చూసే సీఎం టికెటిచ్చారు. బీజేపీ నుంచి మరోసారి అనితా శుభదర్శిని పోటీ చేస్తున్నారు. ఆమె తండ్రి రామకృష్ణ పటా్నయక్ మాజీ మంత్రి. బిజూ, నవీన్ పట్నాయక్లకు అత్యంత సన్నిహితుడు. గంజాం జిల్లాలో ఆయనకు మంచి పేరుంది.ముగ్గురిలో ఒకరిపై కేసు ఒడిశాలో రెండో విడతలో పోలింగ్ జరిగే ఐదు లోక్సభ స్థానాల్లో 40 మంది పోటీలో ఉన్నారు. వీరిలో 13 మంది కోటీశ్వరులే. సంగీతా కుమారి రూ.67.3 కోట్లతో జాబితాలో టాప్లో ఉన్నారు. 12 మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులున్నట్టు పేర్కొన్నారు. వీరిలో 8 మంది తీవ్ర నేరాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 21 మంది గ్రాడ్యుయేషన్, అంతకంటే ఉన్నత విద్యావంతులని ఏడీఆర్ సంస్థ ప్రకటించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
సీఎం నవీన్ విశ్రాంతి తీసుకోవాలి
● రాష్ట్ర ప్రజలు అదే కోరుకుంటున్నారు ● బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ● భువనేశ్వర్లో రోడ్డు షో భువనేశ్వర్: రాష్ట్రానికి ఆరోగ్యవంతమైన, చురుకై న ముఖ్యమంత్రి అవసరమని, అందువలన సీఎం నవీన్ పట్నాయక్ విశ్రాంతి తీసుకోవాలని ఒడిశా ప్రజలు కోరుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భువనేశ్వర్లో గురువారం ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు మార్పు తీసుకురావాలని, బీజేపీని ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నారన్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని దీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈసారి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 3వ సారి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని 21 లోక్సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరో మూడు రోజుల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్న్లకు ముఖ్యమంత్రి అభ్యర్థులను పార్టీ ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నారు. సమృద్ధి ఒడిశాగా మార్చడం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవ చేయడం బీజేపీ లక్ష్యంగా పేర్కొన్నారు. అలాగే ఒడిశా ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నారు. స్థానిక మౌసి మా ఆలయం నుంచి లింగరాజ్ ఆలయం వరకు జరిగిన రోడ్ షోలో భువనేశ్వర్ లోక్సభ అభ్యర్థి అపరాజిత షడంగి, భువనేశ్వర్ ఏకామ్రా అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బాబు సింగ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. -
కేంద్ర ప్రభుత్వ నిధులు అడ్డదారి
బరంపురం: కేంద్ర ప్రభుత్వం ఒడిశా రాష్ట్రానికి అందిస్తున్న నిధులు అడ్డదారిలో మళ్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గంజాం జిల్లా సురడాలో బహిరంగ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులతో పాటు జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన వివిధ రకాల పథకాలను, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. బీజేడీ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలో రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరిగిందని దుయ్యబట్టారు. నష్టపోయిన ఖరీఫ్ రైతుల రుణాలు మాఫీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వలన ఇప్పటివరకు సుమారు 12 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఒడిశా ప్రజలు బీజేడీ నవీన్ ప్రభుత్వంపై పూర్తిగా విసుగు చెందారని, రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం విజయం తథ్యమని చెప్పారు. బహిరంగ సభలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, అస్కా బీజేపీ లోక్సభ అభ్యర్థి అనిత ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. ఒడిశాలో బీజేపీ విజయం తథ్యం కేంద్ర హోం మంత్రి అమిత్ షా -
రెచ్చిపోతున్న బైక్ల దొంగలు
జయపురం: బొరిగుమ్మ సమితిలో బైక్ల దొంగలు రెచ్చిపోతున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు దొంగలను పట్టుకోవడంలో విఫలమవుతున్నారని ఆరోపిస్తున్నారు. గురువారం ఒక మందిరం వద్ద బైక్ ఉంచి పూజలు చేసి వచ్చేసరికి బైక్ దొంగిలించబడింది. వివరాల్లోకి వెళ్తే.. బొరిగుమ్మ సమీప నువాగాం గ్రామానికి చెందిన రవీంద్ర మహాపాత్రో దైవ దర్శనం చేసుకునేందుకు బైక్పై బొరిగుమ్మ వెళ్లాడు. ఆలయం ముందు బైక్ పెట్టి ఆలయంలోకి వెళ్లి పూజచేసి, తిరిగి వచ్చి బైక్ పెట్టిన ప్రాంతానికి వెళ్లి చూడగా అక్కడ బైక్ కనిపించలేదు. దీంతో ఖంగుతిన్న మహాపాత్రో ఆ ప్రాంతంలో ఉన్నవారిని వాకబు చేశాడు. అయితే తామెవరీ చూడలేదని తెలపడంతో తన మిత్రులతో కలిసి బొరిగుమ్మ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎలుగు దాడిలో తండ్రీ, కొడుకుకు గాయాలు
జయపురం: సబ్ డివిజన్ బొరిగుమ్మ సమితి రణస్పూర్ పంచాయతీ రాణిగుణ గ్రామంలో బాసు ముదులి, అతడి కుమారుడు నకుల్ ముదులిలు ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. తమ ఇంటి కప్పు నేతకు గడ్డి వెదురులు, తాళ్లు సంగ్రహించేందుకు బాసు, నకుల్లు మంగళవారం అడవికి వెళ్లారు. అక్కడ వారిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఆ దాడిలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారి ఆర్తనాదాలు విని ఆ ప్రాంతంలో ఉన్నవారు వెళ్లగా వారిని చూసి ఎలుగుబంటి అడవిలోనికి పారిపోయింది. గాయపడిన ఇరువురిని బిసింగపూర్ ప్రాథమిక వైద్య కేంద్రానికి తీసుకెళ్లారు. అనంతరం వారి పరిస్థితి విషమంగా ఉండడంతో బొరిగుమ్మ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం డాక్టర్లు వారిని కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల ఆస్పత్రికి పంపించారు. కానీ అచ్చట కూడా వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో బరంపురం తీసుకెళ్లమని డాక్టర్లు వారి బంధువులకు సూచించారు. అయితే మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి బరంపురం వెళ్లి అచ్చట పరిస్థితులు తెలియక, డబ్బు లేకపోవడంతో బరంపురం వెళ్లేందుకు భయపడ్డారు. ప్రస్తుతం కొరాపుట్లోనే చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. -
నారాయణపూర్ గ్రామస్తుల ఆందోళన
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ్ సమితి నారాయణపూర్ గ్రామస్తులు గ్రామంలో గురువారం ఆందోళన చేపట్టారు. దీంతో పర్లాకిమిడి – ఆర్.ఉదయగిరి – మోహనా రోడ్డు, బరంపురానికి వెళ్లాల్సిన బస్సులు, వాహనాలు నిలిచిపోయాయి. గ్రామంలో తాగునీటికి అనేక నెలలుగా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కన ఉన్న బొమ్మిక గ్రామం మహేంద్రతనయ నుంచి వేసిన పైపులు తక్కువ సమయంలోనే పనిచేయడం లేదని గ్రామస్తులు మండిపడ్డారు. నారాయణపూర్ గ్రామంలో ఉన్న చెరువులు ఎండిపోయాయి. ఎన్నికల ముందు అధికారులు, ఎమ్మెల్యే దాశరథి గొమాంగో ఎన్ని హామీలు ఇచ్చినా అవి బుట్టదాఖలయ్యాయన్నారు. తాగునీటి సమస్య కోసం చేపడుతున్న రాస్తారోకో కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం సంఘటన స్థలానికి బీడీవో సుధీర్ కుమార్ సింగ్ విచ్చేసి, ఆందోళనకారులతో మాట్లాడి తాగునీటి సమస్యను ఎన్నికల పోలింగ్ తర్వాత పరిష్కరిస్తామన్నారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. -
నాటుసారా, మద్యం సీసాలు ధ్వంసం
సోంపేట: సోంపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో గడిచిన ఆరు నెలల్లో వివిధ కేసుల్లో పట్టుబడిన 4817 లీటర్ల నాటు సారా, 43 లీటర్ల మద్యం నిల్వలను గురువా రం స్టేషన్ సమీపంలో ధ్వంసం చేశారు. విశాఖ ఎస్ఈబీ డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వుల మేరకు పలాస డివిజన్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఇస్మాత్ ఆరా బేగం ఆధ్వర్యంలో మద్యం నిల్వలు ధ్వంసం చేసినట్లు సోంపేట ఇన్స్పెక్టర్ ఆర్.జైభీమ్ తెలిపారు. ఆరో ర్యాంకు సాధించిన విద్యార్థికి అభినందనలు కొత్తూరు: కొత్తూరు మండలం కర్లెమ్మ పంచాయతీ పరిధి నేతాజి నగర్ కాలనీకి చెందిన పెనుపర్తి జగదీష్ రాష్ట్ర స్థాయిలో తన ప్రతిభను కనబరిచాడు. కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన జగదీష్ ఏపీఆర్డీసీలో వందకు 96 సాధించి రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంకు తెచ్చుకున్నాడు. దీనిపై కాలేజి ప్రిన్సిపాల్ రవికుమార్తో పాటు అధ్యాపకులు అభినందనలు తెలిపారు. జగదీష్ తల్లిదండ్రులు బుల్లేశ్వరరావు కృష్ణవేణిలు కార్పెంటరీ పనులు చేస్తూ కుమారుడిని చదివించారు. నవధాన్యాల సాగుతో భూసారం పెంపు ఎల్.ఎన్.పేట: ఖరీఫ్ వరి సాగుకు ముందు తొలకరి వర్షాల్లో నవధాన్యాలను సాగు చేసుకోవటం వల్ల భూసారం పెంచుకోవచ్చని ప్రకృతి వ్యవసాయ విభాగం అడిషనల్ డీపీఎం ధనుంజయరావు అన్నారు. మండల కేంద్రంలోని వైకేపీ కార్యాలయంలో మహిళా సంఘాలతో పాటు కొత్తూరు డివిజన్ స్థాయి ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నవధాన్యాల విత్తనాలను వేసుకున్న తర్వాత మొలకలు వచ్చిన 30 నుంచి 50 రోజుల మధ్యలో ఆయా మొక్కలను పొలంలో కలియదున్నటం వల్ల భూసారం పెరుగుతుందన్నారు. ఎరువులు, పురుగుల మందులు విచక్షణరహితంగా వినియోగించటం వల్ల భూసారం క్షీణిస్తుందన్నారు. భూసారం పెంచేందుకు రైతులు తన వంతు ప్రయత్నం చేయాలన్నారు. ఇందుకు రైతులకు అవగాహన కలిగించాల్సిన అవసరం మనపైన ఉందన్నారు. కార్యక్రమంలో రీజనల్ అధికారి హేమసుందరరావు, డివిజన్ ఇన్చార్జ్ ఎన్ఎఫ్ఎ గోవిందరెడ్డి, ఐటీడీఏ ఎన్ఎఫ్ఎ ముసలయ్య, ఎంటీ సూర్యనారాయణ, మార్కెటింగ్ ఎంటీ చిన్నమ్మడు, ఐసీఆర్పీ, యూనిట్ ఇన్చార్జిలు పాల్గొన్నారు. జెమ్స్లో అవయవదానం ● కిడ్నీ, లివర్ విశాఖపట్నంకు తరలింపు ● మరో కిడ్నీ జెమ్స్లోనే రోగికి మార్పు ● చిరంజీవిగా నిలిచిన శ్రీనివాసరావు శ్రీకాకుళం రూరల్: జిల్లా కేంద్రంలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో గురువారం అవయవదానం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను జెమ్స్ వైద్యులు తెలిపారు. శ్రీకాకుళం పరిధిలోని చినమండల వీధికి చెందిన తోట శ్రీనివాసరావు (46) ఈ నెల 14న పెయింట్ంగ్ పనికి వెళ్తూ సూర్యమహల్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అదే రోజు జెమ్స్లో చేరారు. 15వ తేదీ తర్వాత ఆయన బ్రెయిన్ పూర్తిగా పనిచేయడం లేదని వైద్యులు ధ్రువీకరించారు. వెంటిలేటర్పై చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. శరీరంలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. ఆయన కుమారుడు జ్యోతి ప్రకాశ్, చెల్లి సరితాలు కలిసి అవయవదాన సంస్థ గల జీవనదాన్కు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో శ్రీనివాసరావు కిడ్ని, లివర్ను విశాఖపట్నంకు తరలించగా, మరో కిడ్నీని ఇదే ఆస్పత్రిలో వేరే బాధితునికి అమర్చారు. అనంతరం అమరహే శ్రీనివాస్ అంటూ విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది దారి పొడవునా నివాళులర్పించారు. -
ఎన్నికల్లో హింస సరికాదు
భువనేశ్వర్: గంజాం జిల్లా ఖల్లికోట్ పోలీసు ఠాణా పరిధిలోని కృష్ణశరణ్ పూర్ గ్రామంలో బుధవారం బిజూ జనతా దళ్ (బీజేడీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో బీజేపీ కార్యకర్త ఒకరు మృతి చెందగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అధికార బీజేడీ, బీజేపీ మద్దతుదారులు ఎన్నికల పోస్టర్లు అంటించే వైనంతో రగిలిన వివాదం ఘోరమైన ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణ ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొంది. మృతుడు దిలీప్ పహాన్ (43)గా గుర్తించారు. పహాన్ మృతితో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. దీంతో సీఎం నవీన్ పట్నాయక్ ఖల్లికోట్ ఎన్నికల హింసాత్మక ఘటనను ఖండించారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎక్స్ హ్యాండిల్లో ఖల్లికోట్ ప్రాంతంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, విషాదకరమైన హింసాత్మక సంఘటనగా వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర కలత మరియు విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి హింసాత్మక ఘటనలకు మన ప్రజాస్వామ్యంలో చోటు లేదన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలియజేశారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. నేరానికి పాల్పడిన వారిపై పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఓటమి భయంతోనే దాడులు మరోవైపు ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే అధికార పార్టీ హింసకు పాల్పడుతోందని బీజేపీ నేత, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలపై బీజేడీ కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. కార్యకర్తల త్యాగాలు వృథా కావు అని, ఒడిశా ప్రజలు బ్యాలెట్ ద్వారా తగిన సమాధానం ఇస్తారని ధ్వజమెత్తారు. ఘటనపై ఎన్నికల అధికారులు, పోలీసు యంత్రాంగం తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. హింస నివారణకు చర్యలు తీసుకోవాలి: సీఈవో రాష్ట్రంలో రెండో దశ ఎన్నికలకు ముందు జరిగిన సంఘటనపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) నికుంజ బిహారీ ధొలొ తీవ్రంగా స్పందించారు. ఈ ఘర్షణ నేపథ్యంలో ముందస్తు ఎన్నికల హింసను నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని గంజాం జిల్లా కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి హింసాత్మక ఘటనలను సహించబోమని స్పష్టం చేశారు. పరారీలో ప్రధాన నిందితుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) నికుంజ బిహారీ ధొలొ ఆదేశాల మేరకు ఖల్లికోట్ ఠాణా పోలీసులు కృష్ణశరణ్ పూర్ గ్రామంలో బుధవారం రాత్రి బీజేపీ, బీజేడీల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరి ప్రాణాలను బలిగొన్న సంఘటనలో ఎనిమిది మంది నిందితులను గురువారం అరెస్టు చేశారు. ఒకరు మృతి చెందిన ఈ ఘర్షణలో ప్రధాన నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు. సీఎం నవీన్ పట్నాయక్ ఖండన బీజేడీ హస్తంపై బీజేపీ ఆరోపణ
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా జితేష్ శర్మ..
Summer special థండయ్ కుల్పీ రెసిపీ
రోహిత్తో నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. వీడియో వైరల్
Music Shop Murthy: ఆకట్టుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ ‘అంగ్రేజీ బీట్’ సాంగ్
నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
లండన్ కు చేరుకున్న సీఎం జగన్
వవన్ కల్యాణ్ అభిమానిపై రేణు దేశాయ్ ఫైర్
వ్యాక్సిన్ తో ముప్పు?.. ఏది నిజం?
తప్పక చదవండి
- ‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- IPL 2025: ముంబైకి రోహిత్ గుడ్ బై.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్!
- టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
Advertisement