ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు గడిచిన మూడేళ్లలో సాగించిన అవినీతిపై ముద్రించిన ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఈ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో సీఎం చంద్రబాబు చేసిన అవినీతిపై ఆధారాలతో సహా ఈ పుస్తకాన్ని ముద్రించడం జరిగిందన్నారు. ఆయన సాక్ష్యాత్తూ రూ.3 లక్షల 75వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. అందులో లక్షకోట్ల కుంభకోణంలో ఒక్క రాజధాని ప్రాంతం భూముల మీద అయితే, మరొకటీ విశాఖలో భూముల మీద జరిగిన కుంభకోణం అన్నారు. ఇవి కాకుండా చంద్రబాబు నాయుడు వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కాంట్రాక్టులకు సంబంధించి అన్ని ఆధారాలతో ఈ పుస్తకాన్ని రూపొందించామన్నారు. ఈ పుస్తకాన్ని ప్రతి గ్రామంలోకి తీసుకు వెళ్లాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు సూచించారు.
చంద్రబాబు అవినీతిపై ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’
Published Sat, Jul 8 2017 2:17 PM
Advertisement
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement