కొత్త పంథాలో నిరసనలు చేపడతాం: శశికళ | Sakshi
Sakshi News home page

కొత్త పంథాలో నిరసనలు చేపడతాం: శశికళ

Published Sun, Feb 12 2017 6:48 AM

గవర్నర్‌ కావాలనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా తాత్సారం చేస్తున్నారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఆరోపించారు. గవర్నర్‌ స్పందించే వరకూ సహనంగా ఎదురుచూస్తామని చెప్పారు. కొందరు పార్టీని చీల్చాలని చూస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలను కలవడం ఆనందంగా ఉందని చెప్పారు. ఎమ్మెల్యేలంతా ఒకే తాటిపై ఉన్నారని పేర్కొన్నారు. అందరినీ కాపాడుకుంటామని ఆదివారం నుంచి కొత్త పంథాలో నిరసనలు చేపడతామని తెలిపారు.

Advertisement
Advertisement