వేధింపులతో చంపేస్తున్నారు..! | Sakshi
Sakshi News home page

వేధింపులతో చంపేస్తున్నారు..!

Published Tue, Oct 25 2016 7:00 AM

వైద్య కళాశాలలో సీనియర్‌ విద్యార్థులు వేధించకుండా ప్రశాంత వాతావరణంలో విద్యాబోధన జరిగేలా చూడాల్సిన ప్రొఫెసర్‌లే వేధింపులకు పాల్పడుతుండడం దారుణం. వైద్య విద్యార్థినులపై ర్యాగింగ్, లైంగిక వేధింపులు జరగకుండా ప్రొఫెసర్ల నేతృత్వంలో యాంటీ ర్యాగింగ్‌ కమిటీ పనిచేయాల్సిఉంది. కాగా గుంటూరు వైద్య కళాశాల, జీజీహెచ్‌లో కొందరు బోధన సిబ్బంది వైద్య విద్యార్థినులపై మానసిక, లైంగిక వేధింపులకు పాల్పడుతూ తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారు. కొందరు ప్రొఫెసర్ల విపరీత పోకడల వల్ల ప్రసిద్ధిగాంచిన గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రతిష్ట దిగజారుతోంది. గుంటూరు జీజీహెచ్, వైద్య కళాశాలల్లో కొందరు ప్రొఫెసర్లు వైద్య విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతుండడంతో తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement