మాజీ మంత్రులకు కరెంటు కష్టాలు! | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రులకు కరెంటు కష్టాలు!

Published Wed, Mar 26 2014 4:10 PM

అధికార దర్పం వెలగబెడుతున్న నాయకలకు విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు. విద్యుత్ వాడుకుని బిల్లులు చెల్లించకపోవడంతో కరెంట్ సరఫరా నిలిపివేశారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయినికి విద్యుత్ సరఫరా ఆపేశారు. 24 లక్షలు రూపాయల విద్యుత్ బకాయి ఉండటంతో కరెంట్‌ నిలిపేశారు. బిల్లులు కట్టకుంటే ఎవరినైనా ఉపేక్షించబోమన్న సందేశానిచ్చారు. ఇప్పటికైనా నాయకులు విద్యుత్ బకాయిలు చెల్లిస్తారో, లేదో చూడాలి. బిల్లులు చెల్లించే వరకు విద్యుత్ సరఫరాను పునరుద్దరించబోమని అధికారులు అంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement