ఉత్తర కొరియా మరో దుస్సాహసం | Sakshi
Sakshi News home page

ఉత్తర కొరియా మరో దుస్సాహసం

Published Wed, Apr 5 2017 2:42 PM

తరచూ వివాదాస్పద చర్యలకు పాల్పడే ఉత్తర కొరియా మరోసారి వార్తల్లో నిలిచింది. అమెరికా సహా పలు అగ్రదేశాలు హెచ్చరించినా ఇటీవల పలు క్షిపణి, అణు పరీక్షలు చేసిన ఉత్తరకొరియా మరోసారి అదే దుశ్చర్యకు దిగింది. ఉత్తర కొరియా బుధవారం ఓ బాలిస్టిక్ మిస్సైల్ ను జపాన్ ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా, అమెరికా మిలిటరీ వర్గాలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ లు సమావేశం కానున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ క్షిపణిని పరీక్షించడం చర్చనీయాంశమైంది. జపాన్-చైనాలతో పాటు అమెరికాకు సూచనప్రాయంగా తెలిపేందుకే ఈ చర్యలకు దిగుతుందని వీరు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement