కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

Published Wed, Jan 4 2017 7:39 PM

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. నాగర్‌ కర్నూలుకు చెందిన రోజువారి కూలీ నిరంజన్‌ కరెంట్‌ షాక్‌తో మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం ఓ ఇంట్లో పనిచేస్తుండగా నిరంజన్‌ మృతి చెందగా.. ఆ సమాచారాన్ని ఇంటి యజమాని ఇప్పటివరకు తమకు అందించలేదని బంధువులు చెబుతున్నారు. యజమాని నిర్లక్ష్యం వలనే ఈ దారుణం జరిగిందని ఆరోపిస్తూ.. ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement