ఒక్క ఛాలెంజ్‌కే రూలింగ్‌ ఇస్తారా? | Sakshi
Sakshi News home page

ఒక్క ఛాలెంజ్‌కే రూలింగ్‌ ఇస్తారా?

Published Fri, Mar 24 2017 2:24 PM

ప్రతిపక్షం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ఏపీ అసెంబ్లీ జరుగుతున్న తీరుపై వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అసంతృప్తి వ‍్యక్తం చేశారు. అసెంబ్లీ పదినిమిషాలు వాయిదా అనంతరం ఆయన మీడియాతో మా‍ట్లాడుతూ....సభలో ఒక్క ఛాలెంజ్‌కే రూలింగ్‌ ఇస్తారా, తమ ఛాలెంజ్‌లపై రూలింగ్‌ ఇవ్వరా అని ప్రశ్నించారు. దేనికైనా ధర్మం, న్యాయం ఉండాలని పార్టీ మారిన 21మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్‌ విసిరామని, కానీ స్పీకర్‌ను అడ్డం పెట్టుకుని అనర్హత వేటు పడకుండా చూస్తున్నారని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement