'పవన్ పోరాటం ఎవరిపైనో స్పష్టం చేయాలి' | Sakshi
Sakshi News home page

'పవన్ పోరాటం ఎవరిపైనో స్పష్టం చేయాలి'

Published Thu, Mar 5 2015 8:12 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోరాటం ఎవరిపైనో స్పష్టం చేయాలని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ గురువారం హైదరాబాద్లో డిమాండ్ చేశారు. భూ సేకరణపై చంద్రబాబును ఎందుకు నిలదీయడం లేదని ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ను బాల్క సుమన్ ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు కరీంనగర్లో పర్యటన చేస్తారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాబు పట్ల ప్రజల్లో నమ్మకం పోయిందని... అందుకే ప్రజలు దృష్టిని మళ్లించే బాబు యత్నం చేస్తున్నారని విమర్శించారు.