'వారం ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేయొద్దు' | Sakshi
Sakshi News home page

'వారం ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేయొద్దు'

Published Wed, Apr 1 2015 4:19 PM

ఏపీ ప్రైవేటు వాహన యజమానులకు ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంట్రీ ట్యాక్స్ వారం పాటు వసూలు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చెక్ పోస్టుల వద్ద హామీ పత్రాలు ఇవ్వాలని సూచించింది. ఎంపీ కేశినేని నాని తదితరులు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఈ ఆదేశాల్చింది. కోర్టును ఆశ్రయించిన వారు తప్ప మిగతా వారంతా ఎంట్రీ ట్యాక్స్ కట్టాల్సిందేనని న్యాయస్థానం పేర్కొంది. దీనిపై తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement