కార్యకర్త చేసిన పనికి ప్రధాని మోదీ ఎమోషనల్‌ | Sakshi
Sakshi News home page

కార్యకర్త చేసిన పనికి ప్రధాని మోదీ ఎమోషనల్‌

Published Tue, Mar 5 2024 8:00 AM

PM Modi Emotional BJP worker received airport before Seeing His Twins - Sakshi

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం చెన్నై పర్యటనలో తనకు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికిన ఓ బీజేపీ కార్యకర్తపై ప్రశంసలు కురింపించారు. చెన్నై ఎయిర్‌పోర్టులో మోదీకి ఓ బీజేపీ కార్యకర్త స్వాగతం పలికారు. అయితే తన భార్య ఇద్దరు కవల పిల్లలు జన్మనించిందని అయినా వారిని చూడకుండా ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు వచ్చినట్లు స్వయంగా మోదీకే తెలియజేయటం విశేషం. అటువంటి అంకితభావం ఉన్న కార్యకర్త చేసిన పనికి తాను ఎమోషనల్‌ అయినట్లు మోదీ ‘ఎక్స్‌’లో తెలిపారు. ప్రస్తుతం మోదీ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

‘చైన్నై ఎయిర్‌పోర్టులో నాకు స్వాగతం పలకడానికి వచ్చిన బీజేపీ కార్యకర్త అశ్వంత్ పిజై చాలా ప్రత్యేకంగా అనిపించారు. అతను తన భార్య ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచిందని చెప్పారు. అయినా వారిని ఇంకా కలవలేదన్నారు. వారిని కలవకుండా నాకు స్వాగతం పలకడానికి ఎయిర్‌పోర్టుకు వచ్చానని తెలిపారు. నేను ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఆశీర్వాదాలు తెలియజేశాను’ అని సదరు కార్యకర్తపై ప్రశంసలు కురిపించారు. ‘అభిమానం, అంకితభావంతో కూడిన అశ్వంత్ పిజై వంటి బీజేపీ కార్యకర్తను చూడటం చాలా ఆనందంగా ఉంది. కార్యకర్తలు చూపించే ప్రేమ, అనురాగం నన్ను భావోద్వేగానికి గురిచేశాయి’ అని ప్రధాని మోదీ అన్నారు.

చదవండి: కర్ణాటక అసెంబ్లీలో పాక్‌ నినాదాలు నిజమే!

Advertisement
Advertisement