వేదికపైనే బోరున ఏడ్చేసిన కలర్స్ స్వాతి.. ఎందుకంటే? | Colors Swathi Reddy Gets Emotional About Naveen Chandra Comments In Press Meet, Deets Inside - Sakshi
Sakshi News home page

Actress Swathi Reddy Gets Emotional: నవీన్ చంద్ర అలాంటి కామెంట్స్.. స్వాతి ఫుల్ ఎమోషనల్!

Published Tue, Oct 3 2023 12:45 PM

Colors Swathi Reddy Gets Emotional About Naveen Chandra Comments - Sakshi

నవీన్‌ చంద్ర, కలర్స్‌ స్వాతి కలిసి నటిస్తోన్న తాజా చిత్రం మంత్‌ ఆఫ్‌ మధు. ఈ చిత్రానికి శ్రీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్‌ కాగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. గతంలో వీరిద్దరూ త్రిపుర చిత్రంలో జంటగా కనిపించారు. మరోసారి వెండితెరపై జంటగా ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా  ఉంది చిత్రబృందం. మూవీ ప్రమోషన్లలో భాగంగా నవీన్ చంద్ర, స్వాతి వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రెస్‌ మీట్‌లో స్వాతిపై నవీన్ చంద్ర ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో అతని మాటలు విన్న కలర్స్ స్వాతి ఫుల్ ఎమోషనలయ్యారు. 

(ఇది చదవండి: కలర్స్‌ స్వాతితో పెళ్లి.. అసలు విషయం చెప్పేసిన నవీన్ చంద్ర!)

నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ' ఈ సినిమాలో లేఖ అనే క్యారెక్టర్ చేయడానికి చాలా గడుసు కావాలి. మా సిస్టర్‌ జాబ్‌ చేస్తుంటారు. తాను బస్సు, ఆటో, మెట్రోలో రోజు ప్రయాణం చేయాలి. తన కుటుంబం కోసం కష్టపడాలి. అలాగే స్వాతి కూడా చాలా హార్డ్‌ వర్క్ పర్సన్. తనను నేను మా ఫ్యామిలీ మెంబర్‌గానే చూస్తాను. తను కష్టపడడమే కాకుండా.. తనతో పనిచేసే వారిలో నమ్మకం కలిగిస్తుంది. ఆ దేవుడిని ఇంతకంటే ఏమీ అడగలేను. అందుకే తను నా బెస్ట్ ఫ్రెండ్‌. భవిష్యత్తులోనూ ఏదైనా అవకాశమొస్తే మేమిద్దరం కలిసి నటిస్తాం. మేం మంచినటులం. మీ అందరు మా జోడీని ఇంత బాగా గుర్తిస్తున్నందుకు చాలా థ్యాంక్స్.' అని అన్నారు. అయితే నవీన్ చంద్ర మాటలకు స్వాతి వేదికపైనే ఏడ్చేసింది. నన్ను ఇంతలా అర్థం చేసుకున్నందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్ అంటూ స్వాతి ఫుల్ ఎమోషనలయ్యారు. కాగా.. ఈ చిత్రం అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement
Advertisement