చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Published
Fri, Sep 8 2023 12:16 PM
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరుసగా మూడు వాహనాలు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. వడమాలపేట చెక్పోస్ట్ దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది.
రోడ్డుకు అడ్డంగా పడిన లారీని మరో కారు ఢీకొట్టగా, ప్రమాదానికి గురైన కారును బైక్ ఢీకొట్టింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.