వేసవి సెలవుల్లో ప్రత్యేక రైళ్లు | Sakshi
Sakshi News home page

వేసవి సెలవుల్లో ప్రత్యేక రైళ్లు

Published Fri, Apr 26 2024 5:12 AM

Special trains during summer holidays

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ప్రత్యేక వారాంతపు రైళ్లను నడపనున్నట్లు విజయవాడ డివిజన్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ మండ్రూప్‌కర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలు (ట్రైన్‌ నంబర్‌ 07234) ఈ నెల 28నుంచి జూన్‌ 30వ తేదీ వరకు ప్రతి ఆదివారం సికింద్రాబాద్‌ నుంచి సంత్రగచి వరకు నడుస్తుందని పేర్కొన్నారు. 

 సికింద్రాబాద్‌లో రాత్రి 11.40 బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బరంపూర్, కుర్దారోడ్డు, భువనేశ్వర్, కటక్, బద్రాక్, ఖరగ్‌పూర్‌ మీదుగా మంగళవారం ఉదయం 5 గంటలకు సంత్రగచి చేరుతుందన్నారు. 

ఈ ట్రైన్‌ (నంబర్‌ 07235) తిరిగి ఈనెల 30వ తేదీ నుంచి జూలై 2 వరకు మంగళవారాల్లో సంత్రగచిలో మధ్యాహ్నం 12.20కి బయలుదేరి బుధవారం మధ్యాహ్నం  3 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. విజయవాడకు బుధవారం ఉదయం 8.45కు వస్తుంది. 18 బోగీలతో నడిచే  ఈ రైళ్లలో ఎటువంటి రిజర్వేషన్‌ సౌకర్యం ఉండదన్నారు. స్టేషన్‌లలో బుకింగ్‌ కౌంటర్ల వద్ద టికెట్లు పొందవచ్చునని తెలిపారు. యూటీఎస్‌  మొబైల్‌ యాప్‌ ద్వారా  ఆన్‌లైన్‌ టికెట్లు  తీసుకోవచ్చని తెలిపారు. 

Advertisement
Advertisement