-
వైఎస్సార్ క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్
సాక్షి,వైఎస్సార్ కడప: క్రీడలపై ఆసక్తి ఉన్న చిన్నారుల్లో దాగి ఉన్న సామర్థ్యాలను వెలికితీసేందుకు మంచి వేదికగా నిలిచిన డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. నాలుగు, ఐదు తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) ఆధ్వర్యంలో మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించి.. ప్రవేశాలు కల్పిస్తారు. తొలుత మండల స్థాయిలో పోటీలు నిర్వహించి విద్యార్థుల్ని ఎంపిక చేస్తారు. అక్టోబర్ 6 నుంచి 10వ తేదీ మధ్యలో ఈ ప్రక్రియ జరుగుతుంది. అక్టోబర్ 17, 18 తేదీల్లో జిల్లా స్థాయిలో పోటీలుంటాయి. అక్టోబర్ 27, 28 తేదీల్లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించి.. విద్యార్థులను ఎంపిక చేస్తారు. మండల, జిల్లా పోటీల తేదీలను ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునే అవకాశముంది. ఎంపిక విధానమిలా.. తొలుత మండల స్థాయిలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. విద్యార్థి ఎత్తు, బరువుతో పాటు 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల పరుగుపందెంలో 15 పాయింట్లకు ఎంపికలు నిర్వహిస్తారు. 8 పాయింట్లకు పైగా సాధించిన విద్యార్థులను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయిలో ఎంపికలను డీఎస్ఏ ఆధ్వర్యంలో ఆయా జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఎత్తు, బరువుతో పాటు 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల పరుగు పందెం, 6గీ10 షటిల్రన్, మెడిసిన్ బాల్ఫుట్లో 21 పాయింట్లకు ఎంపికలు నిర్వహిస్తారు. 11 పాయింట్లకు పైగా సాధించిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో కూడా ఎత్తు, బరువుతో పాటు 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల పరుగు పందెం, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్లతో కలిపి మొత్తం 27 పాయింట్లకు పోటీలు నిర్వహిస్తారు. ఇందులో 14 పాయింట్లకు పైగా సాధించాలి. బాలురకు 20, బాలికలకు 20 నాలుగవ తరగతిలో ప్రవేశాలకు 40 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో 20 సీట్లు బాలికలకు, 20 సీట్లు బాలురకు కేటాయించారు. కోవిడ్ వల్ల 2020–21 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు నిర్వహించకపోవడంతో.. ఈ ఏడాది 5వ తరగతికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. 5వ తరగతిలో కూడా 20 సీట్లు బాలికలకు, 20 సీట్లు బాలురకు అందుబాటులో ఉంటాయి. ఎంపికైన విద్యార్థులకు 10 క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, హాకీ, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, తైక్వాండో, వెయిట్లిఫ్టింగ్, వాలీబాల్లో నిపుణులు శిక్షణ ఇస్తారు. ఇక్కడి విద్యార్థులు ఏటా పది ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఎవరు అర్హులంటే.. 4వ తరగతిలో చేరాలనుకునే విద్యార్థులు 1–8–2012 నుంచి 31–7–2013 మధ్యలో పుట్టినవారై ఉండాలి. 5వ తరగతిలో చేరాలనుకునే వారు 1–8–2011 నుంచి 31–7–2012 మధ్యలో జన్మించినవారై ఉండాలి. బర్త్ సర్టిఫికెట్, స్టడీ అండ్ కాండక్ట్ సర్టిఫికెట్, 3 పాస్పోర్టు సైజు ఫొటోలను ఎంపిక ప్రదేశానికి తీసుకురావాల్సి ఉంటుంది. సద్వినియోగం చేసుకోవాలి వైఎస్సార్ క్రీడా పాఠశాలలో ప్రవేశం పొందడమంటే చక్కటి భవిష్యత్కు బాట వేయడమే. అన్ని రకాల వసతులు, విద్యతో అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో శిక్షణ అందిస్తున్నాం. ఆసక్తి కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ రామచంద్రారెడ్డి, ప్రత్యేకాధికారి, డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాల, కడప చదవండి: సాగర తీరం.. సుందర దృశ్యం -
‘ఖేలో ఇండియా’ కేంద్రంగా వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్
న్యూఢిల్లీ: భవిష్యత్ ఒలింపిక్స్ చాంపియన్లను తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ పథకంలో ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లా చోటు దక్కించుకుంది. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (కేఐఎస్సీఈ)’ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర క్రీడా శాఖ శనివారం ప్రకటించింది. ఇందులో వైఎస్సార్ జిల్లాలోని ‘డా. వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్’ ఎంపిక కావడం విశేషం. ఈ పథకంలో స్థానం దక్కడంతో వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్లో మౌలిక వసతులు, హై పెర్ఫార్మెన్స్ అధికారులు, కోచ్లు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఇతరత్రా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో 14 సెంటర్లను కేఐఎస్సీఈగా మారుస్తున్నట్లు క్రీడా శాఖ ప్రకటించగా... తాజా జాబితాతో వాటి సంఖ్య 23కు చేరింది. తాజాగా ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్, చంఢీగఢ్, గోవా, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, పుదుచ్చేరి, జమ్మూ కశ్మీర్లు చేరాయి. -
దుమ్మురేపిన ‘దుర్గ’
కడప నగరంలోని వైఎస్ఆర్ క్రీడాపాఠశాలకు చెందిన క్రీడాకారిణి దుర్గ ఫుట్బాల్ క్రీడాంశంలోదుమ్మురేపుతోంది. ఇప్పటికే పలు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటిన కామసాని దుర్గ.. తాజాగా 2020లో నిర్వహించే ప్రపంచ మహిళల ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనే ఇండియాజట్టు ఎంపికల కోసం నిర్వహించే వరల్డ్కప్ ప్రిపరేషన్ నేషనల్ క్యాంపునకు ఎంపికైంది. క్యాంపులో ఈమె చక్కటి ప్రతిభ కనబరిస్తే 16 దేశాల క్రీడాకారిణులు పాల్గొనే ఈ ప్రపంచ మహిళల ఫుట్బాల్ టోర్నమెంట్లో రాష్ట్రం నుంచి ఈమె ప్రాతినిథ్యం వహించే అవకాశాలు ఉన్నాయి. కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో పదోతరగతి చదువుతున్న కామసాని దుర్గ ఫుట్బాల్ క్రీడలో చక్కగా రాణిస్తోంది. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం కె.ఎన్.పెంట గ్రామానికి చెందిన రమేష్రెడ్డి, రోశమ్మల కుమార్తె అయితే ఈమె తొలుత హకీంపేటలోని క్రీడాపాఠశాలలో ప్రవేశం పొందింది. రాష్ట్ర విభజన అనంతరం స్థానికత ఆధారంగా 2014లో ఈమెను కడప వైఎస్ఆర్ క్రీడాపాఠశాలకు బదిలీ చేశారు. అప్పటి నుంచి ఫుట్బాల్ శిక్షకుడు ఎం. హరి వద్ద ఫుట్బాల్లో మెలకువలు నేర్చుకోవడంతో పాటు పలు టోర్నమెంట్లలో రాణిస్తూ వచ్చింది. ఎస్జీఎఫ్, అసోసియేషన్ రాష్ట్రస్థాయి, సౌత్జోన్, జాతీయస్థాయి పోటీల్లో నిలకడగా రాణిస్తూ వస్తోంది. కర్నూలు, శ్రీకాకుళం, గుంటూరు, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఈమె సత్తాచాటారు. అదే విధంగా 2015–16లో భోపాల్లో నిర్వహించిన ఎస్జీఎఫ్ పోటీల్లో ఈమె రాణించారు. 2016–17లో చెన్నైలో నిర్వహించిన ఖేలోఇండియాలోను, సబ్జూనియర్ విభాగంలో సత్తాచాటారు. 2017–18లో బెంగుళూరు, పూణేలో నిర్వహించిన ఎస్జీఎఫ్, ఊర్జా మీట్లలో సత్తాచటారు. 2018–19లో కటక్లో నిర్వహించిన సబ్జూనియర్స్లోను, త్రిపురలో నిర్వహించిన ఎస్జీఎఫ్ నేషనల్ పోటీల్లో ఈమె చక్కటి ప్రతిభ కనబరిచారు. 2019–20 సంవత్సరానికి గాను ఢిల్లీలో నిర్వహించిన జాతీయస్థాయి సుబ్రతోముఖర్జీ టోర్నమెంట్లో ఈమె చక్కటి ప్రతిభ కనబరిచారు. మలుపు తిప్పిన సుబ్రతోముఖర్జీ టోర్నమెంట్.. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ నిర్వహించిన సుబ్రతో ముఖర్జీ టోర్నమెంట్లో ఈమె ఆటతీరుకు చక్కటి గుర్తింపు లభించింది. దీంతో ఆమెను 2020 ఉమెన్స్ వరల్డ్కప్ ప్రిపరేషన్ నేషనల్ క్యాంపునకు ఎంపిక చేశారు. ఏపీ నుంచి ఈ క్యాంపునకు ఎంపికైన ఏకైక క్రీడాకారిణి ఈమె కావడం విశేషం. ఈ క్యాంపు పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కత సమీపంలోని కల్యాణి నగరంలో ఈనెల 4 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ క్యాంపులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులను ఇండియా అండర్–17 ఉమెన్స్ ఫుట్బాల్ టీంనకు ఎంపిక చేశారు. 2020 నవంబర్ 2 నుంచి 21వ తేదీ వరకు మనదేశంలో నిర్వహించనున్నారు. వైఎస్ఆర్ క్రీడాపాఠశాల క్రీడాకారిణి ఇండియన్ ఫుట్బాల్ క్యాంపునకు ఎంపికకావడం పట్ల క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి ఎస్.బాషామోహిద్దీన్, ఫుట్బాల్ కోచ్ హరి సంతోషం వ్యక్తం చేశారు. -
భోజన వేళ.. నిలబడే తినాలి
కడప స్పోర్ట్స్ : రాష్ట్రానికే తలమానికంగా నిలు స్తున్న ఏకైక క్రీడాపాఠశాల వైఎస్ఆర్ క్రీడాపాఠశాల.. క్రీడల పరంగా ఉన్న వసతులతో చక్కటి ఫలితాలు సాధిస్తున్న క్రీడాకారులకు వసతుల పరంగా సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఉదయం, సాయంత్రం వేళ కఠోర సాధన చేసి వచ్చే క్రీడాకారులు డైనింగ్హాల్లో ప్రశాంతంగా కూర్చుని భోజనం చేసే అవకాశం కూడా లేకపోవడంతో క్రీడాకారులకు ఇబ్బందులు తప్పడం లేదు. డైనింగ్హాల్లో అందరికీ సరిపడా కుర్చీలు లేకపోవడంతో కొందరు కూర్చుంటే.. మరికొందరు నిల్చుని తినాల్సిన పరిస్థితి ఉంది. ఉన్న కుర్చీలు సైతం చాలా వరకు చీలిపోయి.. పగిలిపోయి ధ్వంసమై ఉన్నాయి. ఇక నీరు తాగాలంటే కనీసం ఒక్క గ్లాసు కూడా లేకపోవడంతో మగ్గులతో ఎత్తుకుని తాగాల్సిన పరిస్థితి ఉంది. లేనిపక్షంలో వారు సొంతంగా కొనుగోలు చేసి తెచ్చుకున్న బాటిల్స్తో నీరు పట్టుకుని తాగాల్సి వస్తోంది. కాగా ప్రస్తుతం క్రీడాపాఠశాల విద్యార్థులకు భోజనం అందించేందుకు టెండర్లు పిలిచినప్పటికీ ఎవరికీ కేటాయించకపోవడంతో గతంలో ఉన్నవారే ప్రస్తుతం తాత్కాలికంగా భోజనం అందిస్తున్నారు. మళ్లీ వీరికే టెండర్ వస్తుందా.. లేక మరెవరికైనా ఇస్తారో.. తేలకపోవడంతో కొత్త గ్లాసులు, కుర్చీలు కొనుగోలు చేసేందుకు వీరు ముందుకు రావడం లేదు. అధికారులు స్పందించి సౌకర్యాలు కల్పించాలని క్రీడాకారులు కోరుతున్నారు. -
వైజాగ్ మ్యాచ్.. టికెట్లు బ్లాక్లో అమ్మేశారా?
సాక్షి, విశాఖపట్నం: ఉక్కునగరం విశాఖపట్నం వేదికగా భారత్-శ్రీలంక మధ్య కీలక వన్డే మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఇరుజట్లు చెరో వన్డే గెలిచి సమంగా ఉండటంతో సిరీస్ విజేతను తేల్చే ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో విశాఖలోని వైఎస్సార్ స్టేడియం వద్ద ఆదివారం ఉదయం నుంచి అభిమానుల కోలాహలం నెలకొంది. మధ్యాహ్నం 1.30 గంటలకు భారత్-శ్రీలంక మధ్య వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, మూడు వన్డేల సిరీస్లో విజేత ఎవరో తేల్చే ఆఖరి వన్డే కావడంతో సహజంగానే ఈ వన్డేపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ టికెట్లు కొనేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో పోటీపడ్డారు. అయితే, నేరుగా టికెట్లు దొరకకపోవడంతో అభిమానులు నిరాశచెందారు. ఈ మ్యాచ్ సంబంధించి పెద్ద ఎత్తున బ్లాక్ టికెట్లు అమ్మినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖ మ్యాచ్ కోసం 27వేల టికెట్లను ‘మీ-సేవా’ ద్వారా అమ్మాల్సి ఉంది. కానీ, ఐదువేల టికెట్లు మాత్రమే ఇప్పటివరకు విక్రయించారు. మిగతా 22వేల టికెట్లు అధికారులు బ్లాక్ చేసి.. అక్రమంగా అమ్ముకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టికెట్లు దొరకకపోవడంతో క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైజాగ్ ఫేవరెట్ భారత్... విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్ అంటే ఠక్కున గుర్తొచ్చేది ధోనినే. ఇక్కడికి ఓ అనామకుడిగా వచ్చి అసాధారణ కెప్టెన్గా ఎదిగిన వైనం మనకందరికీ తెలుసు. ‘ఈ చరిత్ర ఏ సిరాతో’ అన్నట్లు ‘అతని భవిత ఈ వేదికతో’ మారిపోయింది. అంతేకాదు అతనితో పాటు చాలా మంది ఆటగాళ్లకు అచ్చొచ్చిన స్టేడియం ఇది. పైగా టీమిండియాకు ఫేవరెట్ వేదిక కూడా. ఇక్కడ ఏడు మ్యాచ్లాడిన భారత్ ఐదింట గెలిచి, ఒక్కసారే ఓడింది. మరో మ్యాచ్ రద్దయింది. దీంతో ఇక్కడ జరిగే నిర్ణాయక మూడో మ్యాచ్లో తమ ‘ఫేవరెట్ ఇజం’తో లంకను ఓడించి సిరీస్ను గెలవాలని భావిస్తోంది టీమిండియా. రెండేళ్లుగా సొంతగడ్డపై భారత్ రికార్డు అజేయంగా ఉంది. 2015 అక్టోబర్ తర్వాత భారత్ ఒక్క సిరీస్ను కోల్పోలేదు. అన్నీ చేజిక్కించుకుంది. ఫామ్లోకి వచ్చిన బ్యాట్స్మెన్... తొలి మ్యాచ్లో ఒక్క ధోని మినహా మూకుమ్మడిగా విఫలమైన టీమిండియా బ్యాట్స్మెన్ మొహలీలో కదంతొక్కారు. కెప్టెన్, ఓపెనర్ రోహిత్, మరో ఓపెనింగ్ బ్యాట్స్మన్ ధావన్, కొత్త కుర్రాడు శ్రేయస్ అయ్యర్ పిచ్ పరిస్థితుల్ని చక్కగా ఆకలింపు చేసుకొని చెలరేగారు. టాపార్డర్ అంతా ఫామ్లోకి రావడంతో భారత్ ఇక్కడ కూడా మరో భారీ స్కోరును ఆశిస్తోంది. రెండో వన్డేలో ధోని, పాండ్యా ఇన్నింగ్స్ చివర్లో తక్కువ పరుగులకే నిష్క్రమించినా... అదేమంతా కలవరపెట్టే అంశం కాదు. ఇన్నింగ్స్ను నడిపించాల్సిన సమయంలో ధోని ఎంత చురుగ్గా వ్యవహరిస్తాడో అందరికీ తెలుసు. ఇక బౌలింగ్లో భువీ, బుమ్రా తమ సత్తాను పూర్తిస్థాయిలో బయటపెట్టలేదు. ఒకట్రెండు వికెట్లు తీసినప్పటికీ కీలకమైన నిర్ణాయక పోరులో ఇదే మాత్రం సరిపోదు. ఆరంభంలో, డెత్ ఓవర్లలో తమ జోరు చాటితే మిగతా పనిని చహల్, హార్దిక్ పాండ్యాలు చూసుకుంటారు. పిచ్, వాతావరణం ఎపుడైనా సరే విశాఖ పిచ్ బ్యాట్స్మెన్, బౌలర్లకు సమాన అవకాశాలిస్తుంది. బౌలింగ్లో పేసర్లు, స్పిన్నర్లకు ఇది మంచి వికెట్. ధర్మశాల, మొహాలీలతో పోల్చుకుంటే ఇది కోస్తా ప్రాంతం కాబట్టి శ్రీలంకకు కొలంబోను తలపించవచ్చు. వర్షం ముప్పు లేదు. జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, ధోని, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, బుమ్రా, చహల్, కుల్దీప్/సుందర్. శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్), గుణతిలక, తరంగా, సమరవిక్రమ, మాథ్యూస్, డిక్వెలా, గుణరత్నే, సచిత్, లక్మల్, అకిల ధనంజయ, నువాన్ ప్రదీప్. ► మధ్యాహ్నం 1.30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలి
మరింత ఆలస్యంగా..?
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement