-
భారీస్కోరు దిశగా హర్యాన
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రికెట్మైదానంలో నిర్వహిస్తున్న కల్నల్ సీకే నాయుడు అండర్-23 మ్యాచ్లో హర్యాన జట్టు భారీస్కోరు దిశగా దూసుకెళ్తోంది. 78 పరుగులతో ఓవర్నైట్ బ్యాట్స్మన్గా బరిలోకి దిగిన డాగర్ మంగళవారం 116 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. ఈయనతో పాటు క్రీజులో నిలిచిన యాదవ్ 55 పరుగులు చేసి అవుటయ్యాడు. పెహల్ 48 పరుగులు, తెవతీయ 97 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్నారు. మంగళవారం రెండోరోజు ఆటముగిసే సమయానికి హర్యాన జట్టు 180 ఓవర్లలో 512 పరుగులు చేసింది. ఆంధ్రా జట్టు బౌలర్లు వినీల్ 2, శశికాంత్ 2, స్నేహకిశోర్ 1, కమ్రుద్దీన్ 1 వికెట్ తీశారు. హర్యాన జట్టు బుధవారం ఇదే జోరు కొనసాగిస్తే ఆంధ్రా జట్టు ఎదురీదక తప్పని పరిస్థితి. -
ఘన నివాళి
పులివెందుల, న్యూస్లైన్: పులివెందులలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి దివంగత వైఎస్ రాజారెడ్డి 16వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం పులివెందులలోని లయోలా డిగ్రీ కళాశాల రహదారిలో ఉన్న సమాధి ఘాట్ ప్రాంతంలో పలువురు వైఎస్ఆర్ అభిమానులు, స్థానికులు నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డిలు ఉదయాన్నే వచ్చి వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జయమ్మ, వైఎస్ జార్జిరెడ్డి సమాధుల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్సీపీఎల్పీ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా సమాధి ఘాట్కు చేరుకొని తాత వైఎస్ రాజారెడ్డి, అవ్వ వైఎస్ జయమ్మ, వైఎస్ జార్జిరెడ్డి సమాధుల వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులర్పించడంతోపాటు కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు ఈసీ గంగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్రెడ్డి తదితరులు వచ్చి వైఎస్ రాజారెడ్డి ఘాట్ వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. సమాధి ఘాట్ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. వృద్ధులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని పలకరించారు. పార్కులో వైఎస్ రాజారెడ్డి విగ్రహం వద్ద నివాళి : పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి సమాధి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా లయోలా డిగ్రీ కళాశాల రోడ్డు సమీపంలో ఉన్న రాజారెడ్డి పార్కుకు చేరుకున్నారు. వైఎస్ జగన్తోపాటు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్రెడ్డి తదితరులు వెళ్లారు. పార్కులో వైఎస్ రాజారెడ్డి విగ్రహం వద్ద పూలమాలలువేసి నివాళులర్పించడంతోపాటు కొవ్వొత్తులను వెలిగించి నమస్కరించారు. వైఎస్ఆర్ ఆడిటోరియంలో ప్రత్యేక ప్రార్థనలు.. పులివెందులలోని బాకరాపురంలో ఉన్న వైఎస్ఆర్ ఆడిటోరియంలో వైఎస్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముందుగా వైఎస్ రాజారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం ప్రత్యేక ప్రార్థన కార్యక్రమం ప్రారంభమైంది. సీఎస్ఐ చర్చి ఫాస్టర్ ఐజాక్ వరప్రసాద్ ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్సార్సీపీఎల్పీ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి, చిన్నాన్నలు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ ప్రకాష్రెడ్డి, వైఎస్ జోసఫ్రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, సతీమణి ఈసీ సుగుణమ్మ, వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్ మేనేత్తలు కమలమ్మ, విమలమ్మ, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఆయన సతీ మణి సమతారెడ్డి, సోదరి శ్వేతారెడ్డి, మా జీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి ప్రమీలమ్మ, వైఎస్ భాస్కర్రెడ్డి సతీమణి లక్షుమ్మ తదితరులు ప్రత్యేక ప్రార్థనలలో తదితరులు పాల్గొన్నారు. -
రంజీ మ్యాచ్ డ్రా
కడప స్పోర్ట్స్, న్యూస్లైన్ : కడపలోని వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రీడామైదానంలో నాలుగురోజులుగా ఆంధ్రా-మహారాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్ ఆదివారం డ్రాగా ముగిసింది. ఆంధ్రా జట్టు రెండవ ఇన్నింగ్స్లో 27 పరుగుల ఓవర్నైట్తో బరిలోకి దిగగా ఆంధ్రా బ్యాట్స్మన్ చివరిరోజు మ్యాచ్లో 90 ఓవర్లు ఆడి 7 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేశారు. జట్టులోని చిరంజీవి 12 ఫోర్లు 2 సిక్సర్లతో చెలరేగి ఆడటంతో సెంచరీ దిశగా సాగినా 85 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఒక ఓవర్లో మూడు వరుస బంతుల్లో 2ఫోర్లు 1 సిక్సర్తో అభిమానులను అలరించాడు. జట్టు ఓపనర్ కేఎస్ భరత్ 24 పరుగులు, ఏజీ ప్రదీప్ 25 పరుగులు చేసి అవుటయ్యారు. లోకల్బాయ్ సురేష్ బాధ్యతా యుతంగా ఆడుతూ 38 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈయనకు జతగా హరీష్ 16 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. మహారాష్ట్ర జట్టు బౌలర్స్ సంక్లేచా 3, భరత్ సోలంకి, బావ్నే, దనేకర్ తలా ఒక్కో వికెట్ తీశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ప్రదర్శించిన మహారాష్ట్ర జట్టుకు 3 పాయింట్లు, ఆంధ్రాకు 1 పాయింట్ దక్కింది. రంజీ మ్యాచ్ చివరి రోజు కావడం, అందునా ఆదివారం కావడంతో మ్యాచ్ను వీక్షించేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు మైదానానికి తరలివచ్చారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
Advertisement