-
ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
టీ20 ప్రపంచకప్-2024లో భారత ఓపెనింగ్ జోడీ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పరిస్థితులకు తగ్గట్లుగా తమ తుదిజట్టు కూర్పు ఉంటుందని స్పష్టం చేశాడు.అదే విధంగా ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా తాము జట్టును ఎంపిక చేయలేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. కాగా జూన్ 1న వరల్డ్కప్ మొదలుకానుండగా.. టీమిండియా జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.ఈ నేపథ్యంలో భారత జట్టు తరఫున కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ ఆరంభిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు తుదిజట్టులో చోటు దక్కదని భావిస్తున్నారు.అన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయిఈ విషయంపై స్పందించిన రోహిత్ శర్మ..‘‘ప్రస్తుతం మాకు అన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ ఓపెనింగ్ జోడీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.వెస్టిండీస్కు వెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితుల ఆధారంగా మా ప్లేయింగ్ ఎలెవన్ను ఎంపిక చేసుకుంటాం. నిజానికి చాలా మంది ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నారు.కానీ మేము ఎప్పటి నుంచో ఈ ఫార్మాట్లో జట్టు కూర్పు గురించి చర్చలు జరుపుతూనే ఉన్నాం. చాలా కాలం క్రితమే 15 మంది సభ్యుల జట్టు గురించి తుది నిర్ణయం తీసుకున్నాం. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా మేము మా ప్రణాళికలు మార్చుకోలేదు’’ అని చెప్పుకొచ్చాడు.ఐపీఎల్ ప్రదర్శన ఇలాకాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ఆటగాడిగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఆడిన పది మ్యాచ్లలో కలిపి 315 పరుగులు చేశాడు. మరోవైపు కోహ్లి ఆర్సీబీ ఓపెనర్గా బరిలోకి దిగుతూ 10 మ్యాచ్లలో కలిపి 500 పరుగులు రాబట్టాడు. ఇక యశస్వి జైస్వాల్ రాజస్తాన్ రాయల్స్కు ఆడుతూ 9 మ్యాచ్లలో కలిపి కేవలం 249 పరుగులే చేశాడు.అయితే, ఓపెనింగ్ స్థానం కోసం జరిగిన పోటీలో జైస్వాల్ ప్రధాన జట్టులో చోటు దక్కించుకోగా.. శుబ్మన్ గిల్ రిజర్వ్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. కానీ.. ఐపీఎల్-2024లో ప్రస్తుతం 509 పరుగులతో టాప్ స్కోరర్గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు మాత్రం మొండిచేయి చూపారు సెలక్టర్లు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
T20 WC: సచినే ఓపెనర్గా రాలేదు.. నువ్వెందుకు కోహ్లి?
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో ఆడటానికైనా సిద్ధంగా ఉండాలని సూచించాడు. అంతటి సచిన్ టెండుల్కరే 2007 వరల్డ్కప్ టోర్నీలో మిడిలార్డర్లో బ్యాటింగ్ చేశాడని సెహ్వాగ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఓపెనింగ్ జోడీ గురించి మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.మూడో స్థానంలో ఆడిస్తాను‘‘నాకు గనుక అవకాశం ఉంటే.. అతడి(కోహ్లి)ని ఓపెనింగ్కు పంపించను. అతడిని మూడో స్థానంలో ఆడిస్తాను. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా నా ఆప్షన్. కోహ్లి వన్డౌన్లోనే రావాలి.మిడిల్ ఓవర్లలో ఎలా ఆడాలి అనేది అతడి తలనొప్పి. ఒకవేళ ఆరంభంలోనే వికెట్ పడితే కోహ్లి బ్యాటింగ్కు వస్తాడు. కాబట్టి పవర్ ప్లేలో తను ఇన్నింగ్స్ చక్కదిద్దగలడు.ఒకవేళ వికెట్ తొందరగా పడకపోతే.. ఎలా ఆడాలో కెప్టెన్, కోచ్ల సూచనలకు అనుగుణంగా అతడు ఆడాలి. జట్టులో ఒక ఆటగాడిగా అతడు తప్పక ఇది చేయాల్సిందే’’ అని క్రిక్బజ్ షోలో అతడు వ్యాఖ్యానించాడు.మిడిలార్డర్లో ఆడటం సచిన్కు అస్సలు ఇష్టం లేదుఇందుకు ఉదాహరణగా సచిన్ టెండుల్కర్ పేరును ప్రస్తావించిన సెహ్వాగ్.. ‘‘2007 ప్రపంచకప్ టోర్నీలో సచిన్ టెండుల్కర్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు. నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేశాడు.మిడిలార్డర్లో ఆడటం సచిన్కు అస్సలు ఇష్టం లేదు. అయినా.. జట్టు ప్రయోజనాల కోసం ఒప్పుకొన్నాడు. మీ జట్టులో ఇద్దరు మంచి ఓపెనర్లు ఉండి.. నిన్ను(కోహ్లిని ఉద్దేశించి) మూడో స్థానంలో ఆడమన్నపుడు.. కచ్చితంగా అలాగే చేయాలి.ఓపెనర్లు సెట్ చేసిన మూమెంటమ్ను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత వన్డౌన్ బ్యాటర్కు ఉంటుంది. నాకు తెలిసి ఈ విషయంలో విరాట్ కోహ్లికి ఎలాంటి అభ్యంతరం ఉండదనే అనుకుంటున్నా’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.ఓపెనర్లుగా వాళ్లేకాగా ఈసారి పొట్టి ప్రపంచకప్ ఈవెంట్లో కోహ్లి రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడిగా దిగనున్నాడని.. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ లేదంటే.. శుబ్మన్ గిల్పై వేటు పడనుందన్న వార్తల నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా జూన్ 5న వరల్డ్కప్లో ఐర్లాండ్తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
టీ20 వరల్డ్కప్లో ఓపెనర్లుగా రోహిత్, జైశ్వాల్.. గిల్కు నో ఛాన్స్?
ఐపీఎల్ 2024 సీజన్ ప్రస్తుతం క్రికెట్ అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. ఈ క్యాష్ లీగ్ ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే మరో మహాసంగ్రామానికి తెరలేవనుంది. జూన్1 నుంచి అమెరికా, వెస్టిండీస్ల వేదికగా టీ20 వరల్డ్ కప్-2024 షురూ కానుంది. అయితే ఈ టోర్నీ ఆరంభానికి నెల రోజుల పైగా సమయం ఉన్నప్పటికి.. ఐసీసీ నిబంధనల ప్రకారం మే 1లోపు ఆయా జట్లు తమ వివరాలను సమర్పించాల్సిందే. ఈ క్రమంలో ఆయా దేశ క్రికెట్ బోర్డులు తమ జట్లను ఖారారు చేసే పనిలో పడ్డాయి. బీసీసీఐ కూడా తమ జట్టును ఏప్రిల్ 28న ప్రకటించే అవకాశముంది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కలిసి వరల్డ్కప్లో భామయ్యే జట్టును వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ టీ20 వరల్డ్కప్లో భాగమయ్యే భారత టాప్-3 ఆటగాళ్లను ఎంచుకున్నాడు. భారత ఇన్నింగ్స్ను కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఆటగాడు యశస్వీ జైశ్వాల్ను కలిసి ప్రారంభించాలని పఠాన్ అభిప్రాయపడ్డాడు. జైశ్వాల్ ముంబై ఇండియన్స్పై అద్బుతమైన సెంచరీతో చెలరేగాడని, కాబట్టి అతడు కచ్చితంగా ఓపెనర్గా రావాలని పఠాన్ అన్నాడు. అదే విధంగా ఫస్ట్ డౌన్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని పఠాన్ ఎంపిక చేశాడు. వరల్డ్కప్ జట్టులో కోహ్లి కచ్చితంగా ఉంటాడని ఇర్ఫాన్ థీమా వ్యక్తం చేశాడు. స్ట్రైక్ రేట్ పరంగా క్రిస్ గేల్ కంటే కోహ్లినే మెరుగ్గా ఉన్నాడని, టీ20 వరల్డ్కప్ వంటి మెగా ఈవెంట్లో స్ట్రైక్ రేట్ పెద్ద సమస్య కాదని పఠాన్ ఎక్స్లో రాసుకొచ్చాడు. Now that World Cup is nearing. My top 3 for team India. 1) Rohit Sharma (in form as well as captain) 2) Yashasvi Jaiswal (been saying that he should be there even before his 100 purely cos he was performing well for team India before the ipl) 3) Virat Kohli. (Shouldn’t be… — Irfan Pathan (@IrfanPathan) April 23, 2024 -
రోహిత్తో కలిసి అతడే ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్-2024 కు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో టీమిండియా ఓపెనింగ్ జోడీ గురించి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లి భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే, అదే సమయంలో యశస్వి జైస్వాల్ కూడా రేసులో ఉన్నాడనే విషయం కూడా మర్చిపోద్దని దాదా పేర్కొన్నాడు. కాగా వరల్డ్కప్ జట్టు ఎంపికకు ఐపీఎల్-2024 ప్రదర్శన కీలకం కానుందన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్-2022 తర్వాత సుదీర్ఘకాలం టీ20 జట్టుకు దూరమైన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ఇటీవల స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో మెగా టోర్నీలో వీరిద్దరు ఓపెనర్లుగా దిగనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ఈ సీజన్లో కోహ్లి ఎనిమిది మ్యాచ్లలో కలిపి 379 పరుగులతో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో ఇప్పటికే ఓ సెంచరీ(113 నాటౌట్) కూడా ఉంది. మరోవైపు.. రోహిత్ శర్మ కూడా శతకంతో చెలరేగాడు. ఎనిమిది మ్యాచ్లలో కలిపి 303 పరుగులతో ప్రస్తుతం టాప్-5లో ఉన్నాడు. వీరిద్దరు ఇలా ఫామ్లో ఉండటం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. ఇక రాజస్తాన్ రాయల్స్ యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరంభంలో తడబడ్డా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో అజేయ సెంచరీ(104)తో దుమ్ములేపి రేసులోకి దూసుకువచ్చాడు. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘టీమిండియాలో ప్రతిభకు కొదవలేదు. 40 బంతుల్లోనే సెంచరీ చేయగల సత్తా విరాట్ కోహ్లికి ఉంది. వెళ్లి హిట్టింగ్ ఆడటమే పనిగా పెట్టుకోవాలి. 5-6 ఓవర్ల తర్వాత ఫలితం అదే కనిపిస్తుంది. నా అభిప్రాయం ప్రకారం వరల్డ్కప్లో రోహిత్- విరాట్ కలిసి ఓపెనింగ్ చేయాలి. సెలక్టర్ల మనసులో ఏముందో మనం అంచనా వేయలేం. కానీ నేను మాత్రం ఇది బాగుంటుందనే అనుకుంటున్నా. అలా అని యశస్వి జైస్వాల్ పేరును సెలక్టర్లు మర్చిపోతారని భావించడం లేదు. అతడొక ప్రత్యేకమైన ఆటగాడు. నిలకడైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. ఏదేమైనా యువ, అనుభవజ్ఞులైన జట్టుతో టీమిండియా వరల్డ్కప్ బరిలోకి దిగాలి’’ అని సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. కాగా మే 26న ఐపీఎల్-2024 ముగియనుండగా.. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. జూన్ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడనుంది. చదవండి: T20 Captain: ‘రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే.. ఎనీ డౌట్?’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: ముంబై ఇండియన్స్ అంటే చాలు యశస్వికి పూనకం వస్తుంది..!
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు ముంబై ఇండియన్స్ అంటే చాలు పూనకం వస్తుంది. యశస్వి ఏ జట్టుపై అయినా ఆడతాడో లేదో తెలీదు కానీ ముంబై ప్రత్యర్దిగా ఉంటే మాత్రం రెచ్చిపోతాడు. తాజాగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో నిన్న (ఏప్రిల్ 22) జరిగిన మ్యాచ్లో యశస్వి మరోసారి చెలరేగిపోయాడు. విధ్వంసకర శతకంతో (60 బంతుల్లో 104 నాటౌట్; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. రెండేళ్లలో యశస్వికి ముంబైపై ఇది రెండో సెంచరీ. యశస్వి తన కెరీర్లో చేసిన రెండు సెంచరీలు ముంబైపై చేసినవే కావడం విశేషం. గత సీజన్లో ముంబైపై వారి సొంత మైదానమైన వాంఖడేలో శతక్కొట్టిన (124) యశస్వి.. తాజాగా తమ హోం గ్రౌండ్ జైపూర్లోని సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో అజేయ సెంచరీతో ఇరగదీశాడు. యశస్వితో పాటు సందీప్ శర్మ (4-0-18-5) చెలరేగడంతో నిన్నటి మ్యాచ్లో రాయల్స్ ముంబైపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తాజా శతకంతో యశస్వి ఐపీఎల్లో 23 ఏళ్లలోపు రెండు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. తిలక్ వర్మ (65), నేహల్ వధేరా (49) ముంబైని ఆదుకున్నారు. వీరిద్దరు ఆడకపోయుంటే ముంబై పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. రాయల్స్ బౌలర్లలో సందీప్తో పాటు బౌల్ట్ (4-0-32-2) కూడా రాణించాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. 18.4 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. యశస్వి మెరుపు సెంచరీతో రాయల్స్ను గెలిపించాడు. బట్లర్ (35), సంజూ శాంసన్ (38 నాటౌట్) రాణించారు. రాయల్స్ కోల్పోయిన ఏకైక వికెట్ (బట్లర్) పియూశ్ చావ్లాకు దక్కింది. -
IPL 2024 RR vs MI: ఐదేసి అదరగొట్టిన అమ్ముడుపోని ఆటగాడు
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో నిన్న (ఏప్రిల్ 22) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అదిరిపోయే విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రాయల్స్ 9 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది. వేలంలో అమ్ముడుపోని సందీప్ శర్మ ఈ మ్యాచ్లో రాజస్థాన్ పాలిట గెలుపు గుర్రమయ్యాడు. వేరే ఆటగాడికి రీ ప్లేస్మెంట్గా రాయల్స్లోకి వచ్చిన సందీప్ శర్మ ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి, తన తొలి మ్యాచ్లోనే ఐదు వికెట్లతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో సందీప్ వేసిన స్పెల్ విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఇషాన్ కిషన్ వికెట్ తీసిన సందీప్.. నాలుగో ఓవర్లో అతి భయంకరుడైన సూర్యకుమార్ వికెట్ను పడగొట్టాడు. ఆ తర్వాత 15వ ఓవర్లో బంతినందుకున్న సందీప్.. ఆ ఓవర్లో వికెట్ లేకుండా 11 పరుగులు సమర్పించుకున్నాడు. - Unsold in the auction. - Came as a replacement in 2023. - Became the end over specialist.- Injured in the start of IPL 2024. - Came back into the team & got his first five wicket haul. Sandeep Sharma is a hero. 🫡pic.twitter.com/JeMHj5vLH9— Johns. (@CricCrazyJohns) April 22, 2024 ఆఖరి ఓవర్లో మరోసారి బంతినందుకు సందీప్ ఈసారి తన అద్భుతమైన స్లో బాల్స్ టెక్నిక్ను ఉపయోగించి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసిన సందీప్ 18 పరుగులు సమర్పించుకుని 5 వికెట్లు పడగొట్టాడు. సందీప్కు ఐపీఎల్ కెరీర్లో ఇదే తొలి ఐదు వికెట్ల ప్రదర్శన. మొత్తంగా ఈ మ్యాచ్లో సందీప్ తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో రాయల్స్కు భారీ విజయాన్ని అందించాడు. సందీప్ దెబ్బకు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. 179 పరుగులు మాత్రమే చేసింది. తిలక్ వర్మ (65), నేహల్ వధేరా (49) ముంబైని ఆదుకున్నారు. వీరిద్దరు ఆడకపోయుంటే ముంబై పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. రాయల్స్ బౌలర్లలో సందీప్తో పాటు బౌల్ట్ (4-0-32-2) కూడా రాణించాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. 18.4 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. యశస్వి జైస్వాల్ (60 బంతుల్లో 104 నాటౌట్) మెరుపు సెంచరీతో రాయల్స్ను గెలిపించాడు. బట్లర్ (35), సంజూ శాంసన్ (38 నాటౌట్) రాణించారు. రాయల్స్ కోల్పోయిన ఏకైక వికెట్ (బట్లర్) పియూశ్ చావ్లాకు దక్కింది. -
T20 WC: ఓపెనర్గా అతడు.. రింకూ, సంజూకు నో ఛాన్స్!
ఐపీఎల్-2024 తర్వాత పొట్టి ప్రపంచకప్ సమరం మొదలుకానుంది. మే 26 ఫైనల్తో క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్కు తెరపడనుండగా.. జూన్ 1న టీ20 వరల్డ్కప్-2024కు తెరలేవనుంది. ఇక ఈ మెగా ఈవెంట్లో భారత జట్టు జూన్ 5న ఐర్లాండ్తో మ్యాచ్తో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఈ ఐసీసీ టోర్నీలో భారత తుదిజట్టు కూర్పుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. రోహిత్తో పాటు ఓపెనర్ అతడే ‘‘రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడు. విరాట్ కోహ్లి నంబర్ 3, సూర్యకుమార్ యాదవ నంబర్ 4, హార్దిక్ పాండ్యా ఐదో నంబర్లో.. రిషబ్ పంత్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయాలి. బ్యాటింగ్ డెప్త్ దృష్ట్యా నా జట్టులో ఆల్రౌండర్లకు కూడా అధిక ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి అక్షర్ పటేల్ ఏడు, రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో ఆడాలనుకుంటున్నా. ఆ తర్వాతి స్థానంలో నైపుణ్యాలున్న బౌలర్ కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగాలి. పేసర్ల కోటాలో ఆ ఇద్దరు తర్వాత ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్లు రావాల్సి ఉంటుంది. ఇలా అయితే తుదిజట్టు కూర్పు సరిగ్గా ఉంటుందని భావిస్తున్నా’’ అని మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు. అయితే, అనూహ్యంగా తన ప్లేయింగ్ ఎలెవన్లో నయా ఫినిషర్ రింకూ సింగ్, ఐపీఎల్-2024లో సత్తా చాటుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు కైఫ్ చోటివ్వకపోవడం గమనార్హం. బ్యాట్ ఝులిపించలేకపోతున్న జైస్వాల్ మహ్మద్ కైఫ్ ఎంచుకున్న తుదిజట్టులోని ఆటగాళ్లలో ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు కోహ్లి 319 పరుగులతో టాప్ స్కోరర్గా ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా 10 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. అయితే, యశస్వి జైస్వాల్ మాత్రం ఇంత వరకు ప్రభావం చూపలేదు. ఈ రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లలో కలిపి కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు. మరో ఓపెనింగ్ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ మాత్రం 255 పరుగులతో దుమ్ములేపుతున్నాడు. ఇక వికెట్ కీపర్ కోటాలో సంజూ శాంసన్ 246 పరుగులతో పంత్ కంటే చాలా ముందున్నాడు. రింకూ సైతం కేకేఆర్పై ఫినిషర్గా తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. కాగా ప్రపంచకప్ జట్టులో టీమిండియాను రోహిత్ శర్మనే ముందుకు నడిపిస్తాడని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. చదవండి: గైక్వాడ్ ఈ ఒక్క ఏడాదే.. వచ్చే సీజన్లో CSK కెప్టెన్ అతడే! -
అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి?.. మా వాడికేం ఢోకా లేదు
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు బ్యాట్ ఝులిపించలేదు. కనీస స్థాయి ప్రదర్శన చేయలేక చతికిలపడ్డాడు. కాగా గత సీజన్లో 14 మ్యాచ్లు ఆడి ఏకంగా 625 పరుగులు సాధించిన ఈ లెఫ్టాండర్.. టీమిండియాలో ఎంట్రీ ఇచ్చి దుమ్ములేపాడు. టెస్టు, టీ20లలో భారత ఓపెనర్గా సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో యశస్వి జైస్వాల్పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. కానీ.. అందుకు తగ్గట్లుగా ఈ రాజస్తాన్ రాయల్స్ స్టార్ రాణించలేకపోతున్నాడు. తాజా సీజన్లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో కలిపి యశస్వి జైస్వాల్ కేవలం 39 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు సాధించిన అత్యధిక స్కోరు 24. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో అయితే పరుగుల ఖాతా తెరవకుండానే అతడు వెనుదిరిగాడు. ఈసారి పరుగుల ఖాతా కూడా తెరవలేదు జైపూర్లో శనివారం జరిగిన మ్యాచ్లో రెండు బంతులు ఎదుర్కొని జైస్వాల్ డకౌట్ అయ్యాడు. రీస్ టోప్లీ బౌలింగ్లో మాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, మరో ఓపెనర్ జోస్ బట్లర్ అజేయ శతకం(100)తో రాజస్తాన్ను గెలుపు తీరాలకు చేర్చాడు. 4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷 And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪 Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN — IndianPremierLeague (@IPL) April 6, 2024 సంజూ శాంసన్(69) సైతం మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి రాజస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా రాజస్తాన్ ఖాతాలో వరుసగా నాలుగో గెలుపు చేరింది. ఇక ఇలా జట్టు ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో గెలుపొందింది కాబట్టి జైస్వాల్ వైఫల్యం పెద్దగా లెక్కలోకి రాలేదు. నిజానికి ఏ ఒక్క మ్యాచ్లో ఫలితం తారుమారైనా వేళ్లన్నీ జైస్వాల్ వైపు చూపేవనడంలో సందేహం లేదు. ఏదేమైనా.. ఒంటిచేత్తో జట్టును గెలిపించే సత్తా ఉన్న ఆటగాడైన ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇలా విఫలం కావడం విమర్శలకు తావిస్తోంది. అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి? ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతిసారీ లెఫ్టార్మ్ పేసర్ల చేతిలో అవుట్ అవుతున్న జైస్వాల్ ఇప్పటికైనా బలహీనతలు అధిగమించేందుకు కృషి చేయాలని సూచించాడు. ‘‘యశస్వి జైస్వాల్ మళ్లీ స్కోరు చేయలేకపోయాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్లో మూడింటిలో లెఫ్టార్మ్ పేసర్ల చేతికే చిక్కాడు. అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి? దయచేసి పట్టుదలగా నిలబడి బ్యాటింగ్ చెయ్యి.. కొన్ని పరుగులు సాధించు. నిజానికి నువ్వు మంచి ఆటగాడివి’’ అంటూ జైస్వాల్ ఆట తీరును ఆకాశ్ చోప్రా విమర్శించాడు. ఇప్పటికైనా తిరిగి పుంజుకుంటే వరల్డ్కప్ జట్టులో పోటీ లేకుండా బెర్తు ఖరారు చేసుకోవచ్చని సూచించాడు. చెత్త బ్యాటర్ అయిపోడు ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్కు రాజస్తాన్ రాయల్స్ కోచ్ కుమార్ సంగక్కర అండగా నిలిచాడు. ఫ్రాంఛైజీ క్రికెట్తో పాటు టీమిండియా తరఫున కూడా అదరగొట్టిన యశస్వి.. రెండు ఇన్నింగ్స్లో విఫలమైనంత మాత్రాన చెత్త బ్యాటర్ ఏమీ అయిపోడని వెనకేసుకువచ్చాడు. అతడి నైపుణ్యాలేమిటో తమకు తెలుసునని.. కచ్చితంగా కమ్బ్యాక్ ఇస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. చదవండి: Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
MI స్టార్స్తో ‘మిస్టరీ గర్ల్’.. ఇంతకీ ఈ అందాల సుందరి ఎవరంటే? (ఫొటోలు)
-
జైశ్వాల్కు ఏమైంది.. ఇలా అయితే వరల్డ్కప్కు కష్టమే!?
ఐపీఎల్-2024లో టీమిండియా యువ సంచలనం, రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన జైశ్వాల్.. ఇప్పుడు వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో సైతం అదే తీరును కనబరిచాడు. జైశ్వాల్ ఈ మ్యాచ్లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. తొలి ఓవర్ వేసిన యువ పేసర్ మఫాక బౌలింగ్లో రెండు బౌండరీలు కొట్టి మంచి టచ్లో కన్పించిన యశస్వీ.. ఆఖరి బంతికి టిమ్ డేవిడ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడినే జైశ్వాల్ కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. అయితే టీ20 వరల్డ్కప్కు ముందు జైశ్వాల్ ఈ తరహా ప్రదర్శన చేయడం భారత జట్టు మెనెజ్మెంట్ను ఆందోళన కలిగిస్తోంది. రోహిత్ శర్మకు బ్యాక్ఆప్ ఓపెనర్గా జైశ్వాల్ను ఎంపిక చేసే ఆలోచనలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఉంది. ఈ నేపథ్యంలో జైశ్వాల్ తన ఫామ్ను తిరిగి పొందడం చాలా ముఖ్యం. ఏప్రిల్ చివరి వారంలో భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. pic.twitter.com/cmkDG4E8j2 — Sitaraman (@Sitaraman112971) April 1, 2024 -
ముఖేష్ కుమార్ సూపర్ డెలివరీ.. జైశ్వాల్ షాక్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ వరుసగా రెండో మ్యాచ్లోనూ నిరాశపరిచాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్ ఈవెంట్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో జైశ్వాల్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఢిల్లీ పేసర్ ముఖేష్ కుమార్ అద్భుతమైన బంతితో జైశ్వాల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ 2 ఓవర్ బౌలింగ్ చేసేందుకు డీసీ కెప్టెన్ రిషబ్ పంత్.. ముఖేష్ కుమార్ను ఎటాక్లోకి తీసుకువచ్చాడు. ఈ క్రమంలో ఆ ఓవర్లో రెండో బంతిని జైశ్వాల్ ఫోర్గా మలిచాడు. ఆ తర్వాతి రెండు బంతులకు ఎటువంటి పరుగులు రాలేదు. అయితే ఐదో బంతిని అద్భుతమైన ఫుల్-లెంగ్త్ డెలివరీగా ముఖేష్ సంధించాడు. ఈ క్రమంలో జైశ్వాల్ ఫ్లిక్ షాట్ ఆడటానికి ప్రయత్నించగా.. బంతి మిస్స్ అయ్యి స్టంప్స్ను గిరాటేసింది. దీంతో ఒక్కసారిగా ముఖేష్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. CASTLED! Early success for Mukesh Kumar & @DelhiCapitals 👏👏#RR lose Yashasvi Jaiswal Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RRvDC pic.twitter.com/sJIAua6ehl — IndianPremierLeague (@IPL) March 28, 2024 -
RR Vs LSG: జైశ్వాల్ సూపర్ షాట్.. సూర్యను గుర్తు చేశాడుగా! వీడియో వైరల్
టీమిండియా యువ సంచలనం, రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో దుమ్ము లేపిన యశస్వీ.. ఇప్పుడు ఐపీఎల్ 2024లోనూ అదరగొడుతున్నాడు. ఐపీఎల్-2024లో భాగంగా జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో జైశ్వాల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 12 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్తో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్లో జైశ్వాల్ అద్భుతమైన స్కూప్ షాట్తో మెరిశాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన మొహ్సిన్ ఖాన్ బౌలింగ్లో జైశ్వాల్ ఆడిన షాట్ మ్యాచ్ మొత్తానికి హైలెట్గా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ ఓవర్లో ఐదో బంతిని మొహ్సిన్ ఖాన్.. జైవ్వాల్ ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో జైశ్వాల్ చాలా క్విక్గా ఎడమ వైపున్కి వెళ్లి ఫైన్ లెగ్ మీదుగా స్కూప్ షాట్ ఆడి సిక్సర్గా మలిచాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు స్కై(సూర్యకుమార్ యాదవ్)ను గుర్తు చేశావంటా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ సంజూ శాంసన్ (52 బంతుల్లో 82 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. శాంసన్తో పాటు రియాన్ పరాగ్ (43) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు పడగొట్టగా.. రవి బిష్ణోయ్, మోహ్సిన్ ఖాన్ తలా వికెట్ పడగొట్టారు. pic.twitter.com/WmUBOGI9ut — Sitaraman (@Sitaraman112971) March 24, 2024 -
సత్తాచాటిన రోహిత్ శర్మ, జైశ్వాల్.. టాప్ 10 లోకి
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో అదరగొట్టిన భారత ఆటగాళ్లు.. ఇప్పుడు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లోనూ సత్తాచాటాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ టాప్ 10లోకి దూసుకొచ్చారు. హిట్మ్యాన్ ఏకంగా ఐదు స్ధానాలు ఎగబాకి ఆరో ర్యాంక్కు చేరుకోగా..జైస్వాల్ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని ఎనిమిదో స్థానంలో నిలిచాడు. వీరిద్దరితో పాటు ధర్మశాల టెస్టులో సెంచరీతో చెలరేగిన శుబ్మన్ గిల్ సైతం తన కెరీర్లో బెస్ట్ ర్యాంక్ను పొందాడు. 11 స్ధానాలు ఎగబాకి 20వ ర్యాంక్కు గిల్ చేరుకున్నాడు. ఇక టెస్టుల్లో నెంబర్ వన్ బ్యాటర్గా న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్, పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజం వరుసగా రెండు మూడు స్దానాల్లో నిలిచారు. ఇక ఇది ఇలా ఉండగా.. బౌలింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్ధానంలో నిలిచాడు. బుమ్రాను వెనుక్కి నెట్టి అశ్విన్ టాప్ ర్యాంక్ను కైవసం చేసుకున్నాడు. చదవండి: #David Miller: మూడు మ్యాచ్లకు రూ.1.25 కోట్లు.. పెళ్లినే వాయిదా వేసుకున్న స్టార్ క్రికెటర్ -
యశస్వీ జైశ్వాల్కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు..
టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తొలిసారి ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను జైశ్వాల్కు ఈ అవార్డు దక్కింది. స్వదేశలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో జైశ్వాల్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. గత నెలలో ఇంగ్లండ్తో మూడు టెస్టులు ఆడిన యశస్వీ 112 సగటుతో ఏకంగా 560 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 209 పరుగులు చేసిన జైశ్వాల్.. రాజ్కోట్ టెస్టులో 214 పరుగులతో చెలరేగాడు. ఓవరాల్గా ఇంగ్లండ్ సిరీస్లో జైశ్వాల్ ఏకంగా 712 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. కాగా ఈ అవార్డు కోసం జైశ్వాల్తో పాటు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్, శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక పోటీపడ్డారు. కానీ ఐసీసీ మాత్రం ఎక్కువ ఓట్లు వచ్చిన జైశ్వాల్నే ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపిక చేసింది. మరో వైపు ఫిబ్రవరి నెల మహిళల ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఆస్ట్రేలియా ఆల్రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ ఎంపికైంది. గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో సదర్లాండ్ అద్భుతంగా రాణించింది. చదవండి: వరల్డ్కప్ జట్టులో కోహ్లికి నో ఛాన్స్.. కఠిన నిర్ణయం తీసుకోనున్న బీసీసీఐ Presenting the ICC Player of the Month for February 🙌 Congratulations, Yashasvi Jaiswal 👏👏 🗣️🗣️ Hear from the #TeamIndia batter on receiving the award@ybj_19 pic.twitter.com/tl1tJepdFJ — BCCI (@BCCI) March 12, 2024 -
పవర్ హిట్టర్.. వన్డేల్లోనూ అరంగేట్రం చేయిస్తే!
ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్. టెస్టుల్లో తనదైన ముద్ర వేస్తూ ఓపెనర్గా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ముఖ్యంగా ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్తో ముగిసిన టెస్టు సిరీస్లో యశస్వి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు మ్యాచ్లలో కలిపి (తొమ్మిది ఇన్నింగ్స్లో) ఏకంగా సగటు 89తో.. 712 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం. ఈ క్రమంలో.. టీమిండియా 4-1తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కైవసం చేసుకున్నాడు యశస్వి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్.. యశస్వి జైస్వాల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘జైస్వాల్ను ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. రంజీ ట్రోఫీ, ఐపీఎల్లోనూ తన ఆట తీరును గమనిస్తూనే ఉన్నాం. అతడో అసాధారణ ఆటగాడు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనలతో రాణించి టీ20లలోనూ అడుగుపెట్టాడు. అయితే, ఇంతవరకు వన్డేల్లో మాత్రం అతడికి అవకాశం రాలేదు. 50 ఓవర్ల ఫార్మాట్ క్రికెట్లోనూ యశస్వితో అరంగేట్రం చేయిస్తే మంచిది. అప్పుడు అతడు.. టెస్టు, టీ20, వన్డే ఇలా మూడు ఫార్మాట్ల ప్లేయర్గా జట్టుకు ఉపయోగపడతాడు. బ్యాటర్గా డిఫెన్సివ్గా.. అదే సమయంలో దూకుడుగా ఎలా ఉండాలో తెలిసిన ఆటగాడు. ఆండర్సన్ బౌలింగ్లో మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదిన విధానం అతడి పవర్ హిట్టింగ్ నైపుణ్యాలకు నిదర్శనం’’ అని మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ 26 సిక్సర్లు బాదారు. ముఖ్యంగా రాజ్కోట్ టెస్టులో ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్లో వరుసగా మూడు సిక్స్లు కొట్టడం హైలైట్గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ 2023లో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా టెస్టు, అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు. చదవండి: శార్దూల్ ఏమన్నాడో విన్నాను: డొమెస్టిక్ క్రికెట్పై ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు 𝙃𝙖𝙩-𝙩𝙧𝙞𝙘𝙠 𝙤𝙛 𝙎𝙄𝙓𝙀𝙎! 🔥 🔥 Yashasvi Jaiswal is smacking 'em all around the park! 💥💥💥 Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/OjJjt8bOsx — BCCI (@BCCI) February 18, 2024 -
మాటలు రావడం లేదు.. అతడొక సంచలనం! చాలా సంతోషంగా ఉంది: రోహిత్
సొంతగడ్డపై తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. గతకొంత కాలంగా బాజ్బాల్ అంటూ సంప్రాదయ క్రికెట్ రూపు రేఖలు మార్చేసిన ఇంగ్లండ్ జట్టుకు.. భారత్ సరైన గుణపాఠం నేర్పింది. వరుసగా మూడు టెస్టుల్లో ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్.. ఆఖరి టెస్టులోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ధర్మశాల వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరిగిన ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 259 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన ఇంగ్లండ్.. 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లండ్ ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-0 తేడాతో టీమిండియా ఘనంగా ముగించింది. ఇక ఈ అద్భుత విజయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ సిరీస్ అసాంతం అదరగొట్టిన యువ ఆటగాళ్లపై రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. "టెస్టుల్లో ఇటువంటి విజయం సాధించాలంటే అన్ని ప్రణాళికలు సరిగ్గా అమలు కావాలి. సిరీస్ సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సిరీస్లో మా కుర్రాళ్లు అదరగొట్టారు. వారికి అంతర్జాతీయ స్ధాయిలో పెద్దగా అనుభవం లేదు. గానీ దేశీవాళీ క్రికెట్లో మాత్రం అపారమైన అనుభవం ఉంది. అందుకే తీవ్రమైన ఒత్తడిలో సైతం వారు అద్బుతంగా రాణించారు. ఈ సిరీస్ విజయం సాధించేందుకు మా జట్టు మొత్తం తీవ్రంగా శ్రమించింది. కాబట్టి విన్నింగ్ క్రెడిట్ మా జట్టు మొత్తానికి ఇవ్వాలనకుంటున్నాను. ఎప్పుడైనా ఇటువంటి సిరీస్ విజయం సాధిస్తే అందరూ సెంచరీలు, వ్యక్తిగత రికార్డుల కోసమే మాట్లాడతారు. కానీ ఒక టెస్టులో విజయం సాధించాలంటే 20 వికెట్లు తీయడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి బౌలర్ల కృషి లేనదే గెలుపొందడం చాలా కష్టం. ఈ మ్యాచ్లో మా బౌలర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా స్పిన్నర్లు చాలా బాధ్యతాయుతంగా బౌలింగ్ చేశారు. కుల్దీప్ యాదవ్ ప్రదర్శన కోసం ఎంతచెప్పుకున్న తక్కువే. మొదటి ఇన్నింగ్స్ ఆరంభంలో ఇంగ్లండ్ బ్యాటర్లు కాస్త దూకుడుగా ఆడుతున్నప్పుడు కుల్దీప్ యాదవ్ను ఎటాక్లో తీసుకురావాలని భావించాను. అందుకు తగ్గట్టే అతడు మాకు తొలి వికెట్ను అందించాడు. గాయం నుంచి కోలుకోని కుల్దీప్ ఈ తరహా ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది. కుల్దీప్ బ్యాటింగ్ చేయడం కూడా మా జట్టుకు బాగా కలిసిచ్చోంది. ఇక జైశ్వాల్ గురించి ఏమి మాట్లాడాలో కూడా నాకు తెలియడం లేదు. అతడొక సంచలనం. యశస్వీ ఇంకా తన కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అధిరోహించాలి. జైశ్వాల్కు అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. సవాళ్లను ఎదుర్కోవడానికి జైశ్వాల్ ఎక్కువగా ఇష్టపడతాడు. అతడికి ఇదొక అద్బుతమైన సిరీస్ అని పోస్ట్ మ్యాచ్ ప్రేజంటేషన్లో రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా జైశ్వాల్ ఈ సిరీస్లో దుమ్మురేపాడు. 712 పరుగులతో ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా జైశ్వాల్ నిలిచాడు. -
ఎందుకంత ఓవరాక్షన్ బాబు.. నీకు రోహిత్ చేతిలో ఉందిలా! వీడియో వైరల్
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో జైశ్వాల్ చెలరేగాడు. కేవలం 58 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 5 ఫోర్లు, 3 సిక్స్లతో 57 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఓవరాక్షన్ చేశాడు. ఏమి జరిగిందంటే? తొలి ఇన్నింగ్స్లో భారత ఓపెనర్ల జోరుకు అడ్డుకట్ట వేసేందుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. స్పిన్నర్ బషీర్ను ఎటాక్లోకి తీసుకువచ్చాడు. ఈ క్రమంలో బషీర్కు తన తొలి ఓవర్లోనే జైశ్వాల్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన బషీర్ బౌలింగ్లో యశస్వీ మూడు సిక్స్లు బాది ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. అంతటితో ఆగకుండా తర్వాతి ఓవర్లలో కూడా బషీర్ను జైశ్వాల్ టార్గెట్ చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ బషీర్ బౌలింగ్లోనే జైశ్వాల్ ఔటయ్యాడు. 20 ఓవర్ వేసిన బషీర్ బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన జైశ్వాల్ తర్వాతి బంతికి భారీ షాట్కు ప్రయత్నించి స్టంపౌటయ్యాడు. బంతిని అంచనా వేయడంలో కాస్త విఫలమైన యశస్వీ తన వికెట్ను సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో బషీర్ సెలబ్రేషన్స్ శృతిమించాయి. జైశ్వాల్ వైపు కళ్లు పెద్దవిగా చేసి చూస్తూ సీరియస్గా ఎదో అన్నాడు. జైశ్వాల్ మాత్రం అతడిని పట్టించుకోకుండా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయాడు. కానీ నాన్ స్ట్రైక్లో ఉన్న రోహిత్ శర్మ మాత్రం ఎందుకు అంత ఓవరాక్షన్ అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు అరే బషీర్ నీకు మా రోహిత్ చేతిలో ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. pic.twitter.com/Z3RCeCQJ5d — Virat Kohli (@CricUpdates123) March 7, 2024 -
చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. 21వ శతాబ్దంలో తొలి ఆటగాడిగా
టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న ఆఖరి టెస్టులోనూ జైశ్వాల్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 58 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 5 ఫోర్లు, 3 సిక్స్లతో 57 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 21వ శతాబ్దంలో ఒక టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా జైశ్వాల్ చరిత్ర సృష్టించాడు. యశస్వీ ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్లో 712 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. 2014-15లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో కోహ్లి 692 పరుగులు చేశాడు. అయితే తాజా మ్యాచ్తో కోహ్లి ఆల్టైమ్ రికార్డును ఈ ముంబైకర్(జైశ్వాల్) బ్రేక్ చేశాడు. ఇక ఓవరాల్గా ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. 1971లో వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్లో గవాస్కర్ 774 పరుగులు చేశాడు. అయితే ధర్మశాల టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్లో జైశ్వాల్ మరో 63 పరుగులు చేస్తే.. సన్నీని కూడా జైశ్వాల్ అధిగమించే ఛాన్స్ ఉంది. ఇక ఈ రికార్డుతో పలు అరుదైన ఘనతలను కూడా జైశ్వాల్ తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లి(655) రికార్డును కూడా ఈ యువ ఓపెనర్ బ్రేక్ చేశాడు. అదే విధంగా టెస్టుల్లో ఓ జట్టుపై అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా జైశ్వాల్ నిలిచాడు. ఈ రికార్డు ఇప్పటివరకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కూలర్ పేరిట ఉండింది. ఆసీస్పై 74 ఇన్నింగ్స్ల్లో 25 సిక్సర్లు బాదితే.. యశస్వి ఇంగ్లండ్పై కేవలం 9 ఇన్నింగ్స్ల్లోనే 26 సిక్సర్లు బాది సచిన్ను అధిగమించాడు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 57.4 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. క్రాలీ (108 బంతుల్లో 79; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... మిగతా వారంతా విఫలమయ్యారు. కుల్దీప్ యాదవ్ (5/72) ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగగా, అశ్విన్కు 4 వికెట్లు దక్కాయి.అనంతరం ఆట ముగిసే సమయానికి భారత్ 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసి మరో 83 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. క్రీజులో రోహిత్ శర్మ(52 నాటౌట్), గిల్(26) పరుగులతో ఉన్నారు. -
Ind vs Eng: ‘బజ్బాల్’ను కట్టడి చేసి.. బ్యాటింగ్లో అదరగొట్టి!
India vs England, 5th Test Day 1 Highlights: ఇంగ్లండ్తో ఐదో టెస్టు తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి టీమిండియా పైచేయి సాధించింది. ‘బజ్బాల్’ విధానంతో దూకుడు ప్రదర్శించాలనుకున్న స్టోక్స్ బృందాన్ని కట్టడి చేసి.. స్పిన్ మాయాజాలంతో చుక్కలు చూపించింది. స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే భారత్ 3-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ధర్మశాలలో గురువారం నామమాత్రపు ఆఖరి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత స్పిన్నర్లు ఆది నుంచే అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తూ.. ఇంగ్లిష్ జట్టును తిప్పలు పెట్టారు. ఓపెనర్ జాక్ క్రాలే(79) ఒక్కడే పట్టుదలగా నిలబడగా.. మిగతా వాళ్లలో ఒక్కరి నుంచి కూడా అతడికి సహకారం అందలేదు. కుల్దీప్, అశ్విన్ స్పిన్ మాయ (Kuldeep Yadav- Ravichandran Ashwin Spin Magic) ఈ క్రమంలో 218 పరుగులకే ఇంగ్లండ్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. టీమిండియా స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు(5/72) వికెట్లతో చెలరేగగా.. వందో టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ నాలుగు(4/51) వికెట్లతో రాణించాడు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్(1/17) దక్కింది. 𝙈𝙤𝙢𝙚𝙣𝙩𝙨 𝙇𝙞𝙠𝙚 𝙏𝙝𝙚𝙨𝙚! R Ashwin 🤝 Kuldeep Yadav Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @ashwinravi99 | @imkuldeep18 | @IDFCFIRSTBank pic.twitter.com/hJyrCS6Hqh — BCCI (@BCCI) March 7, 2024 అర్ధ శతకాలతో చెలరేగి భారత ఓపెనర్లు (Yashasvi Jaiswal- Rohit Sharma) ఇక తొలి రోజే ఇంగ్లండ్ ఆట కట్టించిన టీమిండియా.. బ్యాటింగ్లోనూ అదరగొట్టింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ ఫిఫ్టీ(58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు)తో ఇరదగీశాడు. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అర్ధ శతకంతో చెలరేగాడు. అయితే, షోయబ్ బషీర్ బౌలింగ్లో అనూహ్య రీతిలో యశస్వి స్టంపౌట్గా వెనుదిరగగా.. శుబ్మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా స్కోరు 135/1 కాగా.. రోహిత్ శర్మ 52, శుబ్మన్ గిల్ 26 పరుగులతో అజేయంగా ఉన్నారు. Yashasvi goes BIG & how! 🔥 Follow the match ▶️ https://t.co/jnMticF6fc#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/NRqpSKAg2K — BCCI (@BCCI) March 7, 2024 -
Yashasvi Jaiswal: సెకెండ్ ఫాస్టెస్ట్ ఇండియన్
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డు మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో మొదటి పరుగు చేసిన అనంతరం విరాట్ కోహ్లి పేరిట ఉండిన రికార్డును (ఇంగ్లండ్పై టెస్ట్ సిరీస్ల్లో అత్యధిక పరుగులు, 656) బద్దలు కొట్టిన యశస్వి.. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో షోయబ్ బషీర్ బౌలింగ్లో మూడు సిక్సర్లు బాదిన అనంతరం ఓ జట్టుపై అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ పేరిట ఉండింది. సచిన్.. ఆసీస్పై 74 ఇన్నింగ్స్ల్లో 25 సిక్సర్లు బాదితే.. యశస్వి ఇంగ్లండ్పై కేవలం 9 ఇన్నింగ్స్ల్లోనే 26 సిక్సర్లు బాది సచిన్ పేరిట ఉండిన రికార్డును చెరిపేశాడు. ఈ రికార్డుతో పాటు యశస్వి మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో షోయబ్ బషీర్ బౌలింగ్లో బౌండరీ బాది టెస్ట్ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న యశస్వి.. టెస్ట్ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న సెకెండ్ ఫాస్టెస్ట్ ఇండియన్గా రికార్డుల్లోకెక్కాడు. యశస్వికి 1000 పరుగుల మార్కును తాకేందుకు 16 ఇన్నింగ్స్లు అవసరం కాగా.. వినోద్ కాంబ్లీ ఈ మైలురాయిని కేవలం 14 ఇన్నింగ్స్ల్లోనే చేరుకున్నాడు. ఓవరాల్గా అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు ఇంగ్లండ్కు చెందిన సచ్క్లిఫ్ పేరిట ఉంది. ఇతను కేవలం 12 ఇన్నింగ్స్ల్లోనే 1000 పరుగులను పూర్తి చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్ బషీర్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత.. దూకుడుగా ఆడుతుంది. 15 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి (33; ఫోర్, 3 సిక్సర్లు) పరిమిత ఓవర్ల క్రికెట తరహాలో రెచ్చిపోతున్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 146 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితా.. సునీల్ గవాస్కర్ 1971లో వెస్టిండీస్పై 774 పరుగులు సునీల్ గవాస్కర్ 1978లో వెస్టిండీస్పై 732 పరుగులు యశస్వి జైస్వాల్ 2024లో ఇంగ్లండ్పై 712 పరుగులు విరాట్ కోహ్లి 2014/15లో ఆస్ట్రేలియాపై 692 పరుగులు డబ్యూటీసీ 2023-25 సైకిల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడు జైస్వాల్ -
Ind vs Eng: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన యశస్వి జైస్వాల్
Ind vs Eng 5th Test- Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో పరుగుల వరద పారిస్తున్నాడు. సొంతగడ్డపై ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు బాదిన యశస్వి జైస్వాల్.. ధర్మశాలలో జరుగుతున్న ఆఖరి టెస్టులోనూ తనదైన షాట్లతో అలరిస్తున్నాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ బ్యాట్తో వీరవిహారం చేస్తున్నాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న అరుదైన రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్తో తాజా టెస్టులో.. భారత ఇన్నింగ్స్లో తొమ్మిదవ ఓవర్ ముగిసే సరికి యశస్వి జైస్వాల్ మూడు సిక్స్లు కొట్టాడు. తద్వారా ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా బ్యాటర్గా జైస్వాల్ అవతరించాడు. సచిన్ రికార్డు బద్దలు కొట్టి గతంలో సచిన్ టెండుల్కర్ ఆస్ట్రేలియా మీద 25 సిక్సులు కొట్టగా.. జైస్వాల్ తాజాగా ఇంగ్లండ్పై 26వ సిక్సర్ను బాది.. అతడిని అధిగమించాడు. ఇక సచిన్కు ఇందుకోసం 74 ఇన్నింగ్స్ అవసరం కాగా.. జైస్వాల్ కేవలం 9 ఇన్నింగ్స్లోనే ఈ సిక్సర్ల రికార్డు క్రియేట్ చేయడం విశేషం. కాగా ధర్మశాల మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్ 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. షోయబ్ బషీర్ బౌలింగ్లో స్టంపౌట్గా వెనుదిరిగాడు. ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్స్లు బాదిన భారత బ్యాటర్లు 26* - యశస్వి జైస్వాల్ ఇంగ్లండ్ మీద(9 ఇన్నింగ్స్) 25- సచిన్ టెండుల్కర్ ఆస్ట్రేలియా మీద(74 ఇన్నింగ్స్) 22- రోహిత్ శర్మ సౌతాఫ్రికా మీద(20 ఇన్నింగ్స్) 21- కపిల్ దేవ్ ఇంగ్లండ్ మీద(39 ఇన్నింగ్స్) 21- రిషభ్ పంత్ ఇంగ్లండ్ మీద (21 ఇన్నింగ్స్). Yashasvi goes BIG & how! 🔥 Follow the match ▶️ https://t.co/jnMticF6fc#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/NRqpSKAg2K — BCCI (@BCCI) March 7, 2024 -
విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన యశస్వి జైస్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ పేరిట ఉండేది. విరాట్ 2016-17లో స్వదేశంలో జరిగిన నాలుగు మ్యాచ్ల సిరీస్లో 8 ఇన్నింగ్స్ల్లో 109.2 సగటున 655 పరుగులు చేశాడు. తాజా ఇంగ్లండ్ సిరీస్లో యశస్వి జైస్వాల్ కోహ్లి పేరిట ఉండిన ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ సిరీస్లో (2023-24) యశస్వి ఇప్పటివరకు ఆడిన 9 ఇన్నింగ్స్ల్లో 93.71 సగటున 657 పరుగులు చేశాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో యశస్వి 2 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్ బషీర్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు.. యశస్వి జైస్వాల్ 9 ఇన్నింగ్స్ల్లో 657 పరుగులు (స్వదేశంలో 2023-24) విరాట్ కోహ్లి 8 ఇన్నింగ్స్ల్లో 655 (స్వదేశంలో 2016-17) రాహుల్ ద్రవిడ్ 6 ఇన్నింగ్స్ల్లో 602 (ఇంగ్లండ్లో 2002) విరాట్ కోహ్లి 10 ఇన్నింగ్స్ల్లో 593 (ఇంగ్లండ్లో 2018) విజయ్ మంజ్రేకర్ 8 ఇన్నింగ్స్ల్లో 586 (స్వదేశంలో 1961-62) -
టాప్-10లోకి దూసుకొచ్చిన జైస్వాల్.. 11వ స్థానంలో హిట్మ్యాన్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ సత్తా చాటారు. ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్లో ఓ మోస్తరు స్కోర్లు చేసిన ఈ ఇద్దరు (రోహిత్ 2&55, యశస్వి 73&37) తాజా ర్యాంకింగ్స్లో రెండ్రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 10, 11 స్థానాలకు ఎగబాకారు. ఇదివరకే టాప్-10లో ఉన్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి.. ఇంగ్లండ్తో సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా ఓ స్థానం మెరుగుపర్చుకుని తొమ్మిది నుంచి ఎనిమిదో స్థానానికి ఎగబాకగా.. భారత్తో నాలుగో టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన జో రూట్.. మూడు నుంచి రెండో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానాన్ని పదిలంగా కాపాడుకోగా.. స్టీవ్ స్మిత్, డారిల్ మిచెల్, బాబర్ ఆజమ్, ఉస్మాన్ ఖ్వాజా, దిముత్ కరుణరత్నే వరుసగా మూడు నుంచి ఏడు స్థానాల్లో కొనసాగుతున్నారు. తాజాగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్ట్లో భారీ శతకంతో విరుచుకుపడిన ఆసీస్ ఆటగాడు కెమరూన్ గ్రీన్ ఏకంగా 22 స్థానాలు మెరుగుపర్చుకుని 23వ స్థానానికి చేరాడు. ఇవి మినహా తాజా ర్యాంకింగ్స్లో చెప్పుకోదగ్గ మార్పులేవీ జరగలేదు. బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్ట్లో 10 వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన నాథన్ లయోన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. ఆసీస్తో టెస్ట్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటిన గ్లెన్ ఫిలిప్స్ 19 స్థానాలు మెరుగుపర్చుకుని 48వ స్థానానికి చేరాడు. టీమిండియా బౌలర్లు బుమ్రా, అశ్విన్ టాప్-2లో కొనసాగుతుండగా.. రబాడ, హాజిల్వుడ్, కమిన్స్ 3, 4, 5 స్థానాల్లో నిలిచారు. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా ఓ స్థానం తగ్గి ఏడో ప్లేస్కు పడిపోగా.. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ ఆండర్సన్ ఓ స్థానం మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో టాప్-8 ర్యాంకింగ్స్లో ఎలాంటి మార్పులు లేవు. రవీంద్ర జడేజా, అశ్విన్, షకీబ్, రూట్, అక్షర్ పటేల్, జేసన్ హోల్డర్, స్టోక్స్, జన్సెన్ టాప్-8లో కొనసాగుతుండగా.. విండీస్ ఆటగాడు కైల్ మేయర్స్ ఓ స్థానం మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి చేరాడు. న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ 12 స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి ఎగబాకాడు. -
రిషభ్ పంత్ అని ఓ కుర్రాడు ఉండేవాడు: రోహిత్ కౌంటర్ అదుర్స్
రాజ్కోట్ టెస్టులో యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ను ఉద్దేశించి ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ చేసిన వ్యాఖ్యలకు టీమిండియా సారథి రోహిత్ శర్మ దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. రిషభ్ పంత్ పేరును ప్రస్తావిస్తూ.. ఇంగ్లిష్ జట్టుకు తమ స్థాయి ఏమిటో గుర్తుచేశాడు. కాగా ఓపెనర్గా భారత టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న యశస్వి జైస్వాల్.. ఇంగ్లండ్పై వరుస డబుల్ సెంచరీలు బాదిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరుగుతున్న తాజా సిరీస్లో.. ‘బజ్బాల్’ను తలదన్నేలా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాజ్కోట్ వేదికగా యశస్వి జైస్వాల్ ఆడిన ఇన్నింగ్స్(151 బంతుల్లో 153 పరుగులు)ను ఉద్దేశించి ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ ‘‘ప్రత్యర్థి జట్టు కూడా దూకుడుగా ఆడుతోందంటే అందులో మాకూ కొంత క్రెడిట్ దక్కుతుంది. టెస్టు క్రికెట్లో మాలాగే వాళ్లూ ఆడుతున్నారు’’ అని పేర్కొన్నాడు. తాజాగా ఈ విషయం గురించి రోహిత్ శర్మకు ప్రశ్న ఎదురైంది. ధర్మశాల టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో డకెట్ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా కోరగా.. ‘‘మా జట్టులో రిషభ్ పంత్ అని ఓ కుర్రాడు ఉండేవాడు. బహుశా బెన్ డకెట్ అతడి ఆట తీరును చూసి ఉండడు’’ అని రోహిత్ శర్మ డకెట్పై వ్యంగ్యస్త్రాలు సంధించాడు. విదేశీ గడ్డపై కూడా దూకుడైన ఆటకు పంత్ మారుపేరు అన్న విషయాన్ని గుర్తుచేస్తూ హిట్మ్యాన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత్ ఇప్పటికే 3-1తో కైవసం చేసుకుంది. ఇరుజట్ల మార్చి 7 నుంచి నామమాత్రపు ఐదో టెస్టు ఆరంభం కానుంది. ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్లలో కలిపి 655 పరుగులతో టాప్ స్కోరర్గా ఉన్నాడు. చదవండి: Sarfaraz Khan: వారిని డబ్బు అడుగుతున్న సర్ఫరాజ్ తండ్రి?! నిజం ఇదీ -
IND vs ENG : ఐదో టెస్టు కోసం ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా (ఫొటోలు)
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- మా పిల్లల చదువులపై కుట్రలొద్దు బాబూ
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement