-
World Photography Day: వారియర్ కెమెరా: కర్తవ్యాన్ని గుర్తు చేసే కెమెరా కన్ను
ఆరతి కెమెరాతో మాట్లాడి చూడండి... చేపల సవ్వడి లేని నదుల దీనత్వాన్ని గురించి చెబుతుంది. చేవ లేని జీవజాలాన్ని గురించి చెబుతుంది. పచ్చదనాన్ని కోల్పోయి నేలకూలనున్న నిర్జీవ వృక్షాల మృత్యుఘోష చెబుతుంది. నదుల నీటిలోని విషాన్ని గురించి వివరంగా చెబుతుంది. స్థూలంగా చెప్పాలంటే...కనిపించే అందాల వెనుక కనిపించిన నిశ్శబ్ద విధ్వంసాన్ని గురించి కళ్లకు కడుతూ చెబుతుంది. బెంగళూరుకు చెందిన ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్ ఆరతి కుమార్ రావు తన కెమెరాతో పర్యావరణ సంరక్షణం గురించి క్షణం క్షణం గుర్తు చేస్తోంది... ప్రతి కెమెరాకు ఒక దృష్టి ఉంటుంది. మరి ఆరతి కెమెరా చూసేది ఏమిటి? అట్టడుగున పడి కన్పించని కథలు, నిజజీవిత కథలు, పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నా ఎవరూ పట్టించుకోని కథలు, సంప్రదాయ జీవనశైలులు, వాటిలో వస్తున్న అనూహ్య మార్పులు, పదాలకు దొరకని దృశ్యాలు...ఇలా ఎన్నో ఎన్నెన్నో. చిన్నప్పటి నుంచి ‘నేషనల్ జియోగ్రఫి’ పత్రికలను చూస్తూ పెరిగింది ఆరతి. ఆ ఎల్లో బార్డర్ విండోస్ నుంచి విశాలమైన ప్రపంచాన్ని చూసింది. ఆ పత్రికలోని ఫొటోగ్రాఫ్స్ తనపై ఎంతో ప్రభావం చూపాయి. పదాలతోనే కాదు చిత్రాలతో కూడా గొప్ప సత్యాలు చెప్పవచ్చుననే విషయం అర్థమైంది. చిన్నప్పటి నుంచి ఫిజిక్స్ అంటే ఇష్టం ఉన్న ఆరతి బయోఫిజిక్స్లో మాస్టర్స్ చేసింది. ఆ తరువాత ‘లైఫ్టైమ్ టు–డూ’ రూపంలో భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంది. దానిలో నదులతో పరిచయం ఒకటి. నదులను, వాటి చుట్టూ ఉండే జీవితాన్ని ఫొటోల రూపంలో డాక్యుమెంట్ చేయాలనుకుంది. కాళ్లకు బలపాలు, కళ్లకు కెమెరాలు కట్టుకొని ఊరూరు తిరిగినా తల్లిదండ్రులు ఎప్పుడూ అభ్యంతర పెట్టలేదు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వివిధ ప్రాంతాలలో తన ఫొటోగ్రఫీకి సంబంధించిన విషయాలను కుటుంబసభ్యులతో పంచుకునేది ఆరతి. ఫొటోల ద్వారా ఎన్విరాన్మెంటల్ స్టోరీ టెల్లింగ్లో నేర్పు సంపాదించిన ఆరతి తన ప్రయాణంలో ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది. పర్యావరణం గురించి మాట్లాడే వారిని అభివృద్ధి వ్యతిరేకులుగా భావించే వారిని కూడా చూసింది. ‘రివర్ డైరీస్’ అనేది ఆమె ప్రస్థానంలో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్గా పేరు తెచ్చుకుంది. నదుల అందాలతో పాటు వాటికి ఎదురవుతున్న ఆపదలకు ‘రివర్ డైరీస్’ అద్దం పడతాయి. ‘హింస, వివాదాలు మాత్రమే హెడ్లైన్గా కనిపిస్తాయి. అయితే పర్యావరణ విధ్వంసం అనే భయానకమైన కనిపించని హింస చాపకింద నీరులా కొనసాగుతుంది’ అంటుంది ఆరతి. ఆ కనిపించని హింసమూలాలను నలుగురికి తెలియజేసేలా చేయడంలో తన కెమెరాను బలమైన మాధ్యమంగా ఉపయోగించుకుంటోంది. ఆరతి ఫొటోగ్రాఫర్ మాత్రమే కాదు రచయిత్రి కూడా. ఆమె పుస్తకాలలో ‘మార్జిన్ల్యాండ్స్: ఇండియన్ ల్యాండ్స్కేప్స్ ఆన్ ది బ్రింక్’ ఒకటి. ఇందులో లడఖ్ నుంచి సుందరబన్ వరకు ప్రకృతికి సంబంధించిన ఎన్నో సుందరచిత్రాలను కళ్లకు కడుతుంది. గంగ– బ్రహ్మపుత్ర–మేఘన పరీవాహక ప్రాంతాలకు తీసుకువెళుతుంది. భౌగోళిక అందాలతో పాటు ఎదురవుతున్న ప్రమాదాలను, అక్కడి ప్రజలు మాట్లాడుకునే పదాలను పరిచయం చేస్తుంది. ‘నిర్మాణాలు, ఇతరత్రా విధ్వంసక కార్యకలాపాల వల్ల ప్రమాదం అంచున ఉన్న ప్రకృతిని కాపాడు కోవడం అనేది మన చేతిలోనే ఉంది’ అని ఈ పుస్తకం ద్వారా చెబుతుంది ఆరతి. ‘పర్యావరణంలో వచ్చే మార్పులు, అవి మన జీవితాల్లో తెచ్చే మార్పులను నా కెమెరా ద్వారా ఇక ముందు కూడా కథలుగా చెప్పాలనుకుంటున్నాను’ అంటోంది ఆరతి. ఒకానొక సందర్భంలో తన నిరసన గళాన్ని ఇలా వినిపించింది ఆరతి,,,, ‘కరువుకాటకాలు, వరదలలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మాత్రమే పర్యావరణ విధ్వంసం, పరిరక్షణ గురించి మాట్లాడుకుంటారు. ఆ తరువాత ఎవరి పనుల్లో వారు మునిగిపోతారు’ అయితే ఆరతిలాంటి ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్లు తమ చిత్రాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి మన కర్తవ్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నారు. -
డిలీట్.. డిలీట్.. డిలీట్... ఒకప్పటిలా ఆ కిక్కు ఇప్పుడు లేదు
పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన కుమార్తె ఫొటో తండ్రికి జీవిత కాలపు తోడుయవ్వనంలో ఉన్నప్పుడు నాన్న తీయించుకున్న ఛాయా చిత్రం అమ్మ దాచుకున్న రహస్యం. బీరువాలో దొరికే నానమ్మ ఫొటో బాల్యానికి దగ్గరి దారి. గోడ మధ్యన వేలాడుతూ కనిపించే టెన్త్ క్లాస్ గ్రూప్ ఫొటో ఎన్నో జ్ఞాపకాలకు కేరాఫ్ అడ్రస్. పెళ్లి ఆల్బమ్లు, విహారాల ఫొటోలు చిటికెలో బాధను మాయం చేయగల మందులు. ఫొటో అంటే కేవలం కాగితం కాదు .. అందరి గతం. కాలాన్ని బంధించే శక్తి దీనికి మాత్రమే ఉంది. జ్ఞాపకాల ఖజానా టెక్కలి: ఫొటో తీయడం.. బాగులేకపోతే డిలీట్ చేయడం. ఫొటోగ్రఫీ గతం కంటే ఈజీ అయిపోయింది. డిజిటల్ వచ్చినప్పటి నుంచి ఫొటోలు తీయడంలో ఉన్న కిక్కు పోయింది. కెమెరా కడుపులో రీళ్లు ఉన్నప్పుడు అపురూప క్షణం కోసం గంటల కొద్దీ వేచి ఉండడం, సరైన చిత్రాన్ని తీయడానికి ఏకాగ్రతతో ఎదురు చూడడం, తదేక దీక్షతో క్లిక్ మనిపించడం చాలా మందికి ఇంకా గుర్తుండే ఉంటుంది. మెమొరీ కార్డులు వ చ్చి రీళ్లకు సమాధి కట్టేశాయి. పాత తరం కెమెరాను చూస్తే చాలాకాలానికి చూసిన బంధువులా అనిపిస్తుంది. బాల్య జ్ఞాపకమేదో కళ్ల ముందు కనిపిస్తుంది. అలాంటి జ్ఞాపకాల పెట్టెలను టెక్కలికి చెందిన హనుమంతు మల్లేశ్వరరావు సేకరిస్తున్నారు. వృత్తిరీత్యా వీడియో ఎడిటర్ అ యిన మల్లేశ్వరరావు పాతతరం కెమెరాలు సేకరించడం హాబీగా పెట్టుకున్నారు. తెలిసిన వ్యక్తుల వద్ద ఉన్న పా తతరం కెమెరాలను సేకరించడం మొదలు పెట్టారు. 50 ఏళ్ల నాటి కెమెరాను పరిశీలిస్తున్న మల్లేశ్వరరావు గత కొన్ని రోజులుగా పాతతరం కెమెరాల సేకరణ వేటలో నిమగ్నమయ్యారు. యాభై ఏళ్ల కిందటి కెమెరాలను కూడా సేకరించారు. సాగరసంగమం సినిమాలోని ఓ సన్నివేశంలో కమల్హాసన్కు ఓ బాలుడు ఫొటోలు తీసే కెమెరా అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి కెమెరాను కూడా సంపాదించారు. రీల్ కెమెరా నుంచి ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాక్షన్ డిజిటల్ కెమెరాల వరకు వివిధ రకాల వీడియో, ఫొటో కెమెరాలను సేకరించి భద్రపరిచారు. మల్లేశ్వరరావు వీడియో కెమెరాల్లో ఎన్ఈజీఎస్, త్రీసీసీడీ, 3500 తో పాటు మరి కొన్ని పాతతరం వీడియో కెమెరాలు మల్లేశ్వరరావు వద్ద ఉన్నాయి. వీటితో పాటు వివిధ రకాల రీల్ కెమెరాలతో పాటు సరికొత్త 7డీ, 70డీ, ఫోర్కె, గోప్రో, గింబల్, స్లైడర్ తదితర కెమెరాలను సేకరించారు. విహంగాలతో దోస్తీ జి.సిగడాం: వృత్తి రీత్యా ఆయన ఇంజినీర్. ఓ ఉన్నత సంస్థలో ఉద్యోగం. తలమునకలయ్యే పని. కానీ ఆయన ఒక రోజు పని చేస్తున్న సమయంలో ఓ పక్షి ప్రాణాల కోసం కొట్టుకుంటూ నేల మీద పడింది. ఆయన దాన్ని రక్షించి పంజరంలో పెట్టి కాపాడారు. ఆ క్షణం నుంచి ఆ ఇంజినీర్ జీవితం మరో మేలి మలుపు తిరిగింది. పక్షులపై ప్రేమ పెరిగింది. కెమెరా కంటితో పక్షుల కదలికలు చూడడం అలవాటైంది. సాధారణంగా పక్షులను చూసి ఆస్వాదించే కంటే ఫొటోలు తీసి ఆ క్షణాలను నిక్షిప్తం చేయడంలో మజా తెలిసింది. ఇంకే ముంది అప్పటి నుంచి పక్షుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 105 రకాల పక్షుల ఫొటోలు తీసి భద్రపరిచారు. కిశోర్ తీసిన పక్షుల చిత్రాలు జి.సిగడాం మండలం పెంట గ్రామానికి చెందిన పెరుంబుదూరి నర్సిహంమూర్తి పెద్ద కుమారుడు పెరుంబుదూరి కిశోర్ పక్షుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇటీవలే సొంత ఊరికి వచ్చి కిశోర్ ప్రతి రోజు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి పక్షుల ఫొటోలు సేకరిస్తున్నారు. అవి ఎలా గుడ్లు పెడుతున్నాయి, బుల్లి పిట్టలు ఎలా జన్మిస్తున్నాయి, వాటి ఆహారం ఎలా పంచుకుంటున్నాయి అనే విషయాలను తెలుసుకుంటున్నారు. ఇటీవల తామర ఆకులపై నెమలి తోక జకనా అనే పక్షి రాకపోకలు, విన్యాసాలను ఫొటోలు తీసి నిక్షిప్తం చేశారు. గుడ్లు పెట్టిన దశ నుంచి పొదిగే దశ వరకు అన్నింటినీ సేకరించారు. ఈ ఫొటోల కోసం సెలవుల్లో అటవీ ప్రాంతాలకు వెళ్తుంటారు. -
World Photography Day: ‘ఫొటోగ్రఫీ నేర్చుకున్నాను... అని ఎప్పుడూ అనకూడదు’
World Photography Day 2022: ఇల్లు అలకగానే పండగ కాదు. సెల్ఫోన్తో అల్క(తేలిక)గా క్లిక్ అనిపించగానే ఫొటో కాదు. కాస్త కళా పోసన ఉండాలా. అది ఉంటే... పబురన్ బసు మాదిరిగా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవచ్చు... పబురన్ బసు తండ్రి కెమెరాను చేతుల్లోకి తీసుకునే నాటికి తన వయసు నాలుగు సంవత్సరాలు మాత్రమే. తండ్రి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ కావడం వలన ఉత్తర కోల్కతాలోని ఆ ఇంట్లో ఎటు చూసినా రకరకాల ఫొటోగ్రాఫిక్ ఎక్విప్మెంట్లు కనిపించేవి. తనకు తోచినట్లు గా వాటితో ఏవో ప్రయోగాలు చేస్తుండేవాడు బసు. కోవిడ్ కల్లోలంతో అందరూ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ తీరిక సమయాన్ని బాగా ఉపయోగించుకున్నాడు బసు. ఫొటోగ్రఫీపై పూర్తిగా దృష్టి పెట్టాడు. మ్యూజియం ఆఫ్ మోడ్రన్ ఆర్ట్, న్యూయార్క్ ఆన్లైన్ ఫొటోగ్రఫీ కోర్స్ పూర్తిచేశాడు. ఫొటోగ్రఫీ లోతుపాతులు తెలుసుకోవడానికి ఇది తనకు ఎంతగానో ఉపయోగపడింది. ఫొటోగ్రఫీకి సంబంధించిన మ్యాగజైన్లు, పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. PC: Pubarun Basu ‘ఇలా నేను తీయగలనా?’ సోనీ వరల్డ్ ఫొటోగ్రఫీ అవార్డ్ల గురించి ఎప్పుడూ వింటుండేవాడు బసు. బహుమతి గెలుచుకున్న ఫొటోలను చూస్తూ అబ్బురపడేవాడు. ‘ఇలా నేను తీయగలనా?’ అనుకునేవాడు. పోటీలో తొలిసారి పాల్గొన్నప్పుడు ఎలాంటి అవార్డ్లు రాలేదుగానీ, తన ఫొటో గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రశంసాపూర్వకమైన వాక్యాలు రాశారు ఎడిటర్. ఇది తనకు ఎంతో కిక్ ఇచ్చింది. తనపై తనకు నమ్మకాన్ని పెంచింది. అద్భుతం ఆవిష్కృతం! కొన్నిసార్లు సందర్భాలు అద్భుతమైన అవకాశాన్ని సృష్టిస్తాయి. అలాంటి సువర్ణ అవకాశం ఒకరోజు తనకు వచ్చింది. అవి లాక్డౌన్ రోజులు. కిటికీ నుంచి వస్తున్న సూర్యకిరణాల నీడ కర్టెన్పై పడుతోంది. తనకు వెంటనే ఒక ఐడియా తోచింది. ‘అమ్మా! తెర వెనుక వెళ్లి చేతులు ఆనించు’ అన్నాడు తల్లితో. ఆమె అలాగే చేసింది. నిజంగా ఒక అద్భుతం ఆవిష్కారం అయింది. ఆ ఫొటోకు ‘నో ఎస్కేప్ ఫ్రమ్ రియాలిటీ’ అని పేరు పెట్టి ‘సోనీ వరల్డ్ ఫొటోగ్రఫీ అవార్డ్–2021’కి పంపాడు. ఆ ఫొటో తనని ‘యూత్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్’ టైటిల్ గెలుచుకునేలా చేసింది. ‘ఇది నిజమేనా?’ అని తనలో తాను ఎన్నిసార్లు అనుకున్నాడో లెక్కేలేదు! అంతర్జాతీయ అవార్డ్ దక్కించుకున్నంత మాత్రాన ‘ఇక నాకు ఎదురులేదు’ అనుకోవడం లేదు బసు. అలా అనుకోకూడదు! ‘ఫొటోగ్రఫీ నేర్చుకున్నాను... అని ఎప్పుడూ అనకూడదు. నేర్చుకుంటూనే ఉన్నాను అని మాత్రమే అనాలి’ అంటూ తండ్రి చెప్పిన మాట తనకు బాగా గుర్తుండిపోయింది. బీబిసి, నేషనల్ జాగ్రఫీ... మొదలైన ఫొటోగ్రఫీ పోటీల్లో కూడా బహుమతులు గెలుచుకున్నాడు బసు. PC: Pubarun Basu ‘సెల్కెమెరా కావచ్చు, మామూలు కెమెరా కావచ్చు అవి ఫొటోగ్రాఫర్ క్రియేటివిటీకి పరిమితులు విధించలేవు. ఖరీదైన కెమెరాలతో మాత్రమే ఆహా అనిపించే ఫొటోలు వస్తాయనడంలో నిజం లేదు. తమ దగ్గర ఉన్న సాదాసీదా కెమెరాలతోనే అద్భుతమైన ఫొటోలు తీస్తున్న స్ట్రీట్ ఫొటోగ్రాఫర్లే దీనికి ఉదాహరణ’ అంటున్న బసు తన కెమెరా ద్వారా సమాజానికి సంబంధించి ఎన్నో కథలు చెప్పాలనుకుంటున్నాడు. ఫిల్మ్మేకింగ్లోకి వెళ్లాలనేది అతడి భవిష్యత్ కల. చదవండి: Divine Space: శ్వాసపై ధ్యాస Cyber Crime Prevention Tips: టెక్ట్స్ మెసేజ్తో వల.. ఆపై..! వాట్సాప్ స్కామ్.. చా(చీ)టింగ్! -
సిటీలో ఇండియన్ ఫొటో ఫెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది అత్యుత్తమ ఫొటోగ్రాఫర్ను ఎంపిక చేయడానికి హైదరాబాద్ వేదిక కానుంది. ఇండియన్ ఫొటో ఫెస్టివల్, హెచ్ఎండీఏ, క్రెడాయ్ సంయుక్తంగా తొలిసారి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. దీనికోసం 85 దేశాల నుంచి ఫోటోగ్రాఫర్లు తమ అత్యుత్తమ ఫోటోలను ఎంట్రీలుగా పంపించారని ఇండియన్ ఫోటో ఫెస్టివల్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ అక్విన్ మాథ్యూస్ తెలిపారు. ఫొటో జర్నలిజం, డాక్యు మెంటరీ, ట్రావెల్ అండ్ నేచర్, వైల్డ్లైఫ్, స్ట్రీట్, పోట్రెయిట్, వెడ్డింగ్, మొబైల్స్... మొత్తం 8 కేటగి రీల్లో ఎంపికైన అత్యుత్తమ ఫోటోలకు మొత్తం రూ.25లక్షల పారితోషికాన్ని అందించనున్నట్లు చెప్పారు. ఈ ఫొటో ఉత్సవానికి వచ్చిన ఎంట్రీల ను పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్ మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడు తూ.. వివిధ దేశాల నుంచి వచ్చిన అత్యుత్తమ ఫోటోలను ఈనెల 19 నుంచి వచ్చేనెల 19వరకు మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం రోజున ‘ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును బహూకరిస్తామన్నారు. ఈ సందర్భంగా క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రామకృష్ణారావు మాట్లాడారు. -
ఫొటోలు తీసిన పశ్చాత్తాపం.. ఊపిరిలో విషా(దా)న్ని నింపింది
World Photography Day 2021: 1993 మార్చి 26 ఉదయం.. పబ్స్ట్ హోటల్లోని ‘న్యూయార్క్ టైమ్స్’ పేపర్ హెడ్ ఆఫీసులో ఫోన్ మారుమోగుతోంది. రిసెప్షనిస్ట్ రెబెకా అవతలి నుంచి అడుగుతున్న ఒక్కటే ప్రశ్నకు.. ‘తెలీదండీ’ అనే సమాధానం చెప్పీ చెప్పీ విసుగెత్తిపోయింది. ఆ వెంటనే పార్ట్ టైం ఫొటోగ్రాఫర్ కెవిన్ కార్టర్కు ఫోన్ కాల్ కలిపింది. ‘సర్.. ఆ పాప ఇంతకీ బతికి ఉందా? లేదా? అని చాలామంది అడుగుతున్నారు ఏం చెప్పామంటారు’ అంటూ విసుగ్గా అడిగింది రెబెకా. ‘నేను ఆఫీస్కు వస్తున్నా..’ అంటూ ఫోన్ పెట్టేశాడు కెవిన్. ఈ ప్రశ్న కెవిన్నూ చనిపోయేంత వరకు వెంటాడుతూనే వచ్చింది. వాంటింగ్ ఏ మీల్.. ఆకలి కేకలతో బక్కచిక్కిన పసికందు.. ఆ వెనకాలే ఆకలితో పసికందు మరణం కోసం ఆశగా ఎదురుచూస్తున్న రాబందు.. ఇదీ కెవిన్ తీసిన ఫొటో. ఆ స్థితిలో అక్కడుంది ఒక్క రాబందు కాదు.. రెండు!. ఆ పాపకు పట్టెడు అన్నం పెట్టే పరిస్థితి ఉన్నా.. కనికరం లేకుండా కెమెరాలెన్స్ ఎక్కుపెట్టిన కెవిన్ కార్టర్ కూడా ఓ రాబందే. యావత్ ప్రపంచం నుంచి మానవత్వం ఈ విమర్శను ఎక్కుపెట్టింది. దిగజారిన ప్రొఫెషనల్ ఫొటో జర్నలిజం పోకడకు అద్దం పట్టిన ఆ చిత్రం.. చరిత్రకెక్కింది. 1994 మే 23.. కొలంబియా యూనివర్సిటీ లైబ్రరీ ఆడిటోరియంలో చప్పళ్ల మధ్య ‘వాంటింగ్ ఏ మీల్’ ఫొటోకు పులిట్జర్ అవార్డును స్వీకరించాడు కెవిన్. కానీ, ఆ ఫొటో తీసిన పశ్చాత్తాపం కన్నీళ్ల రూపంలో కెవిన్కు తన గతాన్ని గిర్రున తిరిగేలా చేసింది. ఎక్కడో యూరప్ నుంచి దక్షిణాఫ్రికాకు వలసవచ్చి స్థిరపడింది కెవిన్ కుటుంబం. కానీ, కెవిన్కు నల్లజాతీయులపై ఫుల్ సింపథీ ఉండేది. ఫార్మసీ చదివి.. అక్కడున్న రూల్స్ మూలంగా సైన్యంలో చేరాడు. ఓరోజు.. తన తోటి సైనికుడ్ని(నల్ల జాతీయుడ్ని) మిగతావాళ్లు కొడుతుంటే అడ్డుకున్నాడు. బానిసలను వెనకేసుకొస్తావురా... ‘ని** లవర్’ అంటూ వారు కెవిన్ను తన్నారు. ఆ అవమానం భరించలేక డర్బన్ పారిపోయాడు కెవిన్. ఉద్యోగం దొరక్క.. ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆస్పత్రిలో చేర్పించడంతో ఎలాగోలా బతికి బట్టకట్టాడు. వేరే దారిలేక మళ్లీ జోహాన్నెస్ బర్గ్ కే వచ్చి సైన్యంలో చేరాడు. అక్కడ ఓ బాంబు పేలుడులో గాయపడి.. ఆర్మీ సర్వీసు నుంచి బయటికొచ్చాడు. కెమెరాలతో సహజీవనం మళ్లీ ఉద్యోగాల వేటలో ఓ కెమెరాల షాపులో పనికి కుదిరాడు. చుట్టూ కెమెరాలు.. లెన్స్లు కెవిన్కు ఇష్టం పెరిగింది. ఫొటోగ్రఫీలో అత్యంత కీలకమైన లైవ్ క్యాప్చర్ మూమెంట్స్ను తీయడమెలాగో నేర్చుకున్నాడు. కొన్నాళ్లకు స్థానికంగా ఓ పత్రికలో పార్ట్ టైం స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ గా చేరాడు. పేరుకే అందులో ఉన్నా.. సెన్సేషన్ కథనాలపైనే అతని ఫోకస్ ఉండేది. కెవిన్ అతని మరో ముగ్గురు స్నేహితులూ(ముగ్గురూ పొటోగ్రాఫర్లే) కలిసి.. దక్షిణాఫ్రికా ఉద్యమాన్ని చిత్రీకరించేవాళ్లు. అందరికంటే ముందుగా అక్కడ వాలిపోవడం, అరుదైన కోణాల్లో ఫొటోలు తీసి పత్రికలకు ఇవ్వడం.. కెవిన్ అండ్ కోకు బాగా అలవాటైంది. బ్యాంగ్ బ్యాంగ్ క్లబ్ పేరు వచ్చేసింది వాళ్ల సాహసాలకు. ఒకసారి నల్లవారు ఒక శ్వేత యువకుణ్ని పట్టుకుని విపరీతంగా హింసించి తగలబెట్టిన దృశ్యాల్ని చిత్రీకరించారు. ఆ సీన్తో కెవిన్లో భయాందోళనలు పెరిగాయి. దాని నుంచి ఊరట కోసం డ్రగ్స్కు అలవాటుపడ్డాడు కెవిన్. 1991లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మద్దతుదారులైన నల్లవాళ్లు.. ఓ శ్వేత జాతీయుణ్ని హత్యచేస్తుండగా తీసిన ఫొటోకు గాను కెవిన్ క్లోజ్ ఫ్రెండ్ ఊస్టర్ బ్రోక్ కు పులిట్జర్ అవార్డు వచ్చింది. స్నేహితుడి విజయం.. కెవిన్లో అసూయను పెంచింది. ఎలాగైనా తాను పులిట్జర్ కొట్టాలని కసిగా ప్రయత్నాలు చేశాడు. అందుకోసం మరో స్నేహితుడైన సిల్వాతో కలిసి సుడాన్ కరవును చిత్రీకరించడానికి వెళ్లాడు. అక్కడ తీసిందే ఈ పసికందు-రాబందు ఫొటో. డిప్రెషన్.. పశ్చాత్తాపం ఆ తర్వాత కెవిన్ కెరీర్.. సిగ్మా, రాయ్ టర్స్ లాంటి ప్రముఖవార్తా సంస్థలతోనూ సాగింది. రిస్క్ చేసి తీసిన ఫొటోలు.. ఫ్రంట్ పేజీ ఫొటోలుగా ఇంటర్నేషనల్ మాగజీన్లలో పబ్లిష్ అయ్యాయి. 1994 ఏప్రిల్ 18న కెవిన్.. తన మిగతా ఇద్దరు స్నేహితులతో కలిసి టొకోజా టౌన్ షిప్లో జరుగుతున్న అల్లర్లను చిత్రీకరించడానికి వెళ్లాడు. కానీ, హడావిడిగా ఏదో పని మీద మధ్యలోనే వెళ్లిపోయాడు. కాసేటికే అక్కడ కాల్పులు జరిగి ఊస్టర్ బ్రోక్ చనిపోయాడు. ఆ వార్త విని కెవిన్ గుండె బద్ధలయ్యింది. డ్రగ్స్ను ఎక్కువగా వాడేశాడు. చేతిలో డబ్బులు లేవు. పైగా అప్పులు. భార్య అతణ్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఉద్యోగం రిస్క్లో పడింది. ‘తట్టుకోలేకపోతున్నాను.. ఫోన్ లేదు, డబ్బులేదు, అప్పులు... కళ్లముందే ఘోరమైన చావులు, బతుకుపోరాటాలు, హాహాకారాలు, ఆకలితో పేగులు మాడిన చిన్నారులు... విసిగిపోయాను. నాకింక శక్తి లేదు. అందుకే వెళ్లిపోతున్నాను... నా స్నేహితుడు ఊస్టర్ బ్రోక్ దగ్గరికి... అంతటి అదృష్టం నాకు ఉంటే’.. ఇది కెవిన్ కార్టర్ రాసిన సూసైడ్ లేఖ. 1994, జులై 27.. చిన్నతనంలో ఎక్కడైతే ఆడుకున్నాడో.. అక్కడే తన వ్యాన్ సైలెన్సర్ కు ఒక పైపు బిగించి దాన్ని కిటికీ గుండా లోపలికి చేరవేసి బండి స్టార్ట్ చేశాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాక్ మెన్లో తనకిష్టమైన పాటలు వింటూ కళ్లు మూసుకున్నాడు. అలా ఆ విష వాయువుకు అతని ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఏ ఫోటో అయితే అతనికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టిందో.. అదే అంతకు మించిన నిర్వేదాన్ని కెవిన్కు మిగిల్చింది. కనిపించేంత దూరంలో ఆకలి తీర్చే కేంద్రం. కానీ, ఆ పసికందుకు ఓపిక లేదు. వెనుకనే రెక్కలు విప్పిన రాబందు ఇద్దరి ఆకలి తీరడానికి కొన్ని అడుగులే దూరం... ఎండలో ఎంతోసేపు చూసి విసిగిపోయిన కెవిన్ ‘క్లిక్’మనిపించాడు. వాంటింగ్ ఏ మీల్... ఎవరి ఆకలి తీరింది? కోంగ్ న్యోంగ్.. ఆ పసికందు పేరు. అదృష్టవశాత్తూ ఆ పసివాడు బతికాడు. యూఎన్ శరణార్థ శిబిరానికి తరలించారు. ఆ ఫొటో వైరల్ తర్వాత చాలాకాలం శ్రమించిన ఓ స్పానిష్ న్యూస్ పేపర్(ఎల్ ముండో)కు న్యోంగ్ తండ్రి ఇంటర్వ్యూ దొరికింది. కానీ, అప్పటికే కెవిన్ చనిపోయాడు. మరోవైపు 2007లో న్యోంగ్.. వైరల్ ఫీవర్తో కన్నుమూశాడు. ఏదైతేనేం ప్రపంచాన్ని కన్నీళ్లు పెట్టించిన ఫొటోగా.. జర్నలిజానికి, తన జీవితానికి మాయని ఓ మచ్చగా మిగిలిపోయింది కెవిన్ తీసిన ఆ ఫొటో. -ఆగష్టు 19.. వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement