-
ఆసీస్ మహిళల ‘ఎ’ జట్టుదే సిరీస్
బ్రిస్బేన్: సిరీస్ విజేతను నిర్ణయించే అనధికారిక మూడో వన్డేలో భారత మహిళల ‘ఎ’ జట్టు సమష్టిగా విఫలమైంది. దీంతో చివరి వన్డేలో ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టు 3 వికెట్ల తేడాతో గెలిచి మూడు మ్యాచ్ల అనధికారిక సిరీస్ను 2–1తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి (70 బంతుల్లో 45; 2 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచింది. కెప్టెన్ వేద కృష్ణమూర్తి (61 బంతుల్లో 35; 3 ఫోర్లు) ఆకట్టుకుంది. ఓపెనర్ షఫాలీ వర్మ (0) నిరాశ పరిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్ట్రానో 3 వికెట్టు తీయగా... అన్నాబెల్ సదర్ల్యాండ్ , తహిలా మెక్గ్రాత్ చెరో రెండు వికెట్లతో రాణించారు. అనంతరం స్వల్ప విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ 39.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి గెలిచింది. 119/7తో కష్టాల్లో ఉన్న ఆసీస్ను బర్న్స్ (52 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), స్ట్రానో (37 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు) ఆదుకున్నారు. వీరు అజేయంగా ఎనిమిదో వికెట్కు 58 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించారు. భారత బౌలర్లలో హేమలత 3 వికెట్లు, తనూజా కన్వర్ 2 వికెట్లు దక్కించుకున్నారు. -
స్మృతి, జెమీమా అర్ధ సెంచరీలు
నార్త్ సౌండ్: వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్ను భారత మహిళల జట్టు 2–1తో గెలుచుకుంది. బుధవారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో విండీస్పై ఘన విజయం సాధించింది. ముందుగా విండీస్ మహిళలు 50 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటయ్యారు. కెప్టెన్ స్టెఫానీ టేలర్ (112 బంతుల్లో 79; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కింగ్ (38) రాణించింది. అనంతరం భారత్ 42.1 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరమై... ఈ మ్యాచ్తోనే బరిలోకి దిగిన స్మృతి మంధాన (63 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడైన ఆటకు తోడు జెమీమా రోడ్రిగ్స్ (92 బంతుల్లో 69; 6 ఫోర్లు) కూడా అండగా నిలవడంతో జట్టు విజయం సులువైంది. వీరిద్దరు తొలి వికెట్కు 141 పరుగులు జోడించడం విశేషం. స్మృతి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా... స్టెఫానీ టేలర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం దక్కింది. -
కొట్టేసి... పట్టేశారు
సిరీస్ చేజిక్కింది కానీ... కివీస్ కడదాకా పోరాడింది. ఓవరాల్గా 668 పరుగులు నమోదైన గ్రీన్పార్క్ స్టేడియంలో భారత్ ఆరు పరుగుల తేడాతో గట్టెక్కింది. ఇరు జట్ల బ్యాట్స్మెన్ ప్రతాపంలోనూ భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆకట్టుకున్నాడు. పరుగుల వరద పారుతున్న స్టేడియంలో 32 డాట్ బాల్స్ వేశాడు. 3 వికెట్లు తీసి రోహిత్, కోహ్లిల సెంచరీలను గెలిపించాడు. కాన్పూర్: చివరి ఓవర్దాకా సాగిన భారీ స్కోర్ల మ్యాచ్లో భారత్ గెలిచింది. మూడు వన్డేల సిరీస్ను కోహ్లి సేన 2–1తో నెగ్గింది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో రోహిత్ శర్మ (138 బంతుల్లో 147; 18 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లి (106 బంతుల్లో 113; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో కదంతొక్కారు. మొదట భారత్ నిర్ణీ త 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. సౌతీ, మిల్నే, సాన్ట్నర్ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 331 పరుగులు చేసి ఓడింది. మున్రో (62 బంతుల్లో 75; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), లాథమ్ (52 బంతుల్లో 65; 7 ఫోర్లు), విలియమ్సన్ (84 బంతుల్లో 64; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో పోరాడారు. బుమ్రాకు 3, చహల్కు 2 వికెట్లు దక్కాయి. రోహిత్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు... కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కాయి. ధావన్ వైఫల్యం... టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్, ధావన్ శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. జట్టు స్కోరు 29 పరుగుల వద్ద ధావన్ (14) నిష్క్రమించాడు. కెప్టెన్ కోహ్లి జతగా రోహిత్ దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ ఓవర్కు 5 రన్రేట్ పడిపోకుండా జాగ్రత్తపడ్డారు. ముఖ్యంగా రోహిత్ అదుపు తప్పిన బంతుల్ని బౌండరీలకు చేర్చాడు. మిల్నే వేసిన పదో ఓవర్లో రోహిత్ మిడ్వికెట్ మీదుగా కొట్టిన భారీ సిక్సర్తో భారత్ స్కోరు అర్ధసెంచరీ దాటింది. భారీ భాగస్వామ్యం... ఈ క్రమంలో మొదట రోహిత్ 52 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. 19వ ఓవర్లో భారత్ స్కోరు 100కు చేరింది. ఇద్దరు సమన్వయంతో పరుగులు జతచేయడంతో కివీస్ బౌలర్లు అలసిపోయారు. సాన్ట్నర్ వేసిన ఇన్నింగ్స్ 28వ ఓవర్లో రోహిత్ భారీ సిక్స్ బాదాడు. ఈ క్రమంలో అతను సెంచరీకి చేరువకాగా... సాన్ట్నర్ వేసిన తన మరుసటి ఓవర్లో బౌండరీతో కోహ్లి (59 బంతుల్లో, 3ఫోర్లు) ఫిఫ్టీ పూర్తయింది. అదే ఓవర్లో రోహిత్ కూడా ఫోర్ కొట్టాడు. కాసేపటికే అతను (106 బంతుల్లో, 11 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్లో 15వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత రోహిత్ వేగం పెంచాడు. బౌల్ట్ వేసిన 36వ ఓవర్లో కోహ్లి ఒక ఫోర్ కొట్టగా... రోహిత్ మూడు బౌండరీలు బాదాడు. దీంతో ఆ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. తర్వాత గ్రాండ్హోమ్ ఓవర్లో ఇద్దరు ఫోర్లతో మరో 14 పరుగులు పిండుకున్నారు. చాలా ఆలస్యంగా సాన్ట్నర్ బౌలింగ్లో కోహ్లి తొలి సిక్సర్ బాదాడు. చూస్తుండగానే వీరిద్దరి భాగస్వామ్యం 200 దాటింది. కోహ్లి సెంచరీ దిశగా... రోహిత్ 150 వైపు కదం తొక్కుతుండగా... ఓపెనర్ రోహిత్ను 43వ ఓవర్లో సాన్ట్నర్ ఔట్ చేశాడు. దీంతో రెండో వికెట్కు 230 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చిన పాండ్యా (8) ఎక్కువసేపు క్రీజ్లో నిలువలేకపోయాడు. ధోని అండతో కోహ్లి (96 బంతుల్లో; 8 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ పూర్తయింది. 47వ ఓవర్లో జట్టు స్కోరు 300 పరుగులను దాటింది. స్కోరును పెంచే క్రమంలో మొదట కోహ్లి తర్వాత ధోని (17 బంతుల్లో 25; 3 ఫోర్లు), కేదార్ జాదవ్ (10 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) స్వల్పవ్యవధిలో ఔటయ్యారు. కడదాకా పోరాటమే... కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ తొలి ఓవర్లోనే దీటుగా బదులిచ్చింది. భువీ ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో మున్రో వరుసగా 6, 4, 4, 4 బాదేశాడు. ఒక ఓవర్ ముగిసేసరికే కివీస్ స్కోరు 19. ధాటిగా మొదలైన ఇన్నింగ్స్కు బుమ్రా... గప్టిల్ (10) వికెట్తో షాకిచ్చాడు. తర్వాత వచ్చిన విలియమ్సన్ అండతో మున్రో యథేచ్చగా బ్యాటింగ్ చేశాడు. ఇద్దరు ఓవర్కు 6 రన్రేట్తో ఇన్నింగ్స్ను నడిపించారు. మున్రో 38 బంతుల్లోనే (7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించగా, న్యూజిలాండ్ 15వ ఓవర్లోనే 100 పరుగులను అందుకుంది. విలియమ్సన్ (59 బంతుల్లో; 8 ఫోర్లు) కూడా ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్కు 109 పరుగులు జోడించాక జట్టు స్కోరు 153 వద్ద మున్రో, 168 స్కోరు వద్ద విలియమ్సన్ నిష్క్రమించారు. ఆ తర్వాత లాథమ్, టేలర్ (39; 3 ఫోర్లు) జట్టు బాధ్యతను తీసుకున్నారు. వీళ్లిద్దరు రన్రేట్ మందగించకుండా ఆడారు. జట్టు స్కోరు 247 వద్ద కీలకమైన టేలర్ వికెట్ను బుమ్రా, ఆ తర్వాత మెరుపు వేగంతో ఆడుతున్న నికోల్స్ (24 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్)ను భువనేశ్వర్ పడగొట్టడంతో భారత్ ఊపిరిపీల్చుకుంది. కివీస్ విజయానికి చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా బుమ్రా 8 పరుగులే ఇచ్చి సాన్ట్నర్ (9) వికెట్ తీశాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) సౌతీ (బి) సాన్ట్నర్ 147; ధావన్ (సి) విలియమ్సన్ (బి) సౌతీ 14; కోహ్లి (సి) విలియమ్సన్ (బి) సౌతీ 113; పాండ్యా (సి) సౌతీ (బి) సాన్ట్నర్ 8; ధోని (సి) మున్రో (బి) మిల్నే 25; జాదవ్ (సి) గప్టిల్ (బి) మిల్నే 18; కార్తీక్ నాటౌట్ 4; ఎక్స్ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 337. వికెట్ల పతనం: 1–29, 2–259, 3–273; 4–302, 5–331, 6–337. బౌలింగ్: సౌతీ 10–0–66–2, బౌల్ట్ 10–0–81–0, మిల్నే 10–0–64–2, గ్రాండ్హోమ్ 8–0–57–0, సాన్ట్నర్ 10–0–58–2, మున్రో 2–0–10–0. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) కార్తీక్ (బి) బుమ్రా 10; మున్రో (బి) చహల్ 75; విలియమ్సన్ (సి) ధోని (బి) చహల్ 64; టేలర్ (సి) జాదవ్ (బి) బుమ్రా 39; లాథమ్ రనౌట్ 65; నికోల్స్ (బి) భువనేశ్వర్ 37; గ్రాండ్హోమ్ నాటౌట్ 8; సాన్ట్నర్ (సి) ధావన్ (బి) బుమ్రా 9; సౌతీ నాటౌట్ 4; ఎక్స్ట్రాలు 20; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 331. వికెట్ల పతనం: 1–44, 2–153, 3–168, 4–247, 5–306, 6–312, 7–326. బౌలింగ్: భువనేశ్వర్ 10–0–92–1, బుమ్రా 10–0–47–3, పాండ్యా 5–0–47–0, అక్షర్ పటేల్ 7–0–40–0, జాదవ్ 8–0–54–0, చహల్ 10–0–47–2. 7 గతేడాది జూన్ నుంచి భారత్ వరుసగా నెగ్గిన ద్వైపాక్షిక వన్డే సిరీస్ల సంఖ్య. జింబాబ్వే (3–0), న్యూజిలాండ్ (3–2), ఇంగ్లండ్ (2–1), విండీస్ (3–1), శ్రీలంక (5–0), ఆస్ట్రేలియా (4–1), న్యూజిలాండ్ (2–1)లపై వరుసగా సిరీస్లను నెగ్గింది. 4 రోహిత్, కోహ్లి జోడీ డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం నాలుగోసారి. వన్డే చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి జోడీ ఇదే. 20 అన్ని ఫార్మాట్లలో కెప్టెన్గా కోహ్లి చేసి సెంచరీల సంఖ్య. పాంటింగ్ (41), స్మిత్ (దక్షిణాఫ్రికా, 33) ముందు వరుసలో ఉన్నారు. 1460 ఒక క్యాలెండర్ ఇయర్లో కెప్టెన్గా కోహ్లి చేసిన పరుగులివి. పాంటింగ్ (2007లో 1424) రికార్డును తుడిచిపెట్టాడు. -
అదే దూకుడు
విశాఖ స్పోర్ట్స్ : నాలుగో వన్డేలో న్యూజిలాండ్ఏ పై భారత్ ఏ జట్టు 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్లో 2–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టాస్గెలిచిన భారత్ ఏ ఆరువికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఏ 225 పరుగులకే చేతులెత్తెసింది. మిడిలార్డర్లో కొంత ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. నదీమ్ నలుగుర్ని పెవిలియన్కు పంపగా సిద్దార్థ్ మూడు, శార్దుల్ రెండు వికెట్లు తీసి జట్టుకు విజయాన్నందించారు. వొర్కెర్ సెంచరీ వృథా కాగా భారత్ ఏ తరఫున ఓపెనర్ అభిమన్యు 83 పరుగులు చేసి అనూహ్యంగా రనౌటై వెనుతిరిగాడు. శార్దుల్ హాట్రిక్ను మిస్ అయ్యాడు. సిరీస్ చిక్కింది భారత్ ఏ మరో మ్యాచ్ మిగిలివుండగానే న్యూజీలాండ్ ఏపై అనధికార వన్డే సిరీస్ను చేజిక్కించుకుంది. వర్షం కారణంగా తొలి వన్డే రద్దుకాగా రెండో వన్డే టైగా ముగిసింది. ఇక మూడు,నాలుగు వన్డేలను భారత్ ఏ జట్టే గెలవడంతో 2–0తోనే సిరీస్ చేజిక్కింది. ఆదివారం జరిగే చివరి వన్డే నామమాత్రమే కానుంది. గడిచిన రెండు మ్యాచ్లు డేనైట్గా సాగగా నాలుగో వన్డే మాత్రం షెడ్యూలు ప్రకారం ఉదయం తొమ్మిదిగంటలకే ప్రారంభం అయింది. కెప్టెన్ మారాడు... రెండు, మూడు వన్డేల్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన భారత్ ఏ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఈసారి విశ్రాంతి తీసుకున్నాడు. జరిగిన రెండు వన్డేల్లో టాస్ ఓడిన కెప్టెన్ శ్రేయాస్ స్థానంలో వచ్చిన రిషబ్ పంత్ టాస్ గెలిచాడు. ఈసిరీస్ తొలిసారి ఛేజింగ్ కంటే లక్ష్యాన్ని నిర్ధేశించడానికే మొగ్గు చూపాడు. అయితే కెప్టెన్ ఇన్నింగ్స్ను రిషబ్ ఆడలేకపోయాడు. ఏడు బంతులాడినా కేవలం రెండే పరుగులు చేసిన ఈ వికెట్కీపర్ న్యూజిలాండ్ ఏ వికెట్కీపర్ బ్లండెల్కే కాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. వొర్కెర్ సెంచరీ వృథా : న్యూజిలాండ్ ఏ 50 పరుగులకే కీలక ముగ్గురు బ్యాట్స్మెన్ను కోల్పోయింది. అయినా వొర్కెర్ మాత్రం నిలకడగానే ఆడుతూ పదకొండు బంతుల్ని బౌండరీకి తరలించాడు. మరో రెండు సిక్సర్లుగా మలిచాడు. 108 పరుగులు చేసిన వొర్కెర్ చివరికి నదీమ్కు లెగ్బిఫోర్గా దొరికిపోయాడు. అంతా క్యాచ్లే.. భారత్ ఏ జట్టు ఆరువికెట్లు కోల్పోయింది. ఓపెనర్ అభిమన్యు అనూహ్యంగా రనౌట్ కాగా మిగిలిన వారంతా క్యాచ్ల ద్వారానే వెనక్కి మళ్లారు. జట్టే మారింది... నాలుగో వన్డేలో న్యూజిలాండ్ ఏతో పాటు భారత్ ఏ జట్టు రిజర్వ్ బెంచ్కు అవకాశం ఇచ్చింది. న్యూజిలాండ్ఏ జట్టులో ఇప్పటికే నలుగురు ఆటగాళ్లు న్యూజిలాండ్ ప్రధానజట్టుకు అర్హత సాధించారు. ఇదిలా వుండగా భారత్ ఏ శిబిరంలోని 12వ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ ఈ సారి ఏకంగా ఓపెనర్గానే వచ్చి మెరుపులు మెరిపించాడు. సెంచరీ చేజార్చుకున్నా ఏడు బంతుల్ని బౌండరీకి తరలించాడు. ఇక రిజర్వ్ బెంచ్ ఆటగాడు ప్రశాంత్ చొప్రా సయితం భారత్ ఏ జట్టుకు ఓపెనర్గానే వచ్చాడు. వికెట్కీపర్ రిషబ్ పంత్ ఈసారి ఏకంగా కెప్టెన్గానే మారిపోయాడు. హాట్రిక్ చేజారింది... మరో ఆరు ఓవర్లు మిగిలివున్నాయి. శార్దుల్ ఠాకుర్ బౌలింగ్కు వచ్చాడు. తొలి రెండు బంతులు విసిరిన అనంతరం అప్పటికే క్రీజ్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆస్టే›న్లను వెనక్కిపంపాడు. తర్వాతి బంతికే వికెట్ను తీయడంతో భారత్ శిబిరంలో ఒక్కటే ఉత్కంఠ. హాట్రిక్ చేసేందుకు సిద్ధమైన శార్దుల్ ఠాకుర్ ప్రయత్నం ఫలించలేదు. అయితే తర్వాత ఓవర్లో నదీమ్ వేసిన తొలిబంతికే వికెట్ తీయడంతో న్యూజిలాండ్ ఏ జట్టు పరాజయం పాలైంది. -
టీమిండియాదే సిరీస్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (02-05-2024)
Swapna Kondamma: బుల్లితెర నటి సీమంతం.. ఎంతో సింపుల్గా ఇంట్లోనే.. (ఫోటోలు)
హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)
నితీష్ ఊచకోత.. 8 సిక్స్లతో వీర విహారం! వీడియో వైరల్
RR vs SRH: చెలరేగిన నితీష్ కుమార్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
తెలంగాణకు రేవంత్రెడ్డి శనిలా పట్టాడు: హరీష్ రావు
కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
TS: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీ పొడిగింపు
బీజేపీ కుట్రలు అడ్డుకుంటాం: సీఎం రేవంత్
తప్పక చదవండి
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement