-
ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన.. యువతిని బలవంతంగా కారులోకి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన జరిగింది. 19 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి బలవంతంగా కారులోకి లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో యాసిడ్ పోస్తానని బెదిరించాడు. అయినా యువతి భయపడకుండా కారు ఎక్కేందుకు నిరాకరించింది. దీంతో అతడు ఆమెను కారు దగ్గరకు ఈడ్చుకెళ్లాడు. వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో యువతికి గాయాలయ్యాయి. ఢిల్లీలోని పాండవ్ నగర్లో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీలో వరుసగా దారుణాలు జరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. జనవరి 1న అంజలి అనే యువతి స్కూటీని ఢీకొట్టి ఆమెను కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జనవరి 2న ఆదర్శ్ నగర్లో జరిగిన మరో దారుణ ఘటనలో శివకుమార్ అనే 20 ఏళ్ల యువకుడు 21 ఏళ్ల యవతిని కత్తితో పలుమార్లు పొడిచాడు. ఇద్దరూ స్నేహితులే అయినప్పటీకీ ఏదో విషయంలో గొడవపడి అతడు విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చదవండి: అయ్యో అంజలి.. పోస్ట్మార్టం రిపోర్ట్లో షాకింగ్ విషయాలు -
భర్తతో రిలేషన్.. ప్రశ్నించిన భార్యపై యువతి యాసిడ్ దాడి
నాగ్పూర్: ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదేమోనన్న కోపంతో యాసిడ్ దాడి చేసిన సంఘటనలు చూసే ఉంటాం. కానీ, ఓ 25 ఏళ్ల యువతి తన ప్రియుడి భార్యపై యాసిడ్ దాడి చేసింది. ఈ క్రూరమైన చర్య మహారాష్ట్రలోని నాగపూర్లో గత శనివారం ఉదయం జరిగింది. ఈ యాసిడ్ దాడిలో తల్లి, రెండునరేళ్ల కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు స్కూటీపై బాధితుల వద్దకు వచ్చారు. ఒక్కసారిగా వారిపై యాసిడ్ దాడి చేశారు. మహిళతో పాటు తన ఒడిలో బాలుడిపైనా యాసిడ్ పడి తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసి క్షణాల్లోనే అక్కడి నుంచి పరారయ్యాను నిందితులు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ‘వివాహేతర సంబంధంపై బాధితురాలు, నిందితురాలి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తన స్నేహితురాలితో కలిసి బాధితురాలు, ఆమె కుమారుడిపై యాసిడ్ దాడి చేసింది. బాధితులను ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నాం. ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.’ అని యశోద నగర్ పోలీస్లు తెలిపారు. మొబైల్ ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలిని పట్టుకున్నట్లు చెప్పారు. ఆమెపై సెక్షన్ 326ఏ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. SHOCKER - ACID ATTACK ON WOMAN & HER CHILD Horrific attack in Nagpur; acid attack on a woman & her child. Reportedly, the attacker had affair with the woman's husband | @Aruneel_S reports #acidattack #BREAKING_NEWS #Nagpur pic.twitter.com/LuLqEhv6gG — Mirror Now (@MirrorNow) December 6, 2022 ఇదీ చదవండి: Bharat Jodo Yatra: బీజేపీ కార్యకర్తలపై రాహుల్ గాంధీ ముద్దుల వర్షం!.. వీడియో వైరల్ -
మహిళ వీరంగం.. బూతులు తిడుతూ.. చేత్తో కొడుతూ.. కాళ్లతో తన్నుతూ..
సాక్షి, విజయవాడ: ఆర్టీసీ డ్రైవర్పై ఓ మహిళ దాడి చేసిన ఘటన నగరంలో బుధవారం కలకలం రేపింది. సూర్యారావుపేట సీఐ జానకి రామయ్య కథనం మేరకు.. విద్యాధరపురం డిపోనకు చెందిన ఐదో నంబర్ రూట్ బస్సు బుధవారం సాయంత్రం కాళేశ్వరరావు మార్కెట్ నుంచి ఆటోనగర్కు బయలుదేరింది. కృష్ణలంక ప్రాంతానికి చెందిన కె.నందిని తన ద్విచక్ర వాహనంపై వన్ వేలో రాంగ్రూట్లో కేఎల్ యూనివర్సిటీ జంక్షన్ వద్ద బస్సుకు అడ్డంగా వచ్చింది. దీంతో డ్రైవర్ ఎం.ముసలయ్య అత్యవసర బ్రేకు వేసి ప్రమాదం జరగకుండా బస్సును అదుపు చేశారు. చదవండి: కాటేసిన బాబాయ్.. టాటా చెబుతూ నవ్వుతూ వెళ్లిన చిన్నారి.. అంతలోనే.. అయితే నందిని ఆగ్రహంతో చంపేస్తావా అంటూ బస్సులోకి ప్రవేశించి డ్రైవర్పై దాడి చేసింది. డ్రైవర్ను బూతులు తిడుతూ చేతులు, కాళ్లతో దాడిచేయడాన్ని అక్కడే ఉన్న మరో మహిళ తన ఫోన్లో చిత్రీకరించింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. వీడియో దృశ్యాలను పరిశీలించి, విచారణ చేపట్టిన అనంతరం డ్రైవర్ ముసలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందినిపై కేసు నమోదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్పై నందిని దాడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. -
అమానుషం: మహిళను ఈడ్చి కొట్టి మీద కూర్చున్న ఎస్సై
ఒక మహిళపై అమానుషంగా దాడి చేశారనే విమర్శలు ఉత్తర ప్రదేశ్ పోలీసుల్ని చుట్టుముట్టాయి. కాన్పూర్ డెహత్ జిల్లాకు చెందిన ఓ పోలీస్ అధికారి.. ఓ వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు అతని భార్యపై దాడి చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాన్పూర్ డెహత్(దెహత్) జిల్లా దుర్గాదాస్పూర్ గ్రామంలో శనివారం జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. తన భర్త అక్రమంగా అరెస్ట్ చేశారని, వదిలిపెట్టాలంటే డబ్బు ఇవ్వాలని భోగిన్పూర్ ఎస్సై మహేంద్ర పటేల్ డిమాండ్ చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఇవ్వనని చెప్పడంతో తనను లాగేసి నేల మీద పడేసి కొట్టాడని, మీద కూర్చుని ముఖం మీద దాడి చేశాడని, గ్రామస్తుల జోక్యం చేసుకోవడంతో తను వదిలేశాడని వాపోయిందామె. అయితే ఆ సమయంలో స్నేహితులతో శివం యాదవ్ జూదం ఆడుతున్నాడని. అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే అతని భార్య ఆర్తి, తల్లి తమను అడ్డుకోవాలని ప్రయత్నించారని, ఈ క్రమంలో వాళ్లే తన బృందంపై దాడి చేశారని ఎస్సై పటేల్ చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై కాన్పూర్ ఎస్పీ చౌదరి స్పందిస్తూ.. శివం పారిపోయేందుకు సాయం చేసేందుకే అతని భార్య తనను అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారని పటేల్ భావించాడని, అందుకే అలా ప్రవర్తించాడని తెలిపారు. పటేల్ను భోగిన్పూర్ విధుల నుంచి తప్పించామని, ఘటనపై దర్యాప్తు చేయించి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని కాన్పూర్ ఎస్పీ చౌదరి తెలిపారు. మరోవైపు సమాజ్వాదీ పార్టీ ఈ ఘటనపై రాజకీయ విమర్శలు చేస్తోంది. -
గ్యాంగ్ రేప్ యత్నం: యువతి మృతి
ముజఫర్ నగర్ : ఉత్తరప్రదేశ్లో ఘోరం చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై నలుగురు దుండగులు గ్యాంగ్ రేప్నకు యత్నించారు. దీంతో మహిళ వారిని అడ్డుకునే యత్నం చేసింది. ఈ క్రమంలో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందింది. ఈ సంఘటన శామ్లి జిల్లాలోని భూర గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువతి(23) రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నలుగురు గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆమై అత్యాచారం చేయడానికి యత్నించారు. దీంతో ఆమె వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కోపోద్రిక్తులైన దుండగులు ఆమెపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement