-
వక్ఫ్ ఆస్తుల ఆక్రమణదారులపై కొరడా
సాక్షి, అమరావతి: మహోన్నత ఆశయంతో దాతలు ఇచ్చిన వక్ఫ్ భూములు, ఆస్తులను ఆక్రమణల నుంచి కాపాడతామని ఎన్నికలకు ముందు సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చింది. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులను ఆక్రమించిన వారిపై వక్ఫ్ బోర్డు కొరడా ఝళిపిస్తోంది. ఆస్తులను ఆక్రమణల చెర నుంచి విడిపించి స్వాధీనం చేసుకునే ప్రక్రియ వేగంగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సర్వే ద్వారా ఆక్రమణలో ఉన్న వక్ఫ్ ఆస్తులను గుర్తిస్తున్నారు. తొలి దశలో కొన్ని ఆస్తులు గుర్తించగా, రెండో దశ సర్వే వేగంగా సాగుతోంది. ఈ సర్వే ద్వారా అన్యాక్రాంతమైనట్టు గుర్తించిన ఆస్తులను వక్ఫ్ బోర్డు పరిధిలోని టాస్్కఫోర్స్ విభాగం స్వాదీనం చేసుకుంటోంది. వక్ఫ్ బోర్డు ప్రత్యేక అధికారి షేక్ షిరీన్ బేగం పర్యవేక్షణలో అధికారులు, మైనారిటీ సంక్షేమ శాఖ, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గత 15 రోజులుగా రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు తీసుకున్న కొన్ని ప్రధాన చర్యలు.. ♦ నంద్యాల పట్టణంలోని నూనెపల్లి – రైతు నగరం ప్రాంతాల మధ్య వక్ఫ్ భూముల్లో వ్యాపార సముదాయాలు నిరి్మంచిన కొందరు అక్రమార్కులకు చెక్ పెట్టారు. 231 సర్వే నంబర్లో 3.89 ఎకరాలు, 47వ సర్వే నంబర్లో 7.48 ఎకరాలు, 22వ సర్వే నంబర్లో 5.92 ఎకరాలకు నోటీసులు జారీ చేసి ఆక్రమణల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ♦ అన్నమయ్య జిల్లావ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డు భూములను ప్రత్యేకాధికారి షిరీన్ బేగం బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. గువ్వల చెరువు, రహీంషా వలి దర్గా, రాయచోటి జామియ మసీదు ఆస్తులవాస్తవ పరిస్థితులు, రికార్డులను పరిశీలించింది. ఇవి అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సిద్ధం చేసింది. ♦ రాయచోటి దర్గా భూమిని, దుకాణాల్లో ఆక్రమణలు లేవని గుర్తించి అటాచ్ చేశారు. ♦పల్నాడు జిల్లాలో అన్యాక్రాంతమైన వక్ఫ్ భూముల్లో ఆక్రమణలు తొలగించి సంబంధిత శాఖకు అందించాలని ఆ జిల్లా కలెక్టర్ శివశంకర్ ఇటీవల రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీనిపై కార్యాచరణ కోసం వక్ఫ్ భూముల పరిరక్షణ కమిటీ తొలి సమావేశాన్ని నిర్వహించారు. ♦ వినుకొండలో అన్యాక్రాంతమైన మసీదు మాన్యం భూమి స్వా«దీనానికి చర్యలు చేపట్టారు. తిమ్మాయపాలెంలో ఆక్రమణకు గురైన ఆరు ఎకరాలపై కార్యాచరణ సిద్ధం చేశారు. ♦ ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఆక్రమణలకు గురైన స్థలాలు, అమ్మకాలు జరిపిన ఆస్తుల రికార్డులు పరిశీలించారు. వక్ఫ్ బోర్డుకు చెందిన మసీదులు, శ్మశాన వాటికలు పరిశీలించారు. ఇచ్చాపురం హాస్పిటల్ రోడ్డులో వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలను గత నెల 21న తొలగించారు. వక్ఫ్ స్థలంలో వివాదాస్పదంగా మారిన కంటైనర్ను తొలగించారు. 4.82 ఎకరాల విస్తీర్ణంలో 30 ఏళ్లుగా షాపులు ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్న 24 మంది దుకాణదారులను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో వక్ఫ్ భూములు, ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాం. అన్యాక్రాంతమైన ఆస్తులను స్వా«దీనం చేసుకుంటున్నాం. ప్రభుత్వ శాఖల సహకారంతో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ చర్యలు చేపట్టాం. వక్ఫ్ బోర్డుకు చెందిన గజం భూమిని కూడా వదలం. ఆక్రమణలు ఖాళీ చేయకపోతే చట్టప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. – షేక్ షిరీన్బేగం, వక్ఫ్బోర్డు ప్రత్యేకాధికారి -
TS: 48 ఎకరాల భూములపై కన్నేసి.. 24 ఎకరాలు మింగేసి..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: భూ సమస్యలకు సంబంధించి ఎలాంటి అవకతవకలు, జాప్యానికి తావు లేకుండా.. పారదర్శకంగా పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ను అమల్లోకి తీసుకొచ్చింది. అయితే అధికారుల అండతో దీనికీ తూట్లు పొడుస్తున్న అక్రమార్కులు.. వివాదాల్లో ఉన్న వక్ఫ్ భూముల్ని మింగేస్తున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం ముక్తిపాడ్ గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకున్న భూ బాగోతం ఇందుకు ఓ ఉదాహరణగా నిలుస్తోంది. కోర్టులో కేసులుండి వివాదాస్పదంగా మారిన వక్ఫ్ బోర్డుకు చెందిన ఇనాం (కిద్మత్) భూములపై ఎప్పటినుంచో నజర్ వేసిన కొందరు ‘పెద్దలు’చాకచక్యంగా వాటిని కొట్టేశారు. టెనెంట్దారులు (సాగుదారులు), ఇనాందారుల మధ్య రాజీ కుదర్చడంతో పాటు నకిలీ దస్తావేజులు సృష్టించి, రిజి్రస్టేషన్ చేయించి కోట్లాది రూపాయలు దండుకున్నారు. నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డు పరిధిలో కిద్మత్ ఇనాం కింద ఇచి్చన భూముల క్రయవిక్రయాలకు హక్కులు ఉండవు. ఎవరైతే ఇనాం పొందుతారో వారితో పాటు తర్వాతి తరాలు సాగు చేసుకునేందుకు మాత్రమే హక్కులు ఉంటాయి. కానీ.. కొంతకాలం క్రితం బదిలీపై వెళ్లిన ఓ జిల్లా స్థాయి అధికారి, ఓ నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి కుమ్మక్కై చక్రం తిప్పారనే ఆరోపణలున్నాయి. రిజిస్ట్రేషన్ కోసం రూ.5 కోట్లతో ఒప్పందం చేసుకున్నారని, తహసీల్దార్కు సమాచారం లేకుండానే రిజి్రస్టేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది. వారసులతో ఒప్పందం కుదుర్చుకుని.. ముక్తిపాడ్ గ్రామ పంచాయతీ పరిధిలో 19, 20, 50, 51 సర్వే నంబర్లలో 48 ఎకరాల భూమి ఉంది. దీన్ని మూడు తరాలుగా చెన్నారం గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాల వారు సాగు చేసుకుంటూ టెనెంట్దారులుగా ఉన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఇది కిద్మత్ కింద ఇనాం భూమిగా.. హుస్సేని ఆలం ఇనాందారుగా ఉన్నారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచి్చన తర్వాత ఆలం ఆ భూముల పట్టాదారుగా ఆన్లై¯న్లో నమోదైంది. విషయం తెలిసిన టెనెంట్ దారులు తాము అనేక ఏళ్లుగా ఈ భూమిని సాగు చేసుకుంటున్నామని, తమ పేరు మీద పట్టాదారు పాసు బుక్కులు ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత సదరు ఇనాందారుకు చెందిన వారసులు (మూడో తరం) కూడా తమకే హక్కు కలి్పంచాలంటూ కోర్టు మెట్లు ఎక్కారు. ఇలా ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతుండగా ఈ భూములపై కన్నేసిన పెద్దలు.. ఇనాందారుడి వారసులతో ముందస్తు ఒప్పందం చేసుకున్నారు. మీ పేరిట పట్టాదారు పాసుబుక్కులు తెచ్చే బాధ్యత తమదని..ఆ తర్వాత ఆ భూమిని తమకే అమ్మాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఇనాందారుడి వారసులను కుటుంబసభ్యులుగా చేర్చి ఫ్యామిలీ సరి్టఫికెట్తో సంబంధిత 48 ఎకరాల కిద్మత్ ఇనాం భూమిని అధికారుల అండదండలతోవారి పేరిట మార్చి పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు. ఇలా వెలుగులోకి.. ఇనాందారుల పేరిట మొత్తం 48 ఎకరాలకు పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరైన విషయం తెలుసుకున్న టెనెంట్ దారులు మూకుమ్మడిగా కోస్గిలోని తహసీల్దారు కార్యాలయానికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగడంతో అసలు విషయం వెలుగులోకి వచి్చంది. అయితే తన ప్రమేయం లేకుండానే పాసు బుక్కులు వచ్చాయని.. తనకు కనీస సమాచారం లేదని తహసీల్దార్ లిఖిత పూర్వకంగా ధ్రువీకరణ ఇచ్చారు. అసలు విషయం బట్టబయలు కావడంతో పాసు బుక్కులు రద్దు చేస్తున్నామని జిల్లా అధికారులు ప్రకటించి తాత్కాలికంగా గొడవను సద్దుమణిగించారు. కానీ అక్రమార్కులు ఇంతటితో ఆగలేదు. భూముల్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని పథకం వేశారు. ఓ అధికారి కీలకపాత్ర! నారాయణపేట జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్న ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ఓ అధికారి ఈ భూ బాగోతంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. జిల్లా స్థాయి అధికారితో పాటు ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధికి సమాచారం చేరవేసి తతంగం నడిపించినట్లు సమాచారం. కోర్టు కేసులకు సంబంధించి ఇరువర్గాల అడ్వకేట్లు సహా ఇటు టెనెంట్దారులు, అటు వారసుల మధ్య రాజీ కుదిర్చాడు. ఇరువర్గాలు 48 ఎకరాల భూములను సమానంగా పంచుకుని.. హైదారాబాద్ చెందిన ఓ రియల్టర్ల గ్రూప్నకు అమ్మేలా ఒప్పందం చేయించాడు. ఉన్నతాధికారి సహకారంతో ఇరువర్గాలకు (టెనెంట్, ఇనాందారులకు) సమానంగా 24 ఎకరాల చొప్పున రిజి్రస్టేషన్ చేయించాడు. గుట్టుచప్పుడు కాకుండా సాగిన రిజి్రస్టేష¯న్ వెనుక రూ.5 కోట్ల డీల్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ రియల్టర్లు ప్రజాప్రతినిధి బినామీలేనట.. ఒప్పందం ప్రకారం ఇనాందారులకు సంబంధించిన 24 ఎకరాల భూములను హైదరాబాద్కు చెందిన రియల్టర్ల పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. అయితే వీరందరూ నియోజకవర్గ ప్రజాప్రతినిధికి చెందిన బినామీలేనని తెలిసింది. కాగా సదరు ప్రజాప్రతినిధి ముందస్తు ఒప్పందం ప్రకారం వారసులకు తూతూ మంత్రంగా ముట్టజెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత ఇటీవలే 11 ఎకరాలను కోస్గి పట్టణానికి చెందిన ఇద్దరు బడావ్యాపార వేత్తలకు ఏకంగా రూ.6.5 కోట్లకు విక్రయించి తిరిగి వారి పేరిట రిజి్రస్టేషన్ చేయించారు. ఈ భూభాగోతంపై వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ రియాజ్ను సంప్రదించగా.. ‘నేను ఇటీవలే బదిలీపై వచ్చా. పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి వక్ఫ్ బోర్డు సీఈఓకు నివేదిక అందజేస్తా’అని సమాధానమిచ్చారు. ఇది కూడా చదవండి: మూడు రాష్ట్రాల సరిహద్దులో ‘మావో’ల భేటీ? -
మూడొంతులు గల్లంతు!
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగర కుర్దులో సయ్యద్ శారాజ్ ఖత్తాల్ హుస్సేన్ దర్గాకు సుమారు 500 ఎకరాల భూమి ఉంది. చాలావరకు భూమి సాగులో ఉంది. 2008లో వక్ఫ్బోర్డు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో కొందరు రైతులు కోర్టును ఆశ్రయించి స్టే పొందారు. ఇలావుండగా సర్వే నంబర్ 82/అ/1/1లోని ఆరు ఎకరాలకు సంబంధించి ఒక రైతు పేరిట 2018లో పట్టాదారు పాస్బుక్ జారీ అయింది. తర్వాత తప్పిదాన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు 2021లో పాస్బుక్ను రద్దు చేశారు. అయితే అప్పటికే సదరు రైతు నుంచి భూమిని కొనుగోలు చేసిన రియల్టర్లు రిజిస్ట్రేషన్ కు ప్రయత్నించగా నిషేధిత జాబితా కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు హెచ్ఎండీఏఅధికారులు అవగాహన రాహిత్యంతో భూమికి లే అవుట్ పర్మిషన్స్ (ఎల్పీ) నంబర్ జారీ చేయడంతో, ఫైనల్ లే అవుట్ అప్రూవల్ కోసం సదరు రియల్టర్లు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వక్ఫ్ భూములు యథేచ్చగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఇప్పటికే వేలాది ఎకరాలు కబ్జాలో ఉన్నాయి. వక్ఫ్బోర్డు సిబ్బందే స్థిరాస్తి వ్యాపా రులతో కుమ్మక్కై రికార్డులు తారు మారు చేస్తున్నారనే ఆరోపణలు ఉండగా, ప్రభుత్వం కూడా వీటిని రెవెన్యూ భూములుగా పేర్కొంటూ అడ్డగోలుగా ధారాదత్తం చేస్తోందనే విమర్శలున్నాయి. మరోవైపు లీజులకు ఇచ్చిన భూములు సైతం క్రమంగా చేజారిపోతున్నాయి. నిజాం కాలం నుంచి వక్ఫ్ ఆస్తుల రికార్డులు ఉర్దూ, పార్సీ భాషల్లో ఉండగా, భద్రపరచాల్సిన వారే చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. రిటైరైన పర్మినెంట్ సిబ్బంది స్థానంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండటం అక్రమార్కులకు కలిసి వస్తోంది. నామమాత్రపు చర్యలే.. వక్ఫ్బోర్డు రికార్డుల ప్రకారం రాష్ట్రంలోని దర్గాలు, మసీదులు, ఆషూర్ ఖానాలు, చిల్లాలతో పాటు స్మశానవాటికలు తదితరాల (మొత్తం 33,929) కింద సుమారు 77,588.07 ఎకరాల భూమి ఉంది. అందులో మూడొంతులు అంటే.. ఏకంగా 57,423.91 ఎకరాలు (74 శాతం) ఆక్రమణలో ఉండటం విస్మయం కలిగించే అంశం. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో అధిక శాతం భూములు కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. మెదక్లో దాదాపు పూర్తిగా పరాధీనమయ్యాయి. బోర్డు సుమారు 2,186 మంది ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినా తదుపరి చర్యలు ముందుకు సాగలేదు. ఇటీవల హైకోర్టు ఆదేశాలతో కబ్జాలపై ఉక్కుపాదం కోసం రెవెన్యూ, పోలీసు, వక్ఫ్ బోర్డు అధికారులతో కూడిన ఒక టాస్్కఫోర్స్ ఏర్పాటైనా చలనం మాత్రం లేదు. మరోవైపు రాష్ట్ర వక్ఫ్ బోర్డులోని రికార్డుల గదికి ఐదేళ్లుగా తాళం చిప్ప వేలాడుతోంది. అవినీతి ఆరోపణలు దష్ట్యా సీఎం ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కీలక రికార్డులను స్వా«దీనం చేసుకొని రికార్డు రూమ్ను సీజ్ చేశారు. అది ఇప్పటివరకు తెరుచుకోక పోవడంతో సుమారు 3,400 ఎకరాల భూమికి సంబంధించిన కోర్టు కేసులు సరైన ఆధారాలు లేక వీగిపోయాయి. కబ్జాల పర్వం.. ♦ నల్లగొండ జిల్లా దేవరకొండలో 111 ఎకరాల 8 గుంటల వక్ఫ్ భూమిలో సుమారు 83 ఎకరాలు కబ్జా కోరల్లో చిక్కుకుంది. ♦ మల్కాజిగిరిలో హజరత్ మీర్ మెహమూద్ సాహబ్ పహాడి దర్గాకు సర్వే నంబర్ 659, 660లో సుమారు మూడు ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. తాజాగా ఒక వ్యక్తి ఈ భూమిపై తిష్ట వేశాడు. ఫెన్సింగ్ వేసి ప్లాటింగ్కు సిద్ధమవుతున్నాడు. ♦ చిల్లా కోహ్–ఎ–మౌలా–అలీకి మల్లాపూర్, కీసర రాంపల్లిలో సుమారు 232 ఎకరాల భూమి ఉండగా సగానికి పైగా భూబకాసురుల ఆక్రమణలో ఉంది. ♦ మణికొండ దర్గాకు 1,654 ఎకరాల భూమి ఉన్నట్టు రికార్డులుండగా ప్రస్తుతం ఎకరం భూమి కూడా కన్పించడం లేదు. ♦ హకీముల్ మునవీ అల్ మారూఫ్ హకీం బాబా దర్గాకు కుతుబ్షాహీల కాలంలో దర్గా నిర్మాణం కోసం 4,448 గజాలు, దర్గా నిర్వహణ కోసం 323 ఎకరాల 18 గుంటల భూమిని వక్ఫ్ చేయగా, ప్రస్తుతం దర్గా మినహా మిగతా భూమి ఉనికి లేకుండా పోయింది. ధారాదత్తం ఇలా.. ♦ ఐదో నిజాం రాజు అఫ్జల్ దౌలా మణికొండ గ్రామ పరిధిలో హుస్సే¯న్ షావలి దర్గాకు 1,898 ఎకరాలు రాసిచ్చారు. 1959లో గెజిట్ కూడా విడుదల అయ్యింది. అయితే రికార్డుల్లో సర్కారీ పేరుతో ఉన్న వక్ఫ్ భూముల్ని రెవెన్యూగా పేర్కొంటూ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. ♦ పహడీషరీఫ్లో బాబా షర్ఫొద్దీన్ దర్గాకు మామిడిపల్లిలో 2,131 ఎకరాల భూమి ఉండగా, దీంట్లోంచి 1,051 ఎకరాల భూమిని వక్ఫ్బోర్డు అనుమతి లేకుండానే ప్రభుత్వం విమానాశ్రయానికి, మరో 91 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి అప్పగించింది. ♦ సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెంలో ఈద్గాకు చెందిన సర్వే నంబర్ 290లోని 9.20 ఎకరాల భూమిని ప్రభుత్వం రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు అప్పగించింది. న్యాయాధికారాలు ఉండాలి వక్ఫ్ బోర్డుకు ప్రత్యేక న్యాయాధికారాలు ఉండాలి. వక్ఫ్, రెవెన్యూ భూములపై స్పష్టత రావాలి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది స్థానంలో శాశ్వత ఉద్యోగులను నియమించాలి. రికార్డులు గల్లంతు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అక్రమణలను తొలగించేందుకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం సహకరించాలి. – అబుల్ పత్హే బందగి బద్షా రియాజ్ ఖాద్రీ, పాలక మండలి సభ్యుడు, వక్ఫ్బోర్డు. హైదరాబాద్ రికార్డుల గదిని తక్షణమే తెరిపించాలి వక్ఫ్ భూముల రికార్డుల గదిని తక్షణమే తెరిపించాలి. కోర్టు వివాదాల్లోని భూములపై సమగ్ర ఆధారాలు సమర్పించే విధంగా చర్యలు అవసరం. అప్పుడే వక్ఫ్ భూముల పరిరక్షణ సాధ్యమవుతుంది. ప్రభుత్వం దీనిని సీరియస్గా తీసుకోవాలి. – సయ్యద్ ఇఫ్తేకర్ హుస్సేనీ, వక్ఫ్ భూముల పరిరక్షణ కమిటీ గద్వాలలోని హజరత్ సయ్యద్ షా మరూఫ్ పీర్ ఖాద్రీ దర్గాకు 39.8 ఎకరాల భూమి ఉంది. సంగాలలోని సర్వే నంబర్ 95, 96, 97, 98లోని 27.9 ఎకరాల భూమిని దర్గా ముతవల్లి ద్వారా స్థానిక రైతు ఒకరు సాగు కోసం లీజుపై తీసుకున్నారు. తర్వాత ఆ రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడటంతో అతని సోదరుడు రెవెన్యూ శాఖ ద్వారా యాజమాన్య హక్కు సర్టిఫికెట్ (ఓఆర్సీ) పొందాడు. తర్వాత తన పేరిట మారి్పడి చేసుకొని ప్లాటింగ్కు ప్రయత్నించాడు. దర్గాకు చెందినవారి ఫిర్యాదుతో జాయింట్ కలెక్టర్ కోర్టు ఓఆర్సీపై స్టే ఇవ్వగా దానిపై హైకోర్టు స్టే విధించింది. -
వివాదాస్పద 6 ఎకరాల స్థలానికి హెచ్ఎండీఏ ఎల్పీ.. ఇదో అంతుచిక్కని ప్రశ్న!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్న వక్ఫ్ భూమికి ఏకంగా హెచ్ఎండీఏ లే అవుట్ పర్మిషన్ (ఎల్పీ) ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం రూపొందించిన ధరణి, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లు నిషేధిత జాబితాలో పొందుపర్చిన ఈ భూముల వివరాలను కనీసం పరిశీలించకుండా ఏకపక్షంగా అనుమతులు జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాస్బుక్ను రద్దు చేసినా.. మహేశ్వరం మండలం కొంగరకుర్దు రెవెన్యూ పరిధిలోని ఔటర్ను ఆనుకుని సుమారు 500 ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. 1962 నుంచి ఇప్పటి వరకు పహానీల్లో పట్టాదారు కాలంలో సయ్యద్ శారాజ్ ఖత్తాల్ హుస్సేన్సాబ్ దర్గా పేరిట నమోదైంది. దీన్ని వక్ఫ్ భూమిగా పేర్కొంటూ 2008లో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భూమిని సాగు చేసుకుంటున్న కొందరు రైతులు గెజిట్ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టేటస్ కో విధించింది. అప్పటి నుంచి కేసు పెండింగ్లోనే ఉంది. అనంతరం వక్ఫ్భూముల రిజిస్టేషన్లు సైతం నిలిచిపోయాయి.కానీ సర్వే నంబర్ 82/అ/1/1లో 11.17 ఎకరాలు ఉండగా, ఇందులో ఆరు ఎకరాలకు 2018లో ఒకరి పేరిట (ఖాతా నంబర్ 429 టీ 0516090202) పట్టాదారు పాస్బుక్ జారీ చేయడం.. ఒకే భూమికి రెండుసార్లు ఓఆర్సీ ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండటంతో పాటు రిజిస్ట్రేషన్లు నిషేధం ఉన్న సమయంలో కొత్త పట్టాదారు పాస్బుక్ ఎలా ఇచ్చారని స్థాని కులు రెవెన్యూ అధికారులను నిలదీశారు. రికార్డుల్లో పొరపాటున పట్టాదారుగా నమోదైందని పేర్కొంటూ, సదరు పాసుపుస్తకాన్ని రద్దు చేస్తూ 2021 జనవరి 5న ఎండార్స్మెంట్ జారీ చేశారు. వివాదాస్పదమని తేలినా.. పట్టాదారు పాస్బుక్ను ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ సదరు వ్యక్తి నుంచి ఈ భూమిని నగరానికి చెందిన ఇద్దరు రియల్టర్లు కొనుగోలు చేశారు. ఈ మేరకు 20 ఏప్రిల్ 2021న మహేశ్వరం రిజిస్ట్రేషన్ ఆఫీసులో డాక్యుమెంట్ రిజిస్ట్రర్ చేయించేందుకు యత్నించగా ఇది నిషేధిత జాబితాలో ఉన్న వివాదాస్పద స్థలమని తేలింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పెండింగ్లో పెడుతూ ఇదే అంశాన్ని సంబంధిత డాక్యుమెంట్పై కూడా రాసి పెట్టారు. ఇటు ధరణి, అటు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ వెబ్సైట్లలో నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూమికి హెచ్ఎండీఏ అధికారులు తాజాగా ఎల్పీ నంబర్ ఎలా జారీ చేశారనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఫైనల్ లే అవుట్ అప్రూవల్ జారీ చేయాల్సిందిగా సదరు రియల్టర్లు ప్రస్తుతం తుక్కుగూడ మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెస్తుండడం గమనార్హం. చాలాసార్లు ఫిర్యాదు చేశాం వక్ఫ్బోర్డుకు చెందిన భూమిని అమ్మడం, కొనడం నేరం. కొంతమంది రియల్టర్లు దీన్ని ఆక్రమించి, చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసి ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేశాం. కోర్టులో కేసు కూడా నడుస్తోంది. హెచ్ఎండీఏ అధికారులు లేఅవుట్ పర్మిషన్ ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదు. తప్పుడు రికార్డులు సృష్టించి, అధికారులను తప్పుదోవ పట్టించి భూమిని అమ్మేందుకు యత్నిస్తున్న వారిపై.. రికార్డులు పరిశీలించకుండా అనుమతులు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. – ఎ.శ్రీనివాస్గౌడ్, రావిర్యాల అది ముమ్మాటికీ వక్ఫ్ భూమే.. కొంగరకుర్దు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 82లోని భూమి వక్ఫ్బోర్డుకు చెందినదే. కొంతమంది రియల్టర్లు ఇటీవల ఆ భూమిని చదును చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. వెంటనే సిబ్బందిని అక్కడికి పంపి పనులు నిలుపుదల చేయించాం. భూమికి సంబంధించిన డాక్యు మెంట్లు ఉంటే చూపించాలని కోరాం. ఇప్పటి వరకు రాలేదు. ఈ భూమికి హెచ్ఎండీఏ ఎల్పీ నంబర్ జారీ చేసిన విషయం తెలియదు. నిషేధిత జాబితాలో ఉన్న భూమికి ఎల్పీ నంబర్ ఎలా ఇచ్చారనేదీ అర్థం కావడం లేదు. – జ్యోతి, తహసీల్దార్, మహేశ్వరం -
వక్ఫ్ భూములు ఉఫ్..తొలుత లీజుకు ఇచ్చి.. ఆపై కబ్జా
వితరణ శీలురైన కొందరు ముస్లిం సంపన్నులు తమ స్థిరాస్థిలో కొంత భాగాన్ని, లేదా మొత్తం ఆస్తిని ‘అల్లా’ పేరున రాశారు. ఈ ప్రక్రియను ఇస్లాం సంప్రదాయంలో వక్ఫ్ చేయడం అంటారు. ఒకసారి వక్ఫ్ చేసిన ఆస్తిని తిరిగి తీసుకోవడం కుదరదు. అమ్మడమూ కుదరదు. దాత సంతతికి చెందిన వారికి కూడా దాని మీద ఎలాంటి హక్కులు వుండవు. ఇలాంటి భూముల్ని గత సర్కారు పెద్దలు అయిన వారికి యథేచ్ఛగా కట్టబెట్టేశారు. సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలో ఆసూర్ ఖానాకు చెందిన రెవెన్యూ సర్వే నంబరు 287–1లో 11.34 ఎకరాలు, సర్వే నంబరు 287–5లో 2.6 ఎకరాలు.. మొత్తం 13.94 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. ఈ భూమి విలువ రూ.130 కోట్ల పైమాటే. ఈ అక్రమాన్ని అధికారికంగా సక్రమం చేయాలని గత టీడీపీ పెద్దలు ప్రయత్నించారు. కృష్ణా జిల్లా నిడమానూరులో సర్వే నంబర్ 201, 202, 203లో ఖాజీ (ముస్లింల వివాహాలు చేసే గురువు) సర్వీసు కోసం కేటాయించిన మాన్యం భూమి 39.16 ఎకరాలు టీడీపీ దన్నుతో ఏడుగురు బినామీలు చేజిక్కించుకున్నారు. విజయవాడ భవానీపురంలో కోట్లాది రూపాయల విలువైన దర్గా మాన్యం 40 ఎకరాల భూమిని మార్బుల్ స్టోన్ వ్యాపారులకు నామమాత్రపు లీజుకు ఇచ్చేశారు. కొండపల్లి శాంతినగర్ సర్వే నంబర్ 212ఎ, 212బిలో 18.30 ఎకరాలు, 293/1లో 18 సెంట్లు, ఇబ్రహీంపట్నంలో సర్వే నంబర్ 240లో 26 ఎకరాల ఖాజీ మాన్యం ఆక్రమణల పాలైంది. ఆ భూముల్లో భారీ భవంతులు నిర్మించారు. ఇలా వెయ్యి కాదు.. పది వేలు కాదు.. ఏకంగా 31,584 ఎకరాల వక్ఫ్ (ధార్మిక దానం ఇచ్చినవి) భూములు అక్రమార్కుల వశమయ్యాయి. దీంతో దాతల లక్ష్యం, ఔదార్యం నీరుగారిపోతోంది. అనంతపురం, కర్నూలు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ అక్రమాలు చోటుచేసుకున్నాయి. బాబు జమానాలో అక్రమాలకు ఊతం ► చంద్రబాబు పాలించిన రోజుల్లో వక్ఫ్ భూముల్లో అక్రమాలకు ఊతమిచ్చారని ముస్లిం సమాజం ఆవేదన చెందుతోంది. విశాఖపట్నంలో హజ్రత్ ఇషాక్ రహనతుల్లాలై దర్గాకు చెందిన 3,500 ఎకరాల భూమి కార్పొరేట్ సంస్థలకు పంచిపెట్టింది చంద్రబాబే. ► వక్ఫ్ భూముల అన్యాక్రాంతానికి గత ప్రభుత్వం అధికారిక ముద్ర వేసేందుకు గట్టి ప్రయత్నాలు చేయడంతో న్యాయపరమైన వివాదాలు రేగాయి. నిరర్థక ఆస్తుల పేరుతో టీడీపీ అనుయాయులకు, బడాబాబులకు, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ► కాజా భూముల వ్యవహారం ఈ కోవలోకే వస్తుంది. 2018 నవంబర్ 13న అప్పటి వక్ఫ్ బోర్డు చైర్మన్, ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ఖాన్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సమావేశంలో వారికి అనుకూల నిర్ణయం తీసుకున్నారు. ఆ భూమిని నిరర్థక ఆస్తిగా చూపిస్తూ తీర్మానం చేశారు. ► రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల వక్ఫ్ భూములను ఆక్రమణల చెర నుంచి విడిపించడం మానేసి, అన్యాక్రాంతం పేరుతో అయినకాడికి తెగనమ్మి సొంత మనుషులకు ప్రయోజనం చేకూర్చే ప్రయత్నాలు జరిగాయి. గత ప్రభుత్వ పెద్దలు ఆడిన ఆటలో పావులుగా మారిన ముగ్గురు సీఈవోలు కేవలం మూడు నెలల వ్యవధిలోనే బదిలీ వేటుకు గురయ్యారు. ► కాజా భూముల వ్యవహారంలో ఫైల్ నంబర్ ఎస్ /19/జిఎన్టీ/2018 లేఖ ద్వారా 2017 డిసెంబర్ 3న సచివాలయానికి అనుకూల తీర్మానం చేసి పంపగానే సీఈవో ఎండీ సుభానీని 2018 జనవరిలో అక్కడి నుండి బదిలీ చేశారు. మరో సీఈవోను నియమించుకుని అనుకూల పనులు చేయించుకున్న గత ప్రభుత్వం మళ్లీ ఆయన్ను కూడా బదిలీ చేసింది. 2018 ఫిబ్రవరిలో షేక్ అహ్మద్ను కొత్త సీఈవోగా నియమించారు. వాటికే వక్ఫ్ ఆస్తుల వినియోగం ► స్థిరాస్తుల్ని పరిరక్షిస్తూ ఇస్లామిక్ ధార్మిక కార్యక్రమాలకు, ముస్లిం సమాజంలోని నిరుపేదల సంక్షేమానికి ఆ భూములను వినియోగించాలనేది వక్ఫ్ లక్ష్యం. మసీదు, ఆషూర్ ఖానా, దర్గా, ముషాఫిర్ ఖానా, ఖాజీ, అంజుమన్, మొహర్రం నిర్వహణ వ్యయం కోసం ఈ భూములు ఉపయోగపడాలన్నది దాతల మహోన్నత ఆశయం. ► ఈ రకంగా మన దేశంలో దాదాపు 3 లక్షల ముస్లిం ధార్మిక సంస్థలు తమ ఆస్తులను వక్ఫ్ బోర్డు కింద రిజిస్టర్ చేసుకున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక సంస్థలు వక్ప్ బోర్డు కింద రిజిష్టర్ చేయడం విశేషం. చట్టాన్ని ఆసరా చేసుకుని అక్రమాలు ► వాస్తవానికి వక్ఫ్ చట్టం–1995 (సెంట్రల్ యాక్ట్) ప్రకారం వక్ఫ్ ఆస్తుల క్రయ విక్రయాలు, అన్యాక్రాంతం, అసలు లక్ష్యానికి తూట్లు పొడిచేలా వినియోగం కుదరదు. కానీ అదే చట్టంలోని సెక్షన్–97ను ఆసరాగా తీసుకుని గత ప్రభుత్వం అనేక ప్రాంతాల్లోని వాటిని నిరర్థక ఆస్తులుగా చూపి చేతులు మారేలా వెసులుబాటు కల్పించడంతో న్యాయ వివాదాలు రేగాయి. ► వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతం తగదని సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టు సైతం అనేక తీర్పులు చెప్పినప్పటికీ ఆ ఆస్తులను కాపాడేందుకు గత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోలేదు. రానురాను ముస్లిం సమాజపు నిస్సహాయత, గతంలో వక్ఫ్ బోర్డు బాధ్యుల అవినీతి తదితర కారణాలతో వేలాది ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. కాజా వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై 2018లో రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీకి అప్పటి వక్ఫ్ సీఈవో ఇచ్చిన నివేదిక ముందు లీజు.. ఆపై కైంకర్యం.. ► దాతలు ఇచ్చిన విలువైన భూములను ధర్మకర్తల(ముతవల్లీ)కు, ఖాజాలు తదితర ముస్లిం సమాజానికి చెందిన వారి బతుకుదెరువు కోసం కేవలం 11 నెలల లీజుకు ఇస్తారు. అయితే అక్రమార్కులు వక్ఫ్ బోర్డులో ఉన్న వెసులుబాటును సాకుగా తీసుకుని మూడేళ్లపాటు లీజు ఒప్పందాన్ని పొడిగించుకుంటున్నారు. ► తొలుత ముస్లింలతోనే ఆక్రమణ చేయించి, ఆపై బయటి వ్యక్తుల చేతిలోకి ఆ ఆస్తి వెళ్లేలా చక్రం తిప్పారు. ఇంకో విధంగా.. లీజు పేరుతో ముందుగా విలువైన భూములను ఆక్రమించి ఆపై కైంకర్యం చేసేసుకున్నారు. ► ఎవరైనా ఆ స్థలాన్ని ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తే చట్టంలో ఉన్న అవకాశాలను అనుకూలంగా మలుచుకుని న్యాయ పరమైన వివాదాలు సృష్టిస్తూ ఏళ్ల తరబడి ఆస్తులను అనుభవిస్తున్నారు. కృష్ణా జిల్లా నిడమానూరులో వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై 2019లో అప్పటి కలెక్టర్ ఇంతియాజ్ వక్ఫ్ సీఈవోకు ఇచ్చిన నివేదిక వక్ఫ్ ఆస్తుల రక్షణకు చర్యలు ఆంధ్రప్రదేశ్లో ముస్లిం మైనార్టీలకు మేలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో 502 వక్ఫ్ సంస్థలకు చెందిన 65,783 ఎకరాల్లో గతంలో 31,584 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ఈ భూములను కాపాడేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాం. వక్ఫ్ బోర్డుల పరి«ధిలోని ఆస్తుల రక్షణకు, ముస్లింలకు కొత్త శ్మశానాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. వక్ఫ్ ఆస్తుల వివాదాలపై తక్షణ చర్యలు తీసుకునేలా ఏపీలో త్వరలో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. – అంజాద్ బాషా, ఉప ముఖ్యమంత్రి ముస్లిం దాతల స్ఫూర్తి నిలపాలి ముస్లిం సమాజం కోసం విలువైన భూములను త్యాగం చేసిన దాతల స్ఫూర్తిని నిలిపేలా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. వక్ఫ్ ఆస్తుల పరరిక్షణ కోసం లీజు ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. వీటిపై క్షేత్ర స్థాయిలో సర్వే చేసి, అన్యాక్రాంతమైన వాటిని పరక్షించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలి. అక్రమార్కుల చెర నుంచి వాటిని కాపాడాలి. ముస్లిం సమాజానికి ఆ ఆస్తులు ఉపయోగపడేలా చట్టపరమైన చర్యలు త్వరగా తీసుకోవాలి. – మునీర్ అహ్మద్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement