-
ప్రభాస్దే అసలైన సక్సెస్.. కమల్తో పాత వీడియో వైరల్
డార్లింగ్ ప్రభాస్.. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కానీ ఇలాంటి ట్రెండ్ ఏం లేనప్పుడే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి వాళ్లు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేశారు. తమ సినిమాలతో ఆకట్టుకున్నారు. అలాంటిది ఇప్పుడు వీళ్ల ముగ్గురు కలిసి 'ప్రాజెక్ట్ K' అనే చిత్రం చేస్తున్నారు. ఇదంతా పక్కనబెడితే ప్రభాస్-కమల్ హాసన్ తో మాట్లాడిన పదేళ్ల క్రితం నాటి వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. (ఇదీ చదవండి: 'ప్రాజెక్ట్ K'లో కమల్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) సక్సెస్కి కేరాఫ్ ప్రభాస్! 'బాహుబలి' ముందు ప్రభాస్ గురించి తెలుగులో మాత్రమే తెలుసు. అలా 2013లో కమల్ హాసన్ 'విశ్వరూపం' సినిమా సక్సెస్ మీట్ కు హాజరయ్యాడు. విలక్షణ నటుడు కమల్ కు తనని తాను ప్రభాస్ అని పరిచయం చేసుకున్నాడు. కట్ చేస్తే.. పదేళ్లలో ఏకంగా ఆయనతోనే 'ప్రాజెక్ట్ K'లో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కొట్టేశాడు. ఆ వీడియోని చూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్.. ఇది కదా అసలైన సక్సెస్ అంటే అని తెగ పొగిడేస్తున్నారు. ప్రభాస్ మాట్లాడింది ఇదే 'ఆయన(కమల్ హాసన్) సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన పక్కన కూర్చోవడమే నా అదృష్టం. ఆయనకు నేనెవరో తెలియదేమో. ఐ యామ్ ప్రభాస్ సర్. మా జనరేషనే కాదు ఇంకో 10 జనరేషన్లకు కమల్ హాసన్ అవసరం. కమల్ హాసన్ గారికి సినిమాలు ఎంతో అవసరమో తెలియదు గానీ ఇండియాకు ఆయన సినిమాలు చాలా అవసరం' అని ప్రభాస్ మాట్లాడిన పాత వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. aayana cinema lu chusthune periganu, aayana pakkana kurchovadame na adrustam.. aayanaki nen ewaro telidemo "I'm Prabhas Sir". 🙏 pic.twitter.com/4c2PN09XFq — ︎︎︎︎︎︎︎︎ ︎︎︎︎︎︎︎Telugu Tonic (@TeluguTonic) April 30, 2020 View this post on Instagram A post shared by Prabhas (@actorprabhas) (ఇదీ చదవండి: ఓటీటీలోకి మన సూపర్హీరో మూవీ.. తెలుగులోనూ!) -
సెన్సార్ పూర్తి చేసుకున్న విశ్వరూపం 2
ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న కమల్ హాసన్ సినిమాలను మాత్రం పక్కన పెట్టలేదు. త్వరలో నటనకు గుడ్బై చెపుతున్నట్టుగా ప్రకటించిన లోకనాయకుడు తన ప్రతిష్టాత్మక చిత్రాన్ని విడుదలకు రెడీ చేస్తున్నాడు. కమల్ ఎన్నో కష్టనష్టాలకోర్చి తెరకెక్కించిన సినిమా విశ్వరూపం 2. ముందు ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాతగా ఈ సినిమాను ప్రారంభించారు. కానీ తరువాత రవిచంద్రన్ తప్పుకోవటంతో కమలే నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నారు. కమల్ స్వయంగా దర్శకత్వం వహించి నటించిన విశ్వరూపం 2 ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ను జారీ చేశారు. ఈ సినిమాను ఏప్రిల్ నెల రెండు లేదా మూడో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో పూజ కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్, శేఖర్ కపూర్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
రజనీ వెనుకడుగు.. కమల్ రెడీ..!
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 2.ఓ. గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 450 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రతి నాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను 2018 జనవరి 26న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఆలోగా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కావనే ఉద్దేశంతో సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. ముందుగా అనుకున్నట్టుగా జనవరి 26న కాకుండా ఏప్రిల్ 13న 2.ఓ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అయితే రజనీ వదిలేసిన డేట్ కు కమల్ రావాలని నిర్ణయించుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. దాదాపు మూడేళ్లుగా ల్యాబ్ కే పరిమితమైన విశ్వరూపం 2 సినిమాను జనవరి 26న రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. మరో వారం రోజుల షూటింగ్ తో పాటు కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండటంతో ఆ పనులన్నీ పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ కు రెడీ చేసే ప్లాన్ లో ఉన్నారు కమల్ టీం. -
'విశ్వరూపం 2' ఏమైంది..?
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా విశ్వరూపం. కమల్ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయం సాధించటంతో ఈ సినిమాకు సీక్వెల్ను కూడా రూపొందించారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులు కావస్తున్నా రిలీజ్ విషయంలో మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు. దీంతో ఈ ఏడాది కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేదంటున్నాయి చెన్నై సినీ వర్గాలు. తొలి భాగం ఘనవిజయం సాధించటంతో రెండో భాగాన్ని మరింత భారీగా తెరకెక్కించాడు ఆస్కార్ రవిచంద్రన్. ఇలోగా రవిచంద్రన్ వేరే సినిమాలు నిర్మించటం, అవి ఆశించిన స్థాయిలో ఆడకపోవటంతో ఆర్థికంగా దెబ్బతిన్నాడు. దీంతో విశ్వరూపం 2 పనులు ఆగిపోయాయి. షూటింగ్ పూర్తయినా, విజువల్ ఎఫెక్ట్స్తో పాటు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మరో 25 కోట్లకు పైగా బడ్జెట్ అవసరం, ఇప్పట్లో అంత బడ్జెట్ పెట్టడం కుదరదనుకున్న చిత్రయూనిట్ ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేశారట. -
అంతకు ముందు ఆత్రేయగారు రాసిన సందర్భం కావడంతో ఛాలెంజ్గా తీసుకున్నా..!
రామజోగయ్యశాస్త్రి స్వరానికి మాటలు జోడించినంత మాత్రాన అది పాట అయిపోదు. సందర్భానికి తగ్గ భావవ్యక్తీకరణ ఉండాలి. గుండె లోతుల్లో నుంచి కవితావేశం ఉప్పొంగాలి. నిజమైన పాట అప్పుడు ఉద్భవిస్తుంది. దాంతో కవికి కావాల్సినంత ఆత్మసంతృప్తి. అయితే.. ప్రస్తుతం అలాంటి పాటలు అరుదైపోయాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా భుక్తి కోసం రాసే పాటలే. ఈ పరిస్థితుల్లో కూడా అడపాదడపా తన పాటలతో తళుక్కున మెరుస్తుంటారు రచయిత రామజోగయ్యశాస్త్రి. ఆలోచింపజేసే సాహిత్యంతో, అందమైన పద సరళితో శ్రోతలను రంజింపజేస్తున్నారాయన. దాదాపు అన్ని రకాల పాటలు రాసిన రామజోగయ్యశాస్త్రికి వృత్తిపరంగా, వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చిన పాటలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రయోగాల్లో మచ్చుకు ఓ అయిదింటి గురించి ఆయన మాటల్లోనే... ‘శుభప్రదం’ - సినిమాలో ‘తప్పట్లో తాళాలోయ్’ అనే పాట రాశాను. విద్యాసాగర్ స్వరరచన చేసిన పాట అది. కె.విశ్వనాథ్గారి సినిమాకు పాట రాయడం అదే ప్రథమం. కాబట్టి ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దాం అనుకుని ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడు వెలిగింది... కథానుగుణంగా కృష్ణాష్టమి సందర్భంగా ఈ పాట వస్తుంది. ఈ పాట రాయమంది కె.విశ్వనాథ్గారు. సో... ఇది శివకేశవ ప్రేరేపితంగా భావించా. ఇప్పటికే శివకేశవులపై చాలా పాటలొచ్చాయి. అయితే... వైష్ణవావతారమైన కృష్ణుడితో శివుణ్ణి పోలుస్తూ పాట రాలేదు. ఎందుకో తెలీదుకానీ... శివుడికీ, కృష్ణుడికీ మధ్య పోలికలు కనిపించాయి నాకు. శివుడి మూడోకన్నే... నెమలికన్నుగా కృష్ణుని ఆభరణమైంది. శివుని ఓంకార నాదమే... కృష్ణుని మురళీనాదమైంది. భవుని విభూతే... బృందావనంలోని పుప్పొడిగా మారింది. ప్రమథగణ పూజితుడైన విరాగి శివుడైతే... యదుకాంతల ప్రేమను గెలిచిన విరాళి కృష్ణుడు. కైలాస నాట్యకేళి శివుడిదైతే... కాళింది పడగపై ఆనంద నాట్యహేళి కృష్ణుడిది. నాకు కనిపించిన ఈ పోలికలనే పాటగా మలిచాను. ‘తలపైన కన్నున్న ముక్కంటి తానేగా... శివమూర్తి శిఖిపించె మౌళీ... ప్రాణాలు వెలిగించు ప్రణవార్థమేగా... తన మోవి మురళీ స్వరాళీ... భవుని మేని ధూళి... తలపించదా వన మధూళీ... ప్రమథగణ విరాగి... యదుకాంతలకు ప్రియ విరాళీ... ఝణన ఝణన ఝన పద యుగళమే... జతపడే శివకేశవాభేద కేళీ... ఈ పోలిక చూసి... విశ్వనాథ్గారు ఎంతో సంతోషించారు. ‘విశ్వరూపం’ - కమల్హాసన్ ‘విశ్వరూపం’ సినిమాలో ‘అణువినాశ వర్షమిదీ...’ నేను రాసిన పాటల్లో చెప్పుకోదగ్గ పాట. న్యూక్లియర్ బాంబు వినాశనం కారణంగా ప్రపంచం రెండు వర్గాలుగా మారి యుద్ధాలు మొదలయ్యాయి. టైజం పడగ విప్పింది. ప్రపంచం అశాంతికి లోనైంది.. ఈ పరిణామాలవల్ల మనకు ఒరిగిందేమింటి? అని ప్రశ్నించే పాట ఇది. తమిళ మాతృకను అక్కడి ప్రసిద్ధ సినీ గీతరచయిత వైరముత్తు రాశారు. ఆయన భావవ్యక్తీకరణ అద్భుతం. నాకు తెగ నచ్చేసింది. ఇది మాంటేజ్ సాంగ్ కావడంతో దాన్ని చక్కని తెలుగు పదబంధాలతో రాయొచ్చు. అందుకే... భావం చెడకుండా... అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా రాశాను. వైరముత్తు స్థాయిలో రాయలేకపోయినా... అందులో కొంత స్థాయికైనా చేరాననే ఆనందం ఉంది. ఇక ఆ పాటలో ఓ చరణం ఇది... అణువినాశ వర్షమిదీ... చితుల చిగురు మొలచినదీ. ఒక తల్లి కన్న కొడుకేగా సైనికుడెవరైనా... కాలేది కన్న కడుపేగా... ఎవ్వరు బలి అయినా... ఈ పెనుదాహం... కోరేదేమిటో... రణ... మారణహోమం.... ఆగేదెప్పుడో... ఎన్నడో... ఈ జన్మకు ఈ దేహం... మరుజన్మకు నీదే దేశం? నిరంతరమై నీ వెంటే... ఏదీ రాదు నేస్తం... క్షణికపు నీ ఆవేశం సాధించేది శూన్యం../ఈ పెనుదాహం కోరేదేమిటో... రణ... మారణహోమం ఆగేదెప్పుడో... ఎన్నడో... కమల్హాసన్గారు ఈ పాట విని చాలా సంతోషించారు. పైగా ఈ పాట స్వయంగా ఆయనే పాడారు. నా పాట ఆయన నోట వింటుంటే.. చెప్పలేనంత ఆనందం కలిగింది. అంతకుముందే, ‘మన్మథబాణం’ సినిమాకు కమల్గారికి రాశాను. నా కష్టం చూసే ‘విశ్వరూపం’కి అవకాశం ఇచ్చారాయన. ‘జులాయి’ - యువతరానికి సందేశాన్నీ, జోష్నీ ఇస్తూ నేను రాసిన పాట ‘పకడో పకడో...’. ‘జులాయి’ సినిమాలోని ఈ పాట నాకు మంచి పేరు తెచ్చింది. ఇది నా కెరీర్లో ముఖ్యమైన పాట. ముందు ఈ పాట ఒకే చరణం. హీరో పాత్రచిత్రణను ప్రతిబింబించేలా రాశాను. బాగుండటంతో ఇంకో రెండు చరణాలు రాయమన్నారు త్రివిక్రమ్. మిగిలిన రెండు చరణాలు నేటి యువతను లక్ష్యంగా చేసుకొని, వాళ్లకు ప్రేరణ కలిగించేలా రాశాను. నిన్న నువ్వు మిస్సయ్యింది పకడో... రేపు నీకు ప్లస్సయ్యేది పకడో.. ఒంటరైన జీరో.. వేల్యులేనిదేరో... దాని పక్క అంకెయ్రో... గెలుపను మేటరుంది ఎక్కడో... దాన్ని గెలిచే... రూట్ పకడో... టాలెంటుంది నీలో... ఖుల్లమ్ ఖుల్ల ఖేలో.. బ్యాటు బంతి నువ్వేరో... చెదరని ఫోకస్సే... సీక్రెటాఫ్ సక్సెసై... అర్జునుడి విల్లువై... యారో మారో యాపిల్ పకడో... పకడో పకడో పకడో... పకడో పకడో పకడో... పకడో పకడో... నాలుగు మంచి మాటలు చెబితే బావుంటుందనే స్ఫూర్తితో రాసిన పాట ఇది. త్రివిక్రమ్కి కూడా బాగా నచ్చిన పాట. ‘రాజుభాయ్’ - సినిమాలో ఓ పాట రాశాను. కెరీర్ ప్రారంభంలో నాకు సంతృప్తినిచ్చిన పాట అది. ‘నువ్వు డేంజర్ జోన్లోకి అడుగుపెడుతున్నావ్’ అని హీరోని హెచ్చరించే పాట అది. సగటు మనిషికి కూడా ఉపయోగ పడే తత్వంతో ఈ పాట రాశాను. లోతే తెలియనిదే ఏటిలోన దిగకురా... గింజలు ఎరవేస్తే పంజరాన పడకురా.. కోసే కొడవలికి కొయ్యడమే తెలుసురా... వేసే అడుగు నీవు ఆచితూచి వేయరా... సాలె గూడు గూడు కాదు, పాము పడగ నీడ కాదు... సందర్భమే ఈ పాటకు ప్రేరణ. కథను ముందుకు నడిపించే ఇలాంటి పాట కూడా ఒకటి రాయగలిగాను అని గర్వంగా ఫీలవుతుంటా. ‘శిరిడిసాయి’ - బాబా అవతార ధర్మాన్ని ప్రతిబించేలా ‘షిరిడీసాయి’ సినిమా కోసం నేను రాసిన పాట ‘నీ పదమున ప్రభవించిన గంగా యమునా’. ఒక సాయిభక్తునిగా నాకు అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగించిన పాట ఇది. గంగా, యమునా సంగమాన్ని చూడాలని ప్రయాగ బయలుదేరిన దాసగణుని బాబా కటాక్షించిన సన్నివేశం అది. పైగా ఈ సందర్భంలో ఆత్రేయగారు పాట రాసి ఉన్నారు. అదే సందర్భానికి ఇప్పుడు నేను రాయడం ఛాలెంజ్తో కూడుకున్న విషయం. ‘షిరిడీసాయిబాబా మహత్మ్యం’లో ‘సాయి శరణం... బాబా శరణు శరణం’ పాటంటే కె.రాఘవేంద్రరావుగారికి చాలా ఇష్టం. ఆ ఫ్లేవర్లోనే పాట రాయమన్నారు. నీ పదమున ప్రభవించిన గంగా యమునా... నా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణా... ఏ క్షేత్రమైన తీర్థమైన నీవేగా... ఏ జీవమైన భావమైన నీవేగా... నీవులేని చోటు లేదు సాయి... ఈ జగమే నీ ద్వారకామాయి భగవంతుణ్ణి సర్వాంతర్యామి అంటారు. షిరిడీసాయి ద్వారకామాయి నివాసి. అందుకే... జగమంతా ద్వారకామాయి అని రాశాను. షిరిడీసాయి యద్భావం తద్భవతీ అన్నారు. ఆయన ఆరడుగుల దేహం కాదు. భక్తుల అనుభూతికి ఆకృతి. ఆ భావమే ఈ పాటకు రూపమైంది. ఈ అయిదు పాటలే కాదు.. ఓ కవికి తాను రాసిన ప్రతి పాట తన బిడ్డే. అయితే... తల్లితండ్రులకు ఆత్మానందాన్ని కలిగించే బిడ్డలు మాత్రం కొందరే ఉంటారు. నాకు అలాంటి బిడ్డలే ఈ అయిదు పాటలు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
టుడేస్ లీడర్: రోజా హ్యాట్రిక్! వన్స్ మోర్ జగన్
ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ దూరం.. బాబు కుట్రకు పురంధేశ్వరి బలి
టీ20 వరల్డ్కప్కు నేపాల్ జట్టు ప్రకటన..
ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్
చిన్న విషయానికి చిల్లర గొడవ.. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
వీళ్లే మన ఏలూరు అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి..
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి నా విజ్ఞప్తి: సీఎం జగన్
కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
గెలుపు ధీమా.. జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement