-
డర్టీ ఫెలో రెడీ
శాంతి చంద్ర హీరోగా, దీపికా సింగ్, ‘మిస్ ఇండియా 2022’ సిమ్రితి హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహించిన చిత్రం ‘డర్టీ ఫెలో’. గూడూరు భద్రకాళీ సమర్పణలో జీయస్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఈ 24న రిలీజ్కి రెడీ అయింది. ఈ సినిమా ట్రైలర్ని ‘బింబిసార’ మూవీ ఫేమ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘డర్టీ ఫెలో’ ట్రైలర్ బాగుంది.ఈ సినిమా విజయం సాధించి, యూనిట్కి మంచి పేరు రావాలి’’ అన్నారు. శాంతి చంద్ర, మూర్తి సాయి ఆడారి మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘డర్టీ ఫెలో’. మా సినిమాలోని అన్ని పాటలకు మంచి స్పందన వచ్చింది. మా చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామకృష్ణ .యస్, సంగీతం: డా. సతీష్ కుమార్ .పి. -
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన త్రిష కనిపంచనుంది. వీరిద్దరు గతంలో స్టాలిన్ చిత్రంలో జంటగా నటించారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీలో మరో సీనియర్ నటిని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం.విశ్వంభరలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటి కోసం దర్శకుడు వశిష్ట సంప్రదించినట్లు సమాచారం. ఈ పాత్ర కోసం ముందుగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విజయశాంతిని సంప్రదించారట. కానీ ఆమె నో చెప్పినట్లు టాక్. అయితే అదే పాత్ర కోసం మరో సీనియర్ నటి ఖుష్బూని సంపద్రించగా కథ నచ్చడంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో స్టాలిన్ చిత్రంలో కూడా ఖుష్బు నటించారు. మరోవైపు ఈ చిత్రంలో త్రిష ద్విపాత్రాభినయం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ చిత్రంలో త్రిషతో పాటు సురభి, ఇషా చావ్లా కూడా నటిస్తున్నారు. వచ్చే సంక్రాతి పండుగ కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్పై దాదాపు రూ.200కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇదే నిజమైతే చిరంజీవి కెరీర్లో ఇది భారీ బడ్జెట్ చిత్రంగా నిలుస్తుంది. ఇందులో త్రిషతో పాటు సురభి, ఇషా చావ్లా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే సంక్రాతి పండుగ కానుకగా జనవరి 10న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు. -
అజిత్ కి షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
స్టార్ హీరోయిన్ త్రిష.. కెరీర్లో ఎన్నడూ లేనంత బిజీగా ఉన్నారు. 40 ఏళ్ల వయసులోనూ ఈమె నటిస్తున్న సినిమాలన్నీ సూపర్ స్టార్స్తోనే కావడం శేషం. అన్ని భాషల్లోనూ ఏక కాలంలో నటించేస్తున్నారు. ప్రస్తుతం అజిత్ 'విడామయూర్చి', కమల్ హాసన్ 'థగ్ లైఫ్', చిరంజీవి 'విశ్వంభర', మోహన్ లాల్ 'రామ్' చిత్రాల్లో త్రిషనే హీరోయిన్.(ఇదీ చదవండి: నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్కు, నా భర్తకు ఆల్రెడీ బ్రేకప్!)కాగా అజిత్ 'విడా మయూర్చి' షూటింగ్ లేట్ అవుతూ వస్తోంది. దీంతో ఈ సినిమాకు కేటాయించిన డేట్స్ని విశ్వంభర, థగ్ లైఫ్ చిత్రాలకు ఉపయోగించేస్తోంది. దీంతో 'విడామయర్చి' చిత్రానికి షాక్ తగిలినట్లయింది. అయితే ఇదంతా దర్శకుడు మణిరత్నం చేసిన పని అనుకోవచ్చు.. ఎందుకంటే 'పొన్నియన్ సెల్వన్'లో కుందవై పాత్ర ఇచ్చి త్రిషకి మళ్లీ లైఫ్ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు ఈమె ఊపిరిసలపనంత బిజీగా మారిపోయింది. టైమ్ అంటే ఇదే మరి.(ఇదీ చదవండి: నా మాజీ భర్త గే.. అతడి గదిలో రాత్రి ధనుష్కు ఏం పని? సుచిత్ర సంచలన వ్యాఖ్యలు) -
చిరంజీవి సినిమాను రిజెక్ట్ చేసిన విజయశాంతి?
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ పెయిర్లో చిరంజీవి-విజయశాంతి జంట ఒకటి. స్వయంకృషి, అత్తకు యముడు అమ్మయికి మొగుడు, కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్.. ఇలా దాదాపు 19 సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించారు. పలు సినిమాల్లోనూ పోటాపోటిగా అన్నట్లుగా స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన చివరి చిత్రం మెకానిక్ అల్లుడు(1994). ఇది బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఆ తర్వాత హిట్ పెయిర్కి మళ్లీ కలిసి నటించే అవకాశం రాలేదు. ఇద్దరు రాజకీయాల్లో బిజీ కావడంతో.. ఇండస్ట్రీకే గ్యాప్ ఇచ్చారు. చాలా ఏళ్లవరకు వీరిద్దరి మధ్య మాటలు కూడా లేవు.ఇద్దరి పార్టీలు వేరు వేరు కావడంతో అభిప్రాయ భేదాలు ఏర్పడి.. ఒకరినొకరు కలుసుకోలేకపోయారు. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో మాత్రం ఇద్దరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. స్టేజ్పై పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరు కలుసుకున్న దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరిపై ఓ క్రేజీ రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. చిరంజీవి నడిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’లో విజయశాంతి కీలక పాత్ర పోషించబోతుందని ఆ వార్త సారాంశం. జస్ట్ రూమరేనా?విశ్వంభరలో ఓ కీలక పాత్ర కోసం విజయశాంతిని టీమ్ సంప్రదించిన మాట వాస్తమేనట. కానీ రాములమ్మ మాత్రం ఆ ఆఫర్ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఎన్నో సినిమాల్లో మెగాస్టార్కి జోడిగా నటించిన తాను.. ఇప్పుడు మళ్లీ ఆయన సినిమాలోనే వేరే పాత్రలో కనిపించడం ఇష్టం లేదని చెప్పిందట. తమ జంటపై ప్రేక్షకుల మదిలో పడిన ముద్రను చెడగొట్టొదని.. అది అలానే ఉండాలనే ఈ పాత్ర చేయడం లేదని విజయశాంతి చెప్పారట. విజయశాంతి నటించడం కష్టమేవిజయశాంతి మళ్లీ సినిమాల్లో నటించడం ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చు. ఆమెకు కూడా నటించాలనే ఇంట్రెస్ట్ లేదు. పాత్ర నచ్చడంతో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించింది. అదే సమయంలో మళ్లీ తాను తిరిగి సినిమాల్లో నటించనని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం విజయశాంతి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పొలిటికల్గా మరింత ఎదగడానికి ఆమెకు ఇదే మంచి సమయం. ఇలాంటి టైంలో మళ్లీ సినిమాల్లో నటించడం కష్టమే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
నెట్టింట ఒక్కఫోటో వైరల్.. ఆందోళనలో మెగా ఫ్యాన్స్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. మల్లిడి వశిష్ఠ డైరెక్షన్లో భారీ బడ్జెట్లో సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతుంది. గత కొద్దిరోజులుగా ముచ్చింతల్ షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన కొందరు దర్శకులు 'విశ్వంభర' సెట్స్కు వెళ్లి మెగాస్టార్ను కలిసిన విషయం తెలిసిందే. చిరంజీవిని కలిసిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో దర్శకుడు మెహర్ రమేష్, చిరంజీవి కలిసి ఒకే ఫ్రేమ్లో పోజులిచ్చిన ఫోటో భారీగా వైరల్ అవుతుంది. వాటిని చూసిన మెగా ఫ్యాన్స్ ఇప్పుడు చాలా ఆందోళన చెందుతున్నారు. మెహర్ రమేష్కి చిరంజీవి మరో సినిమా అవకాశం ఇస్తున్నారా అంటూ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. గతంలో సినిమా అవకాశాలు లేని మెహర్ రమేష్కు భోళా శంకర్ ఛాన్స్ ఇచ్చారు చిరంజీవి.. గోల్డెన్ లాంటి ఛాన్స్ను ఆయన కరెక్ట్గా ఉపయోగించుకోలేకపోయారనే అపవాదు ఉంది. (ఇదీ చదవండి: ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన 'రాధికా ఆప్టే' బోల్డ్ సినిమా) బాక్సాఫీస్ వద్ద భోళా శంకర్ దారుణమైన పరాజయాన్ని అందుకుంది. దీంతో మెహర్ రమేష్పై భారీగా ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఆయన మీడియాకు కూడా కొంత కాలం దూరంగానే ఉన్నారు. చాలా రోజుల తర్వాత మళ్లీ మెగాస్టార్ను కలవడంతో నెట్టింట భోళా టాపిక్ మరోసారి వైరల్ అవుతుంది. ఎట్టిపరిస్థితిలో మెహర్ రమేష్కు మరో ఛాన్స్ ఇవ్వోద్దంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మెగాస్టార్ను ఎందుకు కలిశారంటే మే 4న తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ డే ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఒక కార్యక్రమాన్ని వారు నిర్వహించనున్నారు. ఈ వేడుకకు రావాల్సిందిగా అసోసియేషన్ ప్రతినిధులు చిరంజీవికి ఆహ్వానం అందించారు. అనుదీప్ కేవీ, మెహర్ రమేశ్, సాయి రాజేశ్, శ్రీరామ్ ఆదిత్యతోపాటు పలువురు దర్శకులు చిరంజీవిని కలిసిన వారిలో ఉన్నారు. విశ్వంభర సెట్స్లో వారు కలవడంతో ఆ స్టిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: కిడ్నాప్ కేసులో 'మైత్రీ మూవీ మేకర్స్' అధినేత నవీన్ యర్నేని) -
Sankranthi 2025: కర్చీఫ్ మడతపెట్టి...!
సంక్రాంతికి ‘కుర్చీని మడతపెటి...’ అంటూ ‘గుంటూరు కారం’లో మహేశ్బాబు చేసిన సందడి ఇంకా వినబడుతోంది. పండగ వెళ్లి మూడు నెలలు కూడా కాకముందే వచ్చే సంక్రాంతి కోసం కర్చీఫ్ మడతపెట్టి, పండగ బరిలో సీట్ రిజర్వ్ చేసుకున్నారు కొందరు స్టార్స్. అయితే సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రకటనలు రావడం, చివరి నిమిషంలో కొన్ని సినిమాలు తప్పుకోవడం మామూలే. ఇక 2025 సంక్రాంతి రేసులో ఇప్పటివరకూ షురూ అయిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. విశ్వంభర వస్తున్నాడు సంక్రాంతికి పండక్కి చాలా హిట్స్ సాధించారు చిరంజీవి. 2023లో ‘వాల్తేరు వీరయ్య’తో సంక్రాంతికి వచ్చి మరో హిట్ను ఖాతాలో వేసుకున్నారు. మళ్లీ 2025లో ‘విశ్వంభర’ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. జనవరి 10న రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్లో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా గోదావరి బ్యాక్డ్రాప్లో ఉంటుందని, భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపిస్తారనీ టాక్. అలాగే ఈ చిత్రంలో చిరంజీవిది హనుమంతుడి భక్తుడి పాత్ర అట. భార్య.. మాజీ ప్రేయసి.. మధ్యలో మాజీ పోలీసాఫీసర్ ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేశ్ ‘సైంధవ్’ రిలీజైంది. వచ్చే సంక్రాంతికి కూడా రానున్నారు. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వెంకటేశ్. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఓ మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, అతని మాజీ ప్రేయసి.. ఇలా ఈ మూడు పాత్రల చుట్టూ సాగే క్రైమ్ కామెడీ మూవీ ఇది. ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ చిత్రాల నిర్మాత ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. 2017లో శర్వానంద్ హీరోగా నటించిన ‘శతమానం భవతి’ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘శతమానం భవతి పేజీ 2’ ఉందని, 2025 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ‘దిల్’ రాజు ప్రకటించారు. ఇప్పుడు వెంకటేశ్–అనిల్ రావిపూడిల కాంబినేషన్లోని సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. మళ్లీ బంగార్రాజు వస్తాడా? ‘నా సామిరంగ’ అంటూ ఈ ఏడాది సంక్రాంతికి హిట్ సాధించారు నాగార్జున. ఈ సినిమా సక్సెస్మీట్లో ‘సంక్రాంతికి కలుద్దాం’ అన్నారు నాగార్జున. సో.. 2025 సంక్రాంతికి కూడా నాగార్జున ఓ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారని ఊహించవచ్చు. 2016 సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’, 2022 సంక్రాంతికి ‘బంగార్రాజు’ (‘సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్) సినిమాలతో హిట్స్ అందుకున్నారు నాగార్జున. సో.. 2025 సంక్రాంతికి ‘బంగార్రాజు 3’ని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా? అనే ఆలోచనలో ఉన్నారట. మరి.. నాగార్జున ఏ సినిమాను రిలీజ్ చేస్తారు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. లక్మణ్ భేరి రెడీ రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి, చివరి నిమిషంలో ఇండస్ట్రీ మేలు కోసం అంటూ వాయిదా పడింది. ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజైంది. ఈసారి పక్కాగా సంక్రాంతికి రావాలనుకుంటున్నారు రవితేజ. అందుకే తన కెరీర్లోని 75వ చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రచయిత భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ సినిమాలో లక్మణ్ భేరి పాత్రలో కనిపిస్తారు రవితేజ. తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా సాగుతుందని టాక్. మరోవైపు 2021 సంక్రాంతికి ‘క్రాక్’ సినిమాతో వచ్చి రవితేజ హిట్ సాధించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇంకా... ప్రభాస్ హీరోగా నటిస్తున్న‘రాజా సాబ్’ 2025 సంక్రాంతికి వచ్చే చాన్స్ ఉందని ఇటీవల పేర్కొన్నారు ఈ చిత్రనిర్మాత టీజీ విశ్వప్రసాద్. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్పై మరోసారి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఈ ఏడాది సంక్రాంతికి తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ మంచి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఇకపై ప్రతి సంక్రాంతికి ఓ సినిమా వస్తుందని పేర్కొన్నారు ప్రశాంత్ వర్మ. మరి.. వచ్చే సంక్రాంతికి ప్రశాంత్ నుంచి వచ్చే సినిమాపై ఇంకా ప్రకటన రాలేదు. ఇలా సంక్రాంతి బరిలో నిలిచే చిత్రాలు మరికొన్ని ఉన్నాయని తెలిసింది. సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో డబ్బింగ్ చిత్రాలు ఉంటుంటాయి. ఇలా అజిత్ హీరోగా నటించనున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సంక్రాంతి విడుదలకు ఖరారైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. అలాగే సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందనున్న సినిమా కూడా 2025 సంక్రాంతికి విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. ఇంకా కన్నడ ఫిల్మ్ ‘కాంతార’కు ప్రీక్వెల్గా రూపొందుతున్న ‘కాంతార: ది లెజెండ్ చాప్టర్ 1’ చిత్రం కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుందనే వార్త వచ్చిన సంగతి తెలిసిందే. -
బాలీవుడ్ వైపు మళ్లీ ఎందుకు వెళ్లలేదంటే..: త్రిష
గత రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయకిగా బహుభాషల్లో రాణిస్తున్న నటి త్రిష. నాలుగు పదుల వయసులోనూ క్రేజీ కథానాయకిగా వెలుగొందడం సాధారణ విషయం కాదు. ఒక దశలో ఈమె నటించిన హీరోయిన్ ఓరియన్టెడ్ కథా చిత్రాలు నిరాశపరచడంతో త్రిష పని అయ్యిపోయింది. తట్టా బుట్టా సర్దుకోవాల్సిసిందే అనే కామెంట్స్ వచ్చాయి. అయితే పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో త్రిష సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టారు. ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో,అదీ అగ్రహీరోల సరసన నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా కొందరు ప్రముఖ హీరోయిన్ల మాదిరిగానే త్రిష కూడా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. అక్కడ 'కట్టా మిఠా' అనే చిత్రంలో నటించారు. అయితే అదే ఆమె నటించిన తొలి, చివరి చిత్రంగా మారింది. ఇటీవల ఒక భేటీలో తొలి హిందీ చిత్రం ప్లాప్ కావడంతో బాలీవుడ్లో అవకాశాలు రాలేదా? అన్న ప్రశ్నకు త్రిష బదులిస్తూ తాను 2010లో కట్టా మిఠా చిత్రంతో బాలీవుడ్లోకి ఎంటర్ అయ్యానన్నారు. అక్షయ్కుమార్ హీరోగా నటించిన ఆ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకుడని చెప్పారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందన్నారు. దీంతో బాలీవుడ్లో నటించిన తొలి చిత్రం ప్లాప్ కావడంతో అవకాశాలు రాలేదని, తాను బాలీవుడ్ నుంచి వైదొలగినట్లు ప్రచారం జరిగిందన్నారు. వాస్తవానికి తాను తన కుటుంబాన్ని ముంబాయికి మార్చడానికి సిద్ధంగా లేనన్నారు. బాలీవుడ్కు వెళ్లాలంటే దక్షిణాదిలో చాలా మందిని వదులుకోవాలన్నారు. అలాగే బాలీవుడ్లో తన కెరీర్ను మళ్లీ కొత్తగా మొదలెట్టాల్సి ఉంటుందన్నారు. అంత ఆసక్తి తనకు అప్పట్లో లేదన్నారు. అందుకే హిందీ చిత్రాల్లో కంటిన్యూగా నటించలేదని త్రిష స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ అజిత్ సరసన విడాముయర్చి, కమలహాసన్కు జంటగా థగ్ లైఫ్ చిత్రాలతో పాటు తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. -
భాగ్యనగరంలో ‘విశ్వంభర’ పూర్తి
చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ‘బింబిసార’ చిత్రంతో బ్లాక్బస్టర్ అందుకున్న వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘స్టాలిన్’ (2006) వంటి హిట్ మూవీలో జోడీగా నటించిన చిరంజీవి–త్రిష ‘విశ్వంభర’ మూవీ కోసం రెండోసారి కలిశారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల హైదరాబాద్లో మొదలైన ‘విశ్వంభర’ షెడ్యూల్ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. చిరంజీవి, త్రిషతో పాటు ప్రధాన తారాగణం పాల్గొన్న ఈ షెడ్యూల్లో కొంత టాకీ పార్ట్, ఓ పాట, యాక్షన్ బ్లాక్ని చిత్రీకరించినట్లు యూనిట్ పేర్కొంది. ‘‘ఫ్యాంటసీ అడ్వెంచర్గా రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ మూవీ ఉంటుంది. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉంటే.. చిరంజీవి నివాసంలో చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో సహా యూనిట్తో దిగిన ఫొటోలను త్రిష సోషల్ మీడియాలో షేర్ చేసి, ‘ఇదొక లెజెండరీ, అద్భుతమైన రోజు! విశ్వంభర’ అని పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి కెమెరా: ఛోటా కె. నాయుడు, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: కార్తీక్ శబరీష్, లైన్ప్రోడ్యూసర్: రామిరెడ్డి శ్రీధర్ రెడ్డి. -
చిరంజీవి 'టెన్త్ సర్టిఫికెట్' వైరల్.. మెగాస్టార్ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది?
కొణిదెల శివశంకర వరప్రసాద్.. మెగాస్టార్ చిరంజీవిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఫిబ్రవరి 11, 1978లో పునాదిరాళ్ళు చిత్రంతో 'చిరు' జల్లులా వచ్చి 'తుపాన్'లా మారారు చిరంజీవి. ఇండస్ట్రీలో చిరు స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. 'స్వయంకృషి'తో ఎదిగిన నటుడిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు వుంది. నాలుగు దశాబ్దాలకు పైగా బాక్సాఫీస్ను శాసిస్తున్న ఆయనకు ఫ్యాన్స్ కూడా అనేకం. తాజాగా ఆయన పదో తరగతికి సంబంధించిన సర్టిఫికెట్ ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. చిరంజీవి 1955 ఆగష్టు 22 న పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించిన చిరంజీవి.. 10వ తరగతి సర్టిఫికేట్ తాలూకు ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సర్టిఫికెట్లో మెగాస్టార్ చిరంజీవి పేరు కేఎస్ఎస్ వరప్రసాద్ రావు అని ఉంది. ఆయన తండ్రి పేరు వెంకట్ రావు అని ఉంది. కానీ ఇందులో చిరంజీవి పెనుగొండలో పుట్టినట్లు పేర్కొనడం జరిగింది. అందులోని పాఠశాల వివరాలు మొగల్తూరుకు సంబంధించినవిగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆయన ఫ్యాన్స్ కూడా తెగ షేర్ చేస్తున్నారు. కానీ ఈ సర్టిఫికెట్ చిరంజీవికి సంబంధించినదేనా అని సందేహాలు కొందరిలో ఉన్నాయి. ఈ అంశం గురించి మెగాస్టార్ తన ఎక్స్ పేజీలో చెప్పాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు. చిరంజీవి తండ్రి పోలీస్ కానిస్టేబుల్ కావడంతో ఆయనకు ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండేది. చిరంజీవి బాల్యంలో కొంతకాలం తాతయ్య దగ్గర ఉన్నారు. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. విద్యార్థి దశలో చిరంజీవి ఎన్.సి.సిలో చేరి 1970వ దశకంలో న్యూఢిల్లీలో జరిగిన పెరేడ్లో పాల్గొన్నారు. చిన్నతనం నుంచి నటనమీద ఆసక్తి ఏర్పడింది. ఒంగోలులోని సి.ఎస్.ఆర్ శర్మ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.నరసాపురంలోని శ్రీ వై.ఎన్. కళాశాల నుంచి వాణిజ్య శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న తర్వాత 1976లో చెన్నై వెళ్లి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరాడు. 1978లో పునాదిరాళ్లు చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. -
సంక్రాంతి బరిలో ఏడో సినిమా.. వర్కౌట్ అయ్యే పనేనా?
మొన్నీమధ్యే సంక్రాంతి వెళ్లింది. నాలుగు సినిమాలొస్తే అందులో 'హనుమాన్' బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, విజేతగా నిలిచింది. అలానే వచ్చే ఏడాది పండక్కి ఇంకా చాలా టైముంది. కానీ ఇంతలోనే బాక్సాఫీస్ బరిలో అర డజనుకు పైగా చిత్రాలు కర్చీఫ్ వేసేస్తున్నాయి. తెలుగు హీరోలని పక్కనబెడితే తాజాగా తమిళ స్టార్ హీరోతో భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ సంస్థ పోటీలో పెట్టింది. ఇప్పుడు ఈ విషయం ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్గా మారింది. సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి మాములుగా ఉండదు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు స్టార్ హీరోలు తమ సినిమాలతో రెడీగా ఉంటారు. 2025 పండగ బరిలో చిరంజీవి 'విశ్వంభర' ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. బయటకు చెప్పనప్పటికీ.. ప్రభాస్ 'రాజా సాబ్', బాలకృష్ణ-బాబీ మూవీ, వెంకటేశ్-అనిల్ రావిపూడి సినిమా, నాగార్జున బంగార్రాజు ఫ్రాంచైజీ మూవీ, శతమానం భవతి సీక్వెల్ చిత్రాలు కూడా పండకే రావాలని గట్టిగా ఫిక్సయ్యాయి. (ఇదీ చదవండి: రాజమౌళి సలహా.. పద్ధతి మార్చుకున్నా: స్టార్ హీరోయిన్) ఇప్పుడు వీటికి పోటీగా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, తమిళ స్టార్ హీరో అజిత్ కాంబోలో తీయబోయే చిత్రం కూడా సంక్రాంతికే రానుంది. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టైటిల్ ఫిక్స్ చేశారు. అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. తమిళంలో ఈ సినిమా రిలీజ్కి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు గానీ తెలుగులోకి వచ్చేసరికి చిరుతో పోటీపడాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత సంఖ్య బట్టి చూస్తే దాదాపు ఏడు సినిమాల వరకు సంక్రాంతి బరిలో ఉన్నాయి. చివరకొచ్చేసరికి వీటిలో ఎన్ని నిలబడతాయ్? ఎన్ని తప్పుకొంటాయనేది చూడాలి? మరోవైపు అజిత్కి తెలుగులో ఫ్యాన్ బేస్ తక్కువే. దీంతో మైత్రీ-అజిత్ కాంబో తెలుగులో ఏ మేరకు వర్కౌట్ అవుతుందా అనేది సస్పెన్స్. (ఇదీ చదవండి: హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?) With Wholesome Humbleness herewith, we Announce the title of AK's Next Movie Called as #GoodBadUgly #AjithKumar @Adhikravi @ThisIsDSP @AbinandhanR @editorvijay @GoodBadUglyoffl@SureshChandraa @supremesundar#kaloianvodenicharov #Anuvardhan @valentino_suren@Donechannel… pic.twitter.com/EU4qKO5fEO — Mythri Movie Makers (@MythriOfficial) March 14, 2024 -
చిరుతో 'విశ్వంభర'.. త్రిష డబుల్ ధమాకా?
హీరోయిన్ త్రిష తెలుగు ప్రేక్షకు లకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. 2006లో విడుదలైన ‘స్టాలిన్’ సినిమా తర్వాత రెండోసారి ‘విశ్వంభర’ కోసం జోడీ కట్టారు చిరంజీవి–త్రిష. కొన్నేళ్ల తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్ చిత్రమిది. ఇందులోని గ్రాఫిక్స్ ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయని టాక్. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయంపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో త్రిష ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్. ఆమెపాత్రకు కథలో చాలాప్రాధాన్యం ఉందట.. అందుకే డబుల్ రోల్ చేస్తున్నారని భోగట్టా. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. యూవీ క్రియేషన్స్పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే. -
డ్యాన్సింగ్ మూడ్లో స్టార్ హీరోలు.. 1997 తర్వాత 'చిరు' మళ్లీ ఇలా
ఫ్యామిలీ సాంగ్ ఆనందోత్సాహలతో ఫ్యామిలీ పాట పాడుతున్నాడట ‘విశ్వంభర’. చెల్లెళ్లు, ప్రేయసితో కలిసి హాయిగా డ్యాన్స్ చేస్తున్నాడట. ఈ ఫ్యామిలీ సెలబ్రేషన్ సాంగ్కు కారణమైన హ్యాపీ మూమెంట్స్ ఏంటో ‘విశ్వంభర’ సినిమాలో చూడాలి. చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకుడు. ‘స్టాలిన్’ తర్వాత అంటే దాదాపు 18 ఏళ్ల తర్వాత ‘విశ్వంభర’ కోసం చిరంజీవితో జోడీ కట్టారు త్రిష. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర భీమవరం దొరబాబు అని, కథ రీత్యా దొరబాబుకు ఐదుగురు చెల్లెళ్లు ఉంటారనే ప్రచారం సాగుతోంది. చిరంజీవి చెల్లెళ్లుగా మీనాక్షీ చౌదరి, మృణాల్ ఠాకూర్, ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా, సురభి కనిపిస్తారని భోగట్టా. కాగా ‘విశ్వంభర’ తాజా షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. ముందుగా కొంత టాకీ పార్ట్ చిత్రీకరించారు. ఇటీవల ఫ్యామిలీ సాంగ్ చిత్రీకరణ ఆరంభించారని తెలిసింది. వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ అడ్వెంచరస్ ఫ్యాంటసీ ఫిల్మ్ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి స్వరకర్త. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘హిట్లర్’ (1997) సినిమాలో హీరో చిరంజీవికి ఐదుగురు చెల్లెళ్లు. ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇన్నేళ్లకు చిరంజీవి మళ్లీ ఐదుగురు చెల్లెళ్లతో ‘విశ్వంభర’ చేస్తున్నారు. రొమాంటిక్ కల్కి ఇటలీ బీచ్లో ప్రేమ పాట పాడుతున్నారు ప్రభాస్. ఈ రొమాంటిక్ పాట ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కోసం. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న మైథాలజీ అండ్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ఇది. ఇందులో దీపికా పదుకోన్, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, కమల్హాసన్ కీలక పాత్రధారులు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ ఇటలీలో ప్రారంభమైంది. ప్రభాస్, దిశా పటానీల మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్తో పాటు ఓ మెలోడీ లవ్ సాంగ్ను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ షెడ్యూల్తో ‘కల్కి 2898ఏడీ’ సినిమా మేజర్ చిత్రీకరణ పూర్తవుతుందని తెలిసింది. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. పుష్పరాజ్ పాట మంచి ఫైర్ మీద ఉన్నాడు పుష్పరాజ్. తన సత్తా ఏంటో పాట రూపంలో మరోసారి చెబుతున్నాడు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లోని ‘పుష్ప’ చిత్రంలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమాలో ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటూ ఓ మాస్ సాంగ్ ఉంటుంది. ఈ తరహా సాంగ్ ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్’లోనూ ఉందట. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ సాంగ్ను హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడి యోలో చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ పాటకు ప్రేమ్రక్షిత్ కొరియోగ్రఫీ చేస్తున్నారట. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటిన్నారు. తొలి భాగంలో శ్రీవల్లి పాత్రలో ప్రేయసిగా నటించిన హీరోయిన్ రష్మికా మందన్నా మలి భాగంలో భార్యగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఇలా ప్రస్తుతం సెట్స్లో పాటల చిత్రీకరణ జరుపుకుంటున్న మరికొన్ని సినిమాలు ఉన్నాయి. -
చిరంజీవి కొత్త సినిమాకు ఊహించని సమస్య?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. 'భోళా శంకర్' ఫ్లాప్తో చిరుపై గట్టి ఎఫెక్ట్ పడింది. దీంతో కొత్త మూవీ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. షూటింగ్ అంతా బాగానే నడుస్తోంది కానీ ఊహించని విధంగా ఓ సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయమే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి.. సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కానీ రేంజుకి తగ్గ హిట్ అయితే పడట్లేదు. 'వాల్తేరు వీరయ్య'గా గతేడాది సంక్రాంతికి సక్సెస్ అందుకున్నప్పటికీ.. 'భోళా శంకర్' వల్ల కథ మళ్లీ మొదటికే వచ్చింది. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే టార్గెట్తో 'విశ్వంభర' అనే సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నారు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. నెల తర్వాత బయటపెట్టింది) 'విశ్వంభర'లో హీరోయిన్గా త్రిష చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో చిరుకు ఏకంగా ఐదుగురు చెల్లెళ్లు ఉంటారని తెలుస్తోంది. ఇషా చావ్లా, సురభి, ఆషికా రంగనాథ్ తదితరులు ఈ పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు వీళ్లకు జోడీలుగా ఎవరిని తీసుకోవాలనే విషయంలో చిత్రబృందం తర్జనభర్జనా పడుతోందట. సుశాంత్, రాజ్ తరుణ్ లాంటి యంగ్ హీరోలు పలువురు పరిశీలనలో ఉన్నప్పటికీ ఫైనల్గా ఎవరు సెట్ అవుతారనేది చూడాలి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 'విశ్వంభర' సినిమాని థియేటర్లలోకి తీసుకురానున్నారు. అధికారికంగా ప్రకటించేశారు కూడా. కీరవాణి సంగీతమందిస్తుండగా.. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ రూ.150 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: సీక్రెట్గా టాలీవుడ్ లేడీ విలన్ నిశ్చితార్థం.. 14 ఏళ్ల ప్రేమకథ) -
విశ్వంభర సినిమాలో చిరంజీవి ఎప్పుడూ చేయని రోల్.
-
'విశ్వంభర'లో అడుగుపెట్టిన ఇద్దరు హీరోయిన్లు
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' చిత్రం షూటింగ్ వేగంగా ప్రారంభం అయింది. చాలారోజుల నుంచే ఈ చిత్రానికి సంబంధించిన పలు సీన్స్ చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ వశిష్ఠ. కొద్దిరోజుల క్రితమే ఈ బిగ్ ప్రాజెక్ట్లోకి మెగాస్టార్ చిరంజీవితో పాటు త్రిష కూడా అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన వీడియోను సోషల్మీడియాలో చిరు పోస్ట్ చేశారు. సుమారు పద్దెనిమిదేళ్ల తర్వాత వారిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. దీంతో ఇరువురి ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. 'విశ్వంభర'లో ఇషా చావ్లా, సురభి అవకాశాన్ని దక్కించుకున్నారు. వీరిద్దరిపై కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయిన సైలెంట్గా వీరిద్దరితో షూటింగ్ కూడా ప్రారంభించారనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ నెల 26 నుంచి హైదరాబాద్లో మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. అందులో త్రిషతో పాటు ఇషా చావ్లా, సురభి కూడా పాల్గొంటారని టాక్. ప్రేమ కావాలి,రంభా ఊర్వసి మేనక వంటి చిత్రాల్లో ఆమె హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. సినిమాలో వీరిద్దరి పాత్ర ఎంత పరిధి వరకు ఉంటుందో తెలియాల్సి ఉంది. ‘విశ్వంభర’ని సంక్రాంతి పండగకి జనవరి 10న విడుదల కానుంది. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్గా దీనిని వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. -
తండ్రి అయిన 'విశ్వంభర' డైరెక్టర్ వశిష్ఠ
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమాతో బిజీగా ఉన్నారు. ఒక్క సినిమా తీసిన అనుభవమున్న దర్శకుడు వశిష్ఠ.. దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హీరోయిన్ త్రిష గురించి రీసెంట్గానే అధికారిక ప్రకటన ఇచ్చారు. ఇలా అంతా సాఫీగా జరుగుతోంది. ఇలాంటి టైమ్లో ఓ గుడ్ న్యూస్ కూడా వినిపించింది. దర్శకుడు వశిష్ఠ తండ్రి అయ్యాడు. (ఇదీ చదవండి: అందుకే ఇన్నేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చాం: ఉపాసన) వశిష్ఠ అసలు పేరు వేణు. తండ్రి నిర్మాత కావడంతో 'ప్రేమలేఖ' అనే సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ ఒక్క చిత్రంతో ఇక నటనకు పుల్స్టాప్ పెట్టేశాడు. చాలా ఏళ్ల తర్వాత 'బింబిసార' అనే చిత్రంతో దర్శకుడిగా మారిపోయాడు. అద్భుతమైన సక్సెస్ అందుకున్న ఈ చిత్రం.. వశిష్ఠకు మెగా ఛాన్స్ వచ్చేలా చేసింది. ప్రస్తుతం చిరుతో 'విశ్వంభర' సినిమా చేస్తూ వశిష్ఠ బిజీగా ఉన్నాడు. మరోవైపు ఇతడి భార్య సుజాత ప్రెగ్నెన్సీ ఉంది. సోమవారం సాయంత్రం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఈ విషయం ఎవరూ బయటకు చెప్పలేదు. పాప పుట్టడం గురించి దర్శకుడు వశిష్ఠ అందరూ తెలియజేయాల్సి ఉంది. (ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కుర్రాడెవరో తెలుసా?) -
పద్దెనిమిది ఏళ్ల తర్వాత...
పద్దెనిమిదేళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు హీరో చిరంజీవి, హీరోయిన్ త్రిష. చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని ఓ హీరోయిన్ పాత్రలో త్రిష నటిస్తున్నట్లుగా యూనిట్ పేర్కొంది. ఈ సినిమా కోసం 13 సెట్లను నిర్మించారు మేకర్స్. ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన ఓ సెట్లో చిరంజీవి, త్రిషలపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, ఓ పాటను కూడా చిత్రీకరించే పనిలో ఉందట చిత్రబృందం. అలాగే ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి మరో హీరోయిన్గా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ‘విశ్వంభర’ని సంక్రాంతి పండగకి జనవరి 10న విడుదల కానుంది. ఇక 2006లో వచ్చిన ‘స్టాలిన్’ చిత్రం తర్వాత చిరంజీవి, త్రిష కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న చిత్రం ‘విశ్వంభర’యే కావడం విశేషం. -
'విశ్వంభర'లో అడుగు పెట్టిన టాప్ హీరోయిన్.. వీడియో వైరల్
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. చాలారోజుల నుంచే ఈ చిత్రానికి సంబంధించిన పలు సీన్స్ చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ వశిష్ఠ. తాజాగా ఈ బిగ్ ప్రాజెక్ట్లోకి మెగాస్టార్ చిరంజీవితో పాటు త్రిష కూడా అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన వీడియోను సోషల్మీడియాలో చిరు పోస్ట్ చేశారు. చాలా రోజుల నుంచి విశ్వంభర చిత్రంలో త్రిష నటించబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసింది. తాజాగా ఈ విషయంపై మెగాస్టార్ నుంచి ఇలా అధికారికంగా ప్రకటన రావడం జరిగింది. గతంలో వీరిద్దరూ స్టాలిన్ చిత్రంలో కనిపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని టాక్ వస్తుంది. ఇందులో అనుష్క, హనీ రోజ్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా త్రిష కూడా తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేసింది. '18 ఏళ్ల తర్వాత మెగాస్టార్తో మళ్లీ కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇదీ నాకు ఎంతో గొప్ప గౌరవం. చిరు సార్ నాకు హృదయపూర్వక స్వాగతం పలికినందుకు చాలా ధన్యవాదాలు.' అని తెలిపింది. సంక్రాంతి కానుకగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఎమ్ఎమ్ కీరవాణి అందిస్తున్నారు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విశ్వంభర విడుదల కానుంది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) What an honour it is to reunite with the one and only MEGASTAR after 18 years.Thank you so much for the warmest welcome Chiru sir❤️@KChiruTweets https://t.co/PSrJ4O7LEW — Trish (@trishtrashers) February 5, 2024 -
చిరంజీవి 'విశ్వంభర' విడుదల తేదీ ప్రకటన
-
విశ్వంభర డేట్ ఫిక్స్
సంక్రాంతి రిలీజ్ డేట్ను కన్ఫార్మ్ చేసుకున్నాడు ‘విశ్వంభర’. చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. గత ఏడాది నవంబరులో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. తొలుత చిరంజీవి పాత్రకు సంబంధించని సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా ‘విశ్వంభర’ సినిమా సెట్స్లో ఈ శుక్రవారం చిరంజీవి జాయిన్ అయినట్లుగా చిత్ర యూనిట్ పేర్కొని, ఈ సినిమాను జనవరి 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. హైదరబాద్లో వేసిన ఓ సెట్లో ప్రొడక్షన్ వర్క్ జరుగు తోందని కూడా చిత్రబృందం పేర్కొంది. -
చిరంజీవి 'విశ్వంభర' విడుదల తేదీ ప్రకటన
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' చిత్రం షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బింబిసారా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాని 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. తాజాగా విడుదల తేదీని కూడా ప్రకటించింది. 2025 జనవరి 10న విశ్వంభర వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఫ్యాంటసీ అడ్వెంచర్గా రూపొందుతోన్న ఈ మూవీ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో భారీ ఖర్చుతో ఓ సెట్ ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ సెట్ ఉంటుందని, అందుకోసం నిర్మాతలు కూడా భారీగా వెచ్చిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్. ఫిబ్రవరి 3 నుంచి మెగాస్టార్ షూటింగ్లో అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. యూవీ క్రియేషన్స్పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కీరవాణి అందిస్తుండగా కెమెరామెన్ఘా ఛోటా కె.నాయుడు ఉన్నారు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విశ్వవ్యాప్తంగా 'విశ్వంభర' విడుదల కానుంది. A LEGEND RISES 🔮🔥 MEGASTAR @KChiruTweets sets his foot into the mighty world of #Vishwambhara ❤🔥 Shoot in Progress. In cinemas 10th Jan 2025 🌠@DirVassishta @mmkeeravaani @boselyricist @NaiduChota @mayukhadithya @sreevibes @gavireddy_srinu @UV_Creations pic.twitter.com/Qrzvlsuv5b — UV Creations (@UV_Creations) February 2, 2024 -
గెటింగ్ రెడీ
‘విశ్వంభర’ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు హీరో చిరంజీవి. ఈ చిత్రంలో భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. కాగా ఈ పాత్రకు సంబంధించిన మేకోవర్ కోసం చిరంజీవి కసరత్తులు చేస్తున్నారు. ‘గెటింగ్ రెడీ ఫర్ విశ్వంభర’ అంటూ తన వర్కౌట్స్ వీడియోను షేర్ చేశారు చిరంజీవి. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకుడు. ఆల్రెడీ చిత్రీకరణ మొదలైంది. అయితే ముందు చిరంజీవి పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరించారు. హైదరాబాద్లోని ఓ స్టూడియోలో వేసిన సెట్స్లో ఈ నెల నుంచి ‘విశ్వంభర’ షూటింగ్లో చిరంజీవి పాల్గొంటారని తెలిసింది. ఇక ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎమ్ఎమ్ కీరవాణి, కెమెరా: చోటా కే నాయుడు. -
విశ్వంభర కోసం మెగాస్టార్ కసరత్తులు..
-
విశ్వంభర కోసం మెగాస్టార్ కసరత్తులు.. అదిరిపోయిన వీడియో
కొత్త ఏడాదిలో పద్మవిభూషణ్ అవార్డు దక్కడంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యులే కాకుండా ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ జోష్ ఇంతటితో ఆగేలా లేదు.. ఆయన నటిస్తున్న 156వ చిత్రం 'విశ్వంభర' కోసం రంగంలోకి దిగేందుకు రెడీ అయిపోయారు చిరు. యు.వి.క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విశ్వంభర రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమైంది కానీ చిరంజీవి ఇంకా సెట్స్లోకి అడుగు పెట్టలేదు. తాజాగా ఈ చిత్రం కోసం ఆయన జిమ్లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. అందులో చివరగా రెడీ ఫర్ విశ్వంభర అంటూ ఫుల్ జోష్లో చెప్పారు. దీంతో మెగాస్టార్ విశ్వంభర సెట్స్లోకి అడుగు పెట్టే సమయం వచ్చేసింది. ఈ వారంలోనే కొత్త షెడ్యూల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకోసం ప్రస్తుతం హైదరాబాద్లో ఓ భారీ సెట్ను కూడా మేకర్స్ ఏర్పాటు చేశారు. 68 ఏళ్ల వయసులో కూడా జిమ్లో మెగాస్టార్ ఒక రేంజ్లో కష్టపడుతున్నారు. యంగ్స్టర్స్కు ఏ మాత్రం తగ్గకుండా ఆయన కసరత్తులు చేస్తున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఎంతో ఆశ్చర్యపోతున్నారు. సినిమా కోసం ఆయన ఎంతగానో కమిట్మెంట్గా పనిచేస్తారని పేరు ఉంది. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడని ఇండస్ట్రీలో ఎందరో చెబుతుంటారు. చిరంజీవి దీంట్లో భీమవరం దొరబాబుగా కనిపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. 2025 సంక్రాంతికి విశ్వంభర విడుదల కానుంది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
హనీమూన్ ఎక్స్ప్రెస్: 'క్యూట్గా స్వీట్గా' సాంగ్ వచ్చేసింది..
విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు
ఇంటర్ కూడా ఇక్కడే..
శృంగార వల్లభునికి రూ.4.04 లక్షల ఆదాయం
ఇంటర్ సప్లిమెంటరీకి రెడీ
అన్నదాత కన్నీరు తుడిచేలా..
No Headline
గ్రూప్–2 మెయిన్ పరీక్షకు ఉచిత శిక్షణ
ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు
బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
తప్పక చదవండి
- బీజేపీ ఎంపీ- ఆప్ ఎమ్మెల్యే వాగ్వాదం.. వీడియో వైరల్!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- పోలింగ్ వేళ జమ్ములో కాల్పుల కలకలం
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement