-
‘ఉజ్వల’ ఫలాలు అందట్లేదు
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంత పేద ప్రజలను ఎల్పీజీ సిలిండర్ల వాడకం వైపు మొగ్గేలా చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎమ్యూవై) కార్యక్రమ ఫలాలు పూర్తి స్థాయిలో అందడం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఉజ్వల పథకం కింద ప్రజలను సిలిండర్లను కొనేలా చేయగలిగినా.. వాటిని పూర్తిగా వినియోగించేలా చేయడంలో యంత్రాంగం విఫలమైనట్లు తేలింది. పథకం కింద కేంద్రం పేద మహిళలకు సబ్సిడీతో ఎల్పీజీ సిలిండర్లిస్తో్తంది. పథకం ప్రారంభమైన తొలి 40 నెలల్లో 8 కోట్ల మందికి పైగా ఎల్పీజీ సిలిండర్లను తీసుకున్నట్లు అధ్యయ నం పేర్కొంది. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా వర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనంచేశారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కట్టె పొయ్యిలనే వాడుతున్నారనీ, వంటకు ఎల్పీజీని మాత్రమే వాడితేనే సత్ఫలితాలు అందుతాయని అభిప్రాయపడ్డారు. -
గ్రామాల్లో మంత్రి లోకేశ్ అనుచరుల వీడియోలు
ఆలమూరు (కొత్తపేట): డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్ము పేరిట గ్రామాల్లో కొంతమంది యువకులు శనివారం ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. వారిని ప్రశ్నిస్తే మంత్రి నారా లోకేశ్ అనుచరులమని, గ్రామాల్లో వీడియో తీసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు పంపించారని చెబుతున్నారు. పెదపళ్ల, చింతలూరు గ్రామాల్లో వేర్వేరు వాహనాల్లో నలుగురు యువకులు వచ్చారు. పెదపళ్లలో మండల పరిషత్ ప్రత్యేక పాఠశాల ఆవరణ, చింతలూరులో శ్రీ నూకాంబికా ఆలయం ప్రవేశ మార్గం వద్ద వారు వీడియో తీశారు. ప్రభుత్వ పథకాలపై అభిప్రాయాలను అక్కడ మహిళల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారి వద్ద ఉన్న పుస్తకాల్లో టీడీపీకి చెందిన కొందరి నేతలు ఫొటోలు ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వారి ఫిర్యాదుతో వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి నామాల శ్రీనివాస్ వారిని నిలదీస్తే పొంతన లేని సమాధానాలిచ్చారు. అమరావతికి చెందిన యువకుడు సందీప్ వీడియోలు తీయాలని పంపాడని ఆ యువకులు తెలిపారు. పెదపళ్లలో దొంగచాటుగా వీడియోలు తీస్తున్న ఇద్దరు యువకులను ఎంపీటీసీ ఏడిద మెహర్ప్రసాద్ అడ్డుకున్నారు. వారిపై మండల కోడ్ ఆఫ్ కాండక్టు (ఎంసీసీ) బృందానికి ఫిర్యాదు చేయడంతో వారు సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఆ రెండు గ్రామాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా వీడియోలు తీస్తున్న నలుగురు యువకులను ఎంపీడీఓ టీవీ సురేందర్రెడ్డి, ఎస్సై టి.క్రాంతికుమార్ పోలీసుస్టేషన్కు తరలించారు. అయితే ఎంసీసీ బృందం సభ్యులు మాత్రం వీరి వద్ద పార్టీ జెండాలు లేకపోవడం వల్ల వెంటనే కేసులు నమోదు చేయలేమని చెప్పడం విమర్శలకు తావిచ్చింది. దీనిపై వైఎస్సార్ సీపీ నేత శ్రీనివాస్ నియోజకవర్గ ఆర్ఓకు, ఎంసీసీ బృందానికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేయకుంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నాయకులు మోరంపూడి వాసు, పెద్దింటి కాశీ, మార్గాని యేసు తదితరులు పాల్గొన్నారు. -
వెంకటాయపాలెంలో దాహం కేకలు
సాక్షి, వెంకటాయపాలెం(నూజివీడు): మండలంలోని వెంకటాయపాలెంలో ఓసీ ఏరియాలో మంచినీటి సమస్య నెలకొనడంతో స్థానికులు దాహం కేకలు వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతుండటంతో మంచినీటి కష్టాలు మరింతగా పెరిగాయి. పంచాయతీ బోరుకు ఏర్పాటు చేసిన విద్యుత్ మోటర్ కాలిపోయి నెలరోజులు గడిచినప్పటికీ మరమ్మతులు చేయించలేదంటే అధికారుల తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. దీంతో స్థానికులు మంచినీళ్ల కోసం, వాడుకోవడానికి వ్యవసాయ బోర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్యను ఎన్నిసార్లు పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ ప్రత్యేకాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దాదాపు 50 గృహాల వారికి నీళ్లు లేక అల్లాడుతున్నారు. ఎస్సీ ఏరియాలో ఉన్న రక్షిత మంచినీటి ట్యాంక్ నుంచి నీళ్లు వస్తున్నప్పటికీ అరకొరగా మాత్రమే వస్తున్నాయని, ఆ నీరు తాగడానికి పనికిరావని మహిళలు పేర్కొంటున్నారు. వేసవి ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందుముందు తాము ఎదుర్కొనే ఇబ్బందులను ఇంకేమీ పట్టించుకుంటారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. నెలరోజుల క్రితం మోటర్లో వైరింగ్ కాలిపోవడంతో మరమ్మతుల కోసమని తీసుకెళ్లారే గాని ఇంత వరకు తిరిగి ఏర్పాటు చేయకపోవడం దారుణం. మరమ్మతులు అయ్యే వరకు నీళ్లు లేకుండా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేక పాలన అయినప్పటికీ పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేకాధికారి, ఎంపీడీవో సమస్యను పరిష్కరించలేకపోతున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా త్వరితగతిన బోరుకు మోటర్ను బిగించేలా చూడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. తాగడానికి నీళ్లు లేవు నెలరోజుల నుంచి తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. మోటర్ కాలిపోయి నెలరోజులు అయినా ఇంత వరకు ఏర్పాటు చేయలేదు. వేసవి వచ్చిన నేపథ్యంలో నీటి ఇబ్బందులు లేకుండా చూడాలి – పూజారి సుజాత, వెంకటాయపాలెం అధికారులు పట్టించుకోవడం లేదు నెలరోజులుగా నీటి సమస్య ఉంటే అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అసలు గ్రామానికి వస్తున్నారో, రావడం లేదో కూడా తెలియడం లేదు. ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఉంటే గ్రామస్తులు ఎలా బతకాలో అధికారులే చెప్పాలి. – షేక్ ఆషా, వెంకటాయపాలెం -
నడవాలంటే నరకమే..
వీణవంక(హుజూరాబాద్): అడుగు తీసి అడుగు వేద్దామంటే కంకరరాళ్లు ఎక్కడ గుచ్చుకుంటాయోననే భయం... చీకటి పడితే రోడ్డు మధ్యనున్న విద్యుత్ స్తంభాలకు తాకుతామేమో అనే ఆందోళన... వాహనాలు వెళ్తుంటే అంతెత్తు లేస్తున్న దుమ్ము ఊపిరాడకుండా చేస్తోంది. దీంతో గత ఆరు నెలలుగా వీణవంక – జమ్మికుంట రహదారిపై నడిచే వాహనదారులకు నకరం నిత్యం నరకం కనిపిస్తోంది. ప్రయాణికుల అష్టకష్టాలు.. వీణవంక–జమ్మికుంట ఫోర్లైన్ రోడ్డు పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. ప్రయాణికుల సౌలభ్యం కోసం చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. పనులు ప్రారంభించి ఏడాది గడిచినా ఇంకా సా..గుతూనే ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండే రహదారి వెంట వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. రూ.33 కోట్లతో నిర్మాణం.. సంవత్సరం క్రితం వీణవంక–జమ్మికుంట మధ్య 12.5 కిలోమీటర్ల ఫోర్లైన్ రోడ్డు కోసం రూ.33 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్ మొదట వల్భాపూర్–నర్సింగాపూర్ గ్రామాల మధ్య పనులు ప్రారంభించారు. ఆరు నెలల క్రితం కంకరపోసి వదిలేశారు. తర్వాత వల్భా పూర్ నుంచి జగ్గయ్యపల్లి మధ్య కొంతదూరం వరకు కంకరపోసి పోశారు. మిగతా మట్టిపోసి అంతటితో వదిలేశాడు. దీంతో వాహనదారులు దుమ్ముతో పాటు కంకరతో నరకయాతన పడుతున్నారు. కంకరపై వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు... పాత కల్వర్టుల స్థానంలో కొత్త కల్వర్టులు నిర్మించారు. రోడ్డు వెడల్పు కావడంతో రోడ్డును ఆనుకొని వ్యవసాయ బావులు ఉన్నాయి. ప్రమాదకర వ్యవసాయ బావుల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. వల్భాపూర్– రంగమ్మపల్లి గ్రామాల మధ్య విద్యుత్ స్తంభాలు రోడ్డుకు అడ్డంగా అతి ప్రమాదకరంగా ఉన్నాయి. రాత్రి సమయంలో స్తంభాలు కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత శనివారం రాత్రి ఓ యువకుడు బైక్పై జమ్మికుంటకు వెళ్తుండగా చీకట్లో స్తంభాన్ని ఢీకొనడంతో గాయాలయ్యాయి. విద్యుత్ స్తంభాల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. దుమ్ము ధూళితో సతమతం.. జగ్గయ్యపల్లి– నర్సింగాపూర్ గ్రామాల మధ్య దుమ్ము విపరీతంగా లేస్తోంది. రోడ్డుపై నీటిని సక్రమంగా చల్లించకపోవడంతో దుమ్ములేచి ఇబ్బందులు పడుతున్నారు. ఈ రూట్లో నిత్యం ఆర్టీసీ బస్సులు 16 ట్రిప్పులు నడుస్తుంటాయి. వందలాది ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాలు తిరుగుతుంటాయి. కంకర జారడం వల్ల ప్రమాదాలు జరగడంతో పాటు వాహనాల టైర్లు త్వరగా చెడిపోతున్నాయని ప్రయాణికులు పేర్కొంటున్నారు. బిల్లు మంజూరులో జాప్యం వల్లేనా? పోర్లైన్ రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్కు జరుగుతున్న పనులకు సకాలంలో బిల్లులు రావడం లేదని సమాచారం. దీంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇంకా మూడు నెలల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా.. పనులు అడుగు కూడా ముందుకు కదలకపోవడం గమనార్హం. ఇదే పరిస్థితి కొనసాగితే పనులు పూర్తి కావడానికి ఎంకాలం పడుతుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై ఆర్అండ్బీ ఏఈ స్వప్నను వివరణ కోరగా దుమ్ము లేవకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రమాదకరంగా ఉన్న స్తంభాల వద్ద రక్షణ చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు. పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు -
ఇన్నాళ్లకు గుర్తొచ్చామా సార్..?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పార్టీలోని వ్యతిరేకవర్గం పన్నాగమో... ప్రజల్లో నిక్షిప్తమైన ఆగ్రహమో తెలియదు గానీ... టీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత తప్పడం లేదు. పూజలు చేసేందుకు వెళ్లిన అభ్యర్థిని ఒక గ్రామంలో నిలదీస్తే... యోగక్షేమాలు అడిగిన అభ్యర్థికి ఓ వృద్ధురాలి నుంచి వ్యతిరేకత ఎదురైంది. తాజాగా సోమవారం ఖానాపూర్లో తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్కు చేదు అనుభవం ఎదురైంది. జన్నారం మండలంలోని బాదంపల్లిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాఖానాయక్ను ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నాలుగున్నరేళ్లలో ఒక్కసారైనా రాని ఎమ్మెల్యే ఇప్పుడెందుకు వచ్చారంటూ గ్రామస్తులు నిలదీశారు. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా గ్రామానికి రావడంపై స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా గ్రామస్తులతో గొంతుకలపడం గమనార్హం. చివరికి పోలీసుల జోక్యంతో ఆందోళన సద్దుమణిగింది. చైతన్యమా... రాజకీయ ప్రోద్బలమా..? ముందస్తు ఎన్నికల్లో భాగంగా సెప్టెంబర్ 6న ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసినప్పటి నుంచే నియోజకవర్గాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో చెన్నూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు సీటివ్వలేదు. మిగతా చోట్ల సిట్టింగ్లకే అవకాశం కల్పించారు. దీంతో చెన్నూర్తో పాటు మిగతా స్థానాల్లో అభ్యర్థులకు వ్యతిరేకంగా టీఆర్ఎస్లోనే వ్యతిరేకత మొదలైంది. చెన్నూర్లో అభ్యర్థి బాల్క సుమన్ ప్రచారాన్ని ప్రారంభించిన ఇందారంలో గట్టయ్య అనే ఓదెలు అభిమాని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఖానాపూర్లో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పార్టీని వీడారు. బోథ్లో ఎంపీ నగేష్ అంతర్గతంగా తనవంతు ప్రయత్నాలు ఇప్పటికీ చేస్తున్నారు. ముధోల్లో సిట్టింగ్ ఎమ్మేల్యేకు వ్యతిరేకంగా ఎస్.వేణుగోపాలచారి వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. బెల్లంపల్లిలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు కంటిలో నలుసుగా మారారు. ఈ పరిణామాల క్రమంలో పార్టీ మారడాలు, సద్దుమణగడం వంటివి జరిగినట్లు కనిపిస్తున్నా... పోరు ఆగలేదు. ఈ నేపథ్యంలోనే ప్రజలు తిరుగుబాటు చేసే దృశ్యాలు కనిపిస్తున్నాయని టీఆర్ఎస్ నేతలు కొట్టివేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, నేతల ప్రోద్బలంతోనే వ్యతిరేక సీన్లు కనిపిస్తున్నాయని అంటున్నారు. జైనథ్లో మంత్రి జోగు రామన్నకు తప్పని వ్యతిరేకత... ఇటీవల రాష్ట్ర మంత్రి జోగు రామన్నకు జైన£థ్ మండలంలో రెండుచోట్ల స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. సాంగ్వి, భోరజ్ గ్రామాల్లో మంత్రి ప్రచారానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... సాంగ్విలో మంత్రిని వ్యతిరేకించడం వెనుక రాజకీయ కారణాలే కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్లోనే కొనసాగిన ఓ వ్యక్తి తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న కారణంతో మంత్రి రామన్నకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఇటీవల బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్న ఆ వ్యక్తి ప్రోద్బలంతోనే సాంగ్విలో స్థానికులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే మండలంలోని భోరజ్లో మాత్రం ఒక దళిత బస్తీలో స్థానికులు మంత్రిని ప్రశ్నించడం గమనార్హం. మూడెకరాల ప్రభుత్వ భూమి, ఉపాధిహామీ ద్వారా నిర్మించే సీసీ రోడ్డు తమ బస్తీకి ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. భోరజ్లో ప్రజా చైతన్యం కొట్టొచ్చినట్లు కనిపించిది. బెల్లంపల్లి, బోథ్లలో... బెల్లంపల్లి మండలం పరిధిలోని చాకెపల్లి, బుదాగుర్ధు గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రచారం నిర్వహిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. తమ గ్రామాలను ఇన్నాళ్లు పట్టించుకోకుండా ఇప్పుడెందుకు వచ్చారంటూ నిలదీసే ప్రయత్నం చేశారు. బోథ్లో టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపూరావు ప్రచారాన్ని తరచూ అడ్డుకోవడం జరుగుతోంది. ఇక్కడ గిరిజన తెగల్లోని రెండు వర్గాల మధ్య గత కొంతకాలంగా వైషమ్యాలు పెరగడం అనే అంశంతో పాటు రాజకీయ పరిణామాలు కూడా ఈ ఆందోళనల వెనుక ఉన్నట్లు సమాచారం. బోథ్లో టీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని మార్చి తనకు అవకాశం ఇవ్వాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ గత కొంతకాలంగా అధిష్టానాన్ని కోరుతున్నారు. అయినా కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాథోడ్ బాపూరావుకే సీటు ఇవ్వడం ఆయన వర్గీయులకు ఇబ్బందిగా మారింది. నియోజకవర్గంలోని పలు మండలాల్లో నగేష్ వర్గీయులే కీలక స్థానాల్లో ఉండడంతో బాపూరావుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. అయినా అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ వెళుతుండడం గమనార్హం. మిగతా పార్టీల అభ్యర్థులు ఖరారైతే... నెలరోజుల క్రితమే టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేయడంతో ప్రస్తుతం వారే ప్రచారంలో అధికారికంగా పాల్గొంటున్నారు. దీంతో కొన్ని గ్రామాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడం గమనిస్తున్నాం. త్వరలో కాంగ్రెస్ మహా కూటమి, బీజేపీ నుంచి ఖరారయ్యే అభ్యర్థుల విషయంలో ప్రజాక్షేత్రంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది ఆసక్తిగా మారింది. చెన్నూర్ మినహా టీఆర్ఎస్ అభ్యర్థులంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలే కావడంతో సహజంగడా ప్రజల్లో ఉండే అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకునే దిశగా నేతలు పావులు కదుపుతున్నారని సమాచారం. ప్రస్తుతం పార్టీలో టికెట్టు ఆశించి భంగపడ్డ వారి ప్రోద్బలంతోనే టీఆర్ఎస్ అభ్యర్థులను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని నాయకులు ఆరోపిస్తున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు, నాయకులు కూడా వీరినే ఫాలో అయితే పరిస్థితి ఏంటనేది టీఆర్ఎస్ అభ్యర్థులను కలవరానికి గురిచేస్తోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
తప్పక చదవండి
- ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement