-
‘అర్జున’ రేసులో రాహుల్
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తూ నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ వెయిట్లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ పేరును ఈ ఏడాది కేంద్ర క్రీడా పురస్కారం ‘అర్జున’ కోసం భారత వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్ఎఫ్) నామినేట్ చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన 23 ఏళ్ల రాహుల్ 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల 85 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. అంతకుముందు 2015, 2017లలో కామన్వెల్త్ చాంపియన్షిప్లో పసిడి పతకాలు గెలిచాడు. 2015 ఆసియా జూనియర్ చాంపియన్షిప్లో బంగారు పతకం నెగ్గిన రాహుల్... 2014 యూత్ ఒలింపిక్స్ క్రీడల్లో రజతం... 2013 ఆసియా యూత్ క్రీడల్లో స్వర్ణం... 2013 ప్రపంచ యూత్ చాంపియన్షిప్లో స్వర్ణం సొంతం చేసుకున్నాడు. మీరాబాయి, పూనమ్ పేర్లను కూడా... రాహుల్తోపాటు మీరాబాయి చాను (మణిపూర్), పూనమ్ యాదవ్ (ఉత్తరప్రదేశ్) పేర్లను ఐడబ్ల్యూఎల్ఎఫ్ కేంద్ర క్రీడా శాఖకు ప్రతిపాదించింది. అయితే మీరాబాయి ఇప్పటికే దేశ అత్యున్నత క్రీడాపురస్కారం ‘రాజీవ్గాంధీ ఖేల్రత్న’ను 2018లోనే అందుకుంది. వాస్తవానికి ‘ఖేల్రత్న’ కోసం ఎవరినైనా నామినేట్ చేయాలంటే ముందుగానే వారికి ‘అర్జున’ వచ్చి ఉండాలి. కానీ 2017లో మీరాబాయి ప్రపంచ చాంపియన్షిప్లో 48 కేజీల విభాగంలో స్వర్ణం నెగ్గి విశ్వవిజేతగా నిలువడంతో ఆమె ఘనతకు గుర్తింపుగా కేంద్ర క్రీడాశాఖ నేరుగా ‘ఖేల్రత్న’ను అందజేసింది. ఇప్పటికే తాను అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్రత్న’ అందుకున్నా ‘అర్జున’ అవార్డు ప్రత్యేకత వేరుగా ఉంటుందని మీరాబాయి వ్యాఖ్యానించింది. పూనమ్ యాదవ్ 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో 69 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. 2015లో సతీశ్ శివలింగం అర్జున అవార్డు పొందాక మరే వెయిట్లిఫ్టర్కు ‘అర్జున’ లభించలేదు. -
వైఎస్ జగన్ను కలిసిన వెయిట్లిఫ్టర్ రాహుల్
విజయవాడ స్పోర్ట్స్: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్లిఫ్టింగ్లో స్వర్ణ పతకం సాధించిన తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశాడు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైఎస్ జగన్ను ఆదివారం ఆగిరిపల్లి క్యాంపు వద్ద రాహుల్ తన తండ్రి మధుతో పాటు కలిశాడు. రాహుల్కు ఆర్థిక సాయం చేస్తామని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. భవిష్యత్లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. రాహుల్కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా స్టువర్టుపురం ప్రాంతానికి చెందిన రాగాల వెంకట్ రాహుల్ గోల్డ్కోస్ట్ (ఆస్ట్రేలియా) వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో 85 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. -
స్వర్ణ విజేత రాహుల్కు పవన్ నజరానా
సాక్షి, హైదరాబాద్ : కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిప్టింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్కు జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ రూ.10 లక్షల నజరానాను ప్రకటించారు. శనివారం వెంకట్ రాహుల్ పవన్ కల్యాణ్ను ఆయన నివాసంలో కలిసినట్లు జనసేన ఓప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ రాహుల్ను, క్రీడల వైపు ప్రోత్సహించిన అతని తండ్రిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం అందరికి తెలిసేలా బాపట్ల పట్టణంలో జనసేన తరపున ఈనెల 30న భారీ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ వేదికపైనే రాహుల్ తండ్రిని మధును సైతం సన్మానిస్తామని ఆయన పేర్కొన్నారు. గోల్డ్కోస్ట్ వేదికగా జరిగిన కామెన్వెల్త్ గేమ్స్లో 85 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా స్టువర్ట్పురం ప్రాంతానికి చెందిన రాగాల వెంకట్ రాహుల్ 338 కేజీలు (స్నాచ్లో 151+క్లీన్ అండ్ జెర్క్లో 187) బరువెత్తి పసిడిని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
మెరిసిన తెల్ల‘బంగారం’
గజ్వేల్లో పత్తి క్వింటాలుకు ధర రూ.5,550 గజ్వేల్: తెల్ల‘బంగారం’ మెరి సింది. ఈ సీజన్ కు సంబం ధించి రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో సోమ వారం పత్తి క్వింటాలుకు రూ.5,550 పలికింది. ఈ విషయాన్ని స్థానిక మార్కెట్ కమిటీ కార్యదర్శి వెంకట్ రాహుల్ తెలిపారు. ఈ మార్కెట్ యార్డు పరిధిలో ఇప్పటి వరకు 1.6 లక్షల క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయి. గజ్వేల్ మార్కెట్ యార్డులో సీజన్ ఆరంభం నుంచే రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ధర పలికింది. తాజాగా రూ.5,550కు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. -
వెంకట్@ఐఏఎస్
పేదకుటుంబం నుంచి ఎంపికైన జిల్లావాసి పోచమ్మమైదాన్ : ఓ నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు చదువులో రాణించి ఐఏఎస్కు ఎంపికయ్యాడు. హన్మకొండ గుడిబండల్కు చెందిన నరసింహ స్వామి కుమారుడు రాహుల్ వెంకట్ ఇటీవల విడుదలైన సివిల్స్ పలితాల్లో 386వ ర్యాంక్ సాధిం చాడు. శుక్రవారం జరిగిన ఐఏఎస్ ఎంపికలో రాహుల్ వెంకట్ ఎంపికయ్యాడు. హన్మకొండ రెడ్డి కాలనీలోని సేయింట థామస్ గ్రామర్ హై స్కూల్లో పదో తర గతి వరకు చదివాడు. విజయవాడలోని నలంద కళాశాలలో, కూకట్పల్లి జెన్టీయూలో బీటెక్ సీఎస్ఈ చేశాడు. ఇండియన్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ పూర్తి చేశారు. స్టాక్ మార్కెట్లో క్లస్టర్ హెడ్గా దాదాపు మూడున్నర సంవత్సరాలు చేశాడు. సివిల్స్ లక్ష్యంతో జాబ్ రిజైన్ చేసి సివిల్స్కు ప్రిపేర్ అయ్యారు. సివిల్స్ నాల్గవ అటెంట్లో 386వ ర్యాంక్ను సాధించారు. గతేడాది సివిల్స్లో ఎంపికై ఇంటర్వ్యూలో మిస్సయ్యడు. సివిల్స్లో అంథ్రోపాలజీని ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక కావడానికి అమ్మే కారణం రాహుల్ వెంకట్ను ‘సాక్షి’ ఫోన్లో పలకరించగా.. సివిల్స్లో ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. మా అమ్మనాన్నలు చాలా ప్రోత్సహించేవారు అని అన్నారు. ఐఏఎస్కు ఎంపిక కావడానికి అమ్మ కీలకం అని చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement