-
ఇలా చేస్తే శరీరంలో ఉన్న కొవ్వును ఈజీగా తగ్గించుకోవచ్చు!
ఇటీవల కాలంలో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని చేసే ఉద్యోగాలే ఎక్కువయ్యాయి. దీంతో అధిక బరువు పెరగడమే గాక ఒంట్లో కొవ్వు పేరుకుపోతుంది. సరైన వ్యాయామం, పౌష్టికాహారం లేకపోవడంతో శరీరంలో తొడలు,పిరుదులు, చేతులు భాగంలో కొవ్వు పెరిగిపోయి చూసేందుకు కూడా అసహ్యంగా ఉంటాయి. దీన్ని తగ్గించుకోవాలంటే మంచి డైట్ ఫాలో అవ్వుతూ..శరీరానికి తగినంత వ్యాయామం చేయాలి. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఇవన్నీ పాటించాలంటే అసాధ్యం. అందుకని ఈ ఆహార పదార్థాలను రోజువారి ఆహరంలో భాగం చేసుకుంటే సులభంగా కొవ్వు తగ్గించుకోవడమే కాదు బరువు కూడా తగ్గిపోతారు. కొవ్వుని కరిగించుకోవాలనుకుంటే తీసుకోవాలసినవి.. సెనగలు ఇవి స్నాక్స్ రూపంలో తీసుకుంటే ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, పోటాషియం, మాంగనీస్, ఫైబర్ వంటవి శరీరాని అందడమే గాక కొవ్వుని ఈజీగా బర్న్ చేస్తుంది. క్వినోవా డైట్ ప్లాన్లో భాగంగా దీన్ని తీసుకుంటే రోజంతా నిండుగా ఉన్న ఫీలింగ్ ఉండి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోరు. ఇక ఇందులో గ్లూటెన్ ఉండదు.. గ్లూటెన్ పడని వారికి క్వినోవా బెస్ట్ ఆప్షన్. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, సీలియాక్ డిసీజ్ లాంటి సమస్యలు ఉన్నవారికి క్వినోవా తీసుకోవచ్చు. క్వినోవా తీసుకుంటే.. శరీరానికి కావలసిన ప్రోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం పుష్కలంగా అందుతుంది. బాదం పప్పులు వ్యాయామానికి ముందు బాదంపప్పు తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్లు పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి ఈ గింజల్లో అధిక మొత్తంలో అమినో యాసిడ్ ఎల్-అర్జినైన్ ఉండటం వల్ల కొవ్వు కరుగుతుంది. బాదం పప్పులు వ్యాయామానికి ముందు బాదంపప్పు తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్లు పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి ఈ గింజల్లో అధిక మొత్తంలో అమినో యాసిడ్ ఎల్-అర్జినైన్ ఉండటం వల్ల కొవ్వు కరుగుతుంది. టోఫు: ఇది తక్కువ క్యాలరీలు, అధిక ప్రోటీన్ కలిగిన శాఖాహారం. దీనిలో కొలెస్ట్రాల్ కూడా ఉండదు. తద్వారా బరువు ఈజీగా తగ్గొచ్చు. అలాగే ఆడవారి ఆరోగ్యానికి ఇది పలు విధాల మేలు కలుగుతుంది. టోఫులోని ఐసోఫ్లేవోన్లు అనే పోషకాలను ఫైటో ఈస్ట్రోజెన్లుగా చెప్తారు. అంటే ఇవి ఈస్ట్రోజెన్ హార్మోన్లా పని చేస్తాయి. కాబట్టి నెలసరి క్రమాన్ని సరిచేసే, పీరియడ్స్ మంటను తగ్గించే గుణాలు ఇందులో ఉంటాయి. బ్రకోలీ: దీనిలో మాంసకృత్తులు, ఫైబర్, విటమిన్లు కే, సీ సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ బరువు తగ్గడంలో సహాయపడతాయి. మొలకలు వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. రెగ్యులర్ వ్యాయామం తోపాటు మొలకలు తీసుకోవడం వల్ల పొత్తికడుపులో ఉండే కొవ్వు తగ్గుతుంది. (చదవండి: ఖననం చేసే సమయంలో..శవపేటిక నుంచి శబ్దం అంతే..) -
Misal Pav: ప్రపంచ గుర్తింపు.. భారత్లో అత్యంత రుచికరమైన వేగన్ ఫుడ్ ఇదే!
స్నాక్స్ అంటే దాదాపుగా ప్రతి ఒక్కరికీ ఇష్టం ఉంటుంది. ఇంట్లోవారికి, ఆఫీసుల్లో పనిచేసేవారికి, పిల్లలకు, పెద్దలకు ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. కొంతమందైతే స్నాక్స్ తినకుండా పనిచేయరు. సాయంత్రమైతే చాలు నోరు లాగేస్తుంది.. ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. స్నాక్స్లో బ్రెడ్తో చేసే వంటకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వడాపావ్, పావ్ బాజీ, మిసాల్ పావ్. ఇవన్నీ మహారాష్ట్రలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్. మిసల్ పావ్.. మహారాష్ట్రలోని పావ్ ఆధారిత స్ట్రీట్ ఫుడ్స్కు చెందిన ప్రముఖ వంటకం మిసల్ పావ్. ఇది రోడ్సైడ్ స్టాల్స్, బ్రేక్ఫాస్ట్ జాయింట్లు, ఆఫీస్ క్యాంటీన్లలో ఎక్కువగా కనిపిస్తుంది. మాత్ బీన్స్ మొలకలు(అలసంద గింజలు), కొబ్బరి, టమాటా, మసాలా దినుసులతో స్పైసీ కూరలాగా తయారు చేస్తారు. తరువాత దీనిపై సేవ్, ఉల్లిపాయలు, నిమ్మకాయలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి బ్రెడ్తో వడ్డిస్తారు. అయితే మిసల్ పావ్లో ఉపయోగించే పదార్థాలు, ప్రదేశాన్ని బట్టి అనేక రకాలు ఉన్నాయి. పుణె మిసల్, ఖండేషి మిసల్, నాసిక్ మిసల్, అహ్మద్నగర్ మిసల్ ప్రఖ్యాతిగాంచాయి. 2015లో లండన్లోని ఫుడీ హబ్ అవార్డ్స్లో మిసల్ పావ్ ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన శాఖాహార వంటకంగా పేరు పొందింది. ఈ అవార్డును ఆస్వాద్ రెస్టారెంట్ గెలుచుకుంది. ఈ రెస్టారెంట్ను 1986లో బాల్ థాకరే ప్రారంభించారు. ఇది ప్రతిరోజూ 400 ప్లేట్ల కంటే ఎక్కువ మిసాల్ పావ్ను అందజేస్తుందని నివేదిక వెల్లడించింది. సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత.. ఈ వంటకం మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలోని ఉత్తమ సాంప్రదాయ వేగన్ వంటకాల జాబితాలో మిసల్ పావ్ మళ్లీ మొదటి స్థానం సంపాదించింది. ఫుడ్ గైడ్ ప్లాట్ఫారమ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచంలోని బెస్ట్-రేటెడ్ శాకాహారి వంటకాల ర్యాంకింగ్ల జాబితాలో మిసాల్ పావ్ 11వ స్థానానికి చేరుకుంది. వీటితోపాటు మరో మూడు వంటకాలు ఆలూ గోబీ, రాజ్మా, గోబీ మంచూరియన్ కూడా టాప్ 25లో నిలిచాయి. ఆలూ గోబీ 20వ స్థానంలో నిలిచింది, రాజ్మా 22వ స్థానంలో నిలిచింది మరియు గోబీ మంచూరియన్ 24వ స్థానంలో నిలిచింది. ఇవేగాక మసాలా వడ 27వ స్థానంలో, భేల్పురి 37వ స్థానంలో, రాజ్మా చావల్ 41వ స్థానంలో నిలిచారు. మొత్తం టాప్ 50లో భారత్ నుంచి ఏడు వెజిటేరియన్ వంటకాలు ఎంపికయ్యాయి. -
సింగపూర్లో శాకాహార హోటల్
భారత దేశానికి స్వాతంత్య్రం 1947లో వచ్చింది. సింగపూర్లో మొట్టమొదటి శాకాహార హోటల్ అదే సంవత్సరం ప్రారంభమైంది. 2015 లో సింగపూర్ ప్రధాని లీ హసీన్ లూంగ్, భార్య హోచింగ్లతో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆ హోటల్లోనే తృప్తిగా భోజనం చేశారు. అదే మురుగయ్య రాజు ప్రారంభించిన కోమల విలాస్... ఇదే ఈ వారం మన ఫుడ్ ప్రింట్స్... ఇక్కడ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అదే సంవత్సరం సింగపూర్ సెరంగూన్ రోడ్లో భారత కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడించేలా మొట్టమొదటి శాకాహార హోటల్ భోజన ప్రియుల కోసం తలుపులు తెరిచి, ఆహ్వానం పలికింది. అదే కోమల విలాస్. అచ్చమైన ఈ శాకాహార హోటల్లో సింగపూర్ ప్రధాని దంపతులతో కలిసి భారత ప్రధాని ఇడ్లీ, వడ, దోసెలను ఆస్వాదించారు. తొమ్మిది దశాబ్దాల క్రితం... మురుగయ్య రాజు 1936లో తన పదహారవ ఏట సింగపూర్లో తమిళనాడు నుంచి పొట్ట కూటి కోసం సింగపూర్ చేరారు. ‘‘మా తాతయ్య మురుగయ్య రాజు, చిన్నవయసులోనే సింగపూర్ వచ్చి శ్రీకరుణా విలాస్లో పని చేశారు. ఈ హోటల్లో అన్ని పనులు తాతగారే స్వయంగా చేసేవారు. పది సంవత్సరాల పాటు అక్కడ అవిశ్రాంతంగా పనిచేసిన తాతగారు... అనుభవంతో పాటు డబ్బు కూడా సంపాదించారు. ఒక మంచి రెస్టారెంటు కొనేస్థాయికి ఎదిగారు’’ అంటారు గుణశేఖరన్. శ్రీకరుణ విలాస్ అధినేత యజమానురాలి పేరు కోమల. మురుగయ్య సింగపూర్ వచ్చిన కొత్తలో ఆమె మురుగయ్యను తల్లిలా చేరదీశారు. అందువల్ల ఆయన ఆ తల్లి మీద ఉన్న గౌరవంతో తన హోటల్కి కోమల విలాస్ అని పేరు పెట్టుకున్నారు. ఇక్కడ కేవలం శాకాహారం మాత్రమే దొరుకుతుంది. భోజనం కూడా... తంజావూరు జిల్లాలో పనిచేస్తున్న సంప్రదాయ వంట మనిషితో మురుగయ్య రాజుకి పరిచయం కావడంతో, అల్పాహారంతో పాటు భోజనాలు కూడా ప్రారంభించారు. అది కూడా అరటి ఆకులలో వడ్డించారు. నెమ్మదినెమ్మదిగా మెనూలో కొత్త కొత్త వంటలను చేర్చారు. అవీ భారతీయ శాకాహార వంటకాలు మాత్రమే. సింగపూర్లో ఇంటింటా కోమల విలాస్ పేరు మార్మోగింది. అక్కడ ఎన్ని భారతీయ రెస్టారెంట్లు వచ్చినా, కోమల విలాస్కు పోటీ ఇవ్వలేకపోతున్నాయి. సంప్రదాయ వంటకాలు మాత్రమే... సంప్రదాయ వంటవారిని భారతదేశం నుంచి ఎంచుకోవడమే కోమల విలాస్ విజయ రహస్యం. ‘‘భారత దేశం నుంచి మాత్రమే సంప్రదాయ వంటవారు దొరుకుతారని మా నమ్మకం. స్వయంగా భారతదేశం వెళ్లి, అక్కడి వంటవారితో వంటలు చేయించి, రుచి చూసి, నచ్చితేనే వారిని మాతో తీసుకువస్తాం. అందుకే మా దగ్గర వంట రుచిగా ఉంటుంది. ఇక్కడి శాకాహార భోజనం చాలా రుచిగా, సంప్రదాయంగా ఉంటుందనే ముద్ర పడింది కోమల విలాస్కి’’ అంటారు గుణశేఖరన్.ఇక్కడి వంటకాలలో మసాలా ఎక్కువగా ఉండదని తెలియడంతో, విదేశీయులు సైతం ఇక్కడ భోజనం చేయడానికి ఉబలాటపడుతుంటారు. పది సంవత్సరాల క్రితం... సింగపూర్కి వచ్చే భారతీయుల సంఖ్య బాగా పెరిగింది. ఉత్తరాది వారు కూడా తరలి వస్తుండటంతో, ఆ వంటకాలను కూడా పరిచయం చేశారు. ఎప్పటికప్పుడు కొత్త వంటలతో కోమల విలాస్ నిత్యయవ్వనంగా ఉండి, సింగపూర్లో అందరికీ సుపరిచితంగా ఉంటోంది నేటికీ. ఉత్తర భారతదేశానికి చెందిన బ్రెడ్ బటూరాను సింగపూర్లో మొట్టమొదటగా పరిచయం చేసిన ఘనత కోమల విలాస్దే. ‘మా కోమల విలాస్కి వచ్చినవారు మసాలా దోసె తినడం మరువకండి. ఇక్కడకు వచ్చి మసాలా దోసె తిన్నవారు రుచి బాగా లేదని ఇంతవరకు ఒక్కరు కూడా చెప్పలేదు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి అతిథ్యం ఇవ్వడానికి మా తాతగారు స్థాపించిన కోమల విలాస్ను ఎంచుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. భారత, సింగపూర్ ప్రధానులిద్దరూ వడ, ఇడ్లీ, రెండు రకాల దోసెలు తిన్నారు. స్వీట్ లస్సీ, మ్యాంగో లస్సీ, నిమ్మరసం కూడా తీసుకున్నారు. గుణశేఖరన్ -
అసెంబ్లీ క్యాంటీన్లో వెజ్లో చికెన్ ముక్కలు
ముంబై: సాక్షాత్తూ మహారాష్ట్ర అసెంబ్లీ క్యాంటీన్లో వేజ్టేరియన్ వంటకంలో చికెన్ ముక్కలు దర్శనమిచ్చాయి. దీనిపై శాసనసభ్యుల్లో కలకలం రేగింది. దీంతో ఈ ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. వేజ్లో చికెన్ ముక్కలు వచ్చిన ఘటనపై విచారణ జరుపుతామని ఆయన సభకు హామీ ఇచ్చారు. ఎన్సీపీ సభ్యుడు అజిత్ పవార్ ఈ ఘటనను సభ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంటున్నట్టు ఫడణవీస్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, అసెంబ్లీ క్యాంటీన్లో వంటలు చేసేటప్పుడు పరిశుభ్రత నిబంధనలను పాటిస్తున్నారా? శుచీశుభ్రతతో ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) మార్గదర్శకాల ప్రకారం వంటకాలు చేస్తున్నారా? అన్నది ప్రస్తుతం విచారిస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని క్యాంటీన్ సిబ్బందికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు సీఎం తెలిపారు. గత బుధవారం ఓ ప్రభుత్వ ఉద్యోగి అసెంబ్లీ క్యాంటీన్లో ‘మట్కీ ఉసాల్’ అనే వేజటేరియన్ వంటకాన్ని ఆర్డర్ చేశారు. కానీ, ఆయన తింటున్నప్పుడు చికెన్ ముక్కలు దర్శనిమిచ్చాయి. దీంతో బిత్తరపోయిన సదరు ఉద్యోగి ఈ విషయాన్ని విధానసభ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. -
మాంసాహారం వద్దు.. శాకాహారమే ముద్దు
కాప్రా: ఆధునిక కాలంలో శాకాహారం ప్రాశస్థ్యం నానాటికీ పెరుగుతోంది. మారుతున్న ఆహారపు అలవాట్లలో దీని పాత్ర ద్విగుణీకృతమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా శాకాహారానికి డిమాండ్ ఏర్పడిన ప్రస్తుత తరుణంలో జీవహింస వద్దు శాకాహారమే ముద్దంటూ చైతన్యపరిచేందుకు నడుం కట్టారు నగరానికి చెందిన దంపతులు ఆచార్య శ్రీనివాస్, దివ్య దంపతులు. యాత్ర ఫర్ యానిమల్స్ పేరుతో స్వచ్ఛందంగా ర్యాలీలు చేపట్టారు. మాంసాహారంతో వచ్చే నష్టాలు, శాకాహారంతో ఒనగూరే ప్రయోజనాలను వివరించేందుకు దేశవ్యాప్త యాత్రకు రెండు రథాలతో శ్రీకారం చుట్టారు. పిరమిడ్ ప్రోత్సాహంతో.. ప్రస్తుత సమాజంలో మనిషి ఎదుర్కొంటున్న రోగాల నివారణకు శాకాహారం ఒక్కటే మార్గం. దీని ద్వారానే అనేక వ్యాధులకు, అనర్థాలకు చెక్ పెట్టవచ్చనే సదుద్దేశంతో ఆచార్య శ్రీనివాస్, దివ్య దంపతులు పిరమిడ్ స్వచ్ఛంద సంస్థ ప్రోత్సాహంతో దేశ వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు సంకల్పించారు. మహబూబ్నగర్ జిల్లా కడ్తాల్ నుంచి ఈ ఏడాది జూన్ 21న యోగా దినోత్సవం సందర్భంగా ర్యాలీకి శ్రీకారం చుట్టారు. దీనిని పిరమిడ్ సొసైటీ ఫౌండర్ బ్రహ్మర్షి పత్రీజీ జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాలో మొదలైన యాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా 54 ర్యాలీలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లోని 644 జిల్లాల్లో 44 వేల కి.మీ మేర ఆచార్య శ్రీనివాస్, దివ్య దంపతులు ర్యాలీల ద్వారా అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం ఈ యాత్ర కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతోంది. పలువురు ప్రముఖుల అభినందనలు శ్రీనివాస్, దివ్య దంపతులు చేపట్టిన ర్యాలీకి త్రిదండి చినజీయర్ స్వామితో పాటు అన్నాహజారే, గాయనీమణులు ఎస్.పి.శైలజ, ఉషా, ఫైట్ మాస్టర్స్ రామ్లక్ష్మణ్, నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్, తెలంగాణ రాష్ట్రంలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మద్దతు పలికిదంపతులను అభినందించారు. దేశవ్యాప్త పర్యటన అనంతరం 2019 జూన్ 21 యోగా దినోత్సవం రోజున హైదరాబాద్లో 25 వేల మందితో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి ముగించనున్నట్లు ఆచార్య శ్రీనివాస్, దివ్య దంపతులు తెలిపారు. మార్పు తేవడమే మా లక్ష్యం.. మూగజీవాలను ప్రేమించాలని, మాంసాహార ప్రియులను శాకాహారం వైపు మళ్లించాలనే లక్ష్యంతో యాత్రను చేపట్టాం. శాకాహారం దారిలో వెళ్లాలని ప్రతి ఇంటికీ, ప్రతి విద్యార్థికీ చేరేలా ప్రచారం నిర్వహిస్తున్నాం. మేం చేపట్టిన ర్యాలీతో ఇప్పటికే చాలామంది శాకాహారం వైపు వచ్చారు. ఇదే ఉత్సాహంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకెళ్తాం. అందరూ శాకాహారం వైపు రావాలనేదే ర్యాలీ లక్ష్యం. – ఆచార్యశ్రీనివాస్, దివ్య
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement