-
వంశధార ట్రిబ్యునల్ తీర్పు: వైఎస్సార్ దార్శనికతకు నిదర్శనం
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపు.. నిబద్ధత.. దార్శనికత కారణంగానే రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ వంశధార జల వివాదాల ట్రిబ్యునల్ (వీడబ్ల్యూడీటీ) తుది తీర్పు ఇచ్చిందని నీటిపారుదల రంగ, న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలతోపాటు మిగులు జలాలపై పూర్తి హక్కును దక్కించుకోవాలంటే.. వాటిని వినియోగించుకునేలా ప్రాజెక్టులు నిర్మించాలంటూ 1985 నుంచి 2004 వరకూ ప్రభుత్వాలకు వైఎస్సార్ సూచిస్తూ వచ్చారు. కృష్ణా, దాని ఉప నదులు, పెన్నా, దాని ఉప నది చిత్రావతిలపై కర్ణాటక సర్కార్ 1995 నుంచి 2004 మధ్య అనుమతి లేకుండా అనేక ప్రాజెక్టులు చేపట్టింది. ఇదే అంశాన్ని ఎత్తిచూపుతూ.. కృష్ణా మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్కు సంపూర్ణ హక్కు రావాలంటే పెండింగ్ ప్రాజెక్టులను చేపట్టాలంటూ అప్పటి సీఎం చంద్రబాబును నాటి ప్రతిపక్ష నేత వైఎస్సార్ డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. పర్యవసానంగా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 ఉమ్మడి ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా తీర్పు ఇచ్చింది. మిగులు జలాలను మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. దీనివల్ల మిగులు జలాలపై హక్కును ఏపీ కోల్పోవాల్సి వచ్చింది. జలయజ్ఞం కింద ఒకేసారి 85 ప్రాజెక్టులకు శ్రీకారం మే 14, 2004న వైఎస్సార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జలయజ్ఞం కింద ఒకేసారి 85 ప్రాజెక్టులను చేపట్టారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చాలనే లక్ష్యంతో.. 1962 నుంచి కాగితాలకే పరిమితమైన వంశధార ప్రాజెక్టు ఫేజ్–2, స్టేజ్–2ను ఫిబ్రవరి 25, 2005న మొదలుపెట్టారు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మించి.. రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కులను హైలెవల్ కాలువ ద్వారా తరలించి.. సింగిడి (0.686), పారాపురం (0.404), హిర మండలం (19.05)లో టీఎంసీలను నిల్వ చేయాలని ప్రణాళిక రచించారు. తద్వారా వంశధార ప్రాజెక్టు తొలి దశ కింద 2.10 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటూ కొత్తగా 45 వేల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీకాకుళం జిల్లాలో వంశధార ఆయకట్టులో రెండు పంటలకు నీళ్లందించవచ్చు. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన నేరడి బ్యారేజీ వల్ల తమ భూభాగం ముంపునకు గురవుతుందని ఒడిశా సర్కార్ అభ్యంతరం తెలుపుతూ 2006లో కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఒకవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించి న్యాయపరమైన వివాదాలను పరిష్కరిస్తూనే.. మరోవైపు ప్రాజెక్టు ముందస్తు ఫలాలను శ్రీకాకుళం జిల్లా రైతులకు అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్ డిజైన్ను మార్చారు. నేరడి బ్యారేజీ స్థానంలో కాట్రగడ్డ వద్ద సైడ్వియర్ (మత్తడి) నిర్మించి.. అక్కడి నుంచి సింగిడి, పారాపురం, హిర మండలం రిజర్వాయర్లకు తరలించేలా డిజైన్ చేసి పనులు చేపట్టారు. 2009 నాటికే సింహభాగం పనులను పూర్తి చేశారు. వైఎస్సార్ వల్లే రాష్ట్రానికి న్యాయం.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా వాదనను ఏళ్ల తరబడి విచారించిన వంశధార ట్రిబ్యునల్ సెప్టెంబర్ 13, 2017న తుది తీర్పు ఇచ్చింది. ఆ తీర్పునే సోమవారం ఖరారు చేసింది. దివంగత సీఎం వైఎస్సార్ చేపట్టిన కాట్రగడ్డ సైడ్వియర్తోపాటు ప్రతిపాదించిన నేరడి బ్యారేజీకి ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. వంశధారలో 57.5 టీఎంసీలను వినియోగించుకునే పూర్తి స్వేచ్ఛను ఏపీకి ఇచ్చింది. వైఎస్సార్ ముందుచూపుతో వంశధార ప్రాజెక్టు ఫేజ్–2 స్టేజ్–2 చేపట్టకున్నా.. ప్రాజెక్టు ఫలాలను ముందస్తుగా రైతుకు అందించాలనే నిబద్ధతతో కాట్రగడ్డ సైడ్వియర్ నిర్మాణాన్ని చేపట్టకపోయినా.. ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వ వాదనతో విభేదించి ఉండేదని న్యాయ నిపుణులు తేల్చిచెబుతున్నారు. చదవండి: గ్రామ సచివాలయాల్లోనూ ఆధార్ సేవలు -
పనుల వేగవంతానికి మరిన్ని యంత్రాలు
హిరమండలం: వంశధార రిజర్వాయర్ పనుల వేగవంతానికి మరిన్ని యంత్రాలను పెట్టినట్లు వంశధార ఈఈ సీతారాం నాయుడు, పాలకొండ ఆర్డీవో రెడ్డి గున్నయ్యలు తెలిపారు. శనివారం పాడలి తులగాం రెవెన్యూ పరి ధిలోని వరినాట్ల తొలగింపు, పొలం గట్లు చదును పనులను వారు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు రెండు రెవెన్యూ పరిధిలో భూ సేకరణకు అవసరమైన మట్టి సేకరణకు అడ్డుగా ఉన్న పొలాలను చదును చేసేందుకు 8 పొక్లెయిన్లు, సుమారు 25 ట్రాక్టర్లను తెచ్చామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు. నిర్వాసితులకు సమస్యలు ఉంటే ప్రతిశనివారం ప్రత్యేక సెల్లో చెప్పుకోవాలని సూచించారు. ఇన్చార్జి డీఎస్పీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పనులు సజావుగా జరిగేందుకు పోలీసు బలగాలను మోహరించామని అవసరమైతే మరిన్ని బలగాలను తెచ్చి శాంతి భద్రతకు విఘాతం కలగకుండా పనులు చేయిస్తామన్నారు. వీరితో పాటు తహసీల్దార్ ఎం.కాళీప్రసాద్, డీఈ బ్రహ్మానందం పలువురు వంశధార, రెవెన్యూ, పోలీసు అధికారులు ఉన్నారు. దుగ్గుపురంలో దళితుల ఇళ్లకు నష్ట పరిహారం చెల్లించాలని పలువురు కోరారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement