-
లారీని ఢీకొన్న బస్సు: 15 మందికి గాయాలు
రామాయంపేట(మెదక్): రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఆర్టీసీ వజ్ర మినీ బస్సు వెనుకనుంచి ఢీకొన్న ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బుధవారం మెదక్ జిల్లా రామాయంపేట శివారులో దామరచెరువు స్టేజీ వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ చెడిపోవడంతో రోడ్డుపైనే ఆగిపోయింది. కాగా, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న మెహిదీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ వజ్ర బస్సు ప్రమాదవశాత్తు రోడ్డుపైన ఆగి ఉన్న ఆ లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రవీందర్రెడ్డితో పాటు నిజామాబాద్కు చెందిన రమేశ్ జాదవ్, ఆయన భార్య మీరా, కూతురు శరణ్య, చంద్రకుమార్, సాయన్న, జానకంపేటకు చెందిన వీరేశం, బాన్స్వాడకు చెందిన విఠల్, బోధన్కు చెందిన నర్సింహారావు, ఆయన బంధువు సుబ్బయ్యకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరందరినీ 108 అంబులెన్సుల్లో రామాయంపేట, బిక్కనూర్ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. వీరిలో బస్సు డ్రైవర్ రవీందర్రెడ్డితో పాటు రమేశ్జాదవ్, సాయన్నను మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ తరలించారు. స్వల్పంగా గాయపడ్డ మరో ఐదుగురు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని వెళ్లి పోయారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ మహేందర్ తెలిపారు. -
వజ్ర మినీ బస్సులో అశ్లీల చిత్రాలు
► ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసిన ప్రయాణికుడు ► సర్ది చెప్పి పంపించిన అధికారులు జనగామ: ఆర్టీసీ సంస్థ ఇటీవల ప్రవేశపెట్టిన మినీ వజ్ర బస్సులో డ్రైవర్ నీలి చిత్రాలు చూస్తూ నడుపుతున్నాడని ఓ ప్రయాణికుడు జనగామ డిపోలో మంగళవారం ఫిర్యాదు చేశాడు. వరంగల్–2 డిపోకు చెందిన టీఎస్ 03 జెడ్ 0340 నంబరు గల వజ్ర బస్సు హైదరాబాద్లోని కూకట్పల్లికి వెళ్తుంది. ప్రయాణికుడు నాగలింగం ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నా యి. బస్సు స్టేషన్ఘన్పూర్ దాటగానే కుదుపుకు లోనయిందన్నారు. అనుమానం వచ్చి చూడడంతో నావిగేషన్ కోసం ఉపయోగిస్తున్న ట్యాబ్లో నీలి చిత్రాలు చూస్తున్నట్లు గమనించడం జరిగిందన్నారు. వెంటనే బస్సు ఆపి డ్రైవర్ను నిలదీయడంతో తమనే బెదిరించే ప్రయత్నం చేయడంతో బస్సుతో సహా తీసుకెళ్లి జనగామ డిపోలో అధికారులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్ బుకాయించడంతో ట్యాబ్లోని యూ ట్యూబ్లో ఉన్న నీలి చిత్రాలకు సంబంధించి వీడియోలను చూపించారు. నావిగేషన్ కోసం ఆర్టీసీ సంస్థ ఏర్పాటు చేస్తే నీలిచిత్రాల కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీలి చిత్రాలను చూడలేదని చెబుతున్న డ్రైవర్ యూ ట్యుబ్ తెరవగానే అవి మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాయని అధికారులను ప్రశ్నించారు. ఫిర్యాదు అందుకున్న హెడ్కానిస్టేబుల్ ఆర్.ప్రకాష్ ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా విషయాన్ని వివరించారు. నాగలింగం తమకు ఫిర్యాదు చేశాడని ప్రకాష్ తెలిపారు. ఆర్టీసీ అధికారులకు ట్యాబ్ను చూపిస్తున్న ప్రయాణికుడు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
పంజాబ్లో మరో లిస్ట్ ప్రకటించిన కాంగ్రెస్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ఒక్కడి కోసం ఫ్యామిలీ మొత్తం దిగింది
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- T20 WC: సచినే ఓపెనర్గా రాలేదు.. నువ్వెందుకు కోహ్లి?
Advertisement