-
ఖమ్మం జిల్లా వైరాలో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం
-
కుటుంబ కలహాలతో ఆత్మహత్య
ఖమ్మం వైరా : కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సై తాండ్ర నరేష్ తెలిపిన వివరాలు... స్థానిక బీసీ కాలనీకి చెందిన చందా సైదారావు(36), ఆయన భార్య వరలక్ష్మి మధ్య కొన్నాళ్లుగా ఘర్షణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఆమె సోదరుడైన రామారావు, శుక్రవారం సైదారావు ఇంటికి వచ్చి బెదిరించాడు, దాడి చేశాడు. అదే రోజు రాత్రి, ఎస్బీఐ సమీపంలో తనకు చెందిన టీ స్టాల్ వద్ద సైదారావు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. వరలక్ష్మి ఫిర్యాదుతో రామారావుపై కేసు నమోదు చేశారు దర్యాప్తు జరుపుతున్నారు. -
2 వేల కిలోల గంజాయి స్వాధీనం
వై.రామవరం: పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న 2 వేల కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వై రామవరం మండలం డొంకరాయి వద్ద శుక్రవారం తనిఖీలు చేపడుతున్న పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 వేల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. -
బల్లి పడిన ఆహారం తిని మహిళ మృతి
వైరా: ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బల్లి పడిన ఆహారం తిని ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన వైరా మండలం పాటడుగు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జానకి రామయ్య కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి భోజనం అనంతరం కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురయ్యారు. దీంతో అనుమానం వచ్చిన వారు వంట గిన్నెలు తీసి చూడగా.. సాంబారులో బల్లి పడి ఉంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా.. జానకి రామయ్య భార్య భారతమ్మ చికిత్స పొందుతూ మృతిచెందగా..జానకి రామయ్యతో పాటు కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. -
నేటి నుంచి ఓటరు జాబితా సవరణ
వైరా : కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణకు మళ్లీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా శుక్రవారం నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులు(బీఎల్ఓలు) ఇంటింటికి వె ళ్లి ఓటర్ల జాబితా సవరణ, బోగస్ ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ వరకు 18 ఏళ్లు నిండిన యువతను ఓటు హక్కు నమోదు చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అలాగే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి తనిఖీ నిర్వహించనున్నారు. ఈ తనిఖీలో అధికారులు ఓటర్ల జాబితా సవరణ, వలసలు వెళ్లిన వారి పేర్ల తొలగింపు, డబుల్ ఓటరు కార్డుల తొలగింపు మరణించిన వారి పేర్ల తొలగింపు తదితర వివరాలు నమోదు చేయనున్నారు. జిల్లాలో 20,17,511 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 9,97,366 మంది, స్త్రీలు 10,19,538 మంది ఓటర్లు ఉండగా ఇతరులు 126, సర్వీసు ఓటర్లు 481 మంది ఓటర్లు ఉన్నారు. 15 రోజుల్లో తనిఖీలు పూర్తి.... నేటి నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు 15 రోజుల పాటు ఈ తనిఖీ నిర్వహించనున్నారు. అనంతరం ఆ వివరాల ఆధారంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేయనున్నారు. మార్పులు చేసిన జాబితాలను నవంబర్ నెలాఖరున ప్రకటించనున్నారు. ఆ జాబితాలో పేర్లు లేని వ్యక్తులు ఓటర్లుగా నమోదు చేయించుకోవడం కోసం డిసెంబర్ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలి. ముసాయిదా జాబితా ప్రకటించిన తర్వాత ఓటరు నమోదు చేసుకునేందుకు కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ డిసెంబర్ వరకు నిర్వహిస్తారు. 2015 జనవరి 25న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. ఆ తర్వాత ఓటర్ల వివరాలను ఆన్లైన్లో పెట్టనున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement