-
ఉత్తరకాశీ సొరంగం శిథిలాల తొలగింపునకు రూ. 20 కోట్ల ఖర్చు!
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్ ప్రమాదం జరిగి చాలా కాలం గడిచింది. ఈ ప్రమాదాన్ని ఎవరూ మరిచిపోలేరు. త్వరలో ఈ సొరంగంలో శిథిలాల తొలగింపు పనులు ప్రారంభం కానున్నాయి. దీనికి ఎంత ఖర్చు అవుతుందనే దానిపై ఒక నివేదిక వచ్చింది. ఉత్తరకాశీ సొరంగం నిర్మాణ సమయంలో కొండచరియలు విరిగిపడటంతో కూలిపోయింది. ఆ సమయంలో సొరంగంలో పనిచేస్తున్న 43 మంది కూలీలు లోపల చిక్కకుపోయారు. వారిని రక్షించేందుకు అధికారుల తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు కార్మికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ టన్నెల్ శిథిలాల తొలగింపు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ పనులకు రూ.20 కోట్లు వెచ్చించనున్నట్లు స్విస్ కంపెనీ వెల్లడించింది. ఈ శిథిలాలను సిల్క్యారాలోని డంపింగ్ గ్రౌండ్కు తరలించనున్నారు. మూడు, నాలుగు రోజుల్లో ఈ పనులు ప్రారంభించనున్నామని స్విస్ కంపెనీ తెలిపింది. -
76 రోజుల తర్వాత ఉత్తరకాశీ సొరంగం పనులు షురూ!
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో సిల్క్యారా సొరంగంలో ప్రమాదం చేసుకున్న 76 రోజుల తరువాత తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు బార్కోట్ వైపు నుంచి ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా రోడ్డు సొరంగంలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. తాజాగా సొరంగం మధ్య షట్టరింగ్ పనులు ప్రారంభించారు. అలాగే సిల్క్యారా వైపు నుంచి సొరంగం ముఖద్వారం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సమాచారాన్ని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఐడిసిఎల్) ప్రాజెక్ట్ మేనేజర్ కల్నల్ దీపక్ పాటిల్ మీడియాకు తెలిపారు. రానున్న 15 రోజుల్లో ఈ పనులు మరింత వేగవంతం కానున్నాయి. సొరంగంలోని సున్నిత ప్రదేశాల్లో ఎస్కేప్ టన్నెల్స్ రూపంలో పైపులు వేస్తున్నట్లు తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతం, సిల్క్యారా వైపు ముఖద్వారం మధ్య దాదాపు 100 మీటర్ల సున్నిత ప్రాంతంలో రక్షణ పనులు ప్రారంభమయ్యాయి. ఎగ్జిట్ టన్నెల్ ద్వారా కార్మికులను పనులు చేసేందుకు లోపలికి పంపుతున్నారు. 2023, నవంబర్ 12న కొండచరియలు విరిగిపడటంతో సిల్క్యారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. 17 రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ తర్వాత వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటన దరిమిలా నవంబర్ 12 నుంచి సొరంగ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ సొరంగంలో ఇంకా 480 మీటర్లు మేర తవ్వాల్సి ఉంది. కేంద్ర మంత్రిత్వ శాఖ పలువురు నిపుణుల సూచనలు, సలహాలు తీసుకున్న తరువాత సొరంగం పనులకు అనుమతినిచ్చింది. ఈ నేపధ్యంలో సొరంగం ముఖద్వారం నుంచి సిల్క్యారా వైపు 100 మీటర్ల సెంటర్ వాల్ (సెపరేషన్ వాల్) షట్టరింగ్ పనులు జరుగుతున్నాయని నిర్మాణ పనులు చేపడుతున్న గజ కంపెనీ అధికారులు తెలిపారు. -
కార్మికులను కాపాడాం... గుణపాఠాలో!
ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల పరిరక్షణ చర్య విజయవంతంగా ముగిసింది. పాక్షికంగా కూలిపోయిన సొరంగంలో దాదాపు 17 రోజులపాటు చిక్కుకున్న కార్మికులందరినీ భారతీయ, విదేశీ నిపుణులు ఉమ్మడిగా సురక్షితంగా బయటికి తీయగలిగారు. హిమాలయ ప్రాంతంలో ఒక పెద్ద అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. సిల్క్యారా సొరంగంలో జరిగిన విపత్తు... పెళుసైన కొండ ప్రాంతాలలో చేపట్టే భారీ స్థాయి ప్రాజెక్టులకు సంబంధించి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. కఠినతరమైన భూభాగంలో కార్యకలాపాల భద్రతపైనా, అలాంటి ప్రాజెక్టులకు అవసరమైన విపత్తు సంసిద్ధతపైనా కూడా ప్రశ్నలను లేవనెత్తింది. హిమాలయ పర్యావరణ వ్యవస్థను కోలుకోలేని నష్టం నుండి రక్షించడానికి ఈ సొరంగ ప్రమాద ఘటన మరో మేల్కొలుపు కావాలి. బద్రీనాథ్, కేదార్నాథ్ వంటి ముఖ్యమైన మతపరమైన పుణ్యక్షేత్రాలను కలుపుతూ, అన్ని వాతావరణాల్లో పనిచేసే నాలుగు లేన్ల రహదారిని నిర్మించాలనే లక్ష్యంతో, ప్రతిష్టా త్మకమైన చార్ ధామ్ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా సొరంగాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టును పర్యావరణ సంఘాలు విమర్శించాయి. దీనిపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా వేశాయి. అనేక ప్రభుత్వ కమిటీలు ప్రాజెక్టును వివిధ కోణాల్లో పరిశీలించి, దానికి అనుమతిని ఇచ్చాయి. అయితే ప్రస్తుత సొరంగ ప్రమాద ఘటన హిమాలయ ప్రాంతంలో ఇటువంటి ప్రాజెక్టులను చేపట్టడంపై అన్ని సందేహాలను, భయాలను పునరుద్ధరించింది. సొరంగాలు ఉత్తమ మార్గమే అయినా... అడవుల విధ్వంసాన్ని నివారించడానికి, పర్యావరణ హానిని తగ్గించడానికి సొరంగ నిర్మాణం ఒక మంచి ఎంపికగా కనిపి స్తున్నప్పటికీ, సొరంగం పరిమాణం చాలా ముఖ్యమైనది. పొడవాటి సొరంగాల వల్ల కలిగే నష్టాన్ని కొండలు తట్టుకోగలవా? చిన్న సొరంగాలను నిర్మించడంపై ప్రాజెక్ట్ బృందాలు ఆలోచించాలి. రహదారులు లేదా జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం పొడవైన నిర్మాణాలను నిర్మించే ముందు సొరంగ తవ్వకం కలిగించే పర్యావరణ ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేయాలి. అనాలోచితంగా చేసే సొరంగ నిర్మాణం భూగర్భ జల వనరులను ప్రభావితం చేస్తుంది. అదే సమయంలో కొండచరియలు విరిగిపడతాయి కూడా. విశాలమైన సొరంగాల తయారీ కోసం చేసే పేలుళ్లు ప్రమాదకరమైన పర్యావరణ పరిణామాలకు కారణమవుతాయి. విపత్తు సంసిద్ధతతోపాటు, నిర్మాణ సంస్థలు తీసుకునే భద్రతా జాగ్రత్తలు మరొక సమాధానం లేని ప్రశ్నగా ఉంటున్నాయి. సిల్క్యారా ప్రాజెక్ట్లో ప్రమేయం ఉన్న కంపెనీలు, ప్రభుత్వ సంస్థల వైపు నుండి లోపాలు ఉంటే వాటిని పూర్తి స్థాయి విచారణ మాత్రమే వెల్లడిస్తుంది. కొండల్లో భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులు, హైవేలు, పర్యాటక సంబంధిత మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దాదాపు రెండు దశాబ్దాలుగా చర్చలు సాగుతున్నాయి. నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో పర్యావరణ సంఘాల సుదీర్ఘ ఆందోళన తర్వాత, రెండు భారీ ప్రాజెక్టులను నిలిపివేశారు. పైగా కొత్త, పెద్ద ప్రాజెక్టులు ఏవీ చేపట్టలేదు. అయితే గత దశాబ్దంలో, కొండలపై నిర్మాణ కార్యకలాపాలను పునరుద్ధరించారు. భద్రతా సమస్యలు, పర్యావరణ సమీక్షల కోసం పిలుపులను విస్మరించారు. తప్పనిసరి పర్యావరణ ప్రభావ అంచనా వంటి వివిధ చట్టాలు, నిబంధనలను సంబంధిత ఏజెన్సీలు, ప్రభుత్వాలు తీవ్రంగా పలుచన చేసిపడేశాయి లేదా దాటవేశాయి. ఈలోగా, వాతావరణ మార్పుల కారణంగా పర్యా వరణ ప్రమాదాలు పెరిగాయి. దీని ఫలితంగా తీవ్రమైన వాతావరణ ఘటనలు, విపత్తులు సంభవిస్తాయి. సంసిద్ధత ఉందా? కొండల్లోని ప్రాజెక్టుల భద్రత, విపత్తులను ఎదుర్కొనే సంసి ద్ధతను పూర్తిగా పరిష్కరించడం అనేది మరొక ప్రధాన సమస్య. సొరంగ ప్రమాదాలకు గల కారణాలపై శ్రద్ధ చూపడం, నిర్మాణ స్థలాల వద్ద భద్రతను నిర్ధారించడం చాలా కీలకం. గతంలో ఉత్తరా ఖండ్లో జరిగిన సంఘటనలతో పాటు, ఇటీవల సిక్కింలో జరిగిన హిమనీనద సరస్సు ఉప్పెన వరద సంబంధిత విపత్తు ద్వారా కూడా ఇది బాగా నిరూపితమైంది. తక్కువ సాంకేతిక, భద్రతాపరమైన నిర్వహణ, అలాగే వర్ష మేఘాల విస్ఫోటనం, కొండ చరియలు విరిగి పడటం మొదలైన ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రమాదాలు తరచుగా సంభవిస్తాయి. అన్ని స్థాయిలలో శిక్షణ, భద్రతా నిర్వహణపై తగిన శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనేక సాంకేతిక, శాస్త్రీయ సమస్యలను ప్రణాళికా దశలోనే అధ్యయనం చేసి పరిష్కరించాలి. సిల్క్యారా–బడ్కోట్ సొరంగం కోసం నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి ప్లానింగ్, కన్సల్టెన్సీ సేవలను అందిస్తున్న యూరప్కు చెందిన బెర్నార్డ్ గ్రుప్పే సంస్థ, ‘‘సొరంగాన్ని తవ్వడం ప్రారంభమైనప్పటి నుండి, టెండర్ డాక్యుమెంట్లలో ఊహించిన దానికంటే భౌగోళిక పరిస్థితులు చాలా సవాలుగా ఉన్నా యని నిరూపితమయ్యాయి. ఆ విధంగా అమలు దశ ప్రారంభంలో చేపట్టిన తదుపరి అన్వేషణే దాని చర్యల ఫలితాలను నిర్ధారిస్తుంది’’ అని వెల్లడించింది. అటువంటి ప్రాజెక్టులను ఆమోదించే ముందు సమగ్రమైన భౌగోళిక అధ్యయనాల అవసరాన్ని ఇది సూచిస్తుంది. కేవలం ప్రమాదమా? కార్మికుల రక్షణ కోసం సొరంగం లభ్యత వంటి భద్రతా నియ మాలను, నిబంధనలను నిర్మాణ సంస్థలు అనుసరించి ఉంటే, సొరంగంలో చిక్కుకున్న కార్మికులను చాలా ముందుగానే రక్షించి ఉండ వచ్చు. ఇప్పుడు ఇలాంటి ప్రమాదం సంభవించినందున, ఇటీవలి సంవత్సరాలలో రాష్ట్రం అనేక విపత్తులను ఎదుర్కొన్న వాస్తవాన్ని బట్టి త్వరితగతిన కార్మికుల పరిరక్షణ కార్యకలాపాలకు వ్యవస్థలు ఉండాలి. సంబంధిత అన్ని ఏజెన్సీలు పరిస్థితిని ఎలా నిర్వహించాలనే అంశంపై తమ అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని పంచుకోవాలి. సిల్క్యారా సొరంగ విపత్తును కేవలం ప్రమాదంగా పరిగణించి హిమాలయాల్లో యధావిధిగా వ్యవహారాలను కొనసాగించడం తప్పు. కోలుకోలేని నష్టం నుండి హిమాలయ పర్యావరణాన్ని కాపాడ టానికి ఇది మరో మేల్కొలుపు. ఈ ప్రాంతంలో అభివృద్ధి ప్రాజెక్టులు అని పేర్కొంటున్న వాటి గురించి మనం అసౌకర్యమైన ప్రశ్నలు అడగవలసి ఉంటుంది. 900 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ హైవే, ఈ ప్రాంతంలో రైల్వే ప్రాజెక్టులు (కనీసం ఒక డజను సొరంగాల నిర్మాణంతో కూడి ఉంటాయి), పర్యాటకాన్ని నిస్సంకోచంగా ప్రోత్సహించడం (ఇది కొండలను మోసుకెళ్లే సామర్థ్యాన్ని మించి ఉంటోంది), జల విద్యుత్ ప్రాజెక్టుల భారీ స్థాయి అభివృద్ధి... ఇలా అన్నింటిపై ఒక పునరాలోచన అవసరం. కొండల్లోని ప్రజలకు విద్యుత్తు, ఉపాధి లేదా పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఆనందించే లేదా అందుబాటులో ఉండే ఇతర సౌకర్యాలు లేకుండా చేయాలని దీని అర్థం కాదు. పర్యా వరణా నికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఇవన్నీ ఎలా సాధిస్తామన్నదే కీలక ప్రశ్న. వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాల్కు తగ్గట్టుగా దీన్ని ఎలా సాధిస్తాం? సిల్క్యారాలో జరిగినటువంటి విషాద సంఘ టనల పట్ల మనకు ఒక సమగ్ర దృక్పథం లేకుండా ఎంతమాత్రమూ ముందడుగు వెయ్యలేం. వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత,దినేష్ సి. శర్మ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
సిల్క్యారా చేస్తున్న హెచ్చరిక
మానవ సంకల్పం ముందు శిఖరం తలొంచింది. పదిహేడు రోజులుగా కోట్లాదిమంది దేశ ప్రజానీకం మాత్రమే కాదు... దేశదేశాల పౌరులూ పడిన ఆరాటం, ఆత్రుత ఫలించాయి. ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగం కుప్పకూలటంతో 422 గంటలపాటు బందీలైన 41 మంది కార్మికులు మంగళవారం సాయంత్రం సురక్షితంగా బయటపడ్డారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నిపుణులు మొదలుకొని వైద్య నిపుణుల వరకూ అందరికందరూ రాత్రింబగళ్లు సమన్వయంతో సాగించిన కృషి ఒక ఎత్తయితే...అత్యంత కష్టసాధ్యమైన ర్యాట్ హోల్ మైనింగ్లో నిపుణులైన కార్మికులు చివరి 12 మీటర్ల పొడవునా వున్న శిథిలాలను ఎంతో ఓపిగ్గా, జాగ్రత్తగా తొలగించటం మరో ఎత్తు. వెరసి బందీలైనవారంతా క్షేమంగా బాహ్యప్రపంచాన్ని చూడగలిగారు. ఇలాంటి సంక్లిష్ట సందర్భాల్లో చిక్కుకున్నవారిలో సమూహ చేతన ఎంతమాత్రమూ సడలరాదన్నది మనస్తత్వ నిపుణుల మాట. బందీల్లో కనీసం ఒక్కరికైనా సద్యోజనిత నాయకత్వ లక్షణం వుంటే తప్ప ఇలాంటి సామూహిక చేతనకు అవకాశం వుండదు. 2010లో చిలీ రాగి గనుల్లో పదివారాలు చిక్కుకున్న కార్మికులైనా... మరో ఏడెనిమిదేళ్లకు ఉత్తర థాయ్లాండ్లోని కొండ గుహల్లోకి వరద నీరు ప్రవేశించటంతో పదకొండు రోజులపాటు చిక్కుకున్న ఫుట్బాల్ టీమ్ పిల్లలైనా క్షేమంగా బయటపడటానికి కారణం ఇదే అంటారు. భయానక పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరైనా నాలుగో రోజు వరకూ ప్రాణాలు నిలుపుకోగలిగితే మానసికంగా వారు దృఢంగా వున్నట్టేనని, ఆ తర్వాత వారు దేన్నయినా సునాయాసంగా అధిగమిస్తారని మనస్తత్వ నిపుణులు చెబుతారు. వెలుపలి ప్రపంచంలో కోట్లాదిమంది పడుతున్న తపనకు బందీలైన ఆ 41 మంది కార్మికుల దృఢచిత్తం తోడవటం వల్లనే ఇదంతా సవ్యంగా పూర్తయింది. ఆ కార్మిక కుటుంబాల మాటేమోగానీ... అశేష ప్రజానీకం ఆశానిరాశాల్లో ఊగిసలాడిన తీరు మాత్రం మరిచిపోలేనిది. మినుకు మినుకుమంటున్న ఆశలు, అంతలోనే గంపెడు నిరాశలో ముంచే పరిణామాలూ ఈ పదిహేడురోజులూ ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఆ కార్మికులు బయటికిరావటం నూటికి నూరుపాళ్లూ సాధ్యమేనని మంగళవారం సాయంత్రానికిగానీ ధ్రువపడలేదు. బందీలను విడిపించటానికి భారీ యంత్రాలను వినియోగించి కొండను తొలుస్తున్న క్రమంలో ఈనెల 16న సంభవించిన భూకంపం అన్ని రకాల ప్రయత్నాలపైనా నీళ్లుజల్లింది. ఒక దశలో పైపును అమరుస్తుండగా భారీ పగుళ్ల శబ్దాలు విన బడ్డాయి. ఈలోగా 25 టన్నుల భారీయంత్రమైన అగర్ మెషిన్తో తవ్వుతుండగా శిథిలాల్లో ఇరుక్కున్న ఇనుప రాడ్లు తగిలి దాని బ్లేడ్లు తెగిపడ్డాయి. ఇక ర్యాట్హోల్ మైనింగ్ నిపుణులు రంగంలో దిగితే తప్ప ఇది పూర్తికాదని నిర్ధారించుకుని మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ల నుంచి వారిని రప్పించారు. అయితే ఈ ఆనందోత్సాహాల సందడిలో అసలు విషయం మరుగున పడకూడదు. అపార ఖనిజ సంపద వున్న దేశాలన్నిటా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చటానికీ, ప్రపంచంలో అగ్రగామిగా నిలిచేందుకూ ప్రభుత్వాలు తపిస్తున్నాయి. ఈ క్రమంలో పర్యావరణానికి కలుగుతున్న చేటు సరే, మనుగడ కోసం మరేదీ చేయలేక ప్రాణాలకు తెగించి గనుల్లో పనిచేస్తున్న బడుగు జీవులు సమిధలవుతున్నారు. చాన్నాళ్ల క్రితమే ఎన్జీటీ నిషేధించిన ర్యాట్ హోల్ మైనింగ్ సిల్క్యారాలో కార్మికుల ప్రాణాలు కాపాడటానికి దోహదపడిన మాట నిజమే అయినా...ఇప్పటికీ చట్టవిరుద్ధంగా అలాంటి మైనింగ్ సాగుతున్నదని ఈ ఎపిసోడ్ నిరూపించింది. కేవలం ఒక మనిషి పాకుకుంటూ వెళ్లగలిగేంత కంత తవ్వుకుంటూ భూగర్భం మూలల్లో వున్న బొగ్గు లేదా ఇతర ఖనిజాలనూ సేకరించటం ఈ కార్మికుల పని. ఈ క్రమంలో ఎక్కడైనా పైకప్పు కూలిందంటే వాళ్ల బతుకులు ముగిసినట్టే. గనుల పరిసర ప్రాంతాల్లో వుంటున్నవారికే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నప్పుడు నేరుగా అందులోకి ప్రవేశించి నిత్యం ఆ దుమ్మూ ధూళితో సావాసం చేసేవారికి ఎంత ముప్పు కలుగుతుందో వేరే చెప్పనవసరం లేదు. ఇక భూమి కుంగిపోవటం, భూగర్భ జలాలు కలుషితం కావటంవంటి పర్యావరణ సమస్యలకు అంతే లేదు. ఇంతా చేసి ఇలాంటి కార్మికుల శ్రమంతా భారీ యంత్రపరికరాలపై పెట్టుబడులూ, అనుమతులు, రాయల్టీ చెల్లింపులూ లేకుండా చట్టవిరుద్ధంగా దోపిడీచేసే మైనింగ్ మాఫియాల పాలవుతోంది. కార్పొరేట్ల లాభార్జనకు దోహదపడుతోంది. హిమశిఖరాలు ఆల్ప్ పర్వతశ్రేణిలా పురాతనమైనవి కాదు. అవి ఆరున్నరకోట్ల సంవత్సరా లనాటివైతే, హిమశిఖరాల వయసు నాలుగుకోట్ల సంవత్సరాలు మించదు. అందువల్లే వాటి భూగర్భంలో నిరంతర చలనం, ఒత్తిడి, అధిక ఉష్ణోగ్రత కొనసాగుతున్నాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీతో సహా 51 శాతం నేల కుంగుబాటు ప్రాంతంలో వున్నదని జర్నల్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్స్ పత్రిక చాన్నాళ్ల క్రితం తెలిపింది. ఇక్కడి కొండల్లో మట్టి, రాళ్లు కలిసి వుండటం వల్ల ఈ కుంగుబాటు ప్రమాదం ఎక్కువ. గత కొన్నేళ్లుగా జోషీమuŠ‡ కుంగుబాటు, ఇతర ప్రాంతాల్లో సైతం భూమి నెర్రెలుబారటం ప్రమాదకర సంకేతాలందిస్తోంది. చార్ధామ్ యాత్రికులకూ, పర్యాటకులకూ అనుకూలంగా వుంటుందని 900 కిలోమీటర్ల మేర చార్ధామ్ హైవే నిర్మాణం చేపట్టారు. సిల్క్యారా సొరంగ నిర్మాణం దానిలో భాగమే. ఇవిగాక ఎన్నో జల విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. ఈ ప్రాజెక్టులను సమీక్షించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సిల్ క్యారా ఉదంతం మనల్ని హెచ్చరిస్తోంది. అప్రమత్తం కావటం మనకే మంచిది. -
సొరంగంలో సంకల్ప స్ఫూర్తి.. ప్రధాని ప్రశంసలు.. ఎవరీ గబ్బర్ సింగ్ నేగి?
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో ఉత్తరకాశీ సిల్క్యారా సొరంగ ప్రమాదంలో చిక్కుకుని 17 రోజులు పర్వత గర్భంలో గడిపిన 41 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. నవంబర్ 12న ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ ప్రయత్నాలు పూర్తయి బయటపడే వరకూ సొరంగం లోపల చిక్కుకున్న కార్మికుల్లో మానిసిక స్థైర్యం చాలా అవసరం. విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు మానసికంగా చాలా ధైర్యం కావాలి. బతకాలన్న సంకల్పం ఉండాలి. బతుకుతామన్న ఆశ కోల్పోకూడదు. ఇది అందరికీ ఉండదు. కానీ ఉత్తరకాశీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 41 మందిలో ఈ మానసిక స్థైర్యాన్ని ప్రదర్శించాడు గబ్బర్ సింగ్ నేగి. ఆ స్థైర్యాన్ని మిగతా 40 మందికీ పంచాడు. సొరంగంలో ఉన్న 17 రోజులూ తోటి కార్మికులకు యోగా, ధ్యానం నేర్పించి చేయించాడు. వారు శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉండేలా చూసుకున్నారు. అందరం తప్పకుండా బయటపడతామంటూ వారిలో ధైర్యం నూరిపోశాడు. చివరగా నేనే.. సొరంగంలో ఉండగా గబ్బర్ సింగ్ నేగి చెప్పిన మాటలను ఆయన అతని సోదరుడు జయమల్ సింగ్ నేగి తెలియజేశారు. రెస్క్యూ ప్రారంభమైనప్పుడు తొక్కిసలాట జరుగుతుందా అని అతన్ని అడిగినప్పుడు.. నేను సీనియర్ని..అందరూ బయటకు వచ్చిన తర్వాతే నేను చివరిగా వస్తాను అని గబ్బర్ సింగ్ నేగి చెప్పినట్లుగా జయల్ సింగ్ నేగి పేర్కొన్నారు. సొరంగం నుంచి సురక్షితంగా బయటపడిన కార్మికులందరూ తమ సహచరుడు గబ్బర్ సింగ్ నేగి కృషిని ప్రశంసించారు. తమను సురక్షితంగా మానసికంగ సంతోషంగా ఉంచడంలో నేగి పాత్రను వివరించారు. యోగా, ధ్యానంతోపాటు లూడో, చెస్ వంటి ఆటలు కూడా ఆడించినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని సైట్లోని మానసిక వైద్యులలో ఒకరైన డాక్టర్ రోహిత్ గోండ్వాల్ కూడా తెలిపారు. ప్రధాని ప్రశంసలు గబ్బర్ సింగ్ నేగీ ధైర్యాన్ని, చొరవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మెచ్చుకున్నారు. కార్మికులు సురక్షితంగా బయటపడిన తర్వాత మంగళవారం రాత్రి రాత్రి వారితో ఫోన్ ద్వారా మాట్లాడారు. గబ్బర్ సింగ్ నేగి గురించి తోటి కార్మికులు చెప్పడంతో ప్రధాని మోదీ ఆయన్ను అభినందించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement