-
Group 4 Notification: 9,168 కొలువులకు నోటిఫికేషన్.. పరీక్ష విధానం ఇదే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తంగా 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎస్పీఎస్సీ ఇంత భారీ సంఖ్యలో గ్రూప్స్ కొలువుల భర్తీకి ప్రకటన వెలువరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇందులో 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్ కేటగిరీల పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తులు: గ్రూప్–4 పోస్టులకు ఈ నెల 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ వరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలపై స్పష్టత ఇచ్చింది. ఆయా పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, కేటగిరీల వారీగా ఖాళీలు, వేతన స్కేల్, వయో పరిమితి తదితర వివరాలతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ను ఈ నెల 23న కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందని.. దీనిని వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహిస్తామని వెల్లడించింది. అన్నీ జూనియర్ అసిస్టెంట్ కేటగిరీవే.. తాజాగా గ్రూప్–4 కేటగిరీలో భర్తీ చేయనున్న ఉద్యోగాలన్నీ జూనియర్ అసిస్టెంట్ స్థాయికి సంబంధించినవే. ఇందులో నాలుగు కేటగిరీలు ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ కేటగిరీలో 429 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ కేటగిరీలో 6,859 పోస్టులు, జూనియర్ ఆడిటర్ కేటగిరీలో 18 పోస్టులు, వార్డ్ ఆఫీసర్ కేటగిరీలో 1,862 పోస్టులు ఉన్నాయి. -
టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్–1 ప్రిలిమ్స్ హాల్టికెట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్కు హాజరయ్యే అభ్యర్థుల హాల్టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఈనెల 16వ తేదీ వరకు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని టీఎస్పీఎస్సీ కల్పించగా..తొలిరోజే 1,32,406మంది అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకున్నారు.. ఈనెల 16వ తేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 1041 పరీక్షా కేంద్రాల్లో జరిగే ప్రిలిమ్స్కు 380202 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్షను సాఫీగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. టెస్ట్ బుక్లెట్లో మార్పులు...: గ్రూప్–1 పరీక్ష నిర్వహణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టెస్ట్ బుక్లెట్ను కొత్తగా డిజైన్ చేసింది. ఇదివరకు టెస్ట్బుక్లెట్ సిరీస్ కోడ్ స్థానంలో ఏ,బీ,సీ,డీ ని రాయాల్సి ఉండేది. అలా కాకుండా పరీక్షను మరింత పారదర్శకతతో నిర్వహించేందుకు టెస్ట్బుక్లెట్ సిరీస్ స్థానంలో ఆరు అంకెల నంబర్ను ఏర్పాటు చేసింది. నిర్దేశించిన బుక్లెట్ నంబర్ను ఓఎంఆర్ షీట్లో పూరించాల్సి ఉంటుంది. టెస్ట్బుక్లెట్ నంబర్ను ఓఎంఆర్ షీట్లో నిర్దేశించిన స్థానంలో నిర్ణీత పద్ధతిలో బ్లూ లేదా బ్లాక్ బాల్పాయింట్ పెన్తో గుర్తించే విధానాన్ని వివరణాత్మకంగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ కార్యదర్శి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్–2 అభ్యర్థుల మార్కుల వివరాలు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ గ్రూప్–2 ఉద్యోగాలకు ఇటీవల నిర్వహించిన ఇంట ర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల మార్కుల వివరాలను తమ అధికారిక వెబ్సైట్లో ఉంచినట్లు వెల్లడించింది. మొత్తం 1,032 ఉద్యోగ ఖాళీలకు 2,064 మందిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించగా, 2,028 మంది హాజరయ్యారని, ఇంటర్వ్యూకు హాజరైన వారందరి మార్కుల వివ రాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఎ.వాణీప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థులకు ఈ ఏడాది జూలై 1 నుంచి ఆగస్టు 27 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించిన విషయం తెలిసిందే. టీఆర్టీ ఎస్జీటీ ఫలితాలు వెల్లడి 909 ఖాళీలకు 843 మంది ఎంపిక సాక్షి, హైదరాబాద్: టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఇంగ్లిషుమీడియం) ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 909 ఖాళీలకు నిర్వహించిన ఈ పరీక్ష ద్వారా ఉత్తీర్ణులైన వారి వివరాలను కోర్టు ఆదేశాలకనుగుణంగా వెల్లడించినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఎ.వాణీప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో 909 ఖాళీలకు 843 మంది ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఆమె వెల్లడించారు. 5 ఖాళీలకు సంబంధించిన ఫలితాలు కోర్టులో కేసు ఉన్నందున వెల్లడించలేదని, 39 వికలాంగ ఖాళీల ఫలితాలను విద్యాశాఖ నుంచి అందే తదుపరి సమాచారం ఆధారంగా ప్రకటిస్తామని, మరో 21 ఖాళీలను కూడా కోర్టుల్లో కేసులు, ఏజెన్సీ క్లెయిమింగ్ నిర్ధారణ కారణంగా ప్రకటించలేదని, మరో ఖాళీకి అర్హులైన అభ్యర్థి దొరకనందున 843 మంది జాబితాను ప్రకటించినట్లు ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
2011 గ్రూపు-1 మెయిన్స్లో తెలంగాణ అంశాలు
టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అర్హుల జాబితా, పరీక్షల షెడ్యూలు సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 13 నుంచి 23 వరకు నిర్వహించనున్న 2011 గ్రూపు-1 మెయిన్స్ పరీక్షను అప్పటి నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారమే నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. పేపరు-1లోని (జనరల్ ఎస్సే) సెక్షన్-3లో, పేపరు-3లోని (ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ) సెక్షన్ 2, 3లో తెలంగాణకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు ఇవ్వనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ పరీక్ష రాసేందుకు అర్హులైన అభ్యర్థుల జాబితా, పరీక్షల షెడ్యూలును టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వివరించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ పరీక్షలకు మొత్తంగా 8,760 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వెల్లడించింది. 196 మందికి వివిధ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 1,003 మందికి విజయవాడలో, విశాఖపట్నంలో 1,342, వరంగల్లో 620, హైదరాబాద్లో 4,701, తిరుపతిలో 898 మందికి పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. అభ్యర్థుల వారీగా కేటాయించిన పరీక్ష కేంద్రం వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వివరించింది. -
‘వన్టైమ్’కు భారీ స్పందన
టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో 5.83 లక్షల మంది రిజిస్ట్రేషన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) చేపట్టిన ‘వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)’కు భారీ స్పందన వస్తోంది. కమిషన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీనికి ఇప్పటివరకు 5,83,839 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర సర్వీసు కమిషన్లో లేని విధంగా ‘ఓటీఆర్’ విధానాన్ని టీఎస్పీఎస్సీ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వివిధ ఉద్యోగ పరీక్షలకు సంబంధించి సిలబస్ ప్రకటన, పలు పోస్టుల నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నేపథ్యంలో ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువ గా ఉన్నారు. పురుషులు 3,93,947 మంది, మహిళలు 1,89,892 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక కీలకమైన గ్రూప్స్ పరీక్షల నోటిఫికేషన్లు జారీ ప్రారంభమైతే ఇది మరింత పెరుగుతుందని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి అత ్యధికం..: ఓటీఆర్ చేసుకున్న వారిలో హైదరాబాద్ జిల్లాకు చెందిన నిరుద్యోగులే ఎక్కువగా ఉన్నారు. తర్వాత స్థానంలో కరీంనగర్, వరంగల్ జిల్లాల వారు ఉన్నారు. కరీంనగర్ జిల్లా నుంచి 68,979 మంది, వరంగల్ నుంచి 67,514 మంది ఓటీఆర్ చేసుకున్నారు. ఇక ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 48,295 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం గమనార్హం. ఏ రాష్ట్రం పేరూ పేర్కొనకుండా మరో 1,892 మంది ఓటీఆర్ చేసుకున్నారు. ‘వన్టైమ్’కు దరఖాస్తుల తీరు.. జిల్లా పురుషులు మహిళలు మొత్తం మహబూబ్నగర్ 31,937 12,692 44,629 రంగారెడ్డి 37,428 21,179 58,607 హైదరాబాద్ 44,298 30,608 74,906 మెదక్ 28,456 12,673 41,129 నిజమాబాద్ 23,630 12,129 35,759 ఆదిలాబాద్ 24,979 10,735 35,714 కరీంనగర్ 45,350 23,629 68,979 వరంగల్ 45,294 22,220 67,514 ఖమ్మం 32,528 15,527 48,055 నల్లగొండ 40,796 17,564 58,360 ఇతర రాష్ట్రాలవారు 37,927 10,368 48,295 రాష్ట్రాన్ని పేర్కొననివారు 1,324 568 1,892 మొత్తం 3,93,947 1,89,892 5,83,839
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
Advertisement