-
కేసీఆర్ సన్నిహితుడికి షాక్
జహీరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరుండటమే కాకుండా జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి రెండు పర్యాయాలు విజయం సాధించిన బీబీ పాటిల్ కోటకు బీటలు వారాయి. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, కామారెడ్డి జిల్లా పరిధిలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో బీఆర్ఎస్ కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, అందోల్, నారాయణఖేడ్ స్థానాలను కోల్పోయింది. జహీరాబాద్, బాన్సువాడ స్థానాలను మాత్రమే నిలుపుకొంది. పాటిల్ కేసీఆర్కు సన్నిహితుడిగా ఉండటంతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ సభల నిర్వహణ బాధ్యతలు సైతం చూశారు. అలాగే సొంత పార్లమెంట్ పరిధిలోని సిట్టింగ్ స్థానాలను సైతం నిలుపుకోలేక పోయారు. అంతే కాకుండా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక్కడి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి 6,741 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో కేసీఆర్ రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో ఈ స్థానం బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇదిలా ఉంటే పాటిల్ తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం అయిన జుక్కల్లో సైతం బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతారావు బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్షిండేపై గెలుపొందారు. ఎల్లారెడ్డిలోనూ బీఆర్ఎస్ అభ్యర్థి జాజుల సురేందర్, కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావు చేతిలో 24 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న అందోల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ సైతం కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ చేతిలో 28 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. నారాయణఖేడ్ స్థానం సైతం బీఆర్ఎస్ అభ్యర్థి అయిన భూపాల్రెడ్డి 6,547 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి చేతిలో ఓటమి చెందారు. బాన్సువాడ, జహీరాబాద్ సిట్టింగ్ స్థానాలను మాత్రమే బీఆర్ఎస్ నిలుపుకొంది. గత ఎన్నికల్లో జహీరాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థికి 35 వేల ఓట్ల మెజారిటీ రాగా అది 13 వేలకు పడిపోయింది. ఇక్కడే ప్రచారానికి పరిమితం జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పార్లమెంట్ పరిధిలో అంతంత మాత్రంగానే ప్రచారం చేశారు. ప్రధానంగా తన సొంత నియోజకవర్గం అయిన జుక్కల్తోపాటు కేసీఆర్ పోటీ చేసిన కామారెడ్డి నియోజకవర్గాలపైనే దృష్టి పెట్టారు. అయినా వారిని ఓటమి నుంచి తప్పించలేక పోయారు. కేసీఆర్, హరీశ్రావు జహీరాబాద్కు ప్రచారానికి వచ్చినప్పుడు మాత్రమే పాటిల్ జహీరాబాద్ సభల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రచారానికి దూరంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలవారీగా పోలైన ఓట్లు బీఆర్ఎస్ : 5,30,194 కాంగ్రెస్ : 5,48,348 బీజేపీ : 1,72,575 -
ఐటీ మంత్రిగా ఎమ్మెల్యే మదన్మోహన్రావు..?
సాక్షి, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడంతో మంత్రి పదవులపై చర్చ మొదలైంది. జిల్లా నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న దానిపై ఊహాగానాలు జోరందు కున్నాయి. జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేత అయిన షబ్బీర్అలీ గురించి పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మైనారిటీ కోటాలో ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అలాగే తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన సాఫ్ట్వేర్ సంస్థల యజమాని, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావుకు కాలం కలిసొస్తే ఐటీ మంత్రిగా అవకాశం రావచ్చన్న ప్రచారం జరుగుతోంది. జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. ఎల్లారెడ్డి, జుక్కల్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇద్దరు కూడా తొలిసారి విజయం సాధించారు. ఇందులో మదన్మోహన్రావు ఐటీ కంపెనీల యజమాని. ఆయన కు పార్టీ జాతీయ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. అదే ఆయనకు ఎల్లారెడ్డి టికెట్టు రావడానికి కారణమైంది. ఆయనకు మంత్రి మండలిలోనూ అవకాశం కల్పిస్తారని పార్టీ నాయకులు ఆశిస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో అనుభవంతో పాటు పార్టీలో ఐటీ రంగానికి సంబంధించి వివిధ రకాల సేవలందించినందున ఆయనకు ఐటీ శాఖ మంత్రి బాధ్యతలు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. మైనారిటీ కోటాలో.. జిల్లాలో సీనియర్ నాయకుడైన మాజీ మంత్రి షబ్బీర్అలీ.. 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే అప్పటి చెన్నారెడ్డి మంత్రిమండలిలో అవకాశం దక్కించుకున్నారు. తర్వా త 2004 ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్సార్ మంత్రి మండలిలో క్యాబినెట్ మంత్రిగా చేరారు. 2009 లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి, శాసన మండలి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు అప్పగించింది. ఆయన 2014, 2018 ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఆయన నాలుగైదేళ్లుగా జనంలోనే ఉండి నిరంతరం పనిచేశారు. అయితే కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీకి దిగడంతో షబ్బీర్ స్థానంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బరిలోకి వచ్చారు. మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్న నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి షబ్బీర్ను బరిలోకి దింపినా గెలవలేకపోయారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో షబ్బీర్కు మంత్రి మండలిలో అవకాశం దక్కుతుందన్న ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడి జిల్లానుంచి గెలిచిన కాంగ్రెస్ నేతల్లో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందోనన్న విషయమై అంతటా చర్చలు నడుస్తున్నాయి. -
ఉద్యమంలో గులాబీ జెండాను ముద్దాడిన నేల.. సీఎం పోటీ చేసినా తప్పని ఓటమి
తెలంగాణ ఉద్యమంలో గులాబీ జెండాను హత్తుకున్న పల్లెలిప్పుడు అదే పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేశాయి. తొమ్మిదిన్నరేళ్ల పాలన మీద అసంతృప్తిని ఓట్ల రూపంలో బయటపెట్టాయి. ఆఖరుకు సీఎం కేసీఆర్ పోటీ చేసినా ఆదరించలేదు. దీంతో కామారెడ్డితో పాటు పొరుగునే ఉన్న ఎల్లారెడ్డి నియోజక వర్గం, ఆ పక్కనే ఉన్న జుక్కల్లోనూ బీఆర్ఎస్కు ఓటమి తప్పలేదు. వరుసగా గెలిపించిన ప్రజలు ఈసారి వద్దనుకుని సాగనంపారు. సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కేసీఆర్ నాయకత్వంలో 2001 లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో చైతన్యవంతమైన సమాజం గులాబీ జెండాను చేతబట్టి ఉద్యమంలో ముందుండి నడిచింది. టీఆర్ఎస్ స్థాపించిన తొలినాళ్లలోనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచారెడ్డిలో ఎంపీటీసీలను ఏకగ్రీవంగా ఎన్నుకుని ఎంపీపీ పీఠాన్ని కై వసం చేసుకుంది. అలాగే ఎనిమిది జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుని జిల్లా పరిషత్పై గులాబీ జెండా ఎగరడంలో కీలకభూమిక పోషించింది ఈ రెండు నియోజకవర్గాలే.. 2004 ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగు రవీందర్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తులో భాగంగా కామారెడ్డి నుంచి పోటీ చేసిన షబ్బీర్ అలీని ఇక్కడి ప్రజలు ఆదరించి అసెంబ్లీకి పంపించారు. తెలంగాణ సాధన కోసమే ఎన్నికల్లో విజయతీరాలకు తీసుకువెళ్లారు. 2008 లో ఎమ్మెల్యేల రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలో ఎల్లారెడ్డిలో ఏనుగు రవీందర్రెడ్డిని ఓడించినా ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయననే గెలిపించారు. తెలంగాణ ఉద్యమం ఫలితంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం 2009 డిసెంబర్ 9న పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. అయితే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు చెప్పగానే ఆంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమవడంతో అప్పటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీంతో మరోసారి ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ప్రజల నుంచి తీవ్ర నిరసనలు రావడం, ఉద్యమకారులు ఆత్మబలిదానాలకు పాల్పడడంతో అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, పోచారం శ్రీనివాస్రెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్నారు. ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ తరఫున బరిలో నిలవగా.. ఓటర్లు వారినే తిరిగి ఎన్నుకున్నారు. తరువాత ఉద్యమం తీవ్రమై సబ్బండ వర్ణాలు భాగమయ్యాయి. రైల్రోకో, హైవేల దిగ్బంధం వంటి కార్యక్రమాలు, సకల జనుల సమ్మెల్లో జిల్లా ప్రజలంతా పాల్గొన్నారు. ఎన్నో పోరాటాలతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. 2014 జూన్ 2న నూతన రాష్ట్రం ఆవిర్భవించింది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరడంతో జిలా ప్రజలంతా సంతోషించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాలు..ఈసారి మూడుచోట్ల ఓటమి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్ విఫలమైందన్న భావన బలపడుతూ వచ్చింది. దీంతో గులాబీ కోట బీటలు వారింది. సీఎం కేసీఆర్ స్వయంగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచినా.. ప్రజలు ఆయననూ తిరస్కరించారు. అలాగే ఎల్లారెడ్డిలో బరిలో నిలిచిన జాజాల సురేందర్రెడ్డి, జుక్కల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హన్మంత్ సింధేలనూ ఓడించారు. బాన్సువాడ నియోజకవర్గంనుంచి పోటీ చేసిన పోచారం శ్రీనివాస్రెడ్డి ఒక్కరే గెలుపొందారు. కేసీఆర్ ఉద్యమం తొలినాళ్లలో కామారెడ్డి నియోజక వర్గంలో బ్రిగేడియర్గా పనిచేశారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాలు ఆయనకు తెలుసు. కేసీఆర్ అంటే అభిమానించేవాళ్లు ఇక్కడ వేలాది మంది ఉంటారు. అలాంటిది కేసీఆర్ పోటీ చేసినా ఓడిపోవడం ఉద్యమకారులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ ఓటమితో శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన ఎన్నికల్లో జనం జిల్లాలో గులాబీ పార్టీకి సలాం కొట్టారు. కామారెడ్డి నుంచి గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి నుంచి ఏనుగు రవీందర్రెడ్డి, బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాస్రెడ్డి, జుక్కల్ నుంచి హన్మంత్ సింధేలను గెలిపించారు. 2018 ఎన్నికల్లో కూడా కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజక వర్గాల నుంచి తిరిగి గంప గోవర్ధన్, పోచారం శ్రీనివాస్రెడ్డి, హన్మంత్ సింధేలనే అసెంబ్లీకి పంపించారు. ఎల్లారెడ్డిలో వరుసగా మూడుసార్లు గెలుపొందిన ఏనుగు రవీందర్రెడ్డిని మాత్రం ఓడించి, మరో ఉద్యమ నాయకుడైన కాంగ్రెస్ అభ్యర్థి జాజాల సురేందర్ను గెలిపించారు. కొద్దిరోజుల్లోనే ఆయన కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. -
మంత్రి రేసులో సీతక్క, సురేఖ
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే ప్రభుత్వంలో తొలి కేబినేట్లో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది? 18 మంది మంత్రివర్గ సహచరులతో కొత్త సీఎం పరిపాలన చేయనున్న నేపథ్యంలో జిల్లాలో ఎందరికి అవకాశం దక్కనుంది? జిల్లాలో మొత్తం 10 స్థానాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎవరిని మంత్రి పదవి వరించనుంది?’ ఇదీ ఉమ్మడి వరంగల్లో సర్వత్రా సాగుతున్న చర్చ. 2023 అసెంబ్లీ ఎ న్నికల ఫలితాలు వెలువడిందే తడవుగా ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని హోటల్ ఎల్లాలో ఏఐసీసీ నేతలు మాణిక్రావు ఠాగూర్, డీకే శివకుమార్, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి తదితరులతో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఏకవాక్య తీర్మానంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు నిర్ణయాధికారం అప్పగించారు. సాయంత్రం వరకు సీఎల్పీ నేత ఎంపిక పూర్తవుతుందని భావించినా.. అది మంగళవారానికి వాయిదా పడింది. సీఎల్పీ నిర్వహించిన ఏఐసీసీ పరిశీలకులకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. సీఎల్పీ నేత ఎంపికతో పాటు మంత్రివర్గ కూర్పు కూడా అక్కడే జరగనున్న నేపథ్యంలో.. ఆజాబితాలో జిల్లా నుంచి ఎవరుంటా రు? ఉమ్మడిజిల్లా నుంచి మంత్రిగా ఎవరికి అవకా శం దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. మంత్రి రేసులో సీతక్క, సురేఖ ఉమ్మడి వరంగల్లో 12 అసెంబ్లీ స్థానాలకుగాను 10 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా.. ఇక్కడి నుంచి ఇద్దరికి అవకాశం లభించవచ్చంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్కు మంత్రి పదవులు దక్కాయి. ఈనేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఇద్దరికి అవకాశం ఉంటుందంటున్నారు. ములుగు నుంచి వరుసగా రెండోసారి 33,700 పైచిలుకు ఓట్లతో గెలిచిన ధనసరి సీతక్కకు మొదట కీలకమైన మంత్రి పదవి వరించనుందనే చర్చ జరుగుతుండగా.. రెండో మంత్రి కోసం కొండా సురేఖ రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. ► ములుగు మండలం జగ్గన్నపేటకు చెందిన వ్యవసాయకూలీల కుటుంబంలో పుట్టిన సీతక్క రాజకీయాల్లోకి రాకముందు జనశక్తి పార్టీకి సంబంధించిన అజ్ఞాత దళంలో దళ కమాండర్గా పని చేశారు. ఆతర్వాత జనజీవన స్రవంతిలో కలిసి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. న్యాయవాదిగా వరంగల్ కోర్టులో ప్రాక్టీసు చేశారు. అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసి రెండుసార్లు ము లుగు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడోసారి గెలిచి కీలక నాయకురాలిగా ఎదిగిన ఆమెను రేవంత్రెడ్డి దేవుడిచ్చిన ఆడబిడ్డగా చెప్పారు. ఏఐసీసీ అధిష్టానంలోనూ మంచిపేరున్న ఆమెకు మంత్రి పదవి ఖాయమైనట్లే అంటున్నారు. ► రెండో మంత్రి పదవి కోసం వరంగల్ తూర్పు నుంచి గెలుపొందిన కొండా సురేఖ ప్రయత్నంలో ఉన్నారు. బీసీ(పద్మశాలి) సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ ఎంపీటీసీ నుంచి మంత్రి వరకు అనేక పదవుల్లో కొనసాగారు. గీసుకొండ ఎంపీపీగా, 1999, 2004 శాయంపేట ఎమ్మెల్యేగా, 2009 పరకాల, 2014లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కేబినెట్లో రాష్ట్ర మంత్రిగా పని చేశారు. భర్త కొండా మురళి సహకారంతో రాజకీయాల్లో రాణించి ఆమె కూడా ఈసారి వరంగల్ తూర్పు నుంచి గెలిచి మంత్రి పదవి ఆశిస్తున్నారు. ► టీడీపీ నుంచి 1994, 1999, 2004లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవూరి ప్రకాశ్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. సీనియర్ నేత, శాసనసభ్యుడిగా ఉన్న రేవూరి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 7న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం.. సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని హోటల్ ఎల్లాలో ఏఐసీసీ నేతలు మాణిక్రావు ఠాగూర్, డీకే శివకుమార్.. ఎమ్మెల్యేలతో భేటీ అయిన నేపథ్యంలో సీఎల్పీ నేత, సీఎం పేరు ప్రకటిస్తారని అందరూ భావించారు. ఏకవాక్య తీర్మానంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు నిర్ణయాధికారం అప్పగించిన కొద్ది గంటల్లో సీఎల్పీ నేత ఎంపిక పూర్తయి కొత్త సీఎం రాత్రి 8.30 గంటలకు ప్రమాణస్వీకారం పూర్తవుతుందనకున్నారు. పూర్తిస్థాయిలో మంత్రివర్గంతో సోనియాగాంధీ జన్మదినం రోజున లాల్బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు ప్రకటించారు. సీఎల్పీ నేత ఎంపికపై స్పష్టమైన ప్రకటన రాకపోగా.. అందుకు భిన్నంగా ఏఐసీసీ పరిశీలకులుగా ఉన్న డీకే శివకుమార్, మాణిక్రావు ఠాగూర్ తదితరులకు ఢిల్లీకే రావాల్సిందిగా అధిష్టానం సూచించడంతో హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. ఢిల్లీలోనే మంగళవారం సమావేశం కానున్న ఏఐసీసీ, టీపీసీసీ నేతలు.. సీఎంతో పాటు మంత్రి వర్గం కూర్పుపై తేల్చనున్నారని సమాచారం. కాగా ఇప్పటికే సీఎంగా రేవంత్రెడ్డి పేరు ఖరారైందని, 5, 6 తేదీల్లో మంచిరోజులు లేకపోవడంతో 7న ఉదయం 10 గంటలకు కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ నుంచి ఎంపికయ్యే మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేసే అవకాశం ఉందని పార్టీవర్గాల సమాచారం. -
ఈ అభ్యర్థులు మాకు నచ్చలే..
హైదరాబాద్: శాసనసభ ఎన్నికలలో నోటా ఓట్లు కీలకమని మరోసారి రుజువైంది. బరిలోకి దిగిన అభ్యర్థులు నచ్చకపోతే నన్ ఆఫ్ ది ఎబౌ (నోటా) గుర్తును నొక్కే అవకాశం ఉండటంతో ఈసారి నోటాకు ఓట్లు బాగానే పడ్డాయి. గ్రేటర్లోని చాలా నియోజకవర్గాలలో మూడు ప్రధాన పారీ్టల తర్వాత అత్యధిక ఓట్లు వచ్చింది నోటాకే. అత్యధికంగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో 15,418 రాగా.. అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో 12,824 వచ్చాయి. హైదరాబాద్లో నోటాకు 16,222 ఓట్లు పోలయ్యాయి. అత్యధికం కుత్బుల్లాపూర్, అత్యల్పం నాంపల్లి.. అత్యధికంగా కుత్బుల్లాపూర్లో నోటాకు 4,079 ఓట్లు రాగా.. అత్యల్పంగా నాంపల్లిలో 544 ఓట్లొచ్చాయి. చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య గెలిచిన మెజారిటీ కంటే నోటా ఓట్లే ఎక్కువ ఉండటం కొసమెరుపు. ఇక్కడ యాదయ్య కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్పై 268 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. నోటాకు వచి్చన ఓట్లు 1,423 కావడం గమనార్హం. యాకుత్పురలో 878 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్. ఇక్కడ నోటాకు వచ్చిన ఓట్లు 704. నోటా ఓట్లు గతంలో కంటే తక్కువే.. అయితే 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటర్లు నోటా ఓట్లు తక్కువే పోలయ్యాయి. గత ఎన్నికలలో మూడు జిల్లాలతో కూడిన గ్రేటర్లో నోటాకు 44,935 ఓట్లు రాగా.. తాజా ఫలితాల్లో 471 తగ్గి నోటాకు 44,464 ఓట్లొచ్చాయి. గతంలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో నోటాకు 17,078 ఓట్లు రాగా.. ఈసారి 16,222కు తగ్గాయి. రంగారెడ్డిలో గతంలో 13,242 ఓట్లు పోలవగా.. ఇప్పుడు 12,824 వచ్చాయి. మేడ్చల్–మల్కాజ్గిరిలో గతంలో 14,615 ఓట్లు రాగా.. ఈసారి 803 ఓట్లు ఎక్కువొచ్చాయి. తాజా ఫలితాల్లో నోటాకు 15,418 ఓట్లు వచ్చాయి.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement