-
హద్దులు దాటిన ఆక్రమణ.. 136 కోట్ల సర్కార్ భూమికి ఎసరు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సిన ప్రజాప్రతినిధులే వాటి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్, హెచ్ఎండీఏ ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా భూమిని ప్లాట్లుగా మార్చి.. హద్దురాళ్లు నాటి అమ్మకానికి పెట్టారు. అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ భర్త ఈ భూ ఆక్రమణలో ప్రధాన పాత్రదారుగా ఉండటంతో స్థానిక మున్సిపాలిటీ టౌన్ప్లానింగ్ అధికారులు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. విలువైన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా.. అధికారులు కిమ్మనకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.156 కోట్ల భూమిపై కన్ను రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం కుర్మల్గూడ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 80/1లో 5.32 ఎకరాలు, సర్వే నం. 80/2లో 7.07 ఎకరాలు సర్కారు భూమిగా నమోదైంది. దీనిని ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 80/3లోని 4.23 ఎకరాల భూమి ప్రభుత్వం మోడల్ గ్రేవీ యార్డ్ (క్రిస్టియన్ శ్మశాన వాటిక)కు, సర్వే నం. 80/19లోని 10.27 ఎకరాల భూమిని మోడల్ గ్రేవీ యార్డ్ (ముస్లిం శ్మశాన వాటిక)గా నమోదై ఉంది. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’ వెబ్సైట్లోనూ ఇదే స్పష్టం చేస్తోంది. బహిరంగ మార్కెట్లో ఈ 13 ఎకరాల విలువ రూ.156 కోట్ల పైమాటే. విలువైన ఈ ప్రభుత్వ భూములపై బడంగ్పేట్ నగరపాలక సంస్థ పరిధిలోని అధికార పారీ్టకి చెందిన ఓ కార్పొరేటర్ భర్త కన్నేశారు. వీటిపై తమకే హక్కులు ఉన్నాయని పేర్కొంటూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే సర్వే నం. 80/1లోని కొంత భూమిని ఆక్రమించారు. ఆ భూమిని చదును చేశారు. ప్లాట్లుగా చేసి అమ్మకానికి రంగం సిద్ధం చేశారు. మూడు ఎకరాలు గుర్తించాం ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సర్వే నం. 80/1, 80/2లోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదు కూడా అందింది. గురువారం ఉదయం ఆర్ఐ సహా ఇతర సిబ్బంది క్షేత్రస్థాయికి చేరుకుని పరిశీలించారు. మూడు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించి, ఆ మేరకు జేసీబీతో నాటిన హద్దు రాళ్లను కూడా తొలగించాం. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ ఓ బోర్డును కూడా నాటించాం. ఈ భూములను ఎవరు ఆక్రమించారనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. వచి్చన వెంటనే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. – జనార్దన్, తహసీల్దార్, బాలాపూర్ -
కాంగ్రెస్లో చేరిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి
-
టీఆర్ఎస్ కు బై బై.. కాంగ్రెస్ కు హయ్ హయ్..!!
-
ఎల్బీనగర్ లో టిఆర్ఎస్ -బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
-
కాచిగూడ కార్పొరేటర్పై అనర్హత వేటు
సాక్షి, హైదరాబాద్ : అధికారంలో కొనసాగాలని నిజాన్ని దాచిపెట్టిన టీఆర్ఎస్కు చెందిన ఓ కార్పొరేటర్పై వేటుపడింది. కాచిగూడ కార్పొరేటర్ ఎక్కాల కన్నాచైతన్య ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు సంతానం కలిగి ఉన్నారని బీజేపీ మాజీ కార్పొరేటర్ ఉమాదేవీ భర్త రమేష్యాదవ్ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు విచారణలో కన్నాచైతన్య తనకు ముగ్గురు సంతానం ఉన్నారన్న విషయాన్ని దాచిపెట్టినట్టు తేలింది. దీంతో ఆమెపై అనర్హత వేటువేస్తూ నాంపల్లి కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. రెండోస్థానంలో ఉన్న ఉమాదేవీ రమేశ్యాదవ్ను కార్పొరేటర్గా కొనసాగించాలని కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో ఉమా రమేశ్ కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్లో చేరిన రమేశ్యాదవ్.. ఎన్నికల అనంతరం ఆయన తిరిగి బీజేపీలో చేరడం గమనార్హం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
ఆ సినిమా చూశాకే అలా చేయడం మానేశా: తమన్నా
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement