-
#HYD Metro: మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటి వరకు మెట్రో కార్డుపై ఉన్న రాయితీని, హాలీడే కార్డును మెట్రో అధికారులు పూర్తిగా రద్దు చేశారు. దీంతో, ప్రయాణికులపై అదనంగా భారం పడనుంది. కాగా, హైదరాబాద్వాసులకు మెట్రో రైలు ప్రధాన రవాణా సాధనంగా మారింది. ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా తక్కువ సమయంలో ప్రజలు, ఉద్యోగులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దీంతో, ఉదయం, సాయంత్రం వేళల్లో, సెలవు రోజుల్లో మెట్రో ప్రయాణంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇక గత కొన్ని రోజులుగా ఎండలు దంచికొడుతుండటంతో ప్రజలు మెట్రో బాటపట్టారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు అధికారులు షాకిచ్చారు. BREAKING: #Hyderabad Metro Rail officials took a crucial decision due to the increase in traffic. 10% discount on metro card along with Rs.59 holiday card has been cancelled. On the other hand, the demand for metro travel has increased with the intensity of the summer. — Siddhu Manchikanti Potharaju (@SiDManchikanti) April 7, 2024 మెట్రో కార్డుపై 10 శాతం రాయితీని ఎత్తివేసిన అధికారులు.. రూ.59 హాలిడే కార్డును పూర్తిగా రద్దు చేశారు. దీంతో మెట్రో యాజమాన్యం తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాగా, గతేడాది ఏప్రిల్ కూడా మెట్రో అధికారులు రాయితీలను ఎత్తివేశారు. రద్దీవేళ్లలో డిస్కౌంట్ను పూర్తిగా రద్దుచేశారు. తాజాగా మరోసారి అదేవిధానాన్ని అమలుచేస్తున్నారు. -
ఆంధ్రాలోనూ 'గుంటూరు కారం' టికెట్ రేట్ల పెంపు.. ఎంతంటే?
సూపర్స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమా గ్రాండ్ రిలీజ్కు సిద్ధమైపోయింది. జనవరి 12న థియేటర్లలోకి రానుంది. అయితే టికెట్ రేట్ల పెంపుపై ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా అనుమతి లభించేసింది. అన్ని థియేటర్లలో ఒక్కో టికెట్పై రూ.50 వరకు పెంచుకోవచ్చని పర్మిషన్ ఇచ్చారు. అలానే ఈనెల 12 నుంచి పదిరోజుల పాటు టికెట్ ధరల పెంపు కోసం వెసులుబాటు కల్పించారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) ఇక తెలంగాణ విషయానికొస్తే.. సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీప్లెక్స్ల్లో రూ.100 వరకు పెంపు ఇచ్చారు. ఆల్రెడీ తెలంగాణలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ నుంచి అనుమతి లభించిన దృష్ట్యా ఆంధ్రాలోనూ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయిపోతాయి. సినిమా విషయానికొస్తే.. మాస్-ఫ్యామిలీ-కమర్షియల్ ఎలిమెంట్స్తో 'గుంటూరు కారం' తీశారు. మహేశ్కి జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. తమన్ సంగీతమందించాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా.. చినబాబు నిర్మాతగా వ్యవహరించారు. (ఇదీ చదవండి: అలాంటి డిజైనర్ చీరలో హీరోయిన్ శ్రీలీల.. రేటు ఎంతో తెలుసా?) -
‘సలార్’ టికెట్ ధర పెంపునకు ప్రభుత్వ అనుమతి
సాక్షి, హైదరాబాద్: ప్రభాస్ కథానాయకుడిగా, దర్శకుడు ప్రశాంత్నీల్ తెరకెక్కించిన చిత్రం ‘సలార్’కు టికెట్ ధరల పెంపునకు, బెనిఫిట్ షోలు వేసుకునేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ‘సలార్’చిత్రం ప్రదర్శించే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్ ధరపై రూ.65, మల్టిప్లెక్స్లో ఒక్కో టికెట్పై రూ.100 పెంపునకు ప్రభుత్వం అనుమతించింది. అయితే ఈ టికెట్ ధర పెంపు ఈనెల 22 నుంచి 28 వరకు మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అదేవిధంగా 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఉదయం 4 గంటలకు షో కు, ఆరోజు ఆరో షో వేసేందుకు అనుమతించారు. ఈనెల 22న తెల్లవారుజామున ఒంటిగంటకు ‘సలార్’చిత్రం బెనిఫిట్ షో వేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 20 థియేటర్లకు అనుమతిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఫ్యాన్స్కి 'లియో' షాక్.. అక్కడ టికెట్ రేటు రూ.5 వేలు!
థియేటర్లలో రిలీజయ్యే సినిమాలకు అప్పటితో పోలిస్తే డిమాండ్ తగ్గిన మాట వాస్తవమే. కానీ స్టార్ హీరోల మూవీస్కి మాత్రం వేరే లెవల్ క్రేజ్ ఏర్పడుతోంది. అలా వచ్చే వారం రిలీజ్ కాబోతున్న వాటిలో తెలుగు-తమిళ ప్రేక్షకుల చాలా అంటే చాలా ఎదురుచూస్తున్న మూవీ 'లియో'. ఇప్పుడు ఈ చిత్ర టికెట్ రేట్లు చూస్తుంటే ఒక్కొక్కరికి బుర్ర తిరిగిపోతోంది. (ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా.. హీరోగా 'జబర్దస్త్' కమెడియన్!) 'లియో' సినిమా కోసం ప్రేక్షకులు ఇంతలా ఎదురుచూడటానికి కారణం డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. 'విక్రమ్' సినిమాతో ఒక్కొక్కరిని అవాక్కయ్యేలా చేసిన ఇతడు.. ఈ సినిమాతో రాబోతున్నాడు. దీంతో అంచనాలు గట్టిగా ఉన్నాయి. అలానే 'LCU'తో దీనికి లింక్ ఉందని, ఇందులో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేశాడని రూమర్స్ వల్ల ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా ఉన్నాయి. ఇలా పలు కారణాల వల్ల 'లియో'పై బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు అడ్డదారులు ఎంచుకున్నారు. అభిమానులు ఎలాగైనా సరే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఎగబడతారని తెలిసి, ఏకంగా ఒక్కో టికెట్ని రూ.5 వేలకు అమ్ముతున్నారనట. తమిళనాడులోని ప్రధాన నగరాలైన చెన్నై, మధురై, కోయంబత్తూరులో ఈ దందా నడుస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ మొదలు కావాల్సి ఉంది. మన దగ్గర అంతంత టికెట్ ధరలు ఉండకపోవచ్చులే! (ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) -
చవక రేటుకే ఆదిపురుష్ త్రీడీ టికెట్లు.. సెటైర్లు వేస్తున్న నెటిజన్స్
భారీ అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ హవా చప్పున చల్లారిపోయింది. తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.340 కోట్లు రాబట్టి రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తర్వాత మాత్రం మరో నూరు కోట్లు రాబట్టేందుకు వారం రోజులు తీసుకుంది. బాక్సాఫీస్ వద్ద దారుణ కలెక్షన్లు అందుకుంటున్న ఈ సినిమాను ఎలాగైనా గండం గట్టెక్కించాలని ప్రయత్నిస్తున్నారు నిర్మాతలు. ఈ క్రమంలోనే టికెట్ రేట్లు తగ్గిస్తూ వస్తున్నారు. తొలుత జూన్ 21న ఆదిపురుష్ త్రీడీ టికెట్ రేట్లను రూ.150కే అందుబాటులో ఉంచుతున్నామని ప్రకటించింది చిత్రయూనిట్. అది కూడా కేవలం రెండు రోజులు మాత్రమే ఆ ఆఫర్ అందుబాటులో ఉంటుందని చెప్పింది. కానీ ఈ ఎత్తు పారలేదు. ఆదిపురుష్పై వస్తున్న వ్యతిరేకత కలెక్షన్లకు గండి కొడుతూనే ఉంది. దీంతో తాజాగా మరోసారి టికెట్ రేట్లు తగ్గించారు. కేవలం 112 రూపాయలకే ఆదిపురుష్ 3D టికెట్లు బుక్ చేసుకోండి అని ప్రకటించారు. సోమవారం నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఆదిపురుష్ మేకర్స్ ప్రకటించిన బంపర్ ఆఫర్పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 'మీరు ఫ్రీగా టికెట్లు ఇచ్చినా చూడం', 'మీరు టీజర్ రిలీజ్ చేసినప్పుడే సినిమాను ఎలా భ్రష్టుపట్టించారో అర్థమైంది', 'సినిమాకు వెళ్లి తలనొప్పి తెచ్చుకునేకన్నా ఇంట్లో ఉండటం నయం', 'అరె.. బాబూ.. రూపాయికి టికెట్లు ఇచ్చినా సరే చూసేదే లేదు', 'ఓం రౌత్ హనుమాన్ కోసం థియేటర్లో ఒక సీటు వదిలేయమన్నాడు, కాబట్టి మనమంతా వానర సేన కోసం సినిమా హాల్ అంతా వదిలేద్దాం' అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. Witness the epic saga unfold!🏹 Book your tickets starting from just Rs112/-* and experience the grandeur world of Adipurush🧡 Offer starts tomorrow! #JaiShriRam 🙏 Book your tickets on: https://t.co/0gHImE23yj#Adipurush now in cinemas near you ✨#Prabhas @omraut… pic.twitter.com/cQOKqn0I4S — T-Series (@TSeries) June 25, 2023 చదవండి: ఆదిపురుష్ 2 ఉందా? బూతులు మాట్లాడుతున్న జనాలు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
PrajwalRevannavideo: త్వరలో భారత్కు ప్రజ్వల్ రేవణ్ణ..?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
- సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
- బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
- షుగర్ పేషెంట్స్ పళ్లు తినకూడదా? తింటే ఏవి తినాలి?
- పవన్ కల్యాణ్కి షాక్.. సినిమా నుంచి స్టార్ డైరెక్టర్ తప్పుకొన్నాడా?
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
Advertisement