-
తగ్గేదే లే.. సౌతాఫ్రికాలోనూ టీమిండియా జోరు..!!
-
ఐదు పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు.. భారత్ ఘన విజయం
కేవలం 43 నిమిషాలు... 11.3 ఓవర్లు... ప్రపంచ టెస్టు చాంపియన్ న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ను కుప్పకూల్చడానికి నాలుగో రోజు ఆట తొలి సెషన్లో భారత బౌలర్లు తీసుకున్న సమయం. నాలుగేళ్ల తర్వాత మళ్లీ టెస్టు ఆడిన ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ నాలుగో రోజు మొదటి సెషన్లో నాలుగు వికెట్ల తీయగా... నికోల్స్ను అవుట్ చేసి అశ్విన్ భారత జట్టుకు తమ టెస్టు చరిత్రలోనే పరుగుల పరంగా అతి పెద్ద విజయాన్ని ఖరారు చేశాడు. ఈ సిరీస్ గెలుపుతో భారత్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ను రెండో స్థానానికి వెనక్కి నెట్టి నంబర్వన్ ర్యాంక్ను అందుకుంది. ముంబై: సొంతగడ్డపై మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ భారత క్రికెట్ జట్టు వరుసగా 14వ టెస్టు సిరీస్ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో టెస్టులో భారత్ 372 పరుగుల తేడాతో బ్రహ్మాండమైన విజయం సాధించింది. 540 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 56.3 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. ఓవర్నైట్ స్కోరుకు మరో 27 పరుగులు జతచేసి న్యూజిలాండ్ మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది. స్పిన్నర్లు అశ్విన్, జయంత్ యాదవ్ నాలుగు వికెట్ల చొప్పున తీయగా... మరో వికెట్ ఎడంచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ ఖాతాలోకి వెళ్లింది. ఈ గెలుపుతో భారత్ రెండు టెస్టుల సిరీస్ను 1–0తో కైవసం చేసుకుంది. కాన్పూర్లో జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో అర్ధ సెంచరీ చేసిన భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డుతోపాటు రూ. 1 లక్ష ప్రైజ్మనీ... రెండు టెస్టుల్లో పొదుపుగా బౌలింగ్ చేసి మొత్తం 14 వికెట్లు తీసిన భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారంతోపాటు రూ. 2 లక్షల 50 వేలు ప్రైజ్మనీ లభించాయి. కొత్త హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో భారత్ రెండో సిరీస్ను దక్కించుకుంది. టి20 సిరీస్ను టీమిండియా 3–0తో క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. 5 పరుగులు... 5 వికెట్లు ఓవర్నైట్ స్కోరు 140/5తో ఆట నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ బ్యాటర్లు నికోల్స్ (44; 8 ఫోర్లు), రచిన్ రవీంద్ర (18; 4 ఫోర్లు) తొలి ఆరు ఓవర్లపాటు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి 22 పరుగులు జోడించారు. అయితే ఇన్నింగ్స్ 52వ ఓవర్లో జయంత్ బౌలింగ్లో రచిన్ రెండో స్లిప్లో పుజారాకు క్యాచ్ ఇవ్వడంతో కివీస్ 162 పరుగులవద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత జయంత్ ఐదు బంతుల వ్యవధిలో జేమీసన్ (0), సౌతీ (0), సోమర్విల్లే (1)లను అవుట్ చేశాడు. చివరగా అశ్విన్ బౌలింగ్లో నికోల్స్ స్టంపౌట్ కావడంతో న్యూజిలాండ్ ఓటమి ఖరారైంది. కివీస్ చివరి ఐదు వికెట్లను ఐదు పరుగుల వ్యవధిలో కోల్పోవడం గమనార్హం. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 325; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 62; భారత్ రెండో ఇన్నింగ్స్: 276/7 డిక్లేర్డ్; న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 6; విల్ యంగ్ (సి) సూర్యకుమార్–సబ్ (బి) అశ్విన్ 20; డరైల్ మిచెల్ (సి) జయంత్ యాదవ్ (బి) అక్షర్ పటేల్ 60; రాస్ టేలర్ (సి) పుజారా (బి) అశ్విన్ 6; నికోల్స్ (స్టంప్డ్) సాహా (బి) అశ్విన్ 44; బ్లన్డెల్ (రనౌట్) 0; రచిన్ రవీంద్ర (సి) పుజారా (బి) జయంత్ యాదవ్ 18; జేమీసన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జయంత్ యాదవ్ 0; టిమ్ సౌతీ (బి) జయంత్ యాదవ్ 0; సోమర్విల్లే (సి) మయాంక్ అగర్వాల్ (బి) జయంత్ యాదవ్ 1; ఎజాజ్ పటేల్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (56.3 ఓవర్లలో ఆలౌట్) 167. వికెట్ల పతనం: 1–13, 2–45, 3–55, 128, 5–129, 6–162, 7–165, 8–165, 9–167, 10–167. బౌలింగ్: సిరాజ్ 5–2–13–0, అశ్విన్ 22.3–9–34–4, అక్షర్ పటేల్ 10–2–42–1, జయంత్ యాదవ్ 14–4–49–4, ఉమేశ్ యాదవ్ 5–1–19–0. -
Ashes Series: ముందు 7 టెస్టులు గెలిస్తేనే.. : జో రూట్
న్యూజిలాండ్, భారత్తో జరగనున్న టెస్ట్ సిరీస్ల గెలుపు యాషెస్కు ఎంతో కీలకం కానుందని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తెలిపారు. లార్డ్స్ వేదికగా బుధవారం నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. ఆ తర్వాత న్యూజిలాండ్తో రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత భారత్తో ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లండ్ తలపడాల్సి ఉంది. వరుస విజయాలు ఎంతో అవసరం న్యూజిల్యాండ్, భారత్తో జరగనున్న 7 టెస్ట్ మ్యాచ్లను గెలిచి యాషెస్ సిరీస్కి తమ జట్టు ఆస్ట్రేలియాలోకి ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు రూట్ తెలిపారు. ఇందుకోసం ఇంగ్లండ్ జట్టు తీవ్రంగా శ్రమిస్తోందని చెప్పారు. లార్డ్స్లో బుధవారం ప్రారంభమయ్యే 2 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ న్యూజిలాండ్తో తలపడనుంది, ఆపై ఆగస్టు 4 నుంచి 5 టెస్టులు భారత్తో తలపడనుంది. లార్డ్స్ టెస్ట్ సందర్భంగా కేన్ విలియమ్సన్ జట్టుపై గెలుపుకోసం రూట్ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించే పనిలో పడ్డాడు. యాషెస్ మాకెంతో ప్రత్యేకం ఈ విషయాల గురించి రూట్ మాట్లాడుతూ... ఈ వేసవి అంతా ఆస్ట్రేలియాతో తలపడనున్న యాషెస్ సిరీస్ గురించి నిరంతరం సంభాషణలు జరుగుతున్నాయని చెప్పారు. ఎందుకంటే మాకు ఆ సిరీస్ ఎంతో ప్రత్యేకమైనది. ఒక ఇంగ్లీష్ అభిమానిగా, ఇంగ్లీష్ ప్లేయర్గా యాషెస్ అనేది ఐకానిక్ సిరీస్ మాత్రమే కాదు ఎంతటి ప్రతిష్టాత్మకమో తెలుసు కాబట్టే మేము యాషెస్ను ప్రత్యేకంగా చూస్తామన్నారు. ఈ నేపథ్యంలో రానున్న వరుస టెస్ట్ మ్యాచ్ మ్యాచ్ల గెలుపు చాలా కీలకమని తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు ఉత్తమ జట్టులతో ఆడటం మా ఆటగాళ్లకు గొప్ప అవకాశమని రూట్ తెలిపారు. ఇక, బెన్ స్టోక్స్ లేకపోవడంతో స్టువర్ట్ బ్రాడ్ న్యూజిలాండ్ తరపున ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. కాగా ఇప్పటికే ముంబయికి చేరుకుని క్వారంటైన్లో ఉన్న భారత క్రికెటర్లు.. బుధవారం స్పెషల్ ఛార్టెర్ ప్లైట్లో ఇంగ్లాండ్కి బయల్దేరి వెళ్లనున్నారు. చదవండి: తొలి టెస్ట్కు ముందు ఇంగ్లండ్కు గట్టి షాక్.. -
‘నా టైమ్ ఎప్పుడొస్తుంది’
సాక్షి క్రీడా విభాగం: సరిగ్గా రెండేళ్లయింది కుల్దీప్ యాదవ్ టెస్టు మ్యాచ్ ఆడి. నాడు సిడ్నీ టెస్టులో 5 వికెట్లు పడగొట్టిన తర్వాత ఏ ముహూర్తాన హెడ్ కోచ్ రవిశాస్త్రి ‘కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలర్, అత్యుత్తమ స్పిన్నర్’ అంటూ ప్రశంసించాడో ఆ రోజు నుంచి అదృష్టం అతని గడప తొక్కలేదు. ఇటీవల ముగిసిన సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో ఒక్క వన్డే మాత్రం ఆడిన కుల్దీప్ సొంత గడ్డపైనైనా తన సుడి మారుతుందని ఆశించాడు. ‘స్వదేశంలో జరిగే మ్యాచ్లలో కుల్దీప్ మా ప్రణాళికల్లో భాగంగా ఉన్నాడు’ అంటూ స్వయంగా కోహ్లి గురువారమే చెప్పినా... శుక్రవారానికి వచ్చేసరికి అతనికి మరోసారి మ్యాచ్ దక్కలేదు. వైవిధ్యమైన చైనామన్ బౌలింగ్తో ఇంగ్లండ్ను కచ్చితంగా కుల్దీప్ ఇబ్బంది పెట్టగలడని అంతా భావించారు. అరుదుగా ఉండే ఎడంచేతి మణికట్టు స్పిన్నర్లు పిచ్తో సంబంధం లేకుండా ప్రభావం చూపించగలరు కాబట్టి తొలి టెస్టులో అతనికి చోటు ఖాయంగా కనిపించింది. అయితే టీమ్ మేనేజ్మెంట్ మాత్రం తుది జట్టులో ముగ్గురూ ‘ఫింగర్ స్పిన్నర్’లకే అవకాశమిచ్చింది. అశ్విన్లాంటి సీనియర్ ఉన్నప్పుడు అదే శైలి ఉన్న సుందర్కు చోటు కల్పించడం ఆశ్చర్యకర నిర్ణయం. జట్టు బ్యాటింగ్ను బలోపేతం చేసేందుకే ఇలా చేశారు అంటూ ఒక వాదన వినిపించింది. దీని ప్రకారం కోహ్లి కచ్చితంగా జట్టులో ఒక లెఫ్టార్మ్ స్పిన్నర్ ఉండాల్సిందేనని పట్టు బట్టాడు. పిచ్లు భిన్నమైనా... ఇటీవల శ్రీలంక బౌలర్ ఎంబుల్డెనియా ఇంగ్లండ్ బ్యాట్స్మెన్కు సమస్యలు సృష్టించడం కూడా అందుకు ఒక కారణం. రవీంద్ర జడేజా లేకపోవడంతో అతడిని పోలిన బౌలింగ్ శైలి, బ్యాటింగ్ చేయగల సామర్థ్యంతో అక్షర్ పటేల్ ఆడటం ఖాయమైపోయింది కూడా. అయితే అక్షర్ అనూహ్యంగా తప్పుకోవడంతో లెక్క మారిపోయింది. చివరి నిమిషంలో ఎంపిక చేసిన నదీమ్కు మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. కుల్దీప్ను కూడా ఎంపిక చేస్తే చివరి నలుగురు ఏమాత్రం బ్యాటింగ్ చేయలేనివారిగా మారిపోతారు కాబట్టి ఏడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఉంటే బాగుంటుందని జట్టు భావించింది. ఇటీవలి బ్రిస్బేన్ టెస్టు ప్రదర్శన సుందర్కు అదనపు అర్హతగా మారిపోయింది. దాంతో కుల్దీప్కు అవకాశం దక్కలేదు. అయితే చివరకు అనుభవం లేని నదీమ్, సుందర్లనే లక్ష్యంగా చేసి ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ పరుగులు రాబట్టారు. ఇద్దరూ కలిసి 3.87 ఎకానమీతో పరుగులు ఇవ్వగా, 19 ఫోర్లు వీరి బౌలింగ్లోనే వచ్చాయి. బౌలింగ్లో సుందర్ను జట్టు పెద్దగా వాడుకోనే లేదు. 41వ ఓవర్కు గానీ బౌలింగ్ ప్రారంభించని అతను 12 ఓవర్లు మాత్రమే వేసి ఏకంగా 55 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రత్యేక పరిస్థితుల్లో బ్రిస్బేన్ టెస్టు అవకాశం దక్కించుకున్న సుందర్... మూడున్నరేళ్ల తర్వాత స్వదేశంలో ఆడుతున్న తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... కోహ్లి, పుజారా, రోహిత్, రహానే, పంత్లాంటి స్టార్ బ్యాట్స్మెన్ ఉన్న భారత జట్టు స్వదేశంలో భారీ స్కోరు కోసం ఏడో నంబర్ ఆటగాడి వరకు ఆధారపడుతుందా! టాప్–6 సరిగ్గా బ్యాటింగ్ చేస్తే అసలు లోయర్ ఆర్డర్ అవసరమేముంటుంది? వారు చేయలేని పనిని ఏడు, ఎనిమిదో నంబర్ ఆటగాళ్లు చేస్తారా! మూడేళ్ల తర్వాత... భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎట్టకేలకు స్వదేశంలో తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. 2018 జనవరిలో కేప్టౌన్లో అరంగేట్రం చేసిన అతను ఇప్పటి వరకు 17 టెస్టులు ఆడగా, అన్నీ విదేశాల్లోనే జరిగాయి. -
ఆ అవకాశమిస్తే అదృష్టంగా భావిస్తా: వషీ
చెన్నై: డ్రెసింగ్ రూమ్లో టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఇచ్చే విలువైన సలహాలు యువ ఆటగాళ్లలో ఎంతో స్పూర్తిని నింపుతాయని, మైదానంలో ఉత్తమ ప్రదర్శన చేసేందుకు అవి ఓ టానిక్లా ఉపయోగపడతాయని టీమిండియా యువ సంచలన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అన్నాడు. ఆటలో ఛాలెంజ్లు స్వీకరించేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని, టెస్టుల్లో ఓపెనింగ్ చేసే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తానని అతను పేర్కొన్నాడు. తన ఆటతీరును కోచ్ రవిశాస్త్రి ఏ మేరకు ప్రభావితం చేసాడనే అంశంపై సుందర్ మాట్లాడుతూ.. నాలాంటి యువ ఆటగాళ్లకు రవిశాస్త్రి లాంటి అనుభవజ్ఞుడైన కోచ్ లభించటం ఎంతో అదృష్టమని, మరీ ముఖ్యంగా ఆల్రౌండర్గా రాణించాలకున్న నాకు రవిశాస్త్రి సలహాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నాడు. రవిశాస్త్రి తన టెస్టు కెరీర్లో ఎడమచేతి స్పిన్ బౌలర్గా, కుడి చేతి ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా రాణించిన విషయాన్ని సుందర్ గుర్తుచేశాడు. ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్, కుడి చేతి ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన సుందర్.. కోచ్ రవిశాస్త్రే తనకు, స్పూర్తి, ఆదర్శమని పేర్కొన్నాడు. బ్యాటింగ్ ఒక్కటే సరిపోదని తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల వాషింగ్టన్ సుందర్ అండర్-19 క్రికెట్లో స్పెషలిస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా రాణించాడు. టీమిండియాలో స్థానం సంపాదించాలంటే కేవలం బ్యాటింగ్పైనే ఆధారపడితే సరిపోదని, తనలోని స్పిన్ బౌలింగ్కు సాన పట్టాడు. చాలామంది యువ ఆటగాళ్లలాగే సుందర్ కూడా ఐపీఎల్లో లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని, టీమిండియా టీ20 జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. అంతటితో ఆగకుండా తనలోని ప్రతిభను మరింత మెరుగుపర్చుకుంటూ తన చిరకాల స్వప్నం అయిన టీమిండియా టెస్టు జట్టులో స్థానం సంపాదించాడు. తాజాగా ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్లో తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణంలా మారాడు. బ్రిస్బేన్ టెస్టులో బంతితో పాటు బ్యాట్తోనూ రాణించాడు. తొలి ఇన్నింగ్స్లో 62 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 22 పరుగులు చేశాడు. మొత్తం 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
తెలుగు వాళ్లు నా సినిమాలు కాపీ కొట్టారు: తమిళ డైరెక్టర్
ఒక్క మెసేజ్తో 'సలార్' బైక్ను సొంతం చేసుకున్న అదృష్టవంతుడు
హిందువులను విభజించేందుకు ప్రయత్నం: కాంగ్రెస్పై మోదీ కీలక వ్యాఖ్యలు
రాజస్తాన్తో మ్యాచ్.. ఎస్ఆర్హెచ్ స్టార్ ప్లేయర్ ఎంట్రీ! తుది జట్లు
‘జగన్ కోసం సిద్ధం’ బస్సులను ప్రారంభించిన వైఎస్సార్సీపీ
'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్
T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
తప్పక చదవండి
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- 'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్గా గృహప్రవేశం (ఫోటోలు)
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
- చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల
Advertisement