-
వారిని స్వదేశానికి తీసుకురండి
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో గల్ఫ్లో చిక్కుకుపోయిన తెలంగాణ కార్మికులను స్వదేశానికి తీసుకురావాలని కోరుతూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వి.మురళీధరన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ గురువారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’కార్యక్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువస్తోందని, ఇందులో భాగంగా అనేక మంది తెలంగాణవాసులను స్వదేశానికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. అయితే గల్ఫ్ దేశాల్లో సుమారు 10 లక్షల మంది తెలంగాణవాసులు పని చేస్తున్నారని, వారిలో బతుకుదెరువు కోసం వలస వెళ్లినవారే ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారంతా స్వదేశానికి రాలేక గల్ఫ్లోనే చిక్కుకుపోయి దీనావస్థలో ఉన్నారని తెలిపారు. దీంతో ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని వివరించారు. వందే భారత్ మిషన్లో భాగంగా తక్షణమే మస్కట్ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి, గల్ఫ్లో చిక్కుకుపోయిన తెలంగాణవాసులను స్వదేశానికి తరలించేందుకు సహకరించాలని కోరారు. లేఖలను ఈమెయిల్ ద్వారా కేంద్ర మంత్రులకు పంపించారు. -
కువైట్లో రాష్ట్రవాసుల కష్టాలు తీర్చండి
సాక్షి, హైదరాబాద్: కువైట్లో తెలంగాణవాసులు 50వేల మందికి పైగా ఇబ్బందులు పడుతున్నారని, ఆ దేశ అంబాసిడర్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్కుమార్ చెప్పారు. సొంత దేశానికి వచ్చేందుకు, ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిని భారత్కు రప్పించాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్లో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. కువైట్కు ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని పంపించాలని, ప్రభుత్వ ఖర్చులతోనే బాధితులను రాష్ట్రానికి తీసుకురావాలని కోరారు. కువైట్ నుంచి వచ్చినవారికి ప్రభుత్వం ఉపాధి, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇతర దేశాల్లో ఉన్న ప్రవాసుల గురించి తమ మేనిఫెస్టోలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన సీఎం కేసీఆర్ ఆ హామీలను విస్మరించారని విమర్శించారు. మంత్రుల గల్ఫ్ పర్యటనలన్నీ జల్సాలకు, బతుకమ్మ సంబరాలకే పరిమితమవుతున్నాయని ఆరోపించారు. ఎన్నారై పాలసీ రూపొందించడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో గల్ఫ్ బాధితుల సంక్షేమ చట్టాన్ని రూపొందించాలని, రూ.వెయ్యి కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలన్నారు. గల్ఫ్ బాధితులకు సాయం అందించేందుకు టీపీసీసీ నుంచి ఓ బృందం గల్ఫ్ వెళ్లనుందని, వారి బాధితుల సమస్యలపై సీఎం కేసీఆర్కు లేఖ రాసినట్లు చెప్పారు. -
హైదరాబాద్ టు ఆంధ్రా
సాక్షి, హైదరాబాద్: కోడి పందేలకు నగరవాసులు సైతం సై అంటున్నారు! ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగే కోడి పందేల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి పెద్దఎత్తున బయల్దేరి వెళ్లారు. ఇప్పటికే సంక్రాంతికి దాదాపు 20 లక్షల మందికిపైగా నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరి వెళ్లగా.. ప్రత్యేకంగా కోడి పందేల్లో పాల్గొనేందుకు మరో 10 వేల మంది వరకు వెళ్లారు. ఆదివారం అమీర్పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, మియాపూర్, పాతబస్తీ తదితర ప్రాంతాల నుంచి వీరంతా సొంత వాహనాల్లో ఆంధ్రప్రదేశ్కు పయనమయ్యారు. కోడి పందేలు, పొట్టేళ్ల పందేలతోపాటు పలుచోట్ల జరిగే గుండాటల్లో పాల్గొనేందుకు వీరు ఉత్సుకత చూపుతున్నారు. తెలంగాణవాసులను ఆహ్వానిస్తూ ఏపీలోని పలు ప్రాంతాల్లో కటౌట్లు, బ్యానర్లు కూడా ఏర్పాటు చేయడం విశేషం. లష్కర్ టు భీమవరం కోడి పందేళ్లలో పాల్గొనేందుకు పలువురు లష్కర్వాసులు భీమవరం వెళ్లారు. శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన వీరు శనివారం ఉదయం భీమవరం చేరుకున్నారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్, సనత్నగర్ నియోజకవర్గాల నుంచి వెయ్యి మంది సుమారు 200 వాహనాల్లో వెళ్లారు. గత పదిహేనేళ్లుగా ఏటా భీమవరం వెళ్లడం, కోడి పందేళ్లలో పాల్గొని రావడం వీరికి మామూలే. భీమవరం ప్రాంతాల్లో అపార్టుమెంట్లు, ప్రత్యేక భవనాలు ముందే అద్దెకు తీసుకుని, మూడ్రోజులకు సరిపడా ఆహార పదార్థాలను ఆర్డర్ చేసి పెట్టుకుంటారు. కొందరైతే ఇక్కడి నుంచే వంటవాళ్లను, పనివాళ్లను తీసుకువెళ్తున్నారు. భీమవరం బాట పడుతున్నవారిలో భవన నిర్మాణదారులు, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు, ఉన్నత ఉద్యోగులు, పెద్దమొత్తంలో ఇంటి అద్దెల ఆదాయం కలిగిన వారు, పలువురు రాజకీయ నాయకులు ఉన్నారు. ఇక్కడ్నుంచి 90 పొట్టేళ్లు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఈడుపుగల్లులో జరిగే పొట్టేళ్ల పందేల్లో పాల్గొనేందుకు హైదరాబాద్వాసులు మక్కువ చూపుతున్నారు. ఇక్కడ్నుంచి దాదాపు 60 నుంచి 90 వరకు పొట్టేళ్లను తీసుకెళ్లారు. ‘‘ప్రతి ఏటా మాదిరే ఈసారి కూడా పొట్టేళ్ల పందెంలో పాల్గొనేందుకు వెళ్తున్నాం. మా పొట్టేళ్లు ఈసారి గతంలో కంటే మెరుగ్గా పోటీపడతాయి’’అని పాతబస్తీకి చెందిన మంజూర్ పేర్కొన్నారు. ఏపీలో కత్తులు దూసిన పందెం కోళ్లు ఏపీలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పలుచోట్ల కోళ్లకు కత్తులు కట్టి మరీ భారీగా పందేలు నిర్వహిస్తున్నారు. ఆదివారం భోగి పండుగ సందర్భంగా తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో పెద్దఎత్తున బరులు ఏర్పాటు చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలే బరుల నిర్వాహకులు కావడంతో అధికార యంత్రాంగం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. కోడిపందేలు, పేకాట శిబిరాల్లో పెద్దఎత్తున డబ్బు చేతులు మారిందని అంచనా వేస్తున్నారు. భోగి రోజే దాదాపు రూ.200 కోట్లు చేతులు మారాయని అంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగిన కోడిపందేలు, జూదంలో రూ.150 కోట్లు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో రూ.30 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.20 కోట్ల మేర పందేలు సాగినట్లు అంచనా. విశాఖలో రూ.3 కోట్లు, విజయనగరం జిల్లాలో రూ.2 కోట్ల మేర పందేలు సాగినట్టు అంచనా వేస్తున్నారు. అధికారపార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు దగ్గరుండి మరీ కోడిపందేల బరులు నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో మంత్రి అయ్యన్నపాత్రుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కోడి పందేలను ప్రారంభించారు. పాతబస్తీలో రూ.15 కోట్ల వ్యాపారం ఏపీలో జరిగే కోళ్ల పందేల కోసం నగరంలో దాదాపు రూ.15 కోట్లకుపైగా కోళ్ల అమ్మకాలు జరిగాయని తెలుస్తోంది. పాతబస్తీలోని బార్కస్, ఎర్రకుంట, షాహీన్ నగర్లో 50 మంది పందెం కోళ్ల పెంపకందారులు ఉన్నారు. ఒక్కొక్కరు కనీసం 50 నుంచి 60 కోళ్లను పెంచి, విక్రయించినట్లు తెలిసింది. ఒక్కో కోడి ధర రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా పలికినట్టు సమాచారం. వీటిని కొనుగోలు చేసేందుకు ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొద్దినెలల కిందటే పందెం రాయుళ్లు వచ్చారు. వీరు దాదాపు 2 వేల నుంచి 3 వేల కోళ్ల దాకా కొనుగోలు చేసినట్టు పాతబస్తీలోని వ్యాపారులు చెబుతున్నారు. ఇలా కొనుక్కు వెళ్లిన వాటిలో కొన్నింటిని ఇళ్లలోనే పెంచుకుంటూ వచ్చే ఏడాది పందేలకు సిద్ధం చేస్తారు. బలిష్టంగా ఉన్న కోళ్లను ఈ ఏడాదే పందెం బరిలోకి దింపుతారు. నగరానికి ‘పల్లె’శోభ నగరానికి సంక్రాంతి శోభ వచ్చింది. వీధుల్లో భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, ఇంటి ముంగిట ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, పతంగుల సయ్యాటలతో భోగిని నగరవాసులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. పల్లెలకు వెళ్లలేనివారు నగరంలోనే పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకున్నారు. దీంతో ఆదివారం నగరంలో చాలాచోట్ల పల్లె వాతావరణం కనిపించింది. -
తెలంగాణ ప్రజలపై పగబట్టిన చంద్రబాబు
ధ్వజమెత్తిన ప్రభుత్వ విప్ సునీత సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రజలపై పగబట్టారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత విమర్శించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టకుండా అడ్డంకులు సృష్టిస్తూ కుట్రలకు పాల్పడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. అపెక్స్ కమిటీ సమావేశంలో బాబు తాను తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకమని విషంకక్కినా టీటీడీపీ నేతలు నోరు మెదపలేదన్నారు. అందరూ బాగుండాలనేది కేసీఆర్ వ్యక్తిత్వమయితే, అందరూ నాశనమైనా తాను బాగుండాలనే రాక్షసత్వం బాబుదని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను కొత్త ప్రాజెక్టని బాబు అనడం దారుణమన్నారు. -
2019లో కాంగ్రెస్దే అధికారం
యాదగిరిగుట్ట : తెలంగాణ ప్రజల ఏన్నో ఏళ్ల కళను సకారం చేసి ప్రత్యేక రాష్ట్రాని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలే 2019లో అధికారంలోకి తీసుకువస్తారని మాజీ ఎంపీ, శిక్షణ తరగతుల కమిటీ చైర్మన్ పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట పట్టణ సమీపంలోని శివసాయి గార్డెన్స్లో సోమవారం డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఆలేరు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణ శిబిరంలో ఆయన ప్రసంగించారు. మాటకు కట్టుబడి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. తన కుటుంబ రాజకీయ లబ్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతూ రెండే ళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ పథకాలు అందక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన నడుపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతి నిధులు దాసోజు శ్రావణ్కుమార్, అద్దంకి దయూకర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారన్నారు. ఆ తర్వాత డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారిని కాంగ్రెస్ కచ్చితంగా గుర్తుపెట్టుకుం టుందన్నారు. కాంగ్రెస్ను 2019లో అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు.ముందుగా దివంగత నేతలు ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ, ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్బాపూజీల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాకారుల ఆటాపాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. శిబిరంలో పార్టీసీనియర్ నేతలు పీసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, ప్రేమ్లాల్, ఎస్సీసెల్ టీపీసీసీ అధ్యక్షుడు జగన్లాల్, జిల్లా ఎస్సీసెల్, బీసీసెల్ నాయకులు వెంకన్న, రవీందర్, రవిబాబు, రవీందర్రెడ్డి, దుంపల శ్రీను, చింతపండు నవీన్, బీర్ల అయిలయ్య, నరేందర్గుప్త, సుధాకర్, మహేందర్, రవీందర్, మల్లేష్, హరినాథ్, ద్యాస లక్ష్మారెడ్డి, శంకర్నాయక్, యాదగిరి, సర్పంచ్ ఇమ్మడి మాధ వి రాంరెడ్డి, సత్యనారాయణ, ఎంపీటీసీ కానుగు కవిత బాలరాజు, గొట్టిపర్తి జయమ్మ బాల రాజు, స్థానిక నాయకులు గుండ్లపల్లి భరత్గౌడ్, బాలనర్సయ్య, మిట్ట వెంకటయ్య, శ్రీధర్, బాలలక్ష్మి, నీలం వెంకటస్వామి, ఆకుల పద్మ పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement