-
మోజు తీరగానే ఫోన్లో తలాక్..
ఓ గదిలో కొందరు బాలికలు కూర్చొని ఉన్నారు.. వయసు పైబడిన ఓ వ్యక్తి ఆ గదిలోకి వచ్చాడు. ఒక్కొక్కరిని ప్రశ్నలు అడుగుతున్నాడు. కొద్దిసేపటి తర్వాత వారిలో ఒక బాలికను ఓకే చేశాడు. ఇది ఏ ఉద్యోగం కోసమో జరుగుతున్న ఇంటర్వ్యూకాదు... అమ్మాయిల కొనుగోలు కోసం జరుగుతున్న తంతు. అందం.. ఆరోగ్యం ఉన్న హైదరాబాద్ అమ్మాయిలను ఎంత డబ్బు కుమ్మరించైనా సొంతం చేసుకునేందుకు సొమాలి, సూడానీలు పోటీపడుతున్నారు. ఈ తతంగానికి పెళ్లి అని పేరు పెట్టి.. యువతుల జీవితంతో ఆడుకుంటున్నారు. ఇలాగే ఓ సోమాలీ దేశస్తుడు (అమెరికా పౌరసత్వం ఉన్న వ్యక్తి) పాతబస్తీకి చెందిన మైనర్ అమ్మాయి సబాఫాతిమాను పెళ్లి చేసుకున్నాడు. మోజు తీరగానే అమెరికా వెళ్లి ఫోన్లో తలాక్ చెప్పేశాడు. చదవండి: నెల రోజుల్లో పెళ్లి.. చేతిలో చిల్లిగవ్వ లేక ఏం జరిగింది... : పాతబస్తీ గాజియే మల్లత్ కాలనీకి చెందిన సబా ఫాతిమా(16)కు అబ్ది వలీ అహ్మద్(54)తో పెళ్లి జరిగింది. అప్పటికీ ఫాతిమా మైనర్. టోలిచౌకిలో ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉన్నారు. అలా 2 నెలలు గడిచిన తర్వాత వారం రోజుల్లో తిరిగి వస్తా అని చెప్పి దుబాయ్ వెళ్లాడు. ఏడాది తర్వాత వచ్చాడు. మళ్లీ రెండు నెలలు ఉండి ఎక్కడికో వెళ్లేవాడు. ఇలా నాలుగుసార్లు జరిగింది. అద్దె ఇళ్లను మారుస్తూ మెహిదీపట్నం, మలక్పేట్తో పాటు పలుచోట్ల సబాతో ఉండేవాడు. కాగా, 2020, ఫిబ్రవరిలో దుబాయ్లో ఉన్న తన తల్లి వద్దకు వెళ్తున్నానని.. తర్వాత వచ్చి సబాను తీసుకెళ్తానని చెప్పి వెళ్లాడు. లాక్డౌన్ ముగిసే వరకు దుబాయ్లో ఉండి.. అక్కడి నుంచి అమెరికా వెళ్లాడు. అక్టోబర్ 7న సబా తండ్రి మహ్మద్ ఫరీద్కు ఫోన్ చేసి తలాక్ ఇస్తున్నానని మూడుసార్లు ఆ పదం ఉచ్చరించాడు. అప్పటి నుంచి సబా ఫోన్ నంబర్ను బ్లాక్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన ఫాతిమా కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఘాన్సీబజార్లోని ఉమెన్స్ పోలీసులకు ఆశ్రయించింది. న్యాయం చేయండి... ‘మా నాన్నకు మేము ఐదుగురం అమ్మాయిలం. నాన్న ఆటో నడిపిస్తారు. నేనే ఇంట్లో పెద్ద. నాన్న బాధ చూడలేక నా కంటే రెండింతలు ఎక్కువ వయసున్న నల్లజాతీ యుడిని పెళ్లి చేసుకున్నా. తనకు అమెరికా పౌరసత్వం ఉందని, వాళ్లమ్మ దుబాయ్లో ఉంటుందని చెప్పాడు. నా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందని పెళ్లి చేసుకున్నా. తర్వాత ఎప్పుడూ నెల రోజుల కంటే ఎక్కువ ఉండలేదు. అక్టోబర్లో నాన్నకు ఫోన్ చేసి తలాక్ ఇస్తున్నానని చెప్పాడు. దీంతో చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాం. ప్రభుత్వం స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నా’ – సబాఫాతిమా ఇది ఒక్కరి కథ కాదు.. సబాఫాతిమానే కాదు.. పాతబస్తీకి చెందిన ఎందరో అమ్మాయిల దీనగాథ ఇది. సోమాలీ, సూడానీ దేశస్తులు.. ఇక్కడి అమ్మాయిల అందానికి వెల కడుతున్నారు. పెళ్లి కోసం వచ్చే వీరంతా కుర్రాళ్లేం కాదు. 50–60 ఏళ్లు పైబడిన వారే. వీరు సంపన్నులు కాదు. సోమాలియా, సూడాన్తో పాటు ఇతర అరబ్బు దేశాల నుంచి విద్య, వ్యాపారం, వైద్యం కోసం వస్తున్నారు. శారీరక అవసరాల కోసం మాత్రమే లక్ష, 2 లక్షలు ఇచ్చి పాతబస్తీ అమ్మాయిలను వివాహం చేసుకుంటున్నారు. ఇక్కడి కుటుంబాల్లో పేదలే ఎక్కువగా ఉండటం.. అమ్మాయిల సంఖ్య కూడా ఎక్కువగానే కావడం, పేదరికం, నిరక్షరాస్యతను ఆసరా చేసుకుని దళారులు ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు. ఆయా దేశాల నుంచి వచ్చిన వారు టోలిచౌకి, మెహిదీపట్నం, మాసాబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లోనే అద్దెకు ఉంటున్నారు. దళారుల ద్వారా అమ్మాయిలను ఇంటర్వ్యూ చేసి నచి్చన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మాయిలకు ఇష్టంలేకపోయినా ఒత్తిడి తెచి్చ మరీ తమ పంతం నెరవేర్చుకుంటారు. పెళ్లి చేసుకునే వ్యక్తి ఇచ్చే డబ్బును దళారులు.. ఏజెంట్లు.. తల్లిదండ్రులు పంచుకుంటారు. అయితే వీటిలో అధిక భాగం దళారుల చేతికే చేరుతుంది. పాతబస్తీలో గోప్యంగా పెళ్లి జరుగుతుంది. అక్కడి నుంచి మకాం కొత్తబస్తీకి మారుస్తారు. -
కూతురు ఏడ్చిందని తలాక్
ఇండోర్: ఏడాది వయసున్న కూతురు ఏడుపు భరించలేక తన భార్యకు ఓ వ్యక్తి తలాక్ చెప్పి విడాకులిచ్చిన ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. అనంతరం అతడి భార్య ఉజ్మా అన్సారీ ఆమె సొంత జిల్లా బార్వానిలోని సెంథ్వాలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణిస్తూ గత పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం కొత్త చట్టం తేవడం తెల్సిందే. ఆగస్టు 4న రాత్రి సమయంలో అనారోగ్యంతో ఉన్న తన కూతురు గుక్కపెట్టి ఏడవడంతో, నిద్ర పాడుచేసిందంటూ భర్త అక్బర్ తనతో గొడవ పెట్టుకున్నాడని పోలీసులకు తెలిపారు. మరిది, మామలు తనను కొట్టారని చెప్పారు. వారి సమక్షంలోనే తన భర్త మూడు సార్లు తలాక్ చెప్పాడని పేర్కొన్నారు. -
ఉన్నది ఒకటే ఇల్లు
ఒక ఇంట్లోని వాళ్లంతా ఒకింటివాళ్లు అవుతారు తప్ప ‘వాళ్లు’ అవరు. ఒక దేశంలోని వాళ్లంతా ఒక దేశంవాళ్లు అవుతారు తప్ప ‘వాళ్లు’ అవరు. ఇంట్లో గానీ, దేశంలో గానీ ‘వాళ్లు’ అనే మాట వచ్చిందంటే అది వేరు చేసినట్లు కాదు. వేరు చేసుకున్నట్లు. తలాక్ రద్దుపై అటుగానీ, ఇటుగానీ నోరు మెదపకుండా మౌనంవహించడమంటే ఇంటి నుంచి, లేదా దేశం నుంచి ఎవర్ని వారు వేరు చేసుకోవడమే. అయితే తలాక్ రద్దును వ్యతిరేకిస్తూ ‘‘అదే ‘మనింటి’ విషయంలోనైతే ఇలా చేస్తామా?’’ అని వినిపిస్తున్నవాదనల కంటే నోరు మెదపని మౌనమే నయమేమో అనిపిస్తుంది.-మాధవ్ శింగరాజు జర్నలిజంలోని బ్యూటీ ఏంటంటే, సాయంత్రం ఇంటికి క్యారీబ్యాగులో ఓ కిలో బియ్యం మోసుకుని వెళ్లేందుకు డ్యూటీ చేసినట్లుగా ఉండదు. గుప్పెడు అక్షరాల్ని చల్లి లోకంలోని బంజరుభూముల్ని పండించడానికి ఆఫీస్కి వచ్చినట్లుగా ఉంటుంది. ‘‘మంచిదే కానీ, ప్రత్యేక అంశాలపై నీక్కొన్ని ప్రత్యేక అభిప్రాయాలు ఉన్నప్పుడు వాటిని నీ రాతల్లో వ్యక్తం చేయకుండా ఉండడం వల్ల కెరీర్లో నీకు నూకలు చెల్లకుండా ఉంటాయి’’ అని సీనియర్ జర్నలిస్టు ఒకరు హితవు చెప్పినప్పుడు కూడా ‘అతడు’ బంజరు భూముల్ని పండించడం గురించే ఆలోచించాడు తప్ప, క్యారీబ్యాగులో బియ్యం మోసుకుపోతే సుఖం కదా అనుకోలేదు. ఇరవై ఏళ్ల క్రితం నాటి మాట ఇది. అప్పుడు ‘అతడు’ ట్రైనీ. అదే ‘అతడు’ ఇప్పుడు ‘‘ప్రత్యేక అంశాలపై మీక్కొన్ని ప్రత్యేక అభిప్రాయాలు ఉన్నప్పుడు వాటిని మీరు మీ రాతల్లో వ్యక్తం చేయకపోవడం వల్ల క్యారీబ్యాగులో ఇంటికి మీరు బియ్యం మోసుకెళ్లగలరు తప్ప, బంజరు భూముల్ని పండించలేరు’’ అని చెబుతున్న సీనియర్ జర్నలిస్టు (ఈ వ్యాసకర్త). అప్పట్లో మెడ్రాస్ ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’లో రషీదా భగత్ బ్యూరో చీఫ్గా ఉండేవారు. ‘‘రషీదా భగత్ రాయొచ్చా సర్, ప్రత్యేకాంశాల మీద ప్రత్యేక అభిప్రాయాలు?’’ అని అతడు అడిగినప్పుడు, ‘‘రాయొచ్చు. కానీ నువ్వు రాయకూడదు. రాస్తే ఏ విలువా ఉండదు’’ అనేవారు డెస్క్ ఇన్చార్జి. సీనియర్ జర్నలిస్టులు జూనియర్ జర్నలిస్టులకు ఏం చెప్పినా, చివరి మాట మీడియా యాజమాన్యాలదే. అవి వద్దన్న అభిప్రాయాలేవీ మర్నాడు పేపర్లలో కనిపించవు. ప్రత్యేకాంశాలపై ప్రత్యేక అభిప్రాయాల మీద పత్రికలు ఎప్పుడూ కాస్త జాగ్రత్తగానే ఉంటాయి. ఎవరి మనోభావాలకూ దెబ్బ తగలకుండా. ఈ ఏడాది జూలై 30న రాజ్యసభలో తలాక్ బిల్లు అమోదం పొందగానే ఆ మర్నాడు అన్ని పేపర్లూ ఆ వార్తను వేశాయి కానీ, ఎప్పటిలా ‘ప్రత్యేకాంశం’ అయిన తలాక్పై ప్రత్యేక అభిప్రాయాలకు మాత్రం దాదాపుగా చోటివ్వలేదు. ప్రత్యేక అభిప్రాయాలంటే తలాక్ రద్దుపై ప్రభుత్వాన్ని వ్యతిరేకించని అభిప్రాయాలు. తర్వాత మెల్లిగా తలాక్ రద్దుపై ప్రభుత్వాన్ని సమర్థించని అభిప్రాయాలు ఒకటీ అరా కనిపించడం మొదలైంది. బాబ్రీ కట్టడం కూల్చివేత తర్వాత చాలాకాలం పాటు ఇలాంటి ప్రత్యేకాంశాలపై బలమైన మీడియా హౌస్లు కూడా ‘తటస్థతే సుస్థిరత’ అనే మోడ్లోకి వెళ్లిపోయాయి. వ్యూ, కౌంటర్ వ్యూ రెండూ ఉండేవి కాదు. ‘వాళ్ల’ మంచొద్దు. ‘వాళ్ల’ చెడొద్దు. ఇదీ ధోరణి! అసలు ఏది మంచి? ఏది చెడు? మంచి రాయబోయి చెడు రాసేస్తే? మంచి అనుకుని రాసింది చెడు అయిపోతే? అందుకే జూనియర్ జర్నలిస్టుల్ని ఈ ప్రత్యేకాంశాల దగ్గరకి రానిచ్చేవాళ్లు కాదు. సీనియర్ జర్నలిస్టులు ఎటూ ఆ దరిదాపులకు వెళ్లరు. ఇప్పుడా పరిస్థితి కొంచెం మారినట్లుంది. తలాక్ రద్దు మీద మీడియాలో ఈ రెండు వారాల్లోనూ ప్రధానంగా రెండు ప్రశ్నలు వచ్చాయి. తలాక్ చెబితే కౌన్సెలింగ్ ఇచ్చి పంపేలా బిల్లు ఉండాలి కానీ, ఏదో నేరం చేసినట్లు భర్తను జైల్లో పెట్టే బిల్లేమిటన్నది ఆ రెండిట్లో ఒక ప్రశ్న. ‘తలాక్ను రద్దు చేశారు సరే, హిందువుల్లోని భర్తల్ని çసంస్కరించేందుకు బిల్లు తేరేం?’ అనేది రెండో ప్రశ్న. రెండు ప్రశ్నలూ మంచివే. రెండోది ఇంకా మంచి ప్రశ్న. అయితే ఈ ప్రశ్న వేసే విధానమే మరీ అంత మంచిది కాకుండా ఉంది! ‘తలాక్’ సరే.. ‘మన’ ఇంటి గుట్టో? అని అని ప్రశ్నించడంలో ఏం మంచి ఉంది? ‘వాళ్ల’ సంగతి ఎందుకు? అని ఆనాడు అన్నవాళ్లు, ‘మన’ సంగతేంటి? అని నేడు అంటున్నారు. రెండిటిలోనూ కనిపించే భావం ఒక్కటే. ఈ దేశం ఒకే కుటుంబం కాదని! తలాక్ సంప్రదాయాన్ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్లు వేసి ఏళ్లుగా పోరాడుతున్న జకియా సోమన్, అతియా సాబ్రి, గుల్షన్ పర్వీన్, అఫ్రీన్ రెహ్మాన్, ఇష్రత్ జహాన్, సైరా భానులను ఈ ‘ఇంటి’ ఆడపడుచులు కాదు అనుకుని ఉంటే కోర్టులు పిటిషన్లను స్వీకరించేవా? ప్రభుత్వం ఇప్పుడు తలాక్పై ఒక నిర్ణయం తీసుకుని ఉండేదా? మనదంతా ఒకే కుటుంబం అని వ్యవస్థలే అనుకుంటున్నప్పుడు కుటుంబంలోని ఏ కొందరో, ఏ కారణం చేతనో కుటుంబంలోని కొందరికి అడగకుండానే మద్దతుగా నిలిచినంత మాత్రాన అదంతా ఒకే కుటుంబం కాకుండా పోతుందా? తలాక్ చట్టం మాత్రమే కాదు, అలాంటి ఏ చట్టం ఉద్దేశమైనా కుటుంబాలకు మేలు చేయడమే అయి ఉంటుంది. చట్టం ఫలిస్తుందా, నిష్ఫలం అవుతుందా అన్నది కాలక్రమంలో తేలే విషయం. ఫలించడం అంటే చట్టానికి ఫిర్యాదుల గౌరవం దక్కటం. నిష్ఫలం అంటే ఫిర్యాదులే వెళ్లని గౌరవం దక్కటం. రెండేళ్ల క్రితం మీరట్లో అమ్రీన్ బేగం (పై ఫొటో) అనే మహిళ తన భర్త పెట్టే గృహహింసను భరించలేక పోలీస్ స్టేషన్ బయటే పెద్దగా అరుస్తూ అతడికి తలాక్ చెప్పారు! ‘భర్తకేనా! భార్యకు ఉండకూడదా తలాక్ చెప్పే హక్కు’ అని ప్రశ్నించారు. ఇది ఒక బాధిత మహిళ చట్టాలతో నిమిత్తం లేకుండా తనకు తానుగా దక్కించుకున్న గౌరవం. -
చార్జ్షీట్ దాఖలు చేసి న్యాయం చేయండి
సాక్షి సిటీబ్యూరో: తన ప్రమేయం లేకుండా తన మామ మహ్మద్ యూసుఫ్ తన పేరున జహానుమా సిండికేట్ బ్యాంక్లో అకౌంట్ తీయడమే కాకుండా తన భర్తను రెచ్చగొట్టి తనకు సౌదీఆరేబియా నుంచి పోస్టులో తలాక్ ఇప్పించాడని, దీనిపై ఫలక్నుమా పోలీసులకు సంప్రదించగా అతనిపై నవంబర్ 11న ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఇంత వరకు చార్జ్షీట్ దాఖలు చేయలేదని, పోలీసులు వెంటనే చార్జ్షీట్ దాఖలు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించాలని లేని పక్షంలో అతను తన భార్య మాదిరిగానే సౌదీకి పారిపోయే ప్రమాదం ఉందని తలాక్ బాధితురాలు సయిదాబాద్ నివాసి నస్రీన్ సూల్తానా అన్నారు. మంగళవారం సయిదాబాద్లోని తన నివాసంలో తన తండ్రి ఎస్ఎల్ రెహమాన్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. సైదాబాద్కు చెందిన మహ్మద్ రహ్మన్ కుమార్తె నస్రీన్, జహానుమా ప్రాంతానికి చెందిన మహ్మద్ యూసుఫ్ కుమారుడు మహ్మద్ అలీకి 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారు సౌదీఆరేబియాలో ఉండేవారు. ఇటీవల ఆమె అరోగ్యం సరిగా లేకపోవడంతో వైద్యం కోసం హైదరాబాద్ వచ్చింది. వైద్య ఖర్చుల నిమిత్తం డబ్బులు అవసరం కావడంతో డబ్బులు పంపాలని తన భర్తను కోరింది. అయితే అప్పటికే సౌదీలో ఉన్న కోడలి పేరుతో తప్పుడు సర్టిఫికెట్లతో తన అత్త షమీమ్ఉన్సీసా సంతకంతో మామ యూసుఫ్ అకౌంట్ తెరిచాడు. అదే అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసినట్లు మహ్మద్ అలీ చెప్పడంతో నస్రీన్ మామను నిలదీసింది. దీంతో అతను బ్యాంక్కు వెళ్లి డబ్బులు తీసుకు వచ్చాడు. దీంతో నస్రీన్ ఈ విషయాన్ని తన తండ్రి రహ్మన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన బ్యాంక్కు వెళ్లి ఆరా తీయగా యూసుప్ నస్రీన్ పేరున అకౌంట్ తెరిచినట్లు తెలిపారు. దీనిపై మామను నిలదీయడంతో తన భర్తకు తప్పుడు మాటలు చెప్పి సౌదీ నుంచి తలాక్ చేయించాడని తెలిపింది. దీంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేయగా తన అత్త సౌదీకి పారిపోయిందని, యూసుఫ్ కూడా సౌదీ పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. పోలీసులు వెంటనే అతని పాస్పోర్టును సీజ్ చేయాలని, చార్జ్షీట్ దాఖలు చేసి తనకు న్యాయం చేయాలని కోరింది. -
మామ అక్రమాలను నిలదీసినందుకు..
సాక్షి హైదరాబాద్: బోగస్ పత్రాలతో కోడలు సహా 25 మంది పేరిట బ్యాంకు ఖాతాలు, గ్యాస్ కనెక్షన్లు తీసుకొని వాటి ద్వారా ప్రతి నెలా వంట గ్యాస్ సబ్సిడీ కాజేయడమే కాకుండా దీనిపై నిలదీసిన కోడలికి కొడుకు చేత తలాక్ ఇప్పించిన ఉదంతం నగరంలోని పాతబస్తీలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం సైదాబాద్కు చెందిన మహ్మద్ రహ్మన్ కూతురు నస్రీన్కు ఫలక్నుమా పోలీస్టేషన్ పరిధిలో ఉంటున్న మహ్మద్ యూసుఫ్ కుమారుడు మహ్మద్ అలీకి 2014లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత దంపతులు సౌదీ అరేబియాలో వెళ్లిపోయారు. నకిలీ ఖాతా తెరిచి... ఇటీవల అనారోగ్యానికి గురైన నస్రీన్ వైద్యం కోసం హైదరాబాద్ వచ్చింది. చికిత్స ఖర్చుల కోసం భర్తను డబ్బు పంపాలని కోరింది. దీంతో భర్త.. జహానుమాలోని సిండికేట్ బ్యాంకులో నస్రీన్ పేరిట ఉన్న ఖాతాలోంచి సొమ్ము తీసుకోవాల్సిందిగా భార్యకు సూచించాడు. అయితే తనకు ఖాతా లేకున్నా ఆ బ్యాంకులోకి సొమ్ము ఎలా వచ్చిందని మామ మహ్మద్ యూసఫ్ను అడగ్గా ఆయన అదేమీ చెప్పకుండానే డబ్బును బ్యాంకు నుంచి తీసుకొచ్చి కోడలికి ఇచ్చాడు. దీనిపై అనుమానం వచ్చిన నస్రీన్... ఆ బ్యాంకుకు వెళ్లి ఖాతా వివరాలు పరిశీలించగా 2014లో తన పేరిట బోగస్ పత్రాలతో తెరిచినట్లు ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా 2014 నుంచి ఆ ఖాతాలో తన భర్త జమ చేస్తున్న సొమ్మును మామ కాజేసిట్లు తెలుసుకుంది. అలాగే తన పేరిట, తోటికోడళ్లు, ఇతర మహిళల పేరిట బోగస్ పత్రాలతో 25 బ్యాంకు ఖాతాలను తెరిచి వాటి ద్వారా గ్యాస్ కనెక్షన్లను మామ సంపాదించాడని నస్రీన్ తెలుసుకుంది. ఈ కనెక్షన్ల పేరిట ప్రతి నెలా గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకొని అక్రమంగా సబ్సిడీ సొమ్మును పొందుతున్నట్లు ఆమె గుర్తించింది. పోస్టులో తలాక్..: ఈ అక్రమాలకు తన పేరును ఎందుకు వాడుకున్నావంటూ మామను నిలదీయగా సౌదీలో ఉన్న కొడుకుకు లేనిపోనివి చెప్పి పోస్టు ద్వారా తలాక్ ఇప్పించాడని నస్రీన్ ‘సాక్షి’కి తెలిపింది. మామపై ఈ నెల 1న పోలీసులకు ఫిర్యాదు చేయగా 14న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వివరించింది. తాను జూలై 11న సౌదీ నుంచి వస్తే సెప్టెంబర్ 24న అందిన తలాక్ లేఖలో జూలై 2వ తేదీన తనకు తలాక్ ఇచ్చినట్లు భర్త అందులో పేర్కొన్నాడని బాధితురాలు చెప్పింది. తన పిల్లలు సౌదీలోనే ఉన్నారని, మామ, భర్త కలసి తన జీవితాన్ని నాశనం చేశారని వాపోయింది. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. మహ్మద్ యూసఫ్ గతంలోనూ పలు అక్రమాలకు పాల్పడ్డాడని బాధితురాలు పేర్కొంది. మరణించిన అల్లుడి పిల్లలను తన పిల్లలుగా చూపుతూ వారి పేరిట నకిలీ పాస్పోర్టులను తయారు చేసి గతంలో తాను పని చేసిన సౌదీ కంపెనీ నుంచి ఆర్థిక సాయం కూడా పొందాడని తెలిపింది. తనకు న్యాయం చేస్తానని పోలీసు కమిషనర్ హామీ ఇచ్చారని నస్రీన్ వివరించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement