-
D Y Chandrachud: మాట వినే లక్షణమేదీ?
ముంబై: నేటి సమాజంలో ఇతరులు చెప్పేది వినే లక్షణం లోపిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆవేదన వెలిబుచ్చారు. ఎవరికి వారు తమ వైఖరే గొప్ప అనుకుంటూ ఒక చట్రానికి పరిమితమై బతుకుతున్నారన్నారు. ‘‘ఈ ధోరణిని బద్దలు కొట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఇతరులు చెప్పేది వినడం గొప్ప కళ. దాని ద్వారా అవగాహన పరిధి ఎంతగానో పెరుగుతుంది. ప్రపంచాన్ని సరికొత్తగా అర్థం చేసుకోగలం’’అని హితవు పలికారు. శనివారం ఆయన పుణెలోని సింబయాసిస్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. వ్యక్తిగత వృత్తిగత జీవితంలో ఆగ్రహావేశాలు, హింస, ఇతరులను అగౌరవపరడం వంటివాటితో నష్టాలే తప్ప సాధించేదేమీ ఉండదని విద్యార్థులు అర్థం చేసుకోవాలన్నారు. వినయ విధేయతలు, ధైర్యం, సమగ్రతలే ఆయుధంగా ముందుకు సాగాలని హితవు పలికారు. నేటి యువత ప్రశ్నించేందుకు అస్సలు వెనకాడకపోవడం మంచి పరిణామమన్నారు. సమాజంలో విభజనవాదం నానాటికీ పెరిగిపోతోందని ముంబైలో జమునాలాల్ బజాజ్ అవార్డుల ప్రదానోత్సవంలో సీజేఐ ఆందోళన వెలిబుచ్చారు. ‘‘సోషల్ మీడియాలో కన్పిస్తున్న ధోరణులు, అసహనం దీనికి సంకేతాలే. భారత్ కూడా ఇందుకు అతీతం కాదు’’ అని అభిప్రాయపడ్డారు. -
మహోన్నతంగా ఎదగాలి
పింప్రి, న్యూస్లైన్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కొద్దిసేపు ప్రొఫెసర్ అవతారమెత్తారు. పుణేలోని సింబయాసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన ‘ఫెస్టివల్ ఆఫ్ థింకర్స్ లెక్చర్ సిరీస్’ అనే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విద్యార్థులకు మంచిచెడులను వివరించారు. మనిషి జీవించి ఉన్నంత వరకు సంఘర్షణ తప్పదంటూ తన జీవిత అనుభవ పాఠాలను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకున్నారు. ‘డబ్బు, పేరు, ప్రతిష్ట ప్రజల నుంచి లభిస్తాయి. అయితే విద్య, శిక్షణ, జ్ఞానం మాత్రం ఎవరో ఇస్తే వచ్చేవి కావు. ఇవన్నీ కలిగిన వ్యక్తి మంచి దేశ పౌరుడు అవుతాడు. నేను చదువుకునే సమయంలో ఇటువంటి సదుపాయాలు లేనేలేవు. అయితే ప్రస్తుతం విద్యార్థులకు సకల సదుపాయాలు వున్నాయి. వాటిని వినియోగించుకుని మహోన్నతమైన వ్యక్తిగా ఎదగాలి’ అని విద్యార్థులకు హితవు పలికారు. ‘ప్రతి ఒక్కరూ తనకాళ్లపై నిలబడడానికి ప్రయత్నించాలి. ఎవరిపైనా ఆధారపడకుండా జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలి. అదే అందరినీ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది’ అని మీడియా అండ్ కమ్యూనికేషన్ విభాగం విద్యార్థులకు బోధించారు. ఈ సందర్భంగా అమితాబ్ రెండు ఆలోచనాత్మకమైన కవితలను వినిపించారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగాలని, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి శరవేగంగా జీవితంలో ఎదుగుతాడని అన్నారు. తన విద్యాభ్యాస దశలో జరిగిన ఓ సంఘటనను ఈ సందర్భంగా ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. బాక్సింగ్ను చూడటం వేరు, ప్రత్యక్షంగా పాల్గొనడం వేరని, తాను ఈ నగరానికి కేవలం డ్రైవింగ్ లెసైన్సుతో వచ్చానన్నారు. నట జీవితంలో ఎన్నో సంఘర్షణలను ఎదుర్కొన్నానని, అందువల్లనే మంచి నటుడిగా నిలబడ్డానని అన్నారు. లేకపోతే ఓ మామూలు ట్యాక్సీ డ్రైవర్గా నిలబడిపోయేవాడినేమోనని అన్నారు. దేశానికి స్వాతంత్యం లభించిన సమయంలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అన్న మాటలే తనకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది కదా అని విజయోత్సవాలకే మనం పరిమితం కాకూడదని, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దినప్పుడే అసలైన విజయోత్సవం అని నెహ్రూ అన్నారని తెలిపారు. ఆ మాటలను మనందరం నిరంతరం గుర్తుంచుకోవాలన్నారు. ఏ పనినైనా పట్టుదలతో చేయాలంటూ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రధాన సంచాలకులు డాక్టర్ యేరవడేకర్, వైస్ చాన ్సలర్ డాక్టర్ రజనీ గుప్తే, సింబయాసిస్ ఇంటర్నేషనల్ మీడియా అండ్ కమ్యూనికేషన్ సంచాలకులు చందన ఛటర్జీ, అనుపమ సిద్ధార్థ్ తదితరులు పాల్గొన్నారు. అమితాబ్ ముందుగా ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఆ తరువాత విద్యార్థులతో కలసి ఫొటోలకు పోజులిచ్చారు. అమితాబ్ రాకతో యూనివర్సిటీ బాగా సందడి సందడిగా మారింది.
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Advertisement