-
ఢిల్లీకి కాంగ్రెస్ సూట్కేసులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్పార్టీ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడం పక్కన పెట్టి ఢిల్లీకి సూట్కేసులు మోస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, జి.కిషన్రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీ కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్కాంట్రాక్టర్లు, బిల్డర్లు, కంపెనీలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కర్ణాటక నుంచి సూట్కేసులు వస్తే.. ఇప్పుడు తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాయని విమర్శించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ నాయకుడు వెల్లాల రామ్మోహన్ తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. వారికి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని ఆరోపించారు. ’’కాంగ్రెస్ది భస్మాసుర హస్తం.. చెయ్యి గుర్తుకు ఓటేస్తే.. అదే చెయ్యిని ప్రజల తలపై పెట్టి మోసం చేస్తుందని’’ఇప్పుడు మరోసారి రుజువైందని ధ్వజమెత్తారు. ’’దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన పీవీ నర్సింహారావును మోదీ ప్రభుత్వం గౌరవించింది. పీవీ చనిపోతే.. ఆయన పారి్ధవ దేహాన్ని ఏఐసీసీ ఆఫీసులోకి రానివ్వకుండా హైదరాబాద్కు పంపిన చరిత్ర కాంగ్రెస్ది అని అన్నారు. విజిలెన్స్తో అయ్యేది లేదు.. పోయేది లేదు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ దొందూ దొదేని కిషన్రెడ్డి విమర్శించారు. ‘ఈ రెండూ అవినీతి, కుటుంబ పార్టీలే. ఇవి మజ్లిస్పంచన చేరి బుజ్జగింపు రాజకీయాలు చేస్తాయి. కాంగ్రెస్ కూడా అవినీతి పార్టీనే కాబట్టి బీఆర్ఎస్, కేసీఆర్పై దర్యాప్తు చేసేందుకు కాంగ్రెస్ప్రభుత్వానికి ధైర్యం లేదు. సీబీఐతో విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తే.. విజిలెన్స్ పేరుతో కాలయాపన చేస్తోంది. విజిలెన్స్తో అయ్యేది లేదు.. పోయేది లేదు. గత బీఆర్ఎస్ప్రభుత్వం కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వకుండా వారు జీహెచ్ఎంసీ ముందు ధర్నా చేసే దుర్మార్గ స్థితికి తీసుకువస్తే.. కాంగ్రెస్ప్రభుత్వం దాన్ని మరింత దిగజార్చనుంది. హైదరాబాద్నుంచి రాష్ట్రానికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నా.. జీహెచ్ఎంసీకి నిధులు ఇవ్వడం లేదు’’అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మోదీతోనే తెలంగాణ అభివృద్ధి... గత తొమ్మిదిన్నరేళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోందని కిషన్రెడ్డి వివరించారు. ‘రూ.400 కోట్లతో చర్లపల్లి, రూ.720 కోట్లతో సికింద్రాబాద్, రూ.450 కోట్లతో కాచిగూడ, రూ.350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్లను మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. భద్రాద్రి అభివృద్ధికి రూ.50 కోట్లు కేంద్రం ఇచ్చిందని, వరంగల్రామప్ప దేవాలయానికి మోదీ కృషితో యునెస్కో గుర్తింపు వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో రూ.లక్షా 20 వేల కోట్ల విలువైన రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. హైదరాబాద్ చుట్టూ రూ.26 వేల కోట్ల ట్రిపుల్ఆర్రోడ్డును మోదీ మంజూరు చేశారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్హయాంలో ఎంపీలు, మంత్రులు అవినీతి ఆరోపణలతో, కుంభకోణాలతో జైలుకు వెళ్లారని, తొమ్మిదిన్నర ఏళ్ల మోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదని గుర్తు చేశారు. వచ్చే 25 ఏళ్లలో ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా భారత్ను నిలబెట్టాలని ప్రధాని పిలుపునిచ్చారనీ అందులో భాగస్వామ్యమయ్యేందుకు మనం సిద్ధమవ్వాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. -
సూట్ కేసులతో పరుగులు... ఇవి రాజపక్సవేనా?
Suitcases Loaded On Sri Lanka Navy Ship: శ్రీలంక రాజధాని కొలంబోలో మళ్లీ పెద్ద ఎత్తున ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆందోళనకారులు లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికార నివాసాన్ని చుట్టుముట్టారు కూడా. ఈ మేరకు వారంతా ఆయన కార్యాలయం, అధికార నివాసం రెండింటిని ఆక్రమించారు. ఈ నేపథ్యంలో గోటబయ పరారయ్యరంటూ పలు కథనాలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఆయన పెద్ద పెద్ద సూట్కేసులు తీసుకుని శ్రీలంక నేవీ ఓడలో పారిపోయారంటూ.. వార్తలు గుప్పుమన్నాయి. అందుకు సంబంధించిన పోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు ముగ్గురు వ్యక్తులు పెద్ద పెద్ద సూట్కేసులతో ఎస్ఎల్ఎన్ఎస్ గజబాహు అనే నేవీ ఓడలో తీసుకువెళ్తున్నట్లు వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ విషయమై కొలంబో పోర్ట్లోని అధికారిని ప్రశ్నించగా...ఆయన కూడా ఒక బృందం పెద్ద పెద్ద సూట్కేసులతో గజబాహు అనే ఓడ ఎక్కి వెళ్లినట్లు తెలిపారు. అంతేకాదు ఈ విషయాన్ని శ్రీలంక స్థానిక మీడియా వెల్లడించింది కూడా. ఐతే అతనితోపాటు ఎవరెవరు వెళ్లారు, ఎలా వెళ్లాడనేది వివరణ ఇవ్వలేదు. మరోవైపు శ్రీలంక రక్షణ శాఖ ఆయన్ని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తరలించినట్లు పేర్కొంది. పైగా శ్రీలంకలోని కొన్ని మీడియా సంస్థలు అధ్యక్క్షుడు పరారయ్యడంటూ... విమానాశ్రయంలోని లంక అధ్యక్షుడు గోటబయ కాన్వాయ్ని చూపిస్తూ... వార్తలు ప్రసారం చేశాయి. కానీ లంక అధ్యక్షుడు గోటబయ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లారో లేదా అనేది స్పష్టం కాలేదు. Lmao people actually made the president pack his suitcase and run for his life😂😂 #GoHomeGota #අරගලයටජය #GoHomeRanil pic.twitter.com/gw7Zkr1I5a — ♡ Sanda ♡ (@TachyonJaneesha) July 9, 2022 (చదవండి: ఇంటి నుంచి పరారైన శ్రీలంక అధ్యక్షుడు!) -
జీపీఎస్ టెక్నాలజీ సూట్కేసులు వచ్చేస్తున్నాయ్
కాలిఫోర్నియా : మనం సాధారణంగా మొబైల్స్, కార్లలో జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) టెక్నాలజీని ఎక్కువగా వాడుతుంటాం. కానీ ఒక సూట్కేస్కి జీపీఎస్ ఉంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? మన సామాన్లు భద్రంగా ఉండటమే కాదు.. అది ప్రపంచంలో ఎక్కడున్నా లొకేషన్ను ట్రేస్చేసి తెలుసుకోవచ్చు. అదే బ్లూస్మార్ట్ సూట్కే సు. ఇది మొబైల్ యాప్ ద్వారా పనిచేస్తుంది. ఇందులో ఓ పవర్బ్యాంక్ కూడా ఉంటుంది. దీనిద్వారా మొబైల్ చార్జింగ్ చేసుకోవచ్చు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ సూట్కేసుకు డిజిటల్ లాక్ కూడా ఉంది. దానిని పగలగొడితే తప్ప దొంగలు ఓపెన్ చేయలేరు. త్వరలోనే ఇండియాలో ఈ బ్లూస్మార్ట్ సూట్కేసులు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. -
అతిపెద్ద సూట్కేసు
తిక్క లెక్క ఎంత పెద్ద సూట్కేసు అయినా సామాన్లు పెట్టుకొని, మనుషులు మోసేటట్లే ఉంటాయి గానీ, ఏకంగా మనుషులనే ఇముడ్చుకొనేంతగా ఉంటాయేంటి? సాధారణంగా అలాంటి సూట్కేసులు ఉండవు. ఈ ఫొటోలో కనిపిస్తున్న సూట్కేసు మాత్రం కొంచెం అసాధారణంగా రూపొందించారు. సగటు ఎత్తు, బరువు గల నలుగురు మనుషులు ఇందులో ఈజీగా పట్టేస్తారు. చైనాలోని గువాంగ్డాంగ్ ప్రావిన్స్లో పదేళ్ల కిందట ఏర్పాటైన ఎగుమతి వస్తువుల ప్రదర్శనలో ప్రదర్శనకు పెట్టిన ఈ సూట్కేసు గిన్నెస్బుక్లోకి ఎక్కింది. దీని ఎత్తు 5.9 అడుగులు, పొడవు 3.9 అడుగులు, వెడల్పు 1.6 అడుగులు మాత్రమే. -
హత్యచేసి గంగా నదిలోకి విసిరేసి..
షెరాపులి: పశ్చిమ బెంగాల్లో ఓ బ్యాంకు మేనేజర్ దారుణానికి ఒడిగట్టాడు. ఓ మహిళను, ఆమె కూతురుని హత్య చేసి రెండు సూట్ కేసుల్లో వారి మృత దేహాలను ఉంచి గంగా నదిలో విసిరేసి పోలీసులకు చిక్కాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం 45 ఏళ్ల సమరేశ్ సర్కార్ అనే వ్యక్తి షెరాపులి వద్ద బ్యాంకు మేనేజర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అతడికి అప్పటికే ఓ భార్య తిటాగఢ్ అనే చోట ఉండగా తాను విధులు నిర్వర్తిస్తున్న చోట సుచేత చక్రవర్తి అనే 34 ఏళ్ల మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. గత కొంత కాలంగా ఈ వ్యవహారం నడుస్తుండగా ఆమె ఇటీవల తనను వివాహం చేసుకోవాల్సిందిగా సమరేశ్ ను డిమాండ్ చేసింది. దీంతో భార్యకు భయపడిన అతడు సుచేతను, ఆమెకు అప్పటికే ఉన్న ఐదేళ్లపాపను హతమార్చి ఇద్దరి మృతదేహాలను సూట్ కేసులలో పెట్టి గంగా నదిలో విసిరేశాడు. ఇది తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి వారి మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. అతడిని 12 రోజులపాటు రిమాండ్కు తరలించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement