-
రూ.8వేలు.. ఇద్దరు ఉద్యోగులు
మహబూబ్నగర్ క్రైం: అతనిది నిరుపేద కుటుంబం.. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ట్రాక్టర్ కొనుగోలుకు ఉపయోగించుకోవాలనుకున్నాడు.. తద్వారా ఉపాధి పొందొచ్చన్నది ఆయన ఆశ.. కానీ మహబూబ్నగర్ పరిశ్రమల శాఖ అధికారులు ఆయన ఆశ తీరాలంటే లంచం ఇచ్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.. అలా ఏడాది పాటు ఆయనను తిప్పుకోగా.. విసిగి వేసారిన ఆ లబ్ధిదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇంకేం.. వారు రంగంలో దిగి డబ్బు తీసుకుంటున్న ఇద్దరు ఉద్యోగులు బుధవారం రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. మాకేంటి..? జడ్చర్ల మండలం లక్ష్మణ్నాయక్ తండాకు చెందిన రాంజీనాయక్ గత ఏడాది ఉపాధి నిమిత్తం కొత్త ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ఇందుకోసం ఐసీఐసీఐ బ్యాంకులో రుణం తీసుకున్నాడు. ఆ వెంటనే సబ్సిడీ వస్తుందని తెలియడంతో పరిశ్రమల శాఖ అధికారులను సంప్రదించాడు. ఈ మేరకు సబ్సిడీ మంజూరు చేస్తాం.. కానీ తమకేంటని వారు ప్రశ్నించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ఐపీవో నర్సింగరావు రూ.10వేలు, జూనియర్ అసిస్టెంట్ మహ్మద్ ఇనియాత్ అలీఖాన్ రూ.5వేలు డిమాండ్ చేశారు. ఇలా ఏడాది పాటు రాంజీ వారి చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అయినా డబ్బు ఇస్తేనే సబ్సిడీ మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. చివరకు ఆయన విజ్ఞప్తితో వారు చివరకు రూ.8వేలకు దిగొచ్చారు. అయినప్పటికీ మనస్సు అంగీకరించని రాంజీ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు బుధవారం రంగంలోకి దిగిన వారు.. కార్యాలయంలో రాంజీ నుంచి డబ్బు తీసుకుంటున్న నర్సింగరావు, మహ్మద్ ఇనియాత్ అలీఖాన్ పట్టుకున్నారు. ఈ మేరకు వారిద్దరిపై కేసులు నమోదు చేయడంతో పాటు గురువారం హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ, సీఐ రమేష్ వెల్లడించారు. -
గులాబీ దండుకే యంత్ర‘లక్ష్మి’!
సబ్సిడీ ట్రాక్టర్లు అధికార పార్టీ నాయకులకే.. మూడో విడతలో జిల్లాకు 224 ట్రాక్టర్లు మంజూరు సీఎం కార్యాలయం హామీ ఇచ్చినా.. 2015లో నా పంట పొలంలో పసుపు, మొక్కజొన్న, సోయా పంటలు ఎండిపోయాయి. సీఎం క్యాంపు కార్యాలయానికి టెలిగ్రాం చేశా. ప్రభుత్వం వ్యవసాయానికి అందించే ప్రోత్సాహకాల విషయంలో నాకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి హామీ పత్రం వచ్చింది. అందుకు అనుగుణంగా యంత్రలక్ష్మి పథకం కింద లబ్ధిదారుడిగా ఎంపిక చేయాలి. కానీ.. అధికార పార్టీ నాయకుల మూలంగా నాకు ట్రాక్టర్ మంజూరు కాలేదు. మోర్తాడ్(బాల్కొండ) : వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా యంత్రలక్ష్మి పథకం కింద జిల్లాకు మంజూరైన ట్రాక్టర్ల యూనిట్లు మరోసారి గులాబీ నాయకులనే వరించాయి. ముచ్చటగా మూడోసారి యంత్రలక్ష్మి ట్రాక్టర్ల యూనిట్లను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ అనుచరులకు ఇప్పించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని వివిధ మండలాలకు 2016–17 ఆర్థిక సంవత్సరానికి 224 ట్రాక్టర్ల యూనిట్లు మంజూరయ్యాయి. అయితే ఆర్థిక సంవత్సరం ముగింపులోనే ప్రభుత్వం ట్రాక్టర్ల యూనిట్లకు సబ్సిడీ కోసం నిధులు కేటాయించింది. దీంతో ముందుగానే ఎంపిక చేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో దరఖాస్తు చేయించిన నేతలు వారికే మంజూరయ్యేలా ముందుచూపుతో వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యంత్రలక్ష్మి పథకం కింద లబ్ధి పొందడానికి దరఖాస్తు చేసుకోవాలనే సమాచారాన్ని అధికారులు రైతులకు అందించ లేదు. ఆర్థిక సంవత్సరం ముగిసిపోవడానికి సమయం దగ్గరపడుతున్నా నిధులు విడుదల కాకపోవడంతో యంత్రలక్ష్మి పథకం కింద లబ్ధి పొందడానికి దరఖాస్తు చేసుకోవడానికి రైతులు ఆసక్తి చూపలేదు. కేవలం 300 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇదే అదనుగా భావించిన కొందరు ముఖ్యనేతలు ట్రాక్టర్ల యూనిట్లను హడావుడిగా మంజూరు చేయించారు. గుట్టుచప్పుడు కాకుండా దరఖాస్తు నియోజకవర్గ ఎమ్మెల్యేలు తమ అనుచరులతో గుట్టుచప్పుడు కాకుండా దరఖాస్తులు మీ సేవా కేంద్రాల్లో ఆన్లైన్ చేయించి గ్రామజ్యోతి వ్యవసాయ కమిటీ, మండల కమిటీల ఆమోదం పొందేలా చేశారు. ఆ తరువాత జిల్లా వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ కార్యాలయానికి దరఖాస్తులు పంపించి వాటికి మోక్షం కలిగించడానికి అధికార పార్టీ నాయకులు పావులు కదిపారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం వెల్లడించిన 224 మంది లబ్ధిదారుల జాబితాను పరిశీలిస్తే అందులో అందరూ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మండల, గ్రామ కమిటీల నాయకులు ఉన్నారు. ఒకరిద్దరు ఎంపీపీలతోపాటు, పలువురు ఎంపీటీసీ సభ్యులు, కొంత మంది సర్పంచ్లు, మరికొంత మంది ఉప సర్పంచ్లు, సహకార సంఘం చైర్మన్, డైరెక్టర్లు ఉన్నట్లు స్పష్టం అయ్యింది. ఈ ప్రజాప్రతినిధులు అంతా గులాబీ కండువాలు కప్పుకునే నాయకులు కావడం విశేషం. రెండు విడతల్లో అధికార పార్టీ నాయకులకే పెద్దపీట తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2015లో మొదటిసారి యంత్రలక్ష్మి పథకాన్ని అమలు చేశారు. తొలిసారి అమలు చేసిన సమయంలో ఉమ్మడి జిల్లాకు 175 ట్రాక్టర్ల యూనిట్లను మంజూరు చేశారు. యంత్రలక్ష్మి పథకం కింద అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడంతో భారీ సబ్సిడీ ట్రాక్టర్లను పొందడానికి రైతులు ఎక్కువ మంది పోటీ పడ్డారు. అప్పట్లో దాదాపు 500 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా అన్ని దరఖాస్తులను పరిశీలించి ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన వారికే ట్రాక్టర్లను మంజూరు చేశారు. 2016లో రెండో విడత ట్రాక్టర్లను మంజూరు చేయగా జిల్లాకు 212 యూనిట్లను కేటాయించారు. కాగా 300 దరఖాస్తులు అధికారులకు అందగా ఇందులో కూడా ముఖ్యనేతలు చెప్పిన దరఖాస్తులకే అధికారులు ఆమోద ముద్ర వేశారు. దీనిపై తాళ్లరాంపూర్కు చెందిన రైతు బోనగిరి నర్సారెడ్డి లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా లోకాయుక్త స్పందించి జేడీఏకు నోటీసులను జారీ చేసింది. యంత్రలక్ష్మి ట్రాక్టర్ల యూనిట్ల మంజూరులో ప్రజాప్రతినిధుల జోక్యంపై లోకాయుక్త మండిపడింది. అయితే యంత్రలక్ష్మి పథకం కింద లబ్ధిపొందేవారికి కనీసం రెండు ఎకరా ల వ్యవసాయ భూమి ఉండాలి. ఎంత భూమి ఎక్కువ ఉన్నా ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హుడు అని ప్రభుత్వం నిర్ణయించడంతో లోకాయుక్తలో అధికారులు ప్రభుత్వ నిబంధనలు చూపి తప్పించు కోగలిగారు. భారీగా సబ్సిడీ యంత్రలక్ష్మి పథకం కింద ఒక్కో ట్రాక్టర్ యూనిట్కు 50 శాతం సబ్సిడీని అందిస్తున్నారు. ట్రాక్టర్ ధర ఎంత ఉన్నా సబ్సిడీ మొత్తం రూ.5 లక్షల వరకు వర్తించేది. కాగా సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఈ సంవత్సరం ట్రాక్టర్ ధర ఎంత ఉన్నా సబ్సిడీని రూ.4 లక్షలకు పరిమితం చేసింది. లబ్ధిదారుడికి రెండు ఎకరాలు కనిష్టంగా భూమి ఉండాలి. గరిష్టంగా ఎంత భూమి ఉన్నా యంత్రలక్ష్మి పథకం కింద లబ్ధిపొందవచ్చు. ఇదిలా ఉండగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల కింద సబ్సిడీ రుణాలు అందించడానికి ప్రభుత్వం నిధులు కేటాయించగా దరఖాస్తులు అనేకం వచ్చాయి. అయితే లబ్ధిదారులను ఎంపిక చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం లక్కీ డ్రా పద్ధతిని అవలం భించింది. ఈ విధానాన్ని యంత్రలక్ష్మి ట్రాక్టర్ల యూనిట్ల కేటాయింపునకు అమలు చేసి ఉంటే కొంతమంది అర్హులకైనా ట్రాక్టర్ల యూనిట్లు మంజూరయ్యేవని రైతులు చెబుతున్నారు. కనీసం నాలుగో విడత నుంచైనా డ్రా విధానం అమలు చేయాలని పలువురు కోరుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement