-
ఇప్పటికీ తన విధానమే పాటిస్తున్నాం..: బిల్గేట్స్
యాపిల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్కు టెక్ ప్రపంచంలో ఎల్లప్పుడూ ప్రత్యేకస్థానం ఉంటుంది. కంపెనీ సమావేశాలు ఏర్పాటు చేసినా, కొత్త ఉత్పత్తులు విడుదలైనా ఆయన చేసే ప్రసంగం, తన వ్యవహారశైలి అందరినీ కట్టిపడేసేది. తాజాగా ఇదే విషయాన్ని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వెల్లడించారు. బహిరంగ వేదికలపై స్టీవ్ జాబ్స్లా తాను వ్యవహరించలేనని, ఆయన చాలా సహజంగా ప్రవర్తిస్తూ ఎదుటి వారిని తన మాటలతో ఆకట్లుకునేవారని గేట్స్ ఓ పాడ్కాస్ట్లో తెలిపారు. ఈ సందర్భంగా బిల్గేట్స్ మాట్లాడుతూ.. ‘స్టీవ్ జాబ్స్ చాలా సహజంగా ఉంటారు. స్టేజ్పై మాట్లాడటానికి ముందు ఆయన రిహార్సల్స్ చూడటం ఎంతో సరదాగా ఉంటుంది. కొన్నిసార్లు వేదికపై మాట్లాడుతుంటే అప్పటికప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఆ స్థాయిని నేను ఎప్పటికీ అందుకోలేను. మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన తొలి నాళ్లలో వాటి ఉత్పత్తుల గురించి వివిధ రకాల వ్యక్తులకు వివరించడమే కీలక ప్రక్రియగా ఉండేది. విద్య, వైద్యం, ఏఐకి సంబంధించి మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల గురించి అభిప్రాయ సేకరణ కోసం ఇప్పటికీ కొన్నిసార్లు స్టీవ్ జాబ్స్ అనుసరించే కమ్యూనికేషన్ విధానాన్నే పాటిస్తున్నాం’ అని చెప్పారు. కంపెనీకి సంబంధించి నూతన ఉత్పత్తుల విడుదలతో పాటు, ఇతర సమావేశాల్లో ప్రసంగించేందుకు స్టీవ్ చాలా రోజుల ముందు నుంచి సిద్ధమయ్యేవారట. ఈ విషయాన్ని 2015లో విడుదలైన ‘బికమింగ్ స్టీవ్ జాబ్స్’ అనే పుస్తకంలో రచయితలు బ్రెంట్ ష్లెండర్, రిక్ టెట్జెలీలు వెల్లడించారు. తామా గతంలో ఒక రోజంతా స్టీవ్ జాబ్స్తో ఉన్నామని పుస్తకంలో తెలిపారు. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? కీలక మార్పులు చేసిన బ్యాంకులు చిన్న ప్రజెంటేషన్ కోసం ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని, స్లైడ్స్కు ఎలాంటి రంగులు వాడాలి? స్టేజ్పై తన వ్యవహారశైలి ఎలా ఉండాలి? ఎక్కడ స్పాట్ లైట్ పడాలి? ఇలా ప్రతి విషయంలో ఎంతో ప్రణాళికతో వ్యవహరించేవారని వివరించారు. -
సొంత కంపెనీల్లోనే ఉద్యోగాలు కోల్పోయిన సీఈవోలు వీరే!
ఇటీవల ఓపెన్ఏఐ కంపెనీ తన సీఈఓ 'శామ్ ఆల్ట్మన్'ను పదవి నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వార్త టెక్ ప్రపంచంలో పెద్ద చర్చలకు దారి తీసింది. సీఈఓ జాబ్ కూడా గ్యారెంటీ కాదని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. 2022లో 969 మంది సీఈఓలు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయగా.. ఈ ఏడాది మొదటి తొమ్మిది ఈ సంఖ్య 1425 కు చేరింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ (World of Statistics) ప్రకారం, తాము నెలకొల్పిన సంస్థల నుంచి తమ సీఈఓ పదవులు కోల్పోయిన వారు ఎవరనేది ఈ కథనంలో తెలుసుకుందాం. స్టీవ్ జాబ్స్ (Steve Jobs) యాపిల్ కంపెనీ కో ఫౌండర్, సీఈఓ స్టీవ్ జాబ్స్ ఒకప్పుడు ఆ కంపెనీలోనే తన సీఈఓ జాబ్ కోల్పోయిన సంగతి బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. సంస్థ ప్రారంభమైనప్పుడు అతని వయసు 21 సంవత్సరాలు మాత్రమే, అయితే ఆ కంపెనీ స్థాపించిన సుమారు 9 సంవత్సరాలకు కంపెనీ బోర్డు సీఈఓగా తొలగించి, ఆ స్థానంలో జాన్ స్కూల్లేను నియమించింది. ఆ తరువాత 1997లో స్టీవ్ జాబ్స్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాడు. ఈయన 2011లో అనారోగ్య కారణాల వల్ల కన్నుమూశాడు. ప్రస్తుతం ఈ స్థానంలో 'టిమ్ కుక్' ఉన్నారు. అంకితి బోస్ (Ankiti Bose) జిలింగో కో-ఫౌండర్, సీఈఓ అంకితి బోస్ కొన్ని ఆర్ధిక అవకతవకల దర్యాప్తు కారణంగా 2022లో సీఈఓగా తొలగించారు. బోర్డు ఆమోదం లేకుండానే.. ఆమె జీతం దాదాపు 10 రెట్లు పెరగటం కారణంగా సీఈఓగా తొలగించినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఈ వార్త టెక్ ప్రపంచంలో పెద్ద సంచలనంగా మారింది. పరాగ్ అగర్వాల్ (Parag Agrawal) ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎక్స్ (ట్విటర్) సంస్థను కొనుగోలు చేసిన తరువాత కంపెనీలో చాలామంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లను తొలగించారు. 2021లో సీఈఓగా ఎంపికైన పరాగ్ అగర్వాల్ ఆ సమయంలో కంపెనీని విడిచిపెట్టిన మొదటి వ్యక్తి. విధుల నుంచి తొలగించినందుకు నష్టపరిహారంగా పరాగ్ అగర్వాల్ దాదాపు 40 మిలియన్ల డాలర్ల భారీ మొత్తాన్ని అందుకున్నట్లు సమాచారం. ఫనీష్ మూర్తి (Phaneesh Murthy) ప్రముఖ ఐటీ సంస్థ 'ఐగేట్' (iGate) ప్రెసిడెంట్, సీఈఓ ఫనీష్ మూర్తికి తన సహోద్యోగితో సంబంధం ఉందనే కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అరాసెలి రోయిజ్ అనే ఉద్యోగి లైంగిక వేధింపుల దావా వేసినప్పుడు విచారణంలో దోషిగా తేలడం వల్ల ఈయన సీఈఓగా తొలగించారు. ఈయన ఇన్ఫోసిస్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొన్నట్లు సమాచారం. జాక్ డోర్సే (Jack Dorsey) 2006లో ప్రారంభమైన మైక్రోబ్లాగింగ్ స్టార్టప్ ట్విటర్ కో-ఫౌండర్ అండ్ సీఈఓ 'జాక్ డోర్సే' 2008లో కొన్ని కారణాల వల్ల తన పదవి కోల్పోయాడు. ఆ తరువాత ఆయన స్థానంలోకి పరాగ్ అగర్వాల్ నియమితుడై సీఈఓ బాధ్యతలు చేపట్టారు. శామ్ ఆల్ట్మాన్ (Sam Altman) సంస్థలో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని, బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డు నమ్మకం కోల్పోయిందనే కారణంగా 'ఓపెన్ఏఐ' (OpenAI) 'శామ్ ఆల్ట్మన్'ను సీఈఓ పదవి నుంచి తొలగించింది. ఇదీ చదవండి: ఆ రెండు కార్ల ఖరీదే రూ.20 కోట్లు - అట్లుంటది అంబానీ ఫ్యామిలీ అంటే.. తమ కంపెనీలలోనే సీఈఓ పదవి కోల్పోయిన వ్యక్తుల జాబితాలో యాహూ సీఈఓ కరోల్ బార్ట్జ్ (2011), హెచ్టీసీ సీఈఓ పీటర్ చౌ (2015), తైవాన్కు కంప్యూటర్ కంపెనీ ఏసర్ సీఈఓ జియాన్ఫ్రాంకో లాన్సి (2011), విప్రో జాయింట్ సీఈఓలు గిరీష్ పరంజ్పే & సురేష్ వాస్వానీ (2011), మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీఫెన్ ఎలోప్, హెచ్పీ సీఈఓ మార్క్ హర్డ్ (2010) ఉన్నారు. -
టెక్ దిగ్గజం యాపిల్ కో-ఫౌండర్కి గుండెపోటు!
వోజ్నియాక్ గుండెపోటుకు గురవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లు యాపిల్ కో-ఫౌండర్ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా వోజ్నియాక్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ➤వోజ్గా సుపరిచితులైన వోజ్నియాక్ 1976లో టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. మరో యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ స్టీవ్జాబ్స్తో కలిసి వోజ్నియాక్ తొలి యాపిల్ కంప్యూటర్ను తయారు చేశారు. ➤ యాపిల్ కంప్యూటర్ 2 డిజైనింగ్లో వోజ్నియాక్ ప్రముఖ పాత్ర పోషించారు. అదే కంప్యూటర్.. పర్సనల్ కంప్యూటర్ల విభాగంలో సరికొత్త రెవెల్యూషన్ను క్రియేట్ చేసింది. ఇంజినీరింగ్ ఇన్నోవేషన్స్తో యాపిల్ను ప్రపంచంలో నెంబర్ వన్ టెక్ కంపెనీగా అవతరించేలా కృషి చేశారు. ➤ అయినప్పటికీ 1985లో వోజ్నియాక్ యాపిల్ సంస్థ నుంచి బయటకు వచ్చారు. పర్సనల్ కంప్యూటర్ టెక్నాలజీ తన దృష్టికి అనుగుణంగా లేదని భావించారు. ఆ తర్వాత మొదటి యూనివర్సల్ రిమోట్ కంట్రోల్ను అభివృద్ధి చేసిన సీఎల్ 9 ని స్థాపించడంతో పాటు సహా కొత్త వెంచర్లను ప్రారంభించారు. ➤ వోజ్నియాక్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ విభాగాల్లో విశేషమైన కృషి చేసినందుకు గాను 11 డాక్టరేట్లు సొంతం చేసుకున్నారు. ➤ కాలేజీ చదివే రోజుల్లో యాపిల్ కో-ఫౌండర్కి క్రీమ్ సోడా అంటే మహా ప్రీతి. అందుకే దాని పేరుమీద ‘క్రీమ్ సోడా కంప్యూటర్’ పేరుతో ఓ కంప్యూటర్ను తయారు చేశారు. ఆ కంప్యూటర్కి కీబోర్డ్, స్క్రీన్లు ఉండవు. పంచ్ కార్డ్ ప్రోగ్రామ్తో దీనిని ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఇదే క్రీమ్ సోడా కంప్యూటర్ యాపిల్ తన తొలి యాపిల్ కంప్యూటర్ను విడుదల చేయడానికి కారణమైంది. ➤ 1981లో స్వల్ప విమాన ప్రమాదం జరిగింది. ప్రమాదంతో సదరు విమానంలో ఉన్న వోజ్నియాక్ మతి స్థిమితం కోల్పోయారు. తర్వాత కొన్ని వారాలకు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నారు. మతి మరుపుతో విమన ప్రమాదం జరగడం, మతి స్థిమితం కోల్పోవడం గురించి మరిచిపోయినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. -
రహస్యాలన్నీ బట్టబయలు.. ఎలాన్ మస్క్ బయోగ్రఫీలో ఏమేం ఉంటాయంటే
అపరకుబేరుడు ఎలాన్ మస్క్ బయోగ్రఫీ కాపీలు హాట్ కేకుల్లో అమ్ముడు పోతున్నాయి. ‘ఎలాన్ మస్క్’ పేరుతో విడుదలైన మస్క్ బయోగ్రఫీ కాపీలు కేవలం వారం రోజుల వ్యవధిలోనే 92,560 అమ్ముడుపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా బయోగ్రఫీ పుస్తకాలు ఎన్ని అమ్ముడు పోయాయో సిర్కానా అనే మీడియా సంస్థ ట్రాక్ చేస్తుంది. ఆ కంపెనీ అందించిన సమాచారం మేరకు విడుదలైన వారంలో ఎక్కువ మొత్తంలో అమ్ముడు పోయిన పుస్తకాల్లో మొదటిది యాపిల్ కో- ఫౌండర్ స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీ కాగా.. రెండోది ఎలాన్ మస్క్ బయోగ్రఫీయేనని సిర్కానా వెల్లడించింది. వారంలోనే అన్ని పుస్తకాల ప్రొఫెసర్, ఆథర్, ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ మాజీ సీఈవో వాల్టర్ సెఫ్ ఐజాక్సన్ (Walter Seff Isaacson) యాపిల్ కోఫౌండర్ స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీని రాశారు. అయితే, అక్టోబర్ 5, 2011లో స్టీవ్ జాబ్స్ మరణించిన వారం రోజుల తర్వాత ఆ పుస్తకాన్ని విడుదల చేశారు. విడుదలైన వారం రోజుల్లో 3,83,000 కాపీలు అమ్ముడుపోయాయి. మస్క్ బయోగ్రఫీ కోసం రెండేళ్ల సమయం వాల్టర్ మస్క్ బయోగ్రఫీ రాసేందుకు సుమారు రెండేళ్ల పాటు శ్రమించారు. మస్క్ అటెండ్ అయ్యే సమావేశాలు. ఇచ్చిన ఇంటర్వ్యూలు, కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని, మస్క్ అనుచరుల్ని, సలహాదారుల్ని ఇలా అందరి నుంచి సమాచారం సేకరించి బుక్ రాశారు. ఎలాన్ మస్క్ బయోగ్రఫీ బుక్ ఎప్పుడు విడుదలైంది? Walter Isaacson's biography of Elon Musk sold 92,560 copies in its first week on sale! 📚 pic.twitter.com/WkfgtByzp6 — Dima Zeniuk (@DimaZeniuk) September 22, 2023 ఎలాన్ మస్క్ బయోగ్రఫీని వాల్టర్ ఐజాక్సన్ రాశారు. సెప్టెంబర్ 12,2023న విడుదల చేశారు. మస్క్ బయోగ్రఫీ బుక్లో ఏముంటుంది? ఎలాన్ మస్క్! ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. అలాంటి టార్చ్ బేరర్ బాల్యం, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, పలువురి మహిళలతో నెరిపిన సంబంధాలు, తన తండ్రి ఎర్రోల్ మస్క్తో ఉన్న అనుబంధాలతో సహా బిలియనీర్ జీవితంలోని అనేక కోణాలను వెల్లడించింది. పలు నివేదికల ప్రకారం.. మస్క్ గర్ల్ ఫ్రెండ్లు, మాజీ భార్యలు, మాజీ గర్ల్ఫ్రెండ్లు, పలువురి మహిళలతో సంతానం వంటి అనేక కొత్త విషయాలు మస్క్ జీవిత చరిత్రలో ఉన్నట్లు తేలింది. దీంతో పాటు టెస్లా కార్ల షేర్ల తగ్గింపు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపుకుడు బిల్గేట్స్తో వాగ్వాదం గురించి బయోగ్రఫీలో రాశారు. వాల్టర్ ఇప్పటికే వాల్టర్ ఇప్పటికే రాసిన ఐన్స్టీన్, బెంజిమన్ ఫ్రాంక్లిన్ పుస్తకాలు ఎక్కువగా అమ్ముడు పోయిన జాబితాలో నిలిచాయి. బయోగ్రఫీపై ఎలాన్ మస్క్ స్పందన Cool, although it’s kinda weird seeing so many close-up pics of my face 😂 — Elon Musk (@elonmusk) September 22, 2023 తన బయోగ్రఫీ కాపీలు ఊహించని విధంగా అమ్ముడుపోవడంపై మస్క్ స్పందించారు. ‘క్లోజప్లో నా ఫోటోలు చూడటానికి విచిత్రంగా ఉన్నప్పటికి చాలా బాగుంది అంటూ’ చమత్కరించారు. -
ప్రపంచ చరిత్రలో నష్ట జాతకుడు ఇతనే!
ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు ఎవరో తెలుసా? జపాన్కు చెందిన సుటోము యమగుచి. ఎందుకంటే? ఇతను రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో హిరోషిమా, నాగసాకి అణు బాంబు దాడుల నుండి బయటపడిన వ్యక్తి . 1945 ఆగస్ట్ 6న అమెరికా యుద్ధ విమానం ఎనోలా గే 'లిటిల్ బాయ్' అనే బాంబును హిరోషిమాపై జారవిడిచింది. ఒక్క క్షణంలోనే నగరంలోని రెండున్నర లక్షల జనాభాలో 80 వేల మందిని మృత్యువు బలి తీసుకుంది. సరిగ్గా ఆ బాంబు ప్రదేశం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సుటోము ప్రాణాలతో బయటపడ్డారు. సుటోము యమగచి ఉన్న ప్రాంతంలో ప్రాణాలతో బయపడింది ఇయన ఒక్కరే. జపాన్ ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ఏకైక వ్యక్తి ఇతడే. అందుకే ఇతను ప్రపంచంలోనే అంత్యంత లక్కీయస్ట్ పర్సన్గా గుర్తింపు పొందారు. మరి ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతుడు ఎవరో తెలుసా? రోనాల్డ్ వేన్! వ్యాపార ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ మూడవ కో-ఫౌండర్. మరి అన్ లక్కీయస్ట్ పర్సన్ ఎందుకో తెలుసా? 290 బిలియన్ డాలర్ల షేర్లను కేవలం 800 డాలర్లకే అమ్మాడు. కాబట్టే ఇతనే వరల్డ్లోనే అన్ లక్కీయస్ట్ పర్సన్గా అప్రతిష్టను మూటగట్టుకున్నారు. సీఎన్బీసీ ‘ది ఫిల్తీ రిచ్ గైడ్’ ప్రకారం.. ఏప్రిల్ 1, 1976న కాలిఫోర్నియాలో స్టీవ్ వోజ్నియాక్ (21), స్టీవ్ జాబ్స్ (25), అనుభవంలోనూ, ఇటు వయస్సుల్లో పెద్దవారైన రోనాల్డ్ వేన్ (42) ముగ్గురు కలిసి టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీని ప్రారంభించారు. అదే రోజు యాపిల్ ముగ్గురు వ్యవస్థాపకుల్లో ఒకరైన రోనాల్డ్ వేన్.. కంపెనీలో ఎవరి బాధ్యతలు ఏంటో తెలుపుతూ ఓ అగ్రిమెంట్ రాశారు. దీంతో పాటు యాపిల్ ప్రొడక్ట్కు సంబంధించిన తొలి లోగోని తయారు చేశారు. ఐజాక్ న్యూటన్ ఒక చెట్టు కింద యాపిల్ తింటున్న ఫోటోని తయారు చేసింది ఇతనే. ఈ లోగోని ఏడాది కంటే తక్కువ కాలం ఉపయోగించింది యాపిల్ సంస్థ. ఇక, స్టీవ్ వోజ్నియాక్, స్టీవ్ జాబ్స్,రోనాల్డ్ వేన్ల భాగస్వామ్యంలో యాపిల్ సేవల్ని ప్రారంభించింది. కేవలం 12 రోజుల వ్యవధిలో అమెరికాలోనే తొలి యాపిల్ 1 కంప్యూటర్ను అమ్మిన కంప్యూటర్ రీటైల్ సంస్థ ‘బైట్ షాప్’ తమకు 100 కంప్యూటర్లను తయారు చేసి పెట్టాలంటూ యాపిల్కు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ రానైతే వచ్చింది. తయారు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వలేదు. అప్పుడే కంప్యూటర్ల తయారీకి వినియోగించే పరికరాల కోసం స్టీవ్ జాబ్స్ 15,000 డాలర్ల లోన్ తీసుకున్నారు. నిర్ధేశించిన గడువులోగా స్టీవ్ జాబ్స్ యాపిల్ కంప్యూటర్లను తయారు చేసి ఇచ్చారు. ఒప్పందం ప్రకారం.. కంప్యూటర్లను తయారు చేసి ఇవ్వనైతే ఇచ్చారు. కానీ తయారు చేసిన కంప్యూటర్ల తాలుకు బిల్స్ ఆగిపోయాయి. ఓ వైపు లోన్, మరో వైపు బైట్ షాప్ నుంచి రావాల్సిన డబ్బులు రాలేదు. అందుకే సంస్థలో కొనసాగితే ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని బయపడ్డారు రోనాల్డ్ వేన్. యాపిల్ సంస్థ నష్టపోతే యువకులైన వోజ్నియాక్, జాబ్స్కు ఏమీ కాదు. ఎందుంకటే వాళ్ల చేతిలో ఏమీ లేవు. వేన్ అలా కాదే. అప్పటికే ధనవంతుడు. ఆస్తిపాస్తులు బాగానే సంపాదించారు. అందుకే తాను యాపిల్ సంస్థను వదిలేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే యాపిల్లో ఉన్న తన 10 శాతం వాటాను కేవలం 800 డాలర్లకు తన సహచరులకు అమ్మారు. ఆ విధంగా యాపిల్ సంస్థను విడిచిపెట్టాలని వేన్ తీసుకున్న నిర్ణయం అతనికి పెద్ద నష్టాన్ని మిగిల్చింది. నేడు,యాపిల్లో 10 శాతం వాటా విలువ 95 బిలియన్ల కంటే ఎక్కువగా ఉంటుంది. అదే వాటా వేన్ను సైతం ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలబెట్టేది. కానీ ఆ నిర్ణయమే ప్రపంచంలోనే అత్యంత అన్లక్కియస్ట్ పర్సన్గా నిలబెట్టింది. ఆశ్చర్యకరంగా, వేన్ తన నిర్ణయానికి చింతించలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. యాపిల్ సంస్థ అభివృద్ది చెందలేదని, తాను రాబోయే 20 సంవత్సరాల పాటు డాక్యుమెంటేషన్ విభాగంలో విభాగంలో విధులు నిర్వహించాల్సి వచ్చేదని పేర్కొన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉 ఆ ఇద్దరు ఉద్యోగుల కోసం.. రెండు కంపెనీల సీఈవోలు పోటీ..రేసులో చివరికి ఎవరు గెలిచారంటే?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
కలల సాకారం కోసం పోరాడితేనే 'స్టార్'
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)
మీ భూములకు జగన్ గ్యారెంటీ.. హిందూపురం సిద్ధం ప్రచారంలో జనసందోహం (ఫొటోలు)
తెలుగులో స్ట్రీమింగ్కు వచ్చేసిన హాలీవుడ్ హిట్ సినిమా
అసభ్య వీడియోల కేసు.. ప్రజ్వల్పై మరో లుక్అవుట్ నోటీసు
RCB vs GT: ఆర్సీబీ జోరు కొనసాగేనా?
ముంబైని ముంచేసిన కేకేఆర్
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
Advertisement