-
స్టీల్ ప్లాంట్లో పేలుడు.. ఉవ్వెత్తున ఎగిసిన అగ్ని కీలలు..
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో అగ్ని ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్లో మంటలు చెలరేగాయి. కాస్మారాలో ఉన్న రాయ్పూర్ స్టీల్ ప్లాంట్ నడుస్తున్నప్పుడు ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఘటనాసమయంలో దాదాపు 100 మంది కార్మికులు ప్లాంట్లో పనిచేస్తున్నారు. కాగా మంటల్లో కాలి ఒక వ్యక్తి మరణించినట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్లో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మంటలు వేగంగా వ్యాపించాయి. కాగా.. మంటల్లో కాలి పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. పేలుడుకు సంబంధించిన కారణాలు ఉంకా తెలియలేదు. దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: సీఎంను కించపరుస్తూ పోస్టులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అరెస్టు.. -
ఏపీలో రూ.350 కోట్లతో ఆర్జాస్ స్టీల్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టీల్ రంగంలో ఉన్న ఆర్జాస్ స్టీల్ (గతంలో జెర్డావ్ స్టీల్) రెండు ప్లాంట్లను విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ప్లాంటు సామర్థ్యాన్ని 25–30 శాతం పెంచుతోంది. ఇందుకోసం రూ.350 కోట్లు పెట్టుబడి చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల టన్నులు. నాణ్యతను మెరుగుపరిచేందుకు జర్మనీ నుంచి కాక్స్ సైజింగ్ బ్లాక్తోపాటు కాయిల్ రూపంలో ప్రత్యేక స్టీల్ ఉత్పత్తికై గ్యారెట్ కాయిలర్ లైన్ను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త స్టవ్ల స్థాపనతోసహా స్టీల్ శుద్ధి సామర్థ్యం పెంచుతున్నారు. అలాగే పంజాబ్లోని మండి గోవింద్ఘర్ ప్లాంటు వార్షిక సామర్థ్యం ప్రస్తుతం ఒక లక్ష టన్నులు. దీనికి రూ.260 కోట్ల వ్యయంతో 60–70 శాతం సామర్థ్యం జోడిస్తున్నారు. మొత్తం ఈ రెండు ప్లాంట్లకుగాను రూ.610 కోట్ల పెట్టుబడి చేస్తుండగా.. సామర్థ్యం 5.5 లక్షల టన్నులకు చేరనుంది. 2025 నాటికి ఈ విస్తరణ పూర్తి అవుతుందని ఆర్జాస్ స్టీల్ ఎండీ శ్రీధర్ కృష్ణమూర్తి వెల్లడించారు. వాహన రంగానికి అవసరమైన ప్రత్యేక స్టీల్ రెండు ప్లాంట్లలోనూ తయారవుతోంది. మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్ వంటి కంపెనీలకు వీటిని కంపెనీ సరఫరా చేస్తోంది. చదవండి: యాహూ.. అంబులెన్స్ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా! -
Russia-Ukraine war: రష్యా చేతికి మారియుపోల్
కీవ్: ఉక్రెయిన్లో వరుస ఎదురుదెబ్బలతో డీలా పడ్డ రష్యాకు ఎట్టకేలకు చిన్న ఊరట. కీలక రేవు పట్టణం మారియుపోల్పై రష్యా సైన్యాలు పూర్తిగా పట్టు సాధించాయి. దాదాపు మూడు నెలల పోరాటంలో రష్యాకు చిక్కిన అతి పెద్ద నగరం ఇదే! వాస్తవానికి అజోవ్స్తల్ స్టీల్ ఫ్యాక్టరీ మినహా నగరమంతా ఎప్పుడో రష్యా గుప్పెట్లోకి వెళ్లింది. ఫ్యాక్టరీలో దాగున్న ఉక్రెయిన్ సైనికులు మాత్రం రెండు నెలలుగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఆహారం తదితర వనరులన్నీ నిండుకోవడంతో ఇక పోరాడలేక వారంతా సోమవారం నుంచి లొంగుబాట పట్టారు. అది బుధవారంతో ముగిసిందని రష్యా ప్రకటించింది. 959 మంది లొంగిపోయినట్టు వెల్లడించింది. వారిని బస్సుల్లో డోన్బాస్లో వేర్పాటువాదుల అధీనంలోని ఒలెనివ్కా నగరానికి తరలించారు. ప్రాణాలు కాపాడుకోవాల్సిందిగా వారికి ఉక్రెయిన్ కూడా మంగళవారమే పిలుపునిచ్చింది. ఖైదీల మార్పిడి కింద వారిని తమకు అప్పగిస్తారని ఉక్రెయిన్ భావిస్తుండగా, రష్యా మాత్రం కొందరినైనా యుద్ధ నేరాల కింద విచారిస్తామని చెబుతోంది. దాంతో లొంగిపోయిన వారి భవితవ్యంపై అయోమయం నెలకొంది. మరోవైపు ఉక్రెయిన్కు అమెరికా అందజేసిన అత్యాధునిక ఆయుధాలతో కూడిన పలు నిల్వలను ధ్వంసం చేసినట్టు రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ చెప్పారు. వాటిలో ఎం777 హొవిట్జర్లు తదితరాలున్నాయన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను రష్యా విడుదల చేసింది. చరిత్రాత్మక క్షణం: నాటో చీఫ్ మారియుపోల్ చిక్కిన ఆనందంలో ఉన్న రష్యాకు మింగుడు పడని పరిణామం చోటుచేసుకుంది. నాటో సభ్యత్వం కోసం స్వీడన్, ఫిన్లాండ్ బుధవారం లాంఛనంగా దరఖాస్తు చేసుకున్నాయి. దీన్ని చరిత్రాత్మక క్షణంగా నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోటెన్బర్గ్ అభివర్ణించారు. ‘‘ఈ క్షణాన్ని వదులుకోబోం. ఆ రెడు దేశాలకు తక్షణం సభ్యత్వం ఇచ్చేందుకు చర్యలు చేపడతాం’’ అని ప్రకటించారు. మామూలుగా ఏడాది పట్టే దరఖాస్తు పరిశీలన ప్రక్రియను రెండు వారాల్లో ముగించాలని నాటో నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఫిన్లండ్, స్వీడన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని రష్యా మరోసారి హెచ్చరించింది. అయితే అమెరికా, ఇంగ్లండ్తో పాటు పలు నాటో దేశాలు ఇందుకు దీటుగా స్పందించాయి. దరఖాస్తులు ఆమోదం పొందేలోపు ఆ దేశాలపై రష్యా దుందుడుకు చర్యలకు దిగితే వాటికి అన్నివిధాలా రక్షణ కల్పిస్తామని ప్రకటించాయి. వాటి చేరికకు మొత్తం నాటో సభ్య దేశాలన్నీ అంగీకరించాల్సి ఉంటుంది. టర్కీ వ్యతిరేకత నేపథ్యంలో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. నాటోలో చేరే ఉద్దేశం లేదని ఆస్ట్రియా వెల్లడించింది. ప్రతీకార చర్యల్లో భాగంగా ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దౌత్యవేత్తలను రష్యా బహిష్కరించింది. ఉక్రెయిన్ పునరుద్ధరణకు 950 కోట్ల డాలర్ల రుణం మంజూరు చేయాలని యూరోపియన్ కమిషన్ ప్రతిపాదించింది. ఉక్రెయిన్కు ఇప్పటికే 410 కోట్ల యూరోల సాయాన్ని సేకరించినట్టు కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లెయన్ చెప్పారు. సైనికుడి నేరాంగీకారం యుద్ధ నేరాల విచారణ ఎదుర్కొంటున్న ఓ రష్యా సైనికుడు తనపై మోపిన అభియోగాలను అంగీకరించాడు. ఫిబ్రవరి 28న సమీ ప్రాంతంలో కార్లో కూర్చుని ఉన్న ఓ నిరాయుధ ఉక్రెయిన్ పౌరున్ని తలలో కాల్చి చంపినట్టు సార్జెంట్ వడీం షిషిమారిన్ (21) వెల్లడించాడు. -
ఆ రంగానికి కలిసొస్తున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం..!
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న యుద్ధం భారత ఉక్కు పరిశ్రమకు కొత్త అవకాశాలను సృష్టించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ దాడుల వల్ల కలిగిన సరఫరా అంతరాన్ని భర్తీ చేయడానికి భారతదేశంలోని ఉక్కు తయారీదారులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే, భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉంది. కానీ, ఎగుమతి పరంగా మన దేశ వాటా చాలా తక్కువ. రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలు యూరప్ దేశాలకు ఎక్కువగా ఉక్కును ఎగుమతి చేస్తాయి. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య యుద్దం కొనసాగుతుండటం వల్ల ఉక్కు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ లోటును భర్తీ చేసేందుకు దేశీయ ఉక్కు తయారీ కంపెనీలు సిద్దంగా ఉన్నాయి. జిందాల్ స్టీల్ & పవర్ లిమిటెడ్(జెఎస్పీఎల్) తెలిపిన వివరాల ప్రకారం.. సరఫరా అంతరాయం వల్ల గత నెలలో ఉక్కు ధరలు 20 శాతం పెరగడంతో ఐరోపా, మధ్య ప్రాచ్య & ఆఫ్రికా కంపెనీలు మన దేశం వైపు చూస్తున్నాయి. ఐరోపా, మధ్య ప్రాచ్య & ఆఫ్రికా ప్రాంతంలో ఉక్కు కొరత ఉంది. ఆ సరఫరాను భారతదేశం, పాక్షికంగా చైనా పూడ్చుతుంది" అని వి.ఆర్. శర్మ బ్లూమ్ బెర్గ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ కలిపి ఏడాదికి 44-45 మిలియన్ టన్నుల ఉక్కును ఎగుమతి చేస్తాయని బ్రోకింగ్ అండ్ రీసెర్చ్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. రష్యా ఒక్కటే యూరప్కు 14-15 మిలియన్ టన్నుల ఉక్కును ఎగుమతి చేస్తోంది. బెంచ్మార్క్ ధర మార్కెట్లో ఫిబ్రవరి 18 నాటికి హాట్ రోల్డ్ కాయిల్ స్టీల్ టన్నుకు 947 డాలర్లు ఉండేది. కానీ, మార్చిలో ఆ ధర టన్నుకు 1205 డాలర్లకు చేరుకుంది.. యూరప్లోని చాలా కంపెనీలు స్టీల్ ధరను పెంచడం ప్రారంభించాయి. దీంతో ఎగుమతి ధర పెరిగింది. భారతీయ కంపెనీలు టన్నుకు 1150 డాలర్ల ధరతో యూరప్కు ఉక్కును సులభంగా పంపగలవని, ఇది యూరప్లో నడుస్తున్న ధర కంటే దాదాపు 100 డాలర్లు తక్కువ అని వి.ఆర్. శర్మ చెప్పారు. ప్రస్తుతం భారత ఉక్కు పరిశ్రమ టన్నుకు దాదాపు 1000 డాలర్ల రేటుతో ఉక్కును ఎగుమతి చేస్తోందని ఆయన చెప్పారు. గత సంవత్సరం మన దేశ ఉక్కు & ఇనుప ఖనిజం ఎగుమతులలో దాదాపు మూడవ వంతు ఐరోపా దేశాలకు కంపెనీలు ఎగుమతి చేశాయి. ప్రధానంగా ఇటలీ, బెల్జియం, నేపాల్ & వియత్నాంలకు భారతదేశం 2021లో 20.63 మిలియన్ టన్నులను ఎగుమతి చేసింది. ఉక్కు సరఫరా కొరతను తీర్చడానికి భారతీయ ఉక్కు తయారీదారులు ఐరోపాకు రవాణాను పెంచాలని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. రష్యా - ఉక్రెయిన్ యుద్దం వల్ల ఏర్పడిన సరఫరా కొరత వల్ల ప్రస్తుతం దేశీయ అమ్మకాలు 25 నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. (చదవండి: మార్కెట్లోకి మరో ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరిపోయే రేంజ్!) -
తెలంగాణలో సుగ్న మెటల్స్ రెండో ప్లాంట్ ఏర్పాటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉక్కు తయారీ కంపెనీ సుగ్న మెటల్స్ తెలంగాణ వికారాబాద్లోని పరిగిలో రెండో ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది. మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే ప్రాంతంలో సుగ్న 2008లో తొలి ప్లాంట్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. టర్బో టీఎంటీ రాడ్లతో పాటూ ఉక్కు తయారీలో వినియోగించే బిల్లెట్లు, స్పాంజ్ ఐరన్ వంటివి కూడా ఈ ప్లాంట్లో ఉత్పత్తి చేస్తున్నారు. ఉక్కు తయారీ, పటిష్టతను వివరించేందుకు వివిధ విభాగాల్లోని ఇంజనీర్లతో కలిసి సుగ్న మెటల్స్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) నితిన్ జైన్, ప్లాంట్ ఇంచార్జీ అజయ్ కుమార్ తదితరులు ప్లాంట్ను సందర్శించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement