-
డీజీపీని కూడా మార్చాలి: వైఎస్సార్ సీపీ
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ ఎందుకు గగ్గోలు పెడుతుందో అర్థం కావడం లేదని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరుకుందని, సొంత ప్రయోజనాల కోసం ఇంటెలిజెన్స్ వ్యవస్థను వాడుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న డీజీపీ ఆర్పీ ఠాకూర్ను కూడా పక్కన పెట్టాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇదే విషయంపై మరోసారి ఈసీని కలవబోతున్నట్లు ఆయన తెలిపారు. చదవండి...(ఇంటెలిజెన్స్ డీజీపై వేటు) ఇంటెలిజెన్స్ శాఖ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారి సమాచారాన్ని సేకరిస్తోందని, మరోవైపు వైఎస్సార్ సీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు తప్పుడు పనులకు డీజీపీ, ఏబీ వెంకటేశ్వరరావు కొమ్ము కాస్తున్నారన్నారు. అదృష్టవశాత్తూ ఎన్నికల కమిషన్ తమ గోడు విందని, ఏబీ వెంకటేశ్వరరావుపై వేటును స్వాగతిస్తున్నామన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వెనుక ఇంటెలిజెన్స్ చీఫ్ పాత్ర ఉందని, చీకటి చక్రవర్తి తయారు చేసినట్లు ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ తయారైందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని, ఇందుకోసం 20మంది హ్యాకర్లను నియమించుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు విదేశాలకు వెళ్లి మరీ ప్రత్యేక టెక్నాలజీని తీసుకొచ్చారన్నారు. వ్యక్తుల ప్రయివేట్ జీవితాల్లోకి చొరబడుతున్నారని ఆయన మండిప్డడారు. ఈసీ తీసుకున్న చిన్న చర్యకు కూడా టీడీపీ గగ్గోలు పెడుతోందని, ఇంటెలిజెన్స్ వ్యవస్థకు, ఎన్నికలకు ఏం సంబంధం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అన్ని ఆధారాలతో కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిశామని, టీడీపీ వాదనలో ఎలాంటి హేతుబద్ధత లేదన్నారు. కోర్టులో టీడీపీ వాదనలు నిలబడవని, ఇంటెలిజెన్స్ ఐజీ తన పరిధి దాటి రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారన్నారు. ఇక తన ఫోన్ను ట్యాప్ చేస్తున్నారని, దీనిపై హైకోర్టులో కేసు వేసినట్లు ఆయన తెలిపారు. ఫోన్ ట్యాపింగ్పై హైకోర్టులో పిటిషన్ కాగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పార్టీకి చెందిన పలువురు నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, 13మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, కౌంటర్ ఇంజెలిజెన్స్ ఎస్పీ భాస్కర్ భూషన్తో పాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ప్రతివాదులుగా చేర్చారు. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలు సమర్పించారు. మరోవైపు ఎన్నికల కమిషన్ వేటు వేసిన ముగ్గురు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఇక ఈసీ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..కేంద్ర ఎన్నికల సంఘానికి ఏడు పేజీల లేఖ రాశారు. -
వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం ప్రారంభం
గుంటూరు : వెలగపూడిలో ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం లాంఛనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ పి ఠక్కర్, మంత్రి అయ్యన్నపాత్రుడు బుధవారం మధ్యాహ్నం 2.59 గంటలకు తాత్కాలిక సచివాలయాన్నిఆరంభించారు. ఏపీ తాత్కాలిక సచివాలయంలో ఇద్దరు మంత్రుల పేషీలు ప్రారంభమయ్యాయి. సరిగ్గా రెండు గంటల 59 నిమిషాలకు మంత్రులు కిమిడి మృణాళిని, అయ్యన్నపాత్రుడు.....తమ తమ పేషీల్లోకి ప్రవేశించారు. వేద పండితుల మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ....రిబ్బన్ కట్ చేసి లోపలికి అడుగు పెట్టారు. సచివాలయంలోని ఐదవ బ్లాక్లో మంత్రుల కార్యాలయాలను రూపొందించారు. మొత్తం ముగ్గురు మంత్రుల పేషీలు ఇవాళ ప్రారంభమవుతాయని తొలుత ప్రకటించనప్పటికీ మంత్రి కామినేనిశ్రీనివాస్ ఢిల్లీలో ఉన్నందున ఆయన కార్యాలయ ప్రారంభం వాయిదా పడింది. కోలాహలంగా సాగిన ఈ ప్రారంభోత్సవ వేడుకకు డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రులు ప్రత్తిపాటి, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమాతో పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మంత్రులతో పాటు ఎస్డీ, హెచ్వోడీ కార్యాలయాలు ఆరంభం అయ్యాయి. ఇక గృహ నిర్మాణ, వైద్య, ఆరోగ్య శాఖలకు చెందిన ఉద్యోగులను ఇప్పటికే వెలగపూడికి ఐదు బస్సుల్లో హైదరాబాద్ నుంచి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఆయా శాఖల ఉద్యోగులు కూడా సచివాలయానికి చేరుకున్నారు. కాగా ఉద్యోగుల తరలింపు కొనసాగుతోందని మరో రెండు నెలల్లో సెక్రటేరియేట్ పనులు పూర్తవుతాయని.. అప్పటకి ఉద్యోగులందరినీ అమరావతికి తరలిస్తామని ఏపీ సీస్ ఠక్కర్ స్పష్టం చేశారు. -
వెలగపూడిలో సందడి
అమరావతి : ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం బుధవారం మధ్యాహ్నం ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో వెలగపూడిలో సందడి నెలకొంది. నేటి మధ్యాహ్నం 2.59 గంటలకు తాత్కాలిక సచివాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ పి ఠక్కర్ ప్రారంభించనున్నారు. తొలుత మూడు శాఖల కార్యకలాపాలు ప్రారంభించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అందులోభాగంగా పంచాయతీరాజ్, గృహ నిర్మాణ, వైద్య, ఆరోగ్య శాఖలు తరలించారు. ఆయా శాఖలకు చెందిన ఉద్యోగులను ఇప్పటికే వెలగపూడికి ఐదు బస్సుల్లో హైదరాబాద్ నుంచి వెళ్లిన సంగతి తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"
పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "
కూటమి అంటేనే ఎలపరమబ్బా....
సీఎం జగన్కు ఘన స్వాగతం..!
నేపాల్లో నిలిచిన ఇంటర్నెట్ సేవలు.. కారణం..
కలర్ఫుల్ డ్రెస్లో ప్రగ్యా జైస్వాల్ సమ్మర్ లుక్స్.. ఫోటోలు
అది పెళ్లిచూపులు.. ఇది ఎంగేజ్మెంట్.. అందంగా ముస్తాబైన శోభా
అమెజాన్ సేల్లో ఆఫర్ల జాతర.. 95 శాతం వరకు డిస్కౌంట్
అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. ఐదుగురికి బెయిల్
ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్
తప్పక చదవండి
- ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
- ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
- ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- Black Salt Benefits : బ్లాక్ సాల్ట్తో ఇన్ని లాభాలా?
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
- శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
Advertisement