-
మారుతీ ఎరీనా.. 70 లక్షల కస్టమర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా రిటైల్ విభాగం అయిన ఎరీనా ఆరు వసంతాల ఉత్సవాలను జరుపుకుంటోంది. 2017 నుంచి ఇప్పటి వరకు 70 లక్షలకుపైగా కార్లు ఎరీనా ఔట్లెట్ల నుంచి రోడ్డెక్కాయని కంపెనీ గురువారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 2,392 నగరాలు, పట్టణాల్లో 2,853 ఎరీనా విక్రయ శాలలు ఉన్నాయి. ఆల్టో కె–10, ఎస్–ప్రెస్సో, వేగన్–ఆర్, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా, ఈకో మోడళ్లను ఈ స్టోర్లలో విక్రయిస్తున్నారు. 2022లో భారత్లో అమ్ముడైన టాప్–10 మోడళ్లలో ఆరు వీటిలో ఉండడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సంస్థ మొత్తం అమ్మకాల్లో అరీనా వాటా 68 శాతం ఉందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ ఈ సందర్భంగా వెల్లడించారు. ఏటా 10 లక్షల కుటుంబాల్లో సంతోషాలను నింపుతున్నట్టు తెలిపారు. ఎరీనా విక్రయశాలల్లో 32,130 మంది రిలేషన్íÙప్ మేనేజర్లు వినియోగదార్ల సేవల్లో నిమగ్నమయ్యారు. -
మహిళతో వివాహేతర సంబంధం.. ఆరేళ్ల క్రితం హత్య చేసి.. సినిమాను తలదన్నేలా..
ఆరిలోవ(విశాఖ తూర్పు): ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. నిందితుడే స్వయంగా పోలీసులకు లొంగిపోవడంతో పోలీసులకు పని సులువైంది. నిందితుడిని పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. ఆరిలోవ సీఐ ఇమాన్యుయేల్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరిలోవ ప్రాంతానికి చెందిన దాడి లక్ష్మి (48) 2016 ఏప్రిల్ 7 నుంచి కనిపించడంలేదని ఆమె భర్త దాడి నాగేశ్వరరావు అదే నెల 9న ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అదే నెల 11న ముడసర్లోవ రిజర్వాయర్లో గుర్తు తెలియని మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. ఆ మృతదేహం మిస్సింగ్ అయిన దాడి లక్ష్మిదిగా ఆమె భర్త గుర్తించాడు. ఆమె కాళ్ల, చేతులు కట్టేసి ఉన్నాయి. దీంతో పాటు గోనె సంచికి పెద్ద రాయి కట్టి ఉండటంతో పోలీసులు అప్పట్లో అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సరైన ఆధారాలు లభించకపోవడంతో కొన్నాళ్ల తర్వాత ఆ కేసును పెండింగ్లో పెట్టారు. ఇదిలా ఉండగా ఈనెల 4న దాడి లక్ష్మిని 2016 ఏప్రిల్ 7న తానే హత్య చేశానంటూ గోపాలపట్నం ప్రాంతానికి చెందిన దాసరి దిల్లీశ్వరరావు ఆరిలోవ పోలీసులకు తెలియజేశాడు. దీంతో పోలీసులు అతడి నుంచి వివరాలు సేకరించి గురువారం కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఏటీఎంలో డబ్బులు తీయించి.. తరువాత హత్య... దిల్లీశ్వరరావు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. రిటైర్డ్ అయిన తర్వాత ఆయన నగరంలో ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. అక్కడ ఉన్న క్యాంటీన్లో దాడి లక్ష్మి వంట మనిషిగా పనిచేసేది. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. దిల్లీశ్వరరావు 2016లో హౌసింగ్ లోన్ తీసుకొని గోపాలపట్నంలో ఇళ్లు కొన్నాడు. ఇళ్లు కొనగా మిగిలిన మరికొంత నగదు అతని భార్య బ్యాంక్ ఖాతాలో ఉంది. డబ్బులు అవసరమై అడిగితే ఆమె ఇవ్వలేదు. దీంతో ఆమె బ్యాంక్ ఏటీఎం కార్డు తీసుకొచ్చి లక్ష్మితో ఏటీఎంలో అవసరమైన డబ్బులు విత్డ్రా చేయించాడు. ఆ విషయమై దిల్లీశ్వరరావును అతని భార్య నిలదీసింది. అంతటితో ఆగకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె ఏటీఎం కార్డు ఉపయోగించి ఓ మహిళ డబ్బులు విత్డ్రా చేసినట్లు సీసీ కెమెరాలలో వెల్లడైంది. దీంతో లక్ష్మితో ఉన్న సంబంధం బయటపడిపోతుందనే భయంతో ఆమెను అంతం చేయాలనుకున్నాడు. అందుకు తగిన ప్లాన్ వేసుకున్నాడు. 2016 ఏప్రిల్ 7న రాత్రి లక్ష్మిని బైక్పై ఎక్కించుకొని ముడసర్లోవ ప్రాంతానికి తీసుకెళ్లాడు. బీఆర్టీఎస్ పక్కన సింహాచలం కొండ అంచున ఆమె మెడ గట్టిగా పట్టి చంపేశాడు. కాళ్లు చేతులు కట్టేసి మృతదేహాన్ని ఓ గోనె సంచిలో పెట్టాడు. మృతదేహం తేలకుండా గోనె సంచికి పెద్ద రాయిని తాడుతో కట్టి ముడసర్లోవ రిజర్వాయర్లో పడేశాడు. చదవండి: షాకింగ్ ఘటన.. ద్విచక్ర వాహనంపై ఒంటరిగా మహిళ.. పొదల్లోకి లాక్కెళ్లి.. ఇదంతా ఆయన స్వయంగా వచ్చి లొంగిపోయి వివరించడంతో పోలీసులు అవాక్కయ్యారు. దీని ప్రకారం దిల్లీశ్వరరావును కోర్టులో హాజరుపరిచి అనంతరం రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. తాను చేసిన పాపానికి తగిన శిక్ష అనుభవిస్తున్నానని, తన భార్య, పిల్లలు తనకు దూరంగా ఉండటంతో తాను ఒంటరయ్యానని పోలీసులకు తెలియజేశాడు. ఇటీవల తన కుమార్తె వివాహం కూడా తనకు తెలియకుండా జరిపించారని పేర్కొన్నాడు. పశ్చాత్తాపంతో చేసిన నేరం అంగీకరిస్తున్నట్లు తెలిపాడు. -
ఆరేళ్ళ బాలికపై తండ్రి వరసైన వ్యక్తి అత్యాచారం
-
విశాఖ కోకిల.. వెండితెరపై వెలుగుతున్న వాగ్దేవి
వచ్చీరాని మాటల వయసది.. బోసి నవ్వులతో ఆలిపించిన వంద దేవుళ్లే కలిసొచ్చినా (బిచ్చగాడు చిత్రం) పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే ఒక్కసారిగా ఆ చిన్నారి వాగ్దేవి ఫేమస్ అయింది. తల్లి శాంతమ్మ పర్యవేక్షణలో ఆలపించిన ఈ గీతం టాలీవుడ్ మ్యూజిక్ మెజిషియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆరేళ్ల ప్రాయంలో జీ తెలుగు లిటిల్ ఛాంప్ సరిగమప విన్నర్గా నిలిచి బుల్లితెర లతా మంగేష్కర్గా శభాష్ అనిపించుకుంది. – మద్దిలపాలెం (విశాఖ తూర్పు) ‘వెయ్యి జన్మలెత్తిన నీ రుణం తీర్చుకోలేనమ్మ’కు 60 లక్షల వ్యూస్ శ్రీమాత రికార్డింగ్ కంపెనీ అధినేత పల్లి నాగభూషణ్రావు రచించిన వెయ్యి జన్మలేత్తినా నీ రుణం తీర్చుకోలేనమ్మా.. గీతాన్ని వాగ్దేవి తండ్రి వేణుమాధవ్ సంగీతం అందించారు. ఈ పాటను వాగ్దేవి ఆలపించింది. యూట్యూబ్ అప్లోడ్ చేయగా అనూహ్య రీతిలో 60 లక్షల వ్యూస్ లభించాయి. వెండితెరపై వెలుగుతున్న వాగ్దేవి కేరాఫ్ కంచరపాలెం ఫేం సంగీతం దర్శకుడు స్వీకర్ ఆగస్తీ మెయిల్ చిత్రంలో వాగ్దేవికి అవకాశం కల్పించారు. ప్రియాంకదత్ నిర్మాతగా ప్రియదర్శి íహీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో వాగ్దేవి టిపిరి..టిపిరి గీతాన్ని ఆలపించింది. హీరో విశ్వక్సేన్ చిత్రం పాయల్లో, జాతిరత్నలు చిత్ర సంగీత దర్శకుడు రథన్ కంపోజ్ చేసిన సిద్ శ్రీరామ్తో కలిసి అమ్మా అమ్మా నీ వెన్నెల.. నిత్యం నాపై ఉండాలి ఇలా...అనే గీతాన్ని ఆలపించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అటు పాటలు..ఇటు డబ్బింగ్ వాగ్ధేవి ఓ వైపు పాటలతో అలరిస్తూనే..మరో వైపు బుల్లితెర చిన్నారి నటులకు డబ్బింగ్ చెబుతోంది. రామసక్కని సీత, జెమినిలో వస్తున్న భాగ్యరేఖ సీరియల్స్కు డబ్బింగ్ చెబుతోంది. కీరవాణి ఫిదా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వరా భక్తి చానల్లో వాగ్దేవి ఆలపించిన అన్నమయ్య కీర్తనలకు ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఎం.ఎం.కీరవాణి ఫిదా అయ్యారు. వ్యాఖ్యాతగా ఉన్న గాయకురాలు సునీతను సైతం వరెవ్వా అనిపించింది. దీంతో బుల్లితెరపై అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. సాధించిన విజయాలు ►2007 లిటిల్ ఛాంప్ విన్నర్ సాయిదేవ హర్షతో వాగ్దేవి బుల్లితెరపై పాడడం ప్రారంభించింది ►ఐదేళ్ల ప్రాయంలో లవ్ ఇండియా నేషనల్ సింగింగ్ రియాల్టీ షోలో పాల్గొంది ►ఐదేళ్ల ప్రాయంలో హిందీ పాటాలు పాడేందుకు వాగ్దేవి ముంబై కేంద్రంగా లవ్మీ ఇండియా నేషనల్ సింగింగ్ రియాల్టీ షోకు ఎంపికైంది. ఈ షో హిమేష్ రేషి్మయా, నేహా బాసిన్ను తన గానంతో మైమరపించింది. ►జీ తెలుగు లిటిల్ చాంప్ సరిగమప విన్నర్ ( 2019 )గా నిలిచింది. దీంతో స్వర్ణభూమి సంస్థ రూ.35 లక్షల విలువైన విల్లా బçహూకరించారు. మ్యూజిక్ ఫ్యామిలీ వాగ్దేవి తల్లిదండ్రులు మాధవధారలో నివాసముంటున్నారు. తండ్రి సుదర్శనం వేణుమాధవ్ సంగీతం మాస్టర్గా, తల్లి శాంతి గాయని..అన్నయ్య సాయిదేవ హర్ష జీ లిటిల్ ఛాంప్ 2007 విన్నర్గా సుపరిచితులు. మణిశర్మ సంగీత దర్శకత్వంలో... అరుణగిరి ప్రొడక్షన్లో య్యూట్యూబ్ చానల్కు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఆధ్వర్యంలో 14 పాటల వాగ్దేవి ఆలపించే అవకాశం రావడం గొప్ప అవకాశమని ఆమె తల్లి శాంతి పేర్కొన్నారు. -
ఆరేళ్ల ఆర్నా ప్రపంచ రికార్డు.. విమానం తోక చూసి..
చిన్నారులకు పదేపదే చెబితేగానీ ఎ.బి.సి.డిలు గుర్తుండవు. అటువంటిది ఆరేళ్ల ఆర్నా గుప్తా విమానం తోక చూసి అది ఏ దేశానికి చెందినదో ఇట్టే చెప్పేస్తుంది. నిమిషంలో 93 దేశాలకు చెందిన విమానాలను గుర్తించి ‘అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. హర్యాణాలోని పంచకులకు చెందిన ఆర్నా ఏదైనా ఒక్కసారి చూసినా, విన్నా వెంటనే తన మెదడు లో నిక్షిప్తం చేసుకుంటుంది. వాటి గురించి ఎప్పుడు అడిగినా టక్కున చెప్పేస్తుంది. రెండేళ్ల వయసునుంచే ఆర్నా చెప్పిన ప్రతివిషయాన్ని ఆపోశన పట్టేస్తుంది. ఇది గమనించిన ఆర్నా తల్లి నేహా గుప్తా.. ఆర్నాను ప్రోత్సహించారు. దీంతో ఈ రోజు ఆర్నా ప్రపంచ రికార్డును సాధించింది. గతేడాది ఆగస్టులో 120 మంది ప్రముఖుల పేర్లను 92 సెకన్లలో చెప్పి రికార్డు సృష్టించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కాంగ్రెస్కు షాక్.. నామినేషన్ వెనక్కి తీసుకున్న ఇండోర్ అభ్యర్థి
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- T20 WC: సచినే ఓపెనర్గా రాలేదు.. నువ్వెందుకు కోహ్లి?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
Advertisement