-
హాట్స్టార్లో ఆండ్రియా 'వట్టం', స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నటుడు సిబిరాజ్, ఆండ్రియా, అతుల్య రవి హీరో హీరోయిన్లుగా నటింన చిత్రం వట్టం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధినేతలు ఎస్ ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మించిన తాజా చిత్రం ఇది. కమలకన్నన్ దీనికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నివాస్ కే ప్రసన్న సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం 29వ తేదీన నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర యూనిట్ చెన్నైలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ.. సిబిరాజ్, ఆండ్రియా, అతుల్య రవి, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారన్నారు. సిబిరాజ్ మాట్లాడుతూ.. ఓటీటీలో విడుదలవుతున్న తన తొలి చిత్రం ఇదేనని తెలిపారు. చిత్ర నిర్మాత ఎస్సార్ ప్రభు మాట్లాడుతూ.. జీవితంలో ప్రేమికుల మధ్య సమస్యలు తలెత్తినా, ఆ తర్వాత అవి సమసిపోతాయని అలాంటి ఇతివృత్తంతో కూడిన చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఇందులో హీరోగా ఎవరైతే బాగుంటుంది అన్న ఆలోచించినప్పుడు సిబిరాజ్ గుర్తొచ్చారని చెప్పారు. ఆండ్రియా, అతుల్య రవి పాత్రల్లో ఒదిగిపోయారని అన్నారు. చదవండి: చివరిగా ఎప్పుడు బెడ్ షేర్ చేసుకున్నావ్.. నీళ్లు నమిలిన విజయ్ పదివారాల తర్వాతే ఓటీటీలో పెద్ద సినిమాలు -
ఓటీటీకి రెడీ అవుతున్న ‘వట్టం’
ఇటీవల ఓటీటీ ప్రభావం చాలా పెరిగిపోతుంది. ఇంకా చెప్పాలంటే అది నిర్మాతలకు ఓ వరంగా మారింది. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఓ2 చిత్రం, కమలహాసన్ కథానాయకుడుగా నటించిన విక్రమ్ చిత్రాలు ఇటీవల డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతూ విశేష ఆదరణ పొందుతున్నాయి. అదే బాటలో ఇప్పుడు వట్టం చిత్రం కూడా ఓటీటీ ఎంట్రీకి సిద్ధమవుతోంది. నటుడు శిబిరాజ్ కథానాయకుడుగా నటించిన ఇందులో ఆండ్రియా, అతుల్యరవి నాయికలుగా నటించారు. శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాశ్బాబు నిర్మించారు. దీని గురించి దర్శకుడు మాట్లాడుతూ వట్టం విభిన్న అంశాలతో కూడిన థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. 24 గంటలలో ముగ్గురు వ్యక్తులు ఎదుర్కొన్న సమస్యలు, వాటి వల్ల వారి జీవితాలు ఎలా మారాయి..? అనే అంశాలతో చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. అందరిని అలరించేలా తెరకెక్కించినట్లు తెలిపారు. నటుడు శిబిరాజ్ మాట్లాడుతూ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. వైవిధ్య భరిత కథా చిత్రాలు నిర్మించే డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థలో చిత్రం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఒక సామాన్యుడి పాత్రలో నటించాలని చాలా కాలంగా అనుకుంటున్నానని, ఈ చిత్రంతో ఆ కల నెరవేరిందని తెలిపారు. చిత్రంలో నటి ఆండ్రియ, అతుల్య రవి పాత్రలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. -
మూవీ సక్సెస్.. దర్శకుడికి మాయోన్ మూవీ నిర్మాత సర్ప్రైజ్ గిఫ్ట్
సాక్షి, చెన్నై: మాయోన్ చిత్ర యూనిట్ విజయానందంలో మునిగి తేలుతోంది. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్స్ పతాకంపై అరుణ్ మొళి మాణిక్యం కథణం, నిర్మాణ బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రంలో శిబిరాజ్, తాన్యా రవిచంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించారు. నవ దర్శకుడు కిషోర్ దర్శకత్వం వహించారు. శిలల స్మగ్లింగ్ ప్రధాన ఇతివృత్తంగా ఫాంటిసీ సన్నివేశాలతో రూపొందిన చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదలై విమర్శకుల ప్రశంసలతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీంతో చిత్ర యూనిట్ విజయానందంలో మునిగి తేలుతోంది. గురువారం చిత్ర యూనిట్ చెన్నైలో కేక్ కట్ చేసి వేడుకగా సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత.. దర్శకుడు కిషోర్కు బంగారు గొలుసును కానుకగా అందించారు. కాగా ఈ చిత్రం 7వ తేదీన తెలుగులోనూ విడుదల కానుందని ఈ సందర్భంగా నిర్మాత తెలిపారు. అదే విధంగా మాయోన్కు సీక్వెల్ను కూడా నిర్మించనున్నట్లు చెప్పారు. -
నా కొడుకును ఆదరించండి.. ‘కట్టప్ప’ సత్యరాజ్ విజ్ఙప్తి
చాలా కాలంగా నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఏం ఇచ్చినా నేను మీ రుణం తీర్చుకోలేను. ఇప్పటి వరకు నన్ను ఆదరించినట్లే.. మంచి కంటెంట్ ఉన్న ‘మయోన్’చిత్రం ద్వారా పరిచయమవుతున్న నా కొడుకు శిభి సత్యరాజ్ను కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా’అని ప్రముఖ నటుడు ‘కట్టప్ప’ సత్యరాజ్ అన్నారు. ఆయన కొడుకు సిబిరాజ్ హీరోగా యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం “మాయోన్” ఈ చిత్ర హక్కులను మూవీమ్యాక్స్ అధినేత ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. ‘మాయోన్’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో జూలై 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ని హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..ఈ చిత్ర ట్రైలర్, టీజర్ చాలా బాగున్నాయి. ‘మయోన్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయ మవుతున్న సిబి చాలా చక్కగా నటించాడు. దర్శక, నిర్మాతలు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినా ఇష్టపడి చేశారు.అందుకే సినిమా బాగా వచ్చింది. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి’ అన్నారు. ‘మయోన్ వంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు’అని హీరో శిబి సత్యరాజ్ అన్నారు . ‘మా చిత్రం గురించి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ట్వీట్ చేయడం సంతోషంగా ఉంది. పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన నేపథ్యంలో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ ‘మాయోన్’చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా ఆదరిస్తారు అన్నారు నిర్మాత శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, తిరుపతి రెడ్డి, హ్యుమన్ రైట్స్ సభ్యురాలు రేణుక తదితరులు పాల్గొన్నారు. -
ఏదో ఏదో ఏదో వెతికే నయనం.. పాట విన్నారా?
“కట్టప్ప” సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “మాయోన్”. ఈ చిత్ర హక్కులను మూవీమ్యాక్స్ అధినేత ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. “మాయోన్” చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో జూలై 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గురువారం ఈ చిత్రం నుంచి 'ఏదో ఏదో ఏదో.. వెతికే నయనం.. చేతికి అందేదాకా ఆగదు పయనం" అను పాటను విడుదల చేశారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'నాకు మాస్ట్రో ఇళయరాజా పాటలంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన పాటలకు సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ చిత్రం ద్వారా ఆయనను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. అయన అభిమానినైన నేను అయన సంగీత సారధ్యంలో సత్య ప్రకాష్ ధర్మార్, శ్రీనిషా జయశీలన్ పాడిన "ఏదో ఏదో ఏదో వెతికే నయనం చేతికి అందేదాకా ఆగదు పయనం" పాటకు విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన నేపథ్యంలో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్. ఈ చిత్రాన్ని నిర్మాత అరుణ్ మోజి మాణికం భారీ బడ్జెట్తో నిర్మించారు. ఆయనే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాయడం విశేషం. కిషోర్ ఎన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరో సిబిరాజ్ ‘అర్జున్’ అనే ఆర్కియాలజిస్ట్గా నటిస్తుండగా, తాన్య రవిచంద్రన్ ఎపిగ్రాఫిస్ట్ పాత్రలో కనువిందు చేయనుంది' అన్నారు. చదవండి: ఆ వార్తలను ఖండించిన సోనాలి బింద్రె, నాకావసరం లేదు.. మిస్ ఇండియా పోటీ నుంచి వైదొలిగిన శివానీ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement