-
‘పట్టిసీమ వల్ల సీమకు ఉపయోగం లేదు’
సాక్షి, కడప: గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించే ప్రతిపాదనలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చలను స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ మైసూరా రెడ్డి అన్నారు. త్వరలోనే గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి సంఘం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే కొట్రికె మధుసూదనగుప్తాలతో కలిసి మైసూరా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమలోని 7 ప్రాజెక్ట్లకు నీటిని తరలించాలని ఏపీ విభజన చట్టంలో ఉందన్నారు. రాయలసీమకు 150 టీఎంసీల నీటిని కేటాయించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల సీమకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు మైసూరా రెడ్డి. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల జరుగుతున్న అన్యాయంపై ఏపీ-తెలంగాణ ప్రభుత్వాలు చర్చించాలని కోరారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్ట్లకు పుష్కలంగా నీరు చేరాలంటే కృష్ణా నదిపై సిద్ధేశ్వరం అలుగును త్వరగా పూర్తి చేయాలని కోరారు. శ్రీశైలంలో 885 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడే విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలన్న అంశంలో ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవాలని సూచించారు. -
భట్టిని ఆశీర్వదించండి : శైలజానాథ్
సాక్షి, ఎర్రుపాలెం: మధిర నియోజరవ్గాన్ని అభివృద్ధి చేసిన మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్కను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఉమ్మడి ఏపీ మాజీ విద్యాశాఖా మంత్రి శైలజానాథ్ కోరారు. సోమవారం మండలకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే డిప్యూటీ స్పీకర్గా మల్లు భట్టి విక్రమార్క ఉన్నప్పుడే ఎస్సీ సబ్ప్లాన్కు చట్టబద్ధత కల్పించినట్లు చెప్పారు. బలమైన నేతగా గుర్తింపున్న భట్టిని ఈ నియోజవర్గ ప్రజలు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో కాంగ్రెస్, టీడీపీల మండల కమిటీ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్రెడ్డి, దోమందుల సామేలు, బండారు నర్సింహారావు, బొగ్గుల శ్రీనివాసరెడ్డి,శీలం నర్సిరెడ్డి, కడియం శ్రీను,వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తల్లపురెడ్డి నాగిరెడ్డి,షేక్ జానీబాషా, తదితరులున్నారు. మరిన్ని వార్తాలు... -
'చంద్రబాబుకు కమీషన్లు వస్తే చాలు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రత్యేక హోదా డిమాండ్ సాధించుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల కాదని ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని అడిగే ధైర్యం చంద్రబాబుకు లేదని,ఆ విషయం రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమైందని ఆయన అన్నారు. బుధవారమిక్కడ ఇందిరాభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు కావలసింది కమీషన్లని, అందుకోసమే ఆయన ప్రత్యేక హోదా అడగకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అడుగుతున్నారని శైలజానాధ్ మండిపడ్డారు. ప్రత్యేక హోదా అన్నది రాష్ట్ర ప్రజల హక్కు. వారి ప్రాణం. నిరుద్యోగ సమస్య పరిష్కారనికి అదొక్కటే మార్గం. ఇవేవీ పట్టించుకోకుండా కేవలం కమీషన్ల కక్కుర్తి కోసం చంద్రబాబు రాజీ పడ్డారని ఘాటుగా విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి నష్టం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వ వైఖరులకు వ్యతిరేకిస్తూ గురువారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేబడుతున్నట్టు ఆయన చెప్పారు. అన్ని జిల్లాల కేంద్రాల్లోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన మౌన దీక్షలను చేపడుతున్నట్టు ప్రకటించారు. -
'ఆయన అలా మాట్లాడటం సరికాదు'
హైదరాబాద్: జవహార్లాల్ నెహ్రూ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడటం సరికాదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ మండిపడ్డారు. గురువారం శైలజానాథ్ హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. దేశం కోసం బీజేపీ పెద్దలు చేసిన త్యాగాలేంటి అని శైలజానాథ్ ప్రశ్నించారు. -
'టీడీపీ నేతలకు లాభం చేకూర్చేందుకే ఉచిత ఇసుక'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి శైలజానాథ్ శుక్రవారం మండిపడ్డారు. చంద్రబాబు అవినీతి సొమ్ము లావాదేవీలను నిర్వహించేందుకే మంత్రి నారాయణ సింగపూర్ పర్యటన చేపడుతున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ నేతలకు లాభం చేకూర్చేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుక ఉచితమంటోందని శైలజానాథ్ ఆరోపించారు. అవినీతికి పాల్పడిన మంత్రులను కేబినెట్ నుంచి తప్పించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు సొంత భూముల్లో దొరికిన ఎర్రచందనం దుంగలపై విచారణ జరిపించాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనితీరు బాగోలేదని సర్వేలే చెబుతున్నాయని శైలజానాథ్ గుర్తు చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
T20 World Cup: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు స్పాన్సర్గా అమూల్...
పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే
ఇచ్చిన మాట కోసం హాలీవుడ్ ఆఫర్ వదులుకున్న రాజమౌళి!
గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం
త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్
Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్గా గృహప్రవేశం (ఫోటోలు)
ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "
నెటిజన్ ఘాటు ప్రశ్న.. ఆనంద్ మహీంద్రా దీటు సమాధానం
తప్పక చదవండి
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- జిమ్ చేస్తూ కుప్పకూలిన యువకుడు..చివరకు వీడియో వైరల్
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
- ‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
Advertisement